Friday, 11 August 2017

*దేశ భక్తి 30 గీతాలు *


 

దేశ భక్తి గీతాలు


1.వందేమాతరం
వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం ||

సప్త కోటి కంఠ కలకల నివాద కరాలే
త్రిశంత్కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలా కైనో మా ఐతో బోలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం ||

తుమి విద్యా తుమి ధర్మ్
తుమి హ్రుది తుమి మర్మ్ త్వాం హి ప్రాణాహ్ శరీరే ||
బాహుతే తుమి మా శక్తి
హ్రుదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమా జడి మందిరే || వందేమాతరం ||

త్వాం హి దుర్గా దశప్రహరణ ధరిణీం
కమలా కమల-దళ-విహారిణీం
వాణీ విద్యాదాయినీ నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరం
వందే మాతరం |
శ్యామలాం, సరళాం, సుస్మితాం, భూషితాం,
ధరణీం భరణీం మాతరం ||
వందే మాతరమ్. వందే మాతరమ్||

2.మా తెనుగు తల్లికి

మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి

గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక

రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక

నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం

జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!

3.అంతా ఒక్కటే

అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే, ఆంధ్రులమైనా తమిళులమైనా
ఉత్కళులైనా కన్నడులైనా
మరాఠి అయినా గుజరాత్ అయినా
పంజాబ్ అయినా బంగ్లా అయినా - !!అంతా!!

వందనమండీ వందనం
వణక్కమమ్మా వణక్కం
ఎస్సలాం ఎస్సలాం
నమస్కార్ నమస్కార్

భాషలు వేర్వేరయినాగానీ
భావాలన్నీ ఒకటేనోయ్,
దేశాలన్నీ ఒకటే అయితే ద్వేషాలేమీ ఉండవుగా,
బాలప్రపంచం, భావిప్రపంచం
భావిభారత వారసులం !!అంతా!!
- న్యాయపతి రాఘవరావు

4.భారతీయ వీరులం

భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం
శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం
శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం
మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం
మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం
వేష భాష లేవైనా - మతాచార మేదైనా
వేష భాష లేవైనా - మతాచార మేదైనా
మనం భారతీయులం - ఒకే తల్లి పిల్లలం
మనం భారతీయులం - ఒకే తల్లి పిల్లలం
ప్రపంచాన మన దేశం - ప్రతిభను నిలబెట్టుదాం
మనమంతా సైనికులం - మనం ప్రజాసేవకులం
జాతి స్వేచ్ఛ నపహరించు - శత్రువు నెదిరించుతాం
విజయం సాధించుతాం - జయపతాక నెగరేద్దాం
విజయం సాధించుతాం - జయపతాక నెగరేద్దాం
హిమశైల కిరీటయై - సముద్ర పాదపీఠయై
గంగ, యమున, గోదావరి - కృష్ణవేణి సహితయై
విలసిల్లే భరతమాత - మన తల్లికి జోహార్
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
- దాశరథి

5.దేశమును ప్రేమించుమన్నా
దేశమును ప్రేమించుమన్నా
- మంచి అన్నది పెంచుమన్న
వట్టిమాటలు కట్టిపెట్టోయ్
- గట్టి మేల్ తలపెట్టవోయి!
పాడి పంటలు పొంగిపొర్లే
- దారిలో నువు పాటు పడవోయి
తింది కలిగితే కండ కలదోయి
- కండ కలవాడేను మనిషోయి
ఈసురోమని మనుషులుంటే
- దేశ మేగతి బాగుపడునోయి
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
- దేసి సరుకులు నించవోయి
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి
- దేశి సరుకుల నమ్మవలె నోయి
డబ్బు తేలెనట్టి నరులకు
- కీర్తి సంపదలబ్బవోయి!
వెనుక చూసిన కార్యమేమోయి
- మంచి గతముల కొంచమేనోయి
మందగించక ముందు అడుగేయి
- వెనక పడితే వెనకే నోయి!
పూను స్పర్థను విద్యలందే
- వైరములు వాణిజ్య మందే
వ్యర్ధ కలహం పెఒచబోకోయి
- కత్తి వైరం కాల్చవోయి!
దేశాభిమానము నాకు కద్దని
- వట్టి గొప్పలు చెప్పుకో కోయి
పూని యేదైనాను, నొక మేల్
- కూర్చి జనులకు చూపవోయి!
ఓర్వ లేమి పిశాచి దేశం
- మూలుగులు పీల్చేసె నోయి!
ఒరుల మేలుకు సంతసిస్తూ
- ఐకమత్యం నేర్చవోయి!
పరుల కలిమికి పార్లి యేడ్చే
- పాపి కెక్కడ సుఖం కద్దోయి
ఒకరి మేల్ తన మేలనెంచే
- నేర్పరికి మేల్ కొల్ల లోయి
సొంత లాభము కొంత మానుకు
- పొరుగువారికి తోదు పడవోయి
దేసమంటే మట్టి కాదోయి
- దేశమంటే మనుషులోయి!
చెట్ట పట్టాల్ పట్టుకుని
- దేశస్థు లంతా నదువవలె నోయి
అన్నదమ్ముల వలెను జాతులు
- మతములన్నీ మెలగవలె నోయి!
మతం వేరైతేను యేమోయి
- మనము వొకటై మనుషులుంటే
జాతి యన్నది లేచి పెరిగి
- లోకము న రాణించునోయి!
దేశ మనియెడి దొడ్డ వృక్షం
- ప్రేమలను పూలెత్తవలె నోయి
నరుల చమటను తడిసి మూలం
- ధనం పంటలు పందవలె నోయి!
ఆకులందున అణిగి మణిగి
- కవిత పలకవలె నోయి
పలుకులను విని దేసమందలి
- మానములు మొలకెత్త వలెనోయి!
-గురజాడ వెంకట అప్పారావు

6.నారాయణ నారాయణ అల్లా అల్లా
నారాయణ నారాయణ అల్లా అల్లా
మా పాలిట తండ్రీ నీ పిల్లల మే మెల్ల !!నారాయణ!!
మతమన్నది నాకంటికి మసకైతే
మతమన్నది నామనసుకు మబ్బైతే
మతం వద్దు గితం వద్దు మాయామర్మంవద్దు !!నారాయణ!!
ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గితం వద్దు
మారణ హోమం వద్దు !!నారాయణ!!
మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరము మానవులం,
అందరమూ సోదరులం !!నారాయణ!!

7. పిల్లల్లారా పాపల్లారా

పిల్లల్లారా పాపల్లారా రేపటి భారతపౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా పిల్లల్లారా
మీ కన్నుల్లో పున్నమి జాబిలి
ఉన్నాడు, ఉన్నాడు పొంచున్నాడు.

మీ మనస్సుల్లో దేవుడు కొలువై ఉన్నాడు.
ఉన్నాడు అతడున్నడు.

భారత మాతకు ముద్దులబిడ్డలు, మీరేలే మీరేలే
అమ్మకు మీపై అంతేలేని ప్రేమలే, పిల్లల్లారా ప్రేమేలే
రేపటి భారత పౌరుల్లారా...

భారత దేశం ఒకటేఇల్లు భారత మాతకు మీరే కళ్లు,
మీరే కళ్లు, మీరే కళ్లు
జాతిపతాకం పైకెగరేసి
జాతి గౌరవం కాపాడండి బడిలోబయటా అంతా కలిసి
భారతీయులై మెలగండి కన్యాకుమారికి కాశ్మీరానికి
అన్యోన్యతను పెంచండి వీడని బంధం వేయండి. పిల్లల్లారా!!
- దాశరథి

8. తల్లీభారతి

తల్లీ భారతి వందనం - తల్లీ భారతి వందనం
నీ ఇల్లే మా నందనం - మేమంతా నీ పిల్లలము
నీ చల్లని ఒదిలో మల్లెలము - తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళల కొలిచెదమమ్మా - తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళల కొలిచెదమమ్మా - చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా - చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా - కులమత భేదం మరచెదము
కలతలు మాని మెలగెదము - కులమత భేదం మరచెదము
కలతలు మాని మెలగెదము - మానవులంతా సమానులంటూ
మమతను సమతను పెంచెదము - తెలుగు జాతికీ అభ్యుదయం
నవభారతికే నవోదయం - తెలుగు జాతికీ అభ్యుదయం
నవభారతికే నవోదయం - భావిపౌరులం మనం మనం
భారత జనులకు జయం జయం - భావిపౌరులం మనం మనం
- దాశరథి


9. వీరగంధము
వీరగంధము దెచ్చినారము
వీరుడెవ్వడో తెలుపండీ!
పూసి పోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో!!

తెలుగు బావుట కన్ను చెదరగ
కొండవీటను నెగిరినప్పుడు
తెలుగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు

తెలుగువారల వేడి నెత్తురు
తుంగభద్రను గలిసినప్పుదు
దూరమందున నున్న సహ్యజ
కత్తి నెత్తురు కడిగి నప్పుడు

ఇట్టి సందియమెన్నడేనియు
బుట్టలేదు రవంతయున్;
ఇట్టి ప్రశ్నల నడుగువారలు
లేకపోయిరి సుంతయున్.

నదుముగట్టిన తెలుగు బాలుడు
వెనుక తిరుగండెన్నడున్,
బాసయుచ్చిన తెలుగు బాలుడు
పా¬ఋఇపోవం డెన్నడున్.

ఇదిగో! యున్నది వీరగంధము
మై నలందుము మైనలందుము;
శాంతిపర్వము జదువవచ్చును
శాంతి సమరంబైన పిమ్మట

తెలుగునాటిని వీరమాతను
జేసి మాత్రము తిరిగి రమ్మిక,
పలుతుపాకులు పలు ఫిరంగులు
దారి కడ్డము రాకతప్పవు

వీరగంధము దెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ!
పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో!!

'కవిరాజు ' త్రిపురనేని రామస్వామి చౌదరి

10.జయ జయ జయ ప్రియ భారత

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
దివ్య ధాత్రి దివ్య ధాత్రి


11. జై అందామంతా

వెలుగన్నదే రాని రాతిరుందా
ముగిసేది కాదన్న కలత ఉందా
కరి మబ్బు జల్లు పడి కరిగిపోదా
ఆశలకు అదుపంటు లేదు కదా...
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే..
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...
చేతికిలా ఇలా ఇలా ఇలా...చంద్రుడందేనులే
జుంజుం జుంజుం జుంజుం. జుం జుంజుంజుం జుంజుం
ఇంక ఇలా ఇలా ఇలా ఇలా...నవ్వు చిందేనులే
తరుణం పోనీ చూద్దాం మనదయ్యే లోకం కొద్దాం
అరె ఇంకా కొంచెం పైపైకెళితే మనదే నీలాకాశం
పంతం పోనీ చూద్దాం మనదయ్యే లోకం కొద్దాం
అరె ఇంకా కొంచెం పైపైకెళితే మనదేలే నీలాకాశం
వన్నె చిన్నెల చిలకా...వన్నె చిన్నెల చిలకా
అవకాశం వచ్చెనమ్మ వెళ్ళి అందుకో
అమ్మ అందాల చిట్టెమ్మా...అమ్మా అందాల చిట్టెమ్మా
నీ జన్మాభూమి ఒడి చేరి ఆడుకో
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
గతపంజరాల శతబంధనాలు వీడి
మోసం ద్వేషం దోషంలేని దేశం నిర్మిద్దాము
గతపంజరాల శతబంధనాలు వీడి
మోసం ద్వేషం దోషంలేని దేశం నిర్మిద్దాము
స్వేచ్ఛ దొరికే మనకు ఇక మనసుపై మంచు పొరలు ఎందుకు
స్వేచ్ఛ దొరికే మనకు ఇక మనసుపై మంచు పొరలు ఎందుకు
జై అందాం అంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
జై అందాం అంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...ఏ...
అంబరంలో వాసంతం ఎటుదాక్కున్నా పిలిపిద్దాం
పిలిపిద్దాం పిలిపిద్దాం పిలిపిద్దాం పిలిపిద్దాం
మంచిని పూలుగ పూయిద్దాం మనిషిని మనిషిగ బ్రతిగిద్దాం
బ్రతిగిద్దాం బ్రతిగిద్దాం బ్రతిగిద్దాం బ్రతిగిద్దాం
అంబరంలో వాసంతం ఎటుదాక్కున్నా పిలిపిద్దాం
మంచిని పూలుగ పూయిద్దాం మనిషిని మనిషిగ బ్రతిగిద్దాం
లోకం మొత్తం కరిగిద్దాం సౌఖ్యం చిగురులు తొడిగిద్దాం
వాడా వాడా వెలిగిద్దాం వాడని వనమై వికసిద్దాం
వాడా వాడా వెలిగిద్దాం వాడని వనమై వికసిద్దాం
విశ్వాన్నేలే విజయదీతరం రెప రెపమంటూ ఎగరదాం
మేధస్వరమై వందేమాతరం బంగరు భవితను పిలవగా...

12.ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
రాయప్రోలన్నాడు ఆనాడు అది మరిచిపోవద్దు ఏనాడు
పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగద్గీత
వేదాలు వెలసిన ధరణి రా
వేదాలు వెలసిన ధరణి రా
ఓంకార నాదాలు పలికిన అవని రా
ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మన నేల విఙ్ఞాన కిరణాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
వెన్నెలది ఏ మతము రా
కోకిలది ఏ కులము రా
గాలికి ఏ భాష ఉంది రా
నీతికి ఏ ప్రాంతముంది రా
గాలికీ నీటికీ లేవు భేదాలు
మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు
గాంధీ చూపిన మార్గం విడవద్దు
గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు
గాంధీ చూపిన మార్గం విడవద్దు
దేశాల చీకట్లు తొలగించు
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించు
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్ష
అందుకే నిరంతరం సాగాలి దీక్ష...
అందుకే నిరంతరం సాగాలి దీక్ష...

13.గాంధీ పుట్టిన దేశం

గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి
భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి
బాపూ ఈ కమ్మని వరమే మాకివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం
బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి
బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి
బాపూ నీ చల్లని దీవెన మాకివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం

14. వీర భారతీయ పౌరుల్లారా..ఆ..ఆ..ఆ..

వీర భారతీయ పౌరుల్లారా..ఆ..ఆ..ఆ..
దేశమాత పిలుపు వినలేరా..ఆ..ఆ..ఆ..
హిమాలయంలో మంటలు రేగి ప్రమాద సమయం వచ్చింది
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
సవాలెదుర్కొని కదలండి
అంతా స్నేహితులనుకున్నాము అందరి మేలు ఆశించాము
అందరి మేలు ఆశించాము
పరుల మంచికై నమ్మకముంచి పగటి కలలలో జీవించాము
నేటికి కలిగెను కనువిప్పు ముంచుకు వచ్చెను పెనుముప్పు
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
సవాలెదుర్కొని కదలండి
వీరమాతలారా సుతులకు చంధన గంధం పూయండి
చంధన గంధం పూయండి
వీర వనితలారా పతులకు కుంకుమ తిలకం తీరచండి
కుంకుమ తిలకం తీరచండి
నెత్తురు జంకే యువకుల్లారా కత్తులు దూసి దుకండి
బానిసతనమున బ్రతికే కన్నా చావే మేలని తలచండి
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
సవాలెదుర్కొని కదలండి
మనమంతా ఒక జాతి సమైక్యమే మన నీతి
మనమంతా ఒక జాతి సమైక్యమే మన నీతి
కులమేదైనా మతమేదైనా వేషం భాష వేరే అయినా
జనమొకటే అని చాటండి
ధర్మ దీక్షయే మన కవచం తప్పక మనదే ఘన విజయం
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
సవాలెదుర్కొని కదలండి
భరతమాత పరువు నిల్పగా..ఆ..ఆ..ఆ..
భరతవీర ప్రతిన దాల్చరా..ఆ..ఆ..ఆ..
జయపతాక చేతబూనరా..ఆ..ఆ..ఆ..
సమర విజయ శంఖమూదరా..ఆ..ఆ..ఆ..
సమర విజయ శంఖమూదరా...

15. నీ ధర్మం నీ సంఘం నీ దేశం
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
సత్యం కోసం సతినే అమ్మిన్నదెవరు - హరిశ్చంద్రుడు
తండ్రిమాటకై కానలకేగినదెవరు - శ్రీరామచంద్రుడు
అన్న సేవకే అంకితమైనదెవరన్నా - లక్ష్మన్న
పతియే దైవమని తరించింపోయినదెవరమ్మ - సీతమ్మ
ఆ పుణ్యమూర్తులు చూపినమార్గం అనుసరించుటే ధర్మం
అనుసరించుటే నీ ధర్మం
నీ ధర్మం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న
మేడిపండులా మెరిసే సంగం గుట్టువిప్పెను వేమన్న
వితంతుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించె కందుకూరి
తెలుగు భారతిని ప్రజలభాషలో తీరిచిదిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం
నీవు నిలిచిన ఈ సంఘం
నీ సంఘం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
స్వతంత్రభారత రధసారధియై సమరాన దూకె నేతాజి
సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజి
గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి
తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవి
ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం
నీవు పుట్టిన ఈ దేశం
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
మహనీయులనే మరవద్దు

16. దేశం మనదే తేజం మనదే

దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం అంటామందరం
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతీ మనదే జాతీ మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈవేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం ఓ... అంటామందరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం


17.భారత మాతా భగవద్గీత

భారత మాతా భగవద్గీత
మమతా సమతా మంగళ చరిత
మధురమైన సుస్వరం
ఇది మరిచిపోదు మా తరం
అది వందేమాతరం...
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
భారత మాతా భగవద్గీత
మమతా సమతా మంగళ చరిత
మధురమైన సుస్వరం
ఇది మరిచిపోదు మా తరం
అది వందేమాతరం...
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
హిమగిరి శోభలే సిగలో మల్లెలుగా
కుంకుమ రేఖలే కాశ్మీరాలుగా
కనులకు ఆ సొగసెంతో
చాల్ చాల్లే ఈ వేషం ఆవేశం
తెలిసెను నీ లయలెన్నో
ఏం తెలిసి ఈ అలుసు నా మనసు
గృహమొక దేశమైతే మధు మధురం కాపురం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
గంగా సంగమం యమునకు ఆగునా
జెండా వందనం జాతికి దీవెన
జనగణ మానసగీతం
గోదారై వేదాలే వల్లించే
నవరస కన్నడ రాగం
కావేరై వాగ్దేయం పాడించే
శృతిలయలే మనమైతే ఇక మనదే ఈ తరం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
భారత మాతా భగవద్గీత
మమతా సమతా మంగళ చరిత
మధురమైన సుస్వరం
ఇది మరిచిపోదు మా తరం
అది వందేమాతరం...
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే

18.I Love India... I Love India...

I Love India... I Love India...
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతౄభూమికి మంగళం మాతరం
మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది

I Love India... I Love India...
I Love India... I Love India...

గంగ యమునలు సంగమించిన గానమో
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో
అజంతాల... ఖజురహోల...
సంపదలతో సొంపులొలికే భారతి జయహో
మంగళం మాతరం

I Love India... I Love India...
I Love India... I Love India...

జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
తాజమహలే ప్రణయ జీవుల పావురం
కౄష్ణవేణి శిల్పరమణి నర్తనం
వివిద జాతుల వివిద మతముల
ఎదలు మీటిన ఏక తాళపు భారతి జయహో
మంగళం మాతరం

I Love India... I Love India...
I Love India... I Love India...

జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
వందే మాతరం

19.rss ప్రార్థన

1. నమస్తే సదా వత్సలే మాతృభూమే
త్వయా హిందుభూమే సుఖవ్ వర్ధితోహం
మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే
పతత్వేష కాయో నమస్తే నమస్తే ||

2. ప్రభో శక్తిమన్ హిందు రాష్ట్రాఙ్గభూతా
ఇమే సాదరన్ త్వాన్ నమామో వయం
త్వదీయాయ కార్యాయ బధ్దా కటీయం
శుభామాశిషన్ దేహి తత్పూర్తయే
అజయ్యాఞచ విశ్వస్య దేహీశ శక్తిం
సుశీలన్ జగద్ యేన నమ్రం భవేత్
శ్రుతఞచైవ యత్ కణ్టకాకీర్ణ మార్గం
స్వయం స్వీకృతం నస్ సుగఙ కారయేత్

3. సముత్కర్ష నిస్ శ్రేయ సస్యైక ముగ్రం
పరం సాధనన్ నామ వీర వ్రతం
తదంతస్ స్ఫురత్వక్షయా ధ్యేయనిష్ఠా
హృదంతః ప్రజాగర్తు తీవ్రానిశం
విజేత్రీ చ నస్ సంహతా కార్యశక్తిర్
విధాయాస్య ధర్మస్య సంరక్షణం
పరవ్ వైభవన్ నేతు మేతత్ స్వరాష్ట్రం
సమర్థా భవత్వాశిశాతే భృశం
||భారత్ మాతా కీ జయ్||

20.హిందువులం హిందువులం

హిందువులం హిందువులం - హిందుజాతి వారసులం
హిందు ధర్మ రక్షకులం - హిందు రాష్ట్ర సాధకులం
స్ఫూర్తి శంఖ నాదకులం ప్రణవ ఫణవ వాదకులం
ప్రియ వంశీ నాదములం ధర్మానక ధ్వానములం ||హిందువులం||
ఇంద్రధనూ వర్ణములం సింధు త్రయ వీచికలం
తీవ్ర భాను తేజములం శరత్ చంద్ర కిరణములం ||హిందువులం||
రామ ధనుర్బాణములం శివ గణముల శూలములం
చక్రి చేతి చక్రములం భరతమాత సైనికులం ||హిందువులం||
సర్వజన ప్రేమికులం భగావాధ్వజ వాహకులం
విశ్వశాంతి కాముకులం వేద ధర్మ ఘోషకులం ||హిందువులం||

21.వేదంలా ఘోషించే గోదావరి

వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత వి సుందర నగరం
గత వైభవ కీర్తులతో కమ్మని గానం || వేదంలా ||

1 . రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటి దొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ వినిపించే గౌతమి హోరు || వేదంలా ||

శ్లోకం:
శ్రీవాణీ గిరిజాశ్చిరాయ ధధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం |
తే వేదత్రయ మూర్తయ స్త్రిపురుషా స్సంపూజితావస్సురై:
భూయాసు: పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే ||

2. ఆది కవిత నన్నయ్య వ్రాసేనిచ్చాటా
శ్రీనాథ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
కవిసార్వభౌములకిది ఆలవాలమూ | కవి |
నవ కవితలు వికసించే నందనవనమూ || వేదంలా ||

3 . దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కోటి లింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు || వేదంలా ||

22.భరత జనని ఘన విభవము

భరత జనని ఘన విభవము - భూ నభముల ప్రభవించగ (2)
శుభ మంగళ జయ ఘోషల
గళము గళము కలుపుదాం - పదము పదము కదుపుదాం (2)
రుద్ర రౌద్ర భద్ర హస్త ఢమరుక నాదమ్ముగా
శంభు శిఖా దిగ్భందిత గంగ ఝరీ భంగముగా
దక్ష యఙ్ఞ ధ్వంస భూత భద్రుని హుంకారముగా (2)
ఫణవ నాద ధ్వంకారం దశదిశలా మ్రోగగా ||గళము||

కురు రణ నిష్కర్మణాంత ఫల్గుణ కౄత బాణముగా
జలది లంఘనోత్సాహిత హనుమ సింహ నాదముగా
ధర్మ రక్ష దీక్ష మాన్య పాంచజన్య రావముగా (2)
విజయ శంఖ స్వర నాదము వినువీధుల నినదించగ ||గళము||

రిపు గళ శోణిత శోభిత శివ ఖడ్గ ప్రహేళిగా
రుద్ర రాణి రణ విరచిత కరవాలపు హేలగా
వన జన సమరపు ప్రేరక రామరాజ ధనువుగా (2)
ఆనక తంకార ధ్వనులు లోకమంత వ్యాపించగ ||గళము||

23.స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం

స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం
గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం
ఇహపరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం
ఆ లక్ష్యం చేరుదాక ఆగకుండ సాగుదాం

ఇనుపకండరాలు సంఘ శక్తినినుమడించగా
ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా
విలాసాల మత్తు వదిలి వివేకుని బాటనడిచి
స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం

దేవుడెక్కడ ఉన్నాడని నలుదిక్కుల శోధించే
దీనదళిత దు:ఖితులను దైవంగా దర్శించే
పంథాలెన్నున్నా మన గమ్యం ఒకటేనని
ప్రపంచానికందించే సందేశం ఇదేనని

ప్రతి హిందువు సోదరుడని సగర్వంగ ప్రకటించి
అన్నార్తుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చే
జగతిలోన భరతమాత అధిదేవతగా నిలపి
హిందుత్వమె వసుధ లోన మార్గదర్శి కావాలని

24. మా ప్రాణాలకు నవ ప్రాణం

మా ప్రాణాలకు నవ ప్రాణం
మా జీవాలకు నవ జీవం
మా రాష్ట్రానికి ఉజ్వల కేంద్రం
అరుణారుణ భగవ పతాకం అరుణారుణ భగవ పతాకం

(1) సుర సరితా కల్లోలంలో
మహనీయ ప్రణవ ఘోషలో
మా భారత కీర్తికి ఏక ప్రతీకం ||అరుణారుణ||

(2)రామ విభుని రథ కేతనమై
రావణు చంపిన పౌరుష రూపం
నరనారాయణ సమగ్ర తేజం ||అరుణారుణ||

(3) చంద్రగుప్త చాణుక్యాదుల
శంకరవిద్యారణ్యమౌనుల
తపహ్ పూతమగు పవిత్ర చిహ్నం ||అరుణారుణ||

మా ప్రాణాలకు నవ ప్రాణం
మా జీవాలకు నవ జీవం
మా రాష్ట్రానికి ఉజ్వల కేంద్రం
అరుణారుణ భగవ పతాకం అరుణారుణ భగవ పతాకం

25. ఓ జన్మభూమి భారతి

ఓ జన్మభూమి భారతి - ఓ పుణ్యభూమి భారతి
ఓ వందనీయ భారతి - అభినందనీయ భారతి

జీవన కుసుమమొసంగి ఆరాధింతుము జననీ
ఎన్నెన్ని జన్మలైనా నీ పూజ చేతుమమ్మా
నిన్నే స్మరింతుమమ్మా || ఓ జన్మభూమి||

నీ మకుట మైన హిమగిరి జగమెల్ల మెరయు చుండ
సాగరము రతనములతో అంజలి ఘటించుచుండ
నా మాతౄభూమి ఇదియని ఎలుగెత్తి పాడుకొనుచు
నీ సేవ చేయ జననీ మా జన్మ ధన్యమమ్మా || ఓ జన్మభూమి||

శక హూణ మ్లేఛ్చులంతా ఈ భూమి నాక్రమింప
నీ స్ఫూర్తి తోడ జననీ విక్రముని వంటి వీరుల్
తమ సర్వ శక్తి తోడ జాతిని సమైఖ్య పరచి
అరితతుల చండినారు నీ వీర పుత్రులమ్మా
నీ పూజ చేతుమమ్మా || ఓ జన్మభూమి||

26. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై

శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై
వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !(2)

వేద శాఖలు వెలసెనిచ్చట ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన||

విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన||

సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన

మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||

పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

27.సంఘ శాఖకు మనము రావాలోయ్

సంఘ శాఖకు మనము రావాలోయ్ - సంఘటన దృశ్యమ్ము చూడాలోయ్
అన్ని రంగులు కలుపు ఆత్మ చిత్రము శాఖ - స్నేహ సంబంధాల స్వర్గధామము రా
భిన్నతలొ ఏకతా భవ్య రూపము చూసి - శీల బలములు గూర్చు సిద్ధి మార్గమురా ||సంఘ శాఖకు||
వ్యక్తి వ్యక్తిని కలుపు ముక్తి మార్గము శాఖ - భారతీయుల సౌఖ్య భావి రూపము గా
స్వార్ధమే లేనట్టి స్వచ్ఛంద పథము రా - సహృదయ భావాల సౌందర్య సీమ రా ||సంఘ శాఖకు||
జ్ఞాన, భక్తి, కర్మ యోగ మార్గము శాఖ - వీరవ్రతము ద్యేయనిష్ఠలబ్బును రా
సంఘానుభూతికిది సాధనాస్థలి రా - లోక కళ్యాణమే సాధనా ఫలము రా ||సంఘ శాఖకు||

28.మనమంతా హిందువులం

హిందువులం ప్రియ బంధువులం సుగుణ సింధు జల బిందువులం
హిందు రాష్ట్రమును పూజిద్దాం హైందవ జాతిని సేవిద్దాం
విశ్వ శాంతికై హిందు సంఘటన సోపానమ్మని చూపిద్దాం

హిందుత్వమే మన ఊపిరి హైందవమే మన సిరుల ఝరి
హిందువుగానే జీవిద్దాం హిందువుగానే మరణిద్దాం
మరల మరల ఇల జననమందుచో హిందువుగానే జన్మిద్దాం

హిందువుగా మది గర్వించు స్వాభిమానమును ఎద పెంచు
బందా రాణా గురు గోవిందుల బలిదానాలను తలపించు
ఎవరేమన్నా ఎదురేదైనా నే హిందువునని నినదించు

చేయ్ చేయ్ కలుపుదాం సేవ చేయ కదులుదాం
ప్రజల కొరకు సంఘముగా ప్రతినిమిషం బ్రతుకుదాం

29.చేయ్ చేయ్ కలుపుదాం

చరణం1: అవయవాలు వేరైనా ఆత్మ మాత్రం ఒక్కటే
ప్రాంతం పెరేధైన ప్రజలంతా ఒక్కటే
భాషలేన్ని పలికిన భావ సంపదోక్కటే
ప్రమాదాలు ఎదురైతే ప్రతిస్పందన ఒక్కటే ||చేయ్ ||

చరణం2:కంటినలుసు కాలి ముళ్ళు కలిగిఒచే బాధలను
గుండె రగుల మెదడు కాదుల కరముల తొలగించుదాం
భారత భూమిని సీమను భాదలు పెల్లు బికినా
మన కండలు కరిగించి యిడుములు తొలగించుదాం ||చేయ్ ||

చరణం 3: జన శక్తిని జాతి కొరకు జాగ్రుత మొనరించుదాం
ఒకే తల్లి బిడ్డలమను ఊహనిచట పెంచుదాం
వందేమాతరం అంటూ ముందు ముందు కేడుదాం
ఒకకోకరి తోడూ నిలిచి ఉన్నతి సదించుదాం ||చేయ్ ||

30.ఆంధ్ర సముద్ర మీయమ్మ పాదాలపై

కానిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య
సామ్రాజ్య జాతీయ జయపతక:
వినిపింపరే నేడు విద్యానగర రాజ
సభలోని విజయ దుందుభుక మ్రోత:

వెలగదే నేడు బొబ్బిలి కోట బురుజుపై
తాండ్ర పాపయ తళత్తళల బాకు;
నిప్పచ్చరంబయ్యెనే నేడు వీర ప
ల్నాటి యోధుల సింహనాధలక్ష్మీ;

చెక్కు చెదరని, యేనాడు మొక్కవోని,
అంధ్ర పౌరుషమిప్పు డద్వాన్నమయె;
మరలనొక మాటు వెనుకకు మరలి, చూచి
దిద్దుకోవమ్మ బిడ్డల, తెలుగు తల్లి!

కవులకు బంగారు క్డియాలు తొడిగిన
రాయల గన్న వరాల కడుపు
సీసాలతో కవితాసార మిచ్చు శ్రీ
నాధుని గన్న రత్నాల కడుపు

భద్రాద్రిలో రామభద్రు స్థాపించు గో
పన్నకు గన్న పుర్వాంపు కడుపు
జగమగంటిమి నల్డెసల్ వెలార్చిన పాప
రాయని గన్న వజ్రాల కడుపు

పిసినిగొట్టు రాజులకును, పిలక జుట్టు
కుకవులకు, పిచ్చి పిచ్చి భక్తులకు, పిరికి
వందలకు తావు గాకుండ ముందు ముందు
దిద్దుకోవమ్మ బిడ్డల, తెలుగుతల్లి!

అభ్రంకషంబ్ హిమాలయం బే తల్లి
మౌళి జుట

Monday, 7 August 2017

జంధ్యాల పౌర్ణమి

om sri raam - sri maatrenama:


రేపు అనగా(7-8-17)సోమవారం శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి,రాఖీ పౌర్ణమి.
మన సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది.
భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.
పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం

'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'

దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.
దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్‌ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్‌ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.
ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.
యజ్ఞోపవీతం పరమపవిత్రం
ప్రజాపతే ర్యత్స హజం వురస్తాదా
యుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః !!

బ్రాహ్మణులు యజ్ఞోపవీతం కు పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు.
ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.


జంధ్యాల పూర్ణిమ
శ్రావణ పూర్ణిమ భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత వుంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారందరూ శ్రావణ పూర్ణిమనాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే 'ఉపాకర్మ' అని కూడా అంటారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యాన్నే 'యజ్ఞోపవీతం' అని అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమన ఈ పూర్ణిమని 'నూలి పున్నమి' అన్నాడు. నూలుతో తయారు చేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం. ఉపాకర్మ వేదాధ్యయనానికి ప్రతీక. వేదాధ్యయనం చేసేందుకు ముందు ఉపనయనం చేసి జంధ్యాన్ని వేయడం ఆచారం. యజ్ఞోపవీతధారణ ఉన్న వారిని ''ద్విజులు'' అని పిలుస్తారు. ద్విజులు అనగా రెండు జన్మలు కలవారు. తల్లి కడుపు నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం చేసిన అనంతరం 'జ్ఞానాధ్యయనం' గురువు నుంచి నేర్చుకోవడం రెండో జననంగా చెప్పబడు తుంది. ఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనిని ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు తీసి వేస్తారు.
ఉపనయనం అయిన వారు ఈ రోజు గాయత్రీ పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతదానిని విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ'జంధ్యాల పూర్ణిమ' కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు అష్టోత్తరాలతో గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. పవిత్రతకు, దైవత్వానికి సంకేతం యజ్ఞోపవీతం. యజ్ఞోపవీత ధారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా కొత్త జంధ్యాన్ని తీసుకుని, వేసుకునే ముందు

''యజ్ఞోపవీతం, పరమం పవిత్రం
ప్రజా పతే: యత్‌ సహజం పురస్తాత్‌
ఆయుష్య మర్య్రం, ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజ:''

అనే శ్లోకాన్ని పఠించి ధరించవలెను. నూతన యజ్ఞోప వీతాన్ని ధరించిన అనంతరం పాత (జీర్ణ) యజ్ఞోపవీతాన్ని ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ విసర్జించవలెను.

యజ్ఞోపవీతం, యది జీర్ణవంతం
వేదాంతవేద్యం, పరబ్రహ్మమూర్తిం
ఆయుష్య మాగ్య్రం, ప్రతి ముంచ శుభ్రం
జీర్ణోపవీతం విసృజామి తేజ:||

ఆ తర్వాత యథాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించవలెను. మనం వేసుకునే జంధ్యం 96 బెత్తా లుండాలి. మూడు పోగులుండాలి. వివాహం కాని వారికి మూడు పోగుల జంధ్యాన్ని ధరింప చేస్తారు. ఒంటి ముడి వుండాలి. ఈ మూడు పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు. వివాహమైన వారు మూడు ముడులున్న అంటే తొమ్మిది పోగులున్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి.

యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని 'బ్రహ్మముడి' అంటారు. ఎందుకనగా ఈ యజ్ఞోపవీతాన్ని బ్రహ్మ దేవుడు తయారు చేయగా లోక సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా, లయ కారకుడు ముడివేయ గా, సకల వేద వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమైన సావిత్రీదేవి అభిమంత్రించారు. మనం ధరించే జంధ్యం నాభివరకే ఉండాలి. నాభి క్రిందకు ఉంటే కీర్తి క్షీణిస్తుంది. నాభిపైకి ఉంటే ఆయుష్షు నశిస్తుంది.

జంధ్యం ఆవగింజంత లావు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుంది. మరీ పలుచగా వుంటే ధనహాని కల్గుతుంది. నవ తంతువుల్లో ఓంకారం, నాగదేవతలు, సోముడు, పితరులు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు ఇతర దేవతలు, ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు. పురుషులకే కేటాయించబడిన ఈ పూజను పాటించే ఇంట సకల సిరిసంపదలు, ధన ధాన్యాదులు రెట్టింపవు తాయి. బ్రాహ్మణులు, పండితులకు జంధ్యాలు (యజ్ఞోప వీతం) ఇవ్వడం మంచిది. గాయత్రీ మాత ఉపాసన, హోమం విశేష ఫలితాన్నిస్తాయి. అందుకే 12 సం||లోపు పిల్లలకు ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయిద్దాం. ఈ రోజు పాత జంధ్యాన్ని విసర్జించి గాయత్రీ మంత్రాన్ని జపిద్దాం. మన సంస్కృతిని కాపాడుకుందాం.

"ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము వేసుకోవటం కాదు.
దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి. ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం. ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి. ఉపనయనం అంటే మరొక నయనం(కన్ను,నేత్రం) అని అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది. బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ, మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలెను. ఇదియే ఉపనయనము యొక్క ప్రాముఖ్యత. అది మరచి ఇప్పటి కాలంలో ప్రాణాయామం అంటే ముక్కుని వేలితో మూస్తూ ఏదో శ్వాస నియంత్రణ చేస్తున్నట్టు నటిచడం, బ్రహ్మోపదేశం అంటే ఒక ముసుగుతో తండ్రి, పిల్లవాడిని కప్పి ఉంచటం, ఆ పిల్లవాడి చెవిలో తండ్రి ఏదో గుసగుసలాడడం వలె మారిపోయింది. భిక్ష అంటే అందరూ ఆ పిల్లవాడి భిక్ష పాత్రను డబ్బులతో నింపడంగా మారిపోయింది. బ్రహ్మోపదేశం ఇచ్చు తండ్రికి, ఈ కార్యక్రమము నడిపించు పురోహితునకు ఉపనయనము యొక్క ప్రాముఖ్యత తెలియనప్పుడు, వారు పిల్లవాడికి ఏమి బోధిస్తారు?"
"అంతే కాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు వారి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో, లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు. కొంత కాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలదేరేవాళ్ళు. కొంత కాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్ళకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు. సన్యాసం తీసుకోవాలని ధృఢ సంకల్పం ఉన్న వారు, అవి పట్టించుకోక ముందుకు సాగేవారు,మరికొంత మంది పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చేవారు. ఇది అంతా మరచి, కాశీ యాత్ర అంతే ఇప్పుడు, పిల్లవాడు పట్టుబట్టలు కట్టుకుని, కంటికి కాటుక పెట్టుకుని, కాళ్ళకు పారాణి పెట్టుకుని, మెడలో ఒక పూలమాల ధరించి, చేతిలో గొడుగు, కళ్ళకు చెక్క పాదుకలు ధరించి నడుస్తున్నట్టు నటిస్తాడు. పెండ్లికుమార్తె అన్న వచ్చి తన చెల్లెలిని పెళ్లి చేసుకోమని కోరగా, అప్పుడు నాకు వాచీ కావాలి, బండి కావాలి అని పెడ్లికొడుకు అలక పాన్పు ఎక్కుతాడు. ఇక అన్ని ఒప్పుకున్న తర్వాత ఫోటోలు తీసుకోవటం, ఒకరికొకరు బట్టలు పెట్టుకోవటం అలా కార్యక్రమం సాగుతుంది. ఇప్పటి కాలంలో భిక్ష అంటే డబ్బులతో భిక్షపాత్ర నింపటం, కాశీయాత్ర అంటే కట్నం, లాంఛనాలు తీసుకోవటానికి ఉపయోగపడేదిగా మారిపోయింది."రేపు అనగా(7-8-17)సోమవారం శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి,రాఖీ పౌర్ణమి.

మన సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది.
భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు.
పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం

'యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల'

దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.

దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్‌ నవాబైన బహదూర్‌షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్‌ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్‌ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.

ఇక శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.
యజ్ఞోపవీతం పరమపవిత్రం
ప్రజాపతే ర్యత్స హజం వురస్తాదా
యుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః !!


బ్రాహ్మణులు యజ్ఞోపవీతం కు పూజ చేసి నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు.
ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.


జంధ్యాల పూర్ణిమ
శ్రావణ పూర్ణిమ భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత వుంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారందరూ శ్రావణ పూర్ణిమనాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే 'ఉపాకర్మ' అని కూడా అంటారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యాన్నే 'యజ్ఞోపవీతం' అని అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమన ఈ పూర్ణిమని 'నూలి పున్నమి' అన్నాడు. నూలుతో తయారు చేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం. ఉపాకర్మ వేదాధ్యయనానికి ప్రతీక. వేదాధ్యయనం చేసేందుకు ముందు ఉపనయనం చేసి జంధ్యాన్ని వేయడం ఆచారం. యజ్ఞోపవీతధారణ ఉన్న వారిని ''ద్విజులు'' అని పిలుస్తారు. ద్విజులు అనగా రెండు జన్మలు కలవారు. తల్లి కడుపు నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం చేసిన అనంతరం 'జ్ఞానాధ్యయనం' గురువు నుంచి నేర్చుకోవడం రెండో జననంగా చెప్పబడు తుంది. ఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనిని ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు తీసి వేస్తారు.


ఉపనయనం అయిన వారు ఈ రోజు గాయత్రీ పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతదానిని విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ'జంధ్యాల పూర్ణిమ' కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు అష్టోత్తరాలతో గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. పవిత్రతకు, దైవత్వానికి సంకేతం యజ్ఞోపవీతం. యజ్ఞోపవీత ధారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా కొత్త జంధ్యాన్ని తీసుకుని, వేసుకునే ముందు

''యజ్ఞోపవీతం, పరమం పవిత్రం
ప్రజా పతే: యత్‌ సహజం పురస్తాత్‌
ఆయుష్య మర్య్రం, ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజ:''

అనే శ్లోకాన్ని పఠించి ధరించవలెను. నూతన యజ్ఞోప వీతాన్ని ధరించిన అనంతరం పాత (జీర్ణ) యజ్ఞోపవీతాన్ని ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ విసర్జించవలెను.

యజ్ఞోపవీతం, యది జీర్ణవంతం
వేదాంతవేద్యం, పరబ్రహ్మమూర్తిం
ఆయుష్య మాగ్య్రం, ప్రతి ముంచ శుభ్రం
జీర్ణోపవీతం విసృజామి తేజ:||


ఆ తర్వాత యథాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించవలెను. మనం వేసుకునే జంధ్యం 96 బెత్తా లుండాలి. మూడు పోగులుండాలి. వివాహం కాని వారికి మూడు పోగుల జంధ్యాన్ని ధరింప చేస్తారు. ఒంటి ముడి వుండాలి. ఈ మూడు పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు. వివాహమైన వారు మూడు ముడులున్న అంటే తొమ్మిది పోగులున్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి.

యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని 'బ్రహ్మముడి' అంటారు. ఎందుకనగా ఈ యజ్ఞోపవీతాన్ని బ్రహ్మ దేవుడు తయారు చేయగా లోక సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా, లయ కారకుడు ముడివేయ గా, సకల వేద వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమైన సావిత్రీదేవి అభిమంత్రించారు. మనం ధరించే జంధ్యం నాభివరకే ఉండాలి. నాభి క్రిందకు ఉంటే కీర్తి క్షీణిస్తుంది. నాభిపైకి ఉంటే ఆయుష్షు నశిస్తుంది.

జంధ్యం ఆవగింజంత లావు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుంది. మరీ పలుచగా వుంటే ధనహాని కల్గుతుంది. నవ తంతువుల్లో ఓంకారం, నాగదేవతలు, సోముడు, పితరులు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు ఇతర దేవతలు, ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు. పురుషులకే కేటాయించబడిన ఈ పూజను పాటించే ఇంట సకల సిరిసంపదలు, ధన ధాన్యాదులు రెట్టింపవు తాయి. బ్రాహ్మణులు, పండితులకు జంధ్యాలు (యజ్ఞోప వీతం) ఇవ్వడం మంచిది. గాయత్రీ మాత ఉపాసన, హోమం విశేష ఫలితాన్నిస్తాయి. అందుకే 12 సం||లోపు పిల్లలకు ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయిద్దాం. ఈ రోజు పాత జంధ్యాన్ని విసర్జించి గాయత్రీ మంత్రాన్ని జపిద్దాం. మన సంస్కృతిని కాపాడుకుందాం.
"ఉపనయనము అంటే కేవలము మూడు వరుసల జంధ్యము వేసుకోవటం కాదు.

దాని అర్థం మనకు రెండే కాదు మూడు కన్నులు ఉండాలి. ఆ మూడవ నేత్రం జ్ఞాననేత్రం. ఆ నేత్రాన్ని తెరచి నీ యొక్క నిజమైన స్వరూపాన్ని గుర్తించాలి. ఉపనయనం అంటే మరొక నయనం(కన్ను,నేత్రం) అని అర్థం. ఆ మూడవ నేత్రం(జ్ఞాననేత్రం) తెరచి ఉంచాలి, అందుకొరకు ప్రాణాయామము నేర్పబడుతుంది. బ్రహ్మోపదేశం చేసిన తర్వాత ఆ పిల్లవాడిని భిక్షాటనకు పంపుతారు. మొదటి భిక్ష తల్లి నుంచి తీసుకొనబడుతుంది. తండ్రి బ్రహ్మోపదేశం చేస్తే, తల్లి మూడు గుప్పెళ్ళు భిక్ష ఇచ్చి, ఆ బాలకుడు తండ్రి చెప్పిన బ్రహ్మోపదేశం మననం చేసుకోవటానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఇక ఆ బాలుడు భిక్షాటన చేస్తూ, గురువు గారి వద్దనే ఉండి విద్యాభ్యాసం చేస్తూ, మూడవ నేత్రంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవలెను. ఇదియే ఉపనయనము యొక్క ప్రాముఖ్యత. అది మరచి ఇప్పటి కాలంలో ప్రాణాయామం అంటే ముక్కుని వేలితో మూస్తూ ఏదో శ్వాస నియంత్రణ చేస్తున్నట్టు నటిచడం, బ్రహ్మోపదేశం అంటే ఒక ముసుగుతో తండ్రి, పిల్లవాడిని కప్పి ఉంచటం, ఆ పిల్లవాడి చెవిలో తండ్రి ఏదో గుసగుసలాడడం వలె మారిపోయింది. భిక్ష అంటే అందరూ ఆ పిల్లవాడి భిక్ష పాత్రను డబ్బులతో నింపడంగా మారిపోయింది. బ్రహ్మోపదేశం ఇచ్చు తండ్రికి, ఈ కార్యక్రమము నడిపించు పురోహితునకు ఉపనయనము యొక్క ప్రాముఖ్యత తెలియనప్పుడు, వారు పిల్లవాడికి ఏమి బోధిస్తారు?"
"అంతే కాదు అలా గురువు వద్ద ఉండి జ్ఞానము సంపాదించిన తర్వాత గురువుగారు వారి మనస్సు తాత్కాలిక విషయాలపై ఆకర్షితమవుతుందో, లేక సన్యాసం వైపు ఆకర్షితమవుతుందో తెలుసుకోవటానికి ఆ శిష్యులను తమ తల్లిదండ్రుల వద్దకు పంపేవారు. కొంత కాలం అలా తల్లిదండ్రుల వద్ద ఉన్న తర్వాత పిల్లలు సంసారిక సుఖాలను విడిచిపెట్టి కాశీకి బయలదేరేవాళ్ళు. కొంత కాలానికి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల ఆ పిల్లలను కాశీకి వెళ్ళకుండా ఆపి వారి కుమార్తెలను వివాహం చేసుకోమని అడిగేవారు. సన్యాసం తీసుకోవాలని ధృఢ సంకల్పం ఉన్న వారు, అవి పట్టించుకోక ముందుకు సాగేవారు,మరికొంత మంది పెళ్ళిచేసుకుని ఇంటికి వచ్చేవారు. ఇది అంతా మరచి, కాశీ యాత్ర అంతే ఇప్పుడు, పిల్లవాడు పట్టుబట్టలు కట్టుకుని, కంటికి కాటుక పెట్టుకుని, కాళ్ళకు పారాణి పెట్టుకుని, మెడలో ఒక పూలమాల ధరించి, చేతిలో గొడుగు, కళ్ళకు చెక్క పాదుకలు ధరించి నడుస్తున్నట్టు నటిస్తాడు. పెండ్లికుమార్తె అన్న వచ్చి తన చెల్లెలిని పెళ్లి చేసుకోమని కోరగా, అప్పుడు నాకు వాచీ కావాలి, బండి కావాలి అని పెడ్లికొడుకు అలక పాన్పు ఎక్కుతాడు. ఇక అన్ని ఒప్పుకున్న తర్వాత ఫోటోలు తీసుకోవటం, ఒకరికొకరు బట్టలు పెట్టుకోవటం అలా కార్యక్రమం సాగుతుంది. ఇప్పటి కాలంలో భిక్ష అంటే డబ్బులతో భిక్షపాత్ర నింపటం, కాశీయాత్ర అంటే కట్నం, లాంఛనాలు తీసుకోవటానికి ఉపయోగపడేదిగా మారిపోయింది."

Friday, 4 August 2017

వరలక్ష్మి వ్రతకల్పము.

Om Sri Ram - Sri Matrenama:

వరలక్ష్మి వ్రతకల్పము.
పూజ విధానము:
ఆచమనం : (పై మూడు మంత్రములతో పంచపాత్రలోని నీటిని ఉద్ధరిణితో చేతిలో పోసుకొని తీసుకోవాలి)
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషికేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్ధాయ నమః
పురుషోత్తమాయ నమః
అధోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఉపేంద్రాయ నమః
హరయే నమః
శ్రీకృష్ణాయ నమః
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
(అని పై నామములను స్మరింపవలెను)
శ్లో|| ఉత్తిష్ఠంతుభూతపిశాచాః ఏతే భూమిభారకాః |
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ||
పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకొనవలయును.
ఆ తరువాత కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ క్రింది విధముగా ప్రాణాయామము చేయవలయును.
ప్రాణాయామము :
ఓం భూః, ఓంభువ, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్, ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ||
పై మంత్రముతో 3 మార్లు ప్రాణాయామము చేసి సంకల్పం చేయాలి.
సంకల్పం :
ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శొభనే ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్(ఆయా ప్రంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, ....పక్షే , ....తిధౌ, శుక్రవాసర యుక్తాయాం, శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిదౌ, శ్రీమత్యాః .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, విజయ ఆయురారొగ్య ఐశ్వర్యాభివ్రుధ్యర్ధం, ధర్మార్ధ కామమోక్ష చతుర్విద ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, ప్రారబ్ధదోష నివృత్తి ద్వారా శ్రీ వరలక్ష్మీ ప్రసాదేన అష్టైశ్వర్యయుత శ్రీమహాలక్ష్మీ ప్రాప్తర్థ్యర్థం, మనోవాంచా పరిపూర్తర్థం శ్రీ వరలక్ష్మీవ్రతం కరిష్యే అదౌనిర్విగ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహా గణపతి స్మరణ పూర్వక పంచోపచార పూకాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే.
(కలశమునకు గంధపు బొట్లు పెట్టి అక్షితలద్ది లోపల ఒకపుష్పమునుంచి ఆ పాత్రపై కుడి చేతితో మూసి ఈ క్రింది మంత్రమును చేప్పుకోవాలి )
కలశస్య ముఖే విష్ణు: కంఠే రుద్ర స్సమాశ్రిత:|
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాత్రు గణా: స్మృతా:||
కుక్షౌతు సాగరా: సరేసప్త దీపా వసుంధరా|
ఋగ్వేదొ విధ యజుర్వేద: సామవేదొ హ్యధర్వణ:||
అంగైశ్చ సహితా: సర్వే కలశాంబు సమాశ్రితా:|
ఆయంతు దేవ పూజార్థం దురితక్షయ కారకా:||
గ్లాసులో నీళ్ళు అమ్మవారిమీద పూజద్రవ్యాల మీద చల్లండి
గంగేచ యమునే చైవ గొదావరి సరస్వతి|
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు||
కలశొదకేన పూజా ద్రవ్యాణి దేవమండపఆత్మానంచ సంప్రొక్ష్య
(కలశములొని నీటిని పూజ ద్రవ్యములపైన మన పైన చల్లుకోవాలి)
ఇప్పుడు పసుపుతో వినాయకుడిని చేసుకోని కింది శ్లోకాన్ని చెప్పుకోవాలి
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే||
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతు ర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కంద పూరజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయా దపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గయే తథా
సఙ్గ్రమే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే
అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి
సర్వవిఘ్నచ్చిదే తస్మైగణాధి పతయే నమః ||
పూజ ప్రారంభము:
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ||
అక్షింతలు వేయాలి
సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి
దేవి! త్వాం సుప్రీతా భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః || ధ్యాయామి || ఆవాహయామి
అక్షింతలు వేసి ఆచమనీయం చేయాలి
సూర్యాయుత నిభస్పూర్తే స్ఫురద్రత్న విభూషితం
సింహాసన మిదం దేవి స్థీయతాం సురపూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ధ్యాయామి
రత్నసింహాసనం సమర్పయామి
అక్షింతలు చల్లాలి
శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి
నీళ్ళు వదలాలి
సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పాద్యం సమర్పయామి
అమ్మవారిపై నీళ్ళు చల్లాలి
సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం
గృహాణాచమనం దేవి మయాదత్తం శుభప్రదే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి
నీళ్ళు చల్లాలి
పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి
పంచామృతం చల్లాలి
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్స్థితం
శుద్ధోదక స్నాన మిదం గృహాణ విధు సోదరి
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి
నీళ్ళు చల్లాలి
సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
వస్త్రం సమర్పించాలి
కేయూర కంకణే దివ్యేహారనూపుర మేఖలా
విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి
ఆభరణాలు అమ్మవారికి పెట్టాలి
తప్త హేమకృతం దేవి మాంగల్యం మంగళప్రదం
మయా సమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః మాంగల్యం సమర్పయామి
అమ్మవారికి మాంగల్యం సమర్పించాలి
కర్పూరాగరు కస్తూరి రోచనాదిభి రన్వితం
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతి గృహ్యాతాం
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః గంధం సమర్పయామి
గంధం, కుంకుమ పెట్టాలి
అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాన్ తుండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి
అక్షింతలు, పసుపు, కుంకుమ చల్లాలి
మల్లికా జాజికుసుమైశ్చంప కైరపిర్వకుళైస్తతహా
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే
శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః పుష్పాణి పూజయామి
అమ్మవారిని పూవులతో అలంకరించాలి
అథాంగ పూజ:
చంచలాయై నమః పాదౌ పూజయామి
చపలాయై నమః జానునీ పూజయామి
పీతాంబర ధరాయై నమః ఊరూ పూజయామి
కమల వాసిన్యై నమః కటిం పూజయామి
పద్మాలయాయై నమః నాభిం పూజయామి
మదన మాత్రే నమః స్తనౌ పూజయామి
లలితాయై నమః భుజద్వయం పూజయామి
కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి
సుముఖాయై నమః ముఖం పూజయామి
శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి
సునేత్రాయై నమః నేత్రౌ పూజయామి
రమాయై నమః కర్ణౌ పూజయామి
కమలాయై నమః శిరః పూజయామి
వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ చేయాలి. (ఒక్కొక్క నామానికి పూలు/పసుపు/కుంకుమ వేయాలి)
దశాంగం గుగ్గులోపేతం సుగధం చ మనోహరం
ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మీ గృహాణత్వం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ధూపం సమర్పయామి
అగరవత్తులు వెలిగించండి
ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం
దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః దీపం దర్శయామి
దీపం వెలిగించండి
నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి
పిండి వంటలపై నీళ్ళు చల్లాలి
ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి
నీళ్ళు చల్లలి
ఊగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి
తాంబూలం వక్కలతో పెట్టండి
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవి గ్ర్హ్యాతాం విష్ణువల్లభే
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి
కర్పూరం వెలిగించాలి
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి
చేతిలో పూలు అక్షితలు తీసుకుని ప్రదక్షిణ చేయాలి
యానికాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవా
త్రాహి మాం కృపయాదేవి శరణాగతవత్సలే
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష జనార్థన
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి
నమస్తే లోక జనని నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్త వరదే వరలక్ష్మ్యై నమో నమః
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి
తోరగ్రంధి పూజ:
తోరాన్ని అమ్మవారి ముందుంచి ఒక్కొక్క ముడికి ఇల పూజ చేయాలి
కమలాయై నమః ప్రథమ గ్రంధిం పూజయామి
రమాయై నమః ద్వితీయ గ్రంధిం పూజయామి
లోకమాత్రే నమః తృతీయ గ్రంధిం పూజయామి
విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంధిం పూజయామి
మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంధిం పూజయామి
క్షీరాబ్దితనయాయై నమః షష్ఠ గ్రంధిం పూజయామి
విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంధిం పూజయామి
చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంధిం పూజయామి
హరివల్లభాయై నమః నవమ గ్రంధిం పూజయామి
తోరము కడుతూ కింది శ్లోకం చదవాలి
తోరబంధన మంత్రం:
బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే
వాయన విధి:
ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం శ్వశక్తితః
దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే
ముత్తయిదువకు పండ్లు, పూలూ, తాంబూలం శక్తి కొలది వాయనం ఇవ్వచ్చు. వాయనం ఇచ్చేటప్పుడు ఈ క్రింది మంత్రం చదవాలి.
వాయనదాన మంత్రం:
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ
ఇందిరాతారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః
ఇతి పూజా విధానం సంపూర్ణం.
వరలక్ష్మీ వ్రత కథ:
(అక్షింతలు చేతిలో వేసుకొని, కథను భక్తి శ్రద్దలతో వినాలి)
రమ్యమైన కైలాస పర్వతంలో ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు వినోదముగ పాచికలాడు చుండిరి. పార్వతి గెలిచినది. పరమ శివుడు పరాజితుడైనాదు. నేను గెలిచినంటే నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలయెత్తెను. సమీపమందున్న చిత్రనేమినడుగగా ఆతడు శివునిదే జయమనెను. కోపితురాలై గౌరి అసత్యమాడిన చిత్రనేమిని కుష్ఠురోగివై భూలోకమున సరోవరతీరంలో పడిపొమ్మని శపించెను. క్షమింపుమని వేడి శాపావసానము నడిగెను. ప్రసన్నురాలైన పార్వతి, యే దినమున అప్సరకాంతలు ఆ అసరోవరతీరంలో వరలక్ష్మీ వ్రతము చేయుదురో ఆ దినమున నీవా వ్రతమును చూచి శాపవిముక్తిని పొందెదవనెను. అదే విధముగ చిత్రనేమి శాపవిముక్తుడై కైలాసము చేరుకొనెను.
మఱియు మగధదేశమున పూర్వము కుండిన మనునగరముండెను. అందు చారుమతి అనునొక బ్రాహ్మణ స్త్రీ నివసించుచుండెను. ఆమె తన భర్తనే దైవముగ తలచి సేవించుచుండెను. త్రికరణ శుద్దిగల ఆ పతివ్రతామతాల్లిపై అనుగ్రహభావము గల్గి మహాలక్ష్మి ఒకనాటి రాత్రి స్వప్నమున సాక్షాత్కరించి "నేను వరలక్ష్మీదేవిని శ్రావణశుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారమునాడు నీవు వరలక్ష్మీ వ్రతమును చేయుమని, ఆ వ్రతవిధానమును చెప్పి నీకు సర్వవిధ సౌభాగ్యములు కలుగుగాక" అని ఆశీర్వదించుచు అంతర్ధానమయ్యెను. చారుమతి మేల్కుని సంతోషముతో తనకు కల్గిన స్వప్నమును పెద్దలందరికి చెప్పు శ్రావణ యెదుర్శుక్రవారము కొఱకై యెదురుచూచుచుండెను. శ్రావణ పూర్ణిమకు ముందున్న శుక్రవారము రాగా చారుమతి మున్నగు స్త్రీలందరు కలుసుకొని మిక్కిలి భక్తితో స్నానాదులు ముగించుకొని ఇంటిని గోమయముతో సుద్దిచేసి మంటపము నేర్పరచి, రంగవల్లులతో అలంకరించి
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే |
నారాయణ ప్రియేదేవి సుప్రీతాభవసర్వదా ||
అను శ్లోకముచే ధ్యానావాహనాదిషోడశోపచార పూజలు చేసి నవసూత్ర తోరము కట్టుకొని భక్తితో వరలక్ష్మికి ప్రదక్షిణము చేసిరి. మొదటి ప్రదక్షిణము చేయగానే ఘల్లుఘల్లుమను శబ్దము వచ్చెను. అందరి కాళ్లకు గజ్జెలు కట్టబడియుండెను. అంతయు వరలక్ష్మి కటాక్షమని తలంచి రెండవ ప్రదక్షిణము చేసిరి. తమ అము చేసిరి. స్త్రీలు అందరూ సర్వాభరణ భూషితలైరి. చారుమతి మొదలగు స్త్రీల గృహములన్నియు స్వర్ణమయములై రథగజతురగవాహనములతో నిండిపోయెను. చారుమతి మొదలగు స్త్రీలందరు బ్రాహ్మణులకు వాయనములిచ్చిరి. ఆశీర్వాదము తీసుకొని ప్రతి సంవత్సరము అందరు అత్యంత శ్రద్ధాభక్తులతో వరలక్ష్మీ వ్రతము నాచరించుచు సర్వవిధ సౌభాగ్యములు బొంది సుఖించిరి. ఈ వ్రతమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. వరలక్ష్మీ వ్రతము సర్వ సంపత్కరమే కాక సర్వకార్యసిద్దిని కలుగజేయును.
(అక్షింతలు అమ్మవారిపై వేసి అందరి మీద వేసుకొని ప్రసాదం స్వీకరించాలి).