Friday, 25 August 2023



కలియుగ జ్ఞానం..

మల్లాప్రగడ రామకృష్ణ 

       1  *మీరు నియంత్రిస్తే మీ మనస్సు మీకు గొప్ప స్నేహితుడు.*  

         *కానీ అది మిమ్మల్ని నియంత్రిస్తే మీ మనస్సే మీకు అత్యంత శత్రువు.*

     2   *ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువెక్కువ.*

       *మనిషి ఎంత శ్రీమంతుడైన గుణానికి, వ్యక్తిత్వానికే విలువెక్కువ.*

        3*ఎంత ఒంటరిగా ఉంటే అంత వెలుగుతావు*

       *సూర్యుడు కూడా ఒంటరివాడే ప్రపంచానికి వెలుగు ఇవ్వడం లేదా.*

         4 *స్నేహం,ప్రేమ అనేవి దీపం లాంటివి.*

        *వెలిగించడం సులభమే కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం.*

         5*నలుగురిలో ఉన్నప్పుడు మాటని*

         *ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు.*

          6*ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో*

         *ఆ క్షణం నుండి మన మనసుకు సంతోషం ప్రారంభం అవుతుంది.*

       7   *జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం  "నిన్న" కలిగిన బాధను తలుచుకుంటూ కృంగి పోకుండా*

          *"నేడు" కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ "రేపటి"  ఆనందం కోసం దారులు వెతకాలి.*

8.జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా*

      *నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు అప్పుడే మనిషి జన్మకు ఒక అర్థం ఉంటుంది.*

     9  *జీవితంలో డబ్బు కన్నా విలువైంది మనశ్శాంతి.*

       *ఎందుకంటే దాన్ని ఎవ్వరూ కొనలేరు, అమ్మలేరు.*

           10*తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా గొప్పగా పూర్తిచేయగలడు.*

         *కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు.*  

         11 *వేయి అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే*

        *ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం ఉత్తమం.*


         12 *ఎప్పుడూ మంచి రోజు అనేది ఉండదు.*

          *కానీ ఎప్పుడైనా గాని మంచి ఆలోచనలతో మనం ఏ రోజునైనా మంచిరోజుగా మార్చుకోవచ్చు.*

       13*ఆకలిగా ఉన్నవారికి గుప్పెడు అన్నం,ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం*

       *బాధలో ఉన్న వారికి కొంచెం ఓదార్చు అందించ డమే నిజమైన మానవత్వం* 

 14*గుణానికి మనకంటే ఎక్కువ ఉన్నవారితోనూ*

       *ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి.*

      15*స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకూడదు*

      *మర్యాద ఇవ్వని వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు.*

       

          16*నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకూడదు.*

         *అహంకారం చూపే వారితో కూడా  కలవకూడదు.*

       

      17 *మనకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి.*

       *కానీ మంచి అనిపించుకోవడం కోసం చేయకూడదు.*


       18  *మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడినప్పుడు భుజం తట్టేవాళ్ళు*

          *నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉండదు.*


           19*తప్పు  చేసానని  చింతించి , తిరిగి  అదే  తప్పు మనం  చేస్తూ  ఉంటే*

          *ఆ  ప్రశ్చాత్తపానికి  విలువేముంది.*

       20 *ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు*

       *ఏదో ఒక రోజు మనల్ని ఒంటరిని చేస్తారు.*                                                                            

         21 *దూరంగా ఉన్నవారిని దగ్గరగా చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటిమాటకే ఉంది.*

          *అది కత్తి కంటే పదునైనది అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచి దవుతుందని*

         22*గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది, ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది.*

         *ప్రయత్నించి చూస్తే  సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.*

    

        23 *మనిషి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటాడో*

       *అంత ప్రతిభావంతుడుగా తయారు అవుతాడు.*


      24  *మంచి కోసం మనిషి మారాలి కానీ*

        *అవకాశం కోసం రంగులు మార్చుకోకూడదు.*

          25*జీవితంలో అన్ని కష్టాలకు రెండే మందులు, ఒకటి శ్రమ చేయడం, రెండు సహనంగా ఉండడం.*

          *శ్రమ చేయడం వల్ల నీవు ఏంటి అనేది నలుగురికి తెలిసేలా చేసుకుంటావు, సహనంగా ఉండడం వల్ల బంధాలను కాపాడుకోవడం ఎలా అని తెలుసుకుంటావు.*

         26*తెలివైన వారు తమ మాటలతో విలువైన కాలాన్ని హరించరు.*

        *వాళ్లెప్పుడూ కాలాన్ని కాపాడటానికి మాటల పొదుపు పాటిస్తారు*

          27*మీరు నియంత్రించ గలిగితెే మీ మనస్సు మీకు గొప్ప స్నేహితుడు.*

         *కానీ అది మిమ్మల్ని నియంత్రిస్తే, మీ మనస్సే మీకు అత్యంత శత్రువు.*

          28*ఇంత నేర్చుకున్నానన్న గర్వం "విద్య"  కుంటుంది.*

         *ఇంతకు మించి నేర్చుకోలేదన్న "వినయం" వివేకానికుంటుంది.*        

         29*నిన్నటి న్యూస్ పేపరు నేడు వేస్ట్ పేపరుగా మారవచ్చు కానీ రేపటికి చరిత్రను చూపించే సాక్ష్యం కూడా ఆ వేస్ట్ పేపరే అవుతుంది.*

           *అవసరం లేదని దేనినీ వదిలేయకండి ఆపదలో ఉన్నప్పుడు అదే నీకు అస్త్రంలా ఉపయోగపడవచ్చు.* 

          30 *జీవితంలో మనం నేర్చుకున్న ప్రతిదీ* 

         *ఏదో ఒకరోజు మన జీవితంలో ఉపయోగపడుతుంది.*                                      

       31  *వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి.*

       *కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది.*

          32*విమర్శలను కూడా మీరు  వినయంతో స్వీకరించినపుడే*

        *విజయం కూడా మీ సొంతం అవుతుంది.*    

        33*నీటిలో విసిరిన రాయి హృదయంలో గుచ్చుకున్న మాట మాయమై పోవు*

       *రాయి కరిగిపోదు, మాట మారిపోదు*

      34  *నీటితో స్నానం చేసినవాడు బట్టలు మాత్రమే మారుస్తాడు.*

        *చెమటతో స్నానం చేసినవాడు చరిత్రనే మారుస్తాడు.*   

         35*జీవితంలో మనల్ని అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు, అసూయపడేవారు ఆత్మ గౌరవాన్ని నేర్పిస్తారు.*

         *తప్పు పట్టేవారు మనలో కొత్త ఆలోచనలకు పునాది వేస్తారు.*

          36*ఒక వయస్సు వరకూ ఆర్థిక భద్రత కోసం  ఆస్తులు సంపాదించడం కోసం కష్టపడాలి.*

         *ఆ తర్వాత ఆత్మీయులను, అనుభూతుల్ని సంపాదించడo కోసం కష్టపడాలి.*

    37      *ఎంత కాలం నుంచి పరిచయం అయ్యారు అన్నది కాదు స్నేహానికి కావలసింది*

        *ఎంత బాగా అర్ధం చేసుకున్నారు అన్నదే స్నేహానికి ముఖ్యం.!*

         38  *నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని*

         *కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు.*    

           39 *మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు.*

         *దానిని ఎవరి వద్ద నిరూపించుకోవాలని ప్రయత్నించ వలసిన అవసరంలేదు.*

      40    *చలనం లేని రాయిని కూడా చెక్కడం మొదలుపెడితే శిల్పమవుతుంది.కదల్లేని రాయిలోనే శిల్పం దాగుంటే*

         *పరుగులు పెట్టగల నీలో  గొప్పగా బతకడానికి ఏదో ఒకటి వుండే వుంటుంది ఒక్కసారి ఆలోచన చేసి చూడు.*  

           41*సముద్రంలో రాయి విసిరితే సముద్రానికి ఏమీ కాదు, రాయే సముద్రంలో కనపడకుండా పోతుంది.*

         *ధైర్యంగా మనముంటే విమర్శించే వారే కనపడకుండా పోతారు.*

           42*భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేము.*

        *తెగించడం తెలియక పోతే బాధల నుండి బయట పడలేము.*

           43*ఎదగాలి అనే లక్ష్యంతో బలహీనమైన మొక్క కూడ బలమైన బండరాయిని సైతం చీల్చి పెనువృక్షంగా మారుతుంది.*

          *అలాగే గెలవాలి అనే లక్ష్యం ఎంతటి కష్టాన్నైనా సునాయాసంగా జయిస్తుంది.*

      

         44 *జీవితంలో ఎవరినీ తక్కువగా అంచనా వెయ్యకండి.* 

        *టమాటో ఆపిల్ తో సమానంగా అవుతుందని ఎవరైనా ఊహించారా.*

       45 *మంచి అయినా చెడు అయినా మన చేతుల్లోనే ఉంటుంది వాటిని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా మనలో దాగి ఉంటుంది.*

         *తప్పును గ్రహించి సరిదిద్దుకున్న రోజే పతనానికి దూరంగా విజయానికి దగ్గరగా అడుగులు వేయగలుగుతాం*

         46 *ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్ప గుణం ఉంటుంది.*

         *మనకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణముండాలి.*

      47  *సహనం నీకుంటే సర్వం నీదే.*

        *వినయం నీకుంటే విజయం నీదే.*

      

         48  *మనల్ని మోసం చేశారని తోటివారిని, మనకోసం ఆగలేదని కాలాన్ని, ఎప్పుడూ నిందించకు.*

       *ఎందుకంటే మోసపోవడంలో , కాలాన్ని వృధా చేయడంలో మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.*


       49  *నిప్పు అప్పు పగ తమంతట తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి అందుకే*

        *నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి.*

       50   *జీవితంలో అన్ని కష్టాలకు రెండే మందులు, ఒకటి శ్రమ చేయడం, రెండు సహనంగా ఉండడం.*

          *శ్రమ చేయడం వల్ల నీవు ఏంటి అనేది నలుగురికి తెలిసేలా చేసుకుంటావు, సహనంగా ఉండడం వల్ల బంధాలను కాపాడుకోవడం ఎలా అని తెలుసుకుంటావు.*

        51   *తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దు కుంటారు.*

           *మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో చోటివ్వకు.*

     52  *వయస్సు పెరుగుతుంది అంటే జ్ఞానం పెరగాలి కాని*

       *ఎదుటివారిని చులకన చేసి మాట్లాడే రోగం పెరగకూడదు.*

        53 *జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా*

        *నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు.*

        54 *విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు, ధనం వచ్చిందని స్నేహం మర్చిపోకు.*

        *కాలం నీదని మిడిసిపడకు,  

        *గౌరవం వచ్చిందని గతం మర్చిపోకు, అవసరం తీరిందని సాయపడిన వారిని మర్చిపోకు.*

   

        55*లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలివ్వడం ఒక్కటడిగితే వెయ్యి చెబుతారు*.

        *అన్నింటికంటే కష్టమైనది సహాయం చెయ్యడం వెయ్యిమందిని అడిగితె ఒక్కరు మాత్రమే చేస్తార

అసమానతలు అమానుషాలు'


 ఒకానొకప్పుడు ఒక కీకారణ్యంలో అనేక జంతువులు, పక్షులు జీవిస్తూ ఉండేవి. అదే అరణ్యంలో కొన్ని చిలుకల కుటుంబాలు జీవిస్తూ ఉండేవి. అందులో రెండు చిలుకలు చాలా నేస్తంగా ఉండేవి. ఒకదానికోసం మరొకటి ప్రాణం ఇచ్చుకోగలిగినంత గాఢమైన స్నేహం వాటిది. అవి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తూ వాగులలో స్నానం చేస్తూ, ఆ అడవిలో దొరికే ఫలాలు తింటూ ఉండేవి. 


ఆ అడవి వాతావరణంలో అవి ప్రకృతినియమాలు మినహా మరే నిబంధనలుగాని, నియంత్రణలుగాని లేకుండా స్వేచ్ఛగా పెరిగాయి. అంతే కాకుండా వాటికి తోచినమేరకు, వాటి సామర్ధ్యం మేరకు అవి ఇతర జంతువులకు, పక్షులకు, సాయం చేసేవి.


ఆ అరణ్యానికి సమీపంలోనే మునీశ్వరుల కుటీరాలు కొన్ని ఉండేవి. ఆ చిలుకలు రెండూ అక్కడక్కడ తిరుగుతూ ఆశ్రమవాసుల దినచర్యల్ని గమనించనారంభించాయి. ఆ మునీశ్వరులు జీవిస్తున్న పద్ధతి, పిల్లలకు విద్యనేర్పే విధానం వాటికి బాగా నచ్చింది. అవి తమలో తాము "అరే, ఈ మానవులు ఎంత అదృష్టవంతులు! వాళ్ళకు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు భగవంతుడు. దానితోబాటు విద్యనేర్చుకునే అవకాశాన్నిచ్చాడు.


 చూడు ఆ పిల్లలు గురువుగారి వద్ద ఎంత చక్కగా విద్యలు నేర్చు కుంటున్నారో!" అని ముచ్చటించుకునేవి. అలా కాలం గడిచి పోతున్నది; రెండు చిలుకలకూ వయస్సు మీద పడుతున్నది. వాటి స్నేహం మరింత బలపడి కొనసాగింది. వాటిలో ఒక చిలుకకు తానూ చదువుకోవాలనే కోరిక మరింత బలంగా కలిగింది. కాలం గడచి పోయింది; రెండు చిలుకలూ చనిపోయాయి. 


మరణానంతరం వాటి మంచి హృదయాలకు అనుగుణంగా వాటికి స్వర్గ ప్రాప్తి కలిగింది. అలా స్వర్గంలోకూడా వాటి మైత్రి కొనసాగింది. ఆ చిలుకల మైత్రికి సంతోషపడిన భగవంతుడు కొంతకాలం తరువాత వాటిని పిలిచి, "చిలుకల్లారా, మీ స్నేహం కారణంగా మీరు నాకెంతో ప్రియమైనవారైనారు. మీరు స్వర్గలోకాన్ని విడచి వెళ్తున్న సందర్భంగా కోరిన జన్మనొందేలా మీకు వరం ఇవ్వదలచాను. ఏజన్మ కావాలో కోరుకోండి" అన్నాడు. 


ఒక చిలుక "మహానుభావా! నీ దర్శనంతో నా జన్మ పావనమైంది. నాకు ఇదివరకటిలాగానే చిలుక జన్మను ప్రసాదించు. అదే అరణ్యంలో నేను మళ్ళీ జన్మించేలా వరమివ్వు" అని అడిగింది. రెండవ చిలుక తనకు మనుష్యజన్మ ప్రసాదించమని వేడుకున్నది. భగవంతుడు "తథాస్తు" అని దీవించాడు. మరుక్షణం ఒకటి చిలుకలాగాను, ఒకటి మనిషిలాగాను భూమిమీద జన్మించాయి. 


మొదటి చిలుక అరణ్యంలో జన్మించే సరికి అరణ్యం తగలబడుతున్నది. అక్కడ ఉండవలసిన ముని కుటీరాలు ఏనాడో శిధిలమైనాయి. అరణ్యంలోని చెట్లన్నీ ఏనాడో మనిషివాతనబడి గతించాయి. ఆ అరణ్యంలోంచి బయటపడి ఎంతో శ్రమతో తప్పించుకున్నాయి కొన్ని చిలుకలు. అలా ప్రాణాలతో మిగిలిన చిలుకలకు ఇక ఆహారం కరువైంది. 


తినేందుకు మధుర ఫలాలు లేవు; గూడు కట్టుకునేందుకు అనువైన చెట్లు కానరావటం లేదు. ఎక్కడ చూసినా కాలుష్యం. ’సుసంపన్నమై, తనను ఊరించి ’రా, రమ్మ’ని పిలిచిన గత జీవితం ఎక్కడున్నది? ’గతం గత:’ గతించిన కాలం మళ్ళీ రాదు. సర్వ సంపదలతో తులతూగే అలాంటి జీవితాన్ని తిరిగి సృజించుకోగలిగే సామర్ధ్యం ఈ చిలుక జన్మకు లేదు. ఇలాంటి జన్మనా, తను కోరుకున్నది?’ అని వగస్తూ చిలుక తన జీవితాన్ని అతి భారంగా నెట్టుకొచ్చింది. 


రెండవ చిలుక మానవజన్మనెత్తింది కదా, దాని తల్లిదండ్రులు పల్లెలో జీవితాలు గడపలేక, పట్టణానికి వలస పోయారు. అక్కడ అది అనేకమంది పిల్లలలాగే మురికిగుంటల్లో, రోడ్ల మాటున, అర్ధాకలితో పెరగవలసి వచ్చింది. తనను ఊరించిన అద్భుత విద్యావిధానం కొందరికి మాత్రమే అందుతుందని దానికి ఆలస్యంగానైనా, అర్ధమైంది. భగవంతుడు మనిషికి ఇచ్చిన చింతనా శక్తితో అది ’ఎందుకిలా?’ అని ప్రశ్నించుకున్నది. 


’భగవంతుని సృష్టిలో అందరూ ఒకటికాదూ? మానవులు సృష్టించుకున్న ఈ తారతమ్యాల్ని మనిషిగా తను రూపుమాపలేకపోతే తన జన్మ ఎందుకు?’ ఆ చిలుక స్వశక్తితో ఇక గొప్ప నాయకునిగా ఎదిగింది. మానవలోకంలో సత్యానికి, ప్రేమకు ఇంకా స్థానం ఉన్నదని, వాటిని మిగుల్చుకోకపోతే మనందరి జీవితాలూ శిలా సదృశాలే అవుతాయని ప్రవచించింది. దాని మాటలు మెల్లమెల్లగా దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. 'అసమానతలు అమానుషాలు' అన్న భావన పెరిగింది. మానవసమాజం మెల్లగా వెలుగువైపు పయనించింది. తన జీవితం సార్ధకమైందన్న సంతృప్తి దానికి కలిగింది.


--(())--


Tuesday, 22 August 2023

 *


: వరలక్ష్మి వ్రతం : (పూజా విధానం )


శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :-

పసుపు ................. 100 grms

కుంకుమ ................100 grms

గంధం .................... 1box

విడిపూలు................ 1/2 kg

పూల మాలలు ........... 6

తమలపాకులు............ 30

వక్కలు..................... 100 grms

ఖర్జూరములు..............50 grms

అగర్బత్తి ....................1 pack

కర్పూరము.................50 grms

చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins )

తెల్ల టవల్ .................1

బ్లౌస్ పీసులు .............. 2

మామిడి ఆకులు............

అరటిపండ్లు ................ 1 dazans

ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు

అమ్మవారి ఫోటోల ......................

కలశము .................... 1

కొబ్బరి కాయలు ............ 3

తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............

స్వీట్లు ..............................

బియ్యం 2 kg

కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML


పూజా సామాగ్రి :-

 

దీపాలు ....

గంట

హారతి ప్లేటు

స్పూన్స్

ట్రేలు

నూనె

వత్తులు

అగ్గిపెట్టె

గ్లాసులు

బౌల్స్


శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే

శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి *

ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు *


వరలక్ష్మీ వ్రతకల్పము :*

*#################*


*పూజా సామగ్రి :*


పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ).


అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము


పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార


తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు.


పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో (వెండి/ఇత్తడి/రాగి/కంచు చెంబులో) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకకపోతే తమలపాకులు గానీ వేసి, ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి.


*పూజావిధానం :*


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!


దీపము వెలిగించాలి.


ఆచమ్య:


కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోరాయనమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః..


శ్లో!! ఉత్తిష్ఠిన్తు భూతపిశాచాః యేతేభూమి భారకాః!

ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే!!


(అని అక్షతలు వాసన చూచి తమ యెడమప్రక్కన పడవేయవలెను.)


*మమ ఉపాత్త దురితయక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ* *దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగాగోదావర్యోర్మధ్య ప్రదేశే...సమస దేవతా బ్రాహ్మణ హరిహ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక* *చాంద్రమానేన .......సంవత్సరే ....ఆయనే.....ఋతౌ...మాసే.....పక్షే....తిథౌ.....వాసరే* *శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిధ్యార్థం ఇష్ట కామ్యార్థ* *సిద్ధ్యర్ధం, సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావచ్ఛక్తి, ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే! తదంగత్వేన కలశపూజాం కరిష్యే!*


అని సంకల్పము చేసి కలశమునకు గంధాక్షతలు పెట్టి, పుష్పమును కలశములో నుంచి, చేతితో కలశమును మూసి ఈ క్రింది శ్లోకమును చదువవలెను.


శ్లో!!కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః

మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాః స్మృతాః!!

కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా!

ఋగ్వేదోధయజుర్వేదః, సామవేదోహ్యధర్వణః!

అజ్గైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః!

ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః

గంగేచ, యమునేచైవ గోదావరి సరస్వతీ!

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు!!

కలశోదకేన దేవమాత్మానాం, పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య!!


(కలశములోని ఉదకమును పుష్పముతో దేవునిపైన, తమ పైన, పూజాద్రవ్యములపైన చల్లవలెను.)


కళ్యాణీ కమలనిలయే కామితార్థ ప్రదాయినీ!

యావత్త్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరోభవ!!


(అని ప్రార్థిమ్చి దేవునిపై పుష్పము నుంచవలెను)


అథ ధ్యానమ్:


పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!

నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా!!

క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే!

సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే!!

లక్ష్మీంక్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం!

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం!

శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం!

త్వామ్ త్రైలోక్య కుటుంబినీం సరసిజామ్ వందే ముకుంద ప్రియామ్!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధ్యాయామి!


ఆవాహనం:


సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే!

ఆవాహయామి దేవీత్వామ్ సుప్రీతా భవసర్వదా!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆవాహయామి!


ఆసనమ్:


సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే!

సింహాసనమిదం దేవీ గృహ్యతాం సురపూజితే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, రత్నఖచిత సింహాసనం సమర్పయామి.


పాద్యమ్:


సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవమ్!

పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పాదయోః పాద్యం సమర్పయామి!


అర్ఘ్యమ్:


శుద్ధోదకమ్ చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్!

అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,హస్తయోః అర్ఘ్యం సమర్పయామి!


*ఆచమనీయం :*


సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్!

గృహానాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి


పంచామృత స్నానం:


పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతమ్!

పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పంచామృత స్నానం సమర్పయామి


శుద్ధోదక స్నానం:


గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితమ్!

శుద్ధోదక స్నానమిదం గృహాన హరివల్లభే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, శుద్ధోదక స్నానం సమర్పయామి


వస్త్రం:


సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే!

వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన భువనేశ్వరీ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, వస్త్రయుగ్మం సమర్పయామి


యజ్ఞోపవీతం:


తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితమ్!

ఉపవీతమిదం దేవీ గృహాణ త్వం శుభంకరీ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, యజ్ఞోపవీతం సమర్పయామి


గంధం:


కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్!

గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, గంధం విలేపయామి


అక్షతలు:


అక్షతాన్ ధవళాన్ దేవీ శాలీయాన్ తండులాన్ శుభాన్!

హరిద్రాకుంకుమోపేతం గృహ్యతామబ్ధిపుత్రికే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అక్షతాన్ సమర్పయామి


ఆభరణం:


కేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖలాః!

విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆభరణాని సమర్పయామి


పుష్పం:


మల్లికాజాజి కుసుమైః చంపకైర్వకుళైస్తథా!

శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పుష్పైః పూజయామి


అథాంగపూజా!

ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి

ఓం చపలాయై నమః జానునీ పూజయామి

ఓం పీతాంబదధరాయై నమః ఊరుం పూజయామి

ఓం కమలవసిన్యై నమః కటిం పూజయామి

ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి

ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి

ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి

ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి

ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి

ఓం సుముఖ్యై నమః ముఖం పూజయామి

ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి

ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి

ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి

ఓం కమలాయై నమః శిరః పూజయామి

ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే

అని సంకల్పము చేసి అష్టోత్తర నామపూజ పసుపు కుంకుమలతో గాని, పుష్పములతో గానీ చేయవలెను.


*శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః*


ఓం ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూతహితప్రదాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓం పరమాత్మికాయై నమః

ఓం వాచే నమః

ఓం పద్మాలయాయై నమః (10)


ఓం పద్మాయై నమః

ఓం శుచ్యై నమః

ఓం స్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓం హిరణ్మయ్యై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యై నమః (20)


ఓం అదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణ్యై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం క్రోధసంభవాయై నమః

ఓం అనుగ్రహపరాయై నమః (30)


ఓం ఋద్ధయే నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓం అమృతాయై నమః

ఓం దీప్తాయై నమః

ఓం లోకశోక వినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓం లోకమాత్రే నమః (40)


ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓం పద్మముఖ్యై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓం పద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః (50)


ఓం పద్మిన్యై నమః

ఓం పద్మగంథిన్యై నమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాభిముఖ్యై నమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓం చంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః (60)


ఓం చంద్రరూపాయై నమః

ఓం ఇందిరాయై నమః

ఓం ఇందుశీతులాయై నమః

ఓం ఆహ్లోదజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః (70)


ఓం తుష్ట్యై నమః

ఓం దారిద్ర్య నాశిన్యై నమః

ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః

ఓం శాంతాయై నమః

ఓం శుక్లమాల్యాంబరాయై నమః

ఓం శ్రియై నమః

ఓం భాస్కర్యై నమః

ఓం బిల్వనిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యై నమః (80)


ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓం హేమమాలిన్యై నమః

ఓం ధనధాన్య కర్యై నమః

ఓం సిద్ధయే నమః

ఓం స్త్రైణ సౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశ్మ గతానందాయై నమః

ఓం వరలక్ష్మ్యై నమః (90)


ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓం హిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్ర తనయాయై నమః

ఓం జయాయై నమః

ఓం మంగళాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)


ఓం నారాయణ సమాశ్రితాయై నమః

ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః

ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః

ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః (108)


శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి


దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్!

ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్యగంధినీ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధూపమాఘ్రాపయామి


అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను


ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకమ్!

దీపం దాస్యామి తేదేవీ గృహాణ ముదితోభవ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, దీపం దర్శయామి


(దీపము చూపవలెను)


నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం!

నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నైవేద్యం సమర్పయామి


నివేదనము చేసి నీటిని వదలవలెను.


పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్!

కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, తాంబూలం సమర్పయామి

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్!

తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అనందమంగళ నీరాజనం సందర్శయామి


నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే

నారాయణ ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,మంత్రపుష్పాణి సమర్పయామి

పుష్పము అక్షతలు ఉంచవలెను


*యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ!*

*తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!*


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ప్రదక్షిణం సమర్పయామి


*పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ*

*త్రాహిమాం కృపయాదేవీ శరణాగత వత్సలే!!*

*అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్ మమ!*

*తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దనీ!!*

*నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణు వల్లభే*

*పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః!!*


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నమస్కారాన్ సమర్పయామి 🙏


తోరగ్రంథి పూజా!


ఓం కమలాయై నమః - ప్రథమ గ్రంథిం పూజయామి

రమాయై నమః - ద్వితీయ గ్రంథిం పూజయామి

లోకమాత్రే నమః - తృతీయ గ్రంథిం పూజయామి

విశ్వజనన్యై నమః - చతుర్థ గ్రంథిం పూజయామి

వరలక్ష్మీ నమః - పంచమ గ్రంథిం పూజయామి

క్షీరాబ్ధి తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి

విశ్వసాక్షిణ్యై నమః - సప్తమ గ్రంథిం పూజయామి

చంద్ర సహోదర్యై నమః - అష్టమగ్రంథిం పూజయామి

వరలక్ష్మ్యై నమః - నవమ గ్రంథిం పూజయామి


ఈ క్రింది శ్లోకము చదువుతూ తోరము కట్టుకొనవలెను.


*శ్లో!! బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం*

*పుత్రపౌత్రాభివృద్ధించ* *సౌభాగ్యం దేహిమే రమే*


*వరలక్ష్మీ వ్రత కథ :*


సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను జూచి యిట్లనియె – మునివర్యులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పె దానిం చెప్పెద వినుండు, కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి యుండ పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి దేవా! లోకమున స్త్రీలు యే వ్రతం బొనర్చిన సర్వ సౌభాగ్యంబులు, పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంబుగ నుందురో అట్టి వ్రతం నా కానతీయవలయు” ననిన పరమేశ్వరుండిట్లనియె. ఓ మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగంజేయం వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము నాడు జేయవలయుననిన పార్వతీదేవి యిట్లనియె. ఓ లోకారాధ్యా! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు నెట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవ్వరిచే నీ వ్రతంబాచరింపబడియె? దీనినెల్ల వివరంబుగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగ జెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను, బంగారు గోడలు గల యిండ్లతోనూ గూడియుండెను. అట్టి పట్టణము నందు చారుమతి యనునొక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగ దలచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కాంచి స్నానంబుచేసి పుష్పంబులచే భర్తకు పూజచేసి పిదప అత్తమామలకు ననేక విధంబులైన యుపచారంబులను చేసియు ఇంటి పనులను జేసికొని మితముగా ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ అమ్మహా పతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నమై “ఓ చారుమతీ, నేను వరలక్ష్మీ దేవిని. నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. –శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిచ్చెదనని వచించిన చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే!

శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే!! అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగెనేని జనులు ధన్యులుగను, విద్వాంసులుగను సకల సంపన్నులు గను నయ్యెదరు. నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషమున మీ పాదదర్శనము నాకు గలిగినదని జెప్పిన వరలక్ష్మీ సంతోషంబు జెంది, చారుమతికి ననేక వరములిచ్చి యంతర్థానంబు నొంద చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని యింటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ఓహో! మనము కలగంటిమని స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలయిన వాండ్రతో జెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమయినదని శ్రావణ మాసంబు వచ్చినతోడనే వరలక్ష్మీ వ్రతం బావశ్యంబుగ జేయవలసిందని జెప్పిరి.

చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని యుదయంబుననే మేల్కాంచి స్నానాదుల జేసి చిత్ర వస్త్రంబులను గట్టుకొని చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరచి యందొక ఆసనంబువైచి దానిపై కొత్తబియ్యం బోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచేత కలశంబేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే! నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!” అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి. ఇట్లొక ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళకు జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షం వలన గల్గినవని పరమానందంబు నొంది మరియొక్క ప్రదక్షిణంబు జేయగా హస్తములందు దగద్ధగాయమానంబుగా మెరయుచుండ నవరత్న ఖచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి యిండ్లనుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తప్రకారముగా పూజచేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమకొరకు వచ్చి కాచుకొని యుండు వాహనములపై యిండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం, సంపత్తులు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ యిండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి గలిగి, ధనకనక వస్తు వాహనములతోడ గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీ! యీ యుత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులను గలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువు వారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును.


*వాయన దానము :*


శ్లో!! ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః!

దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే!!


శ్లో!! ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతిచ

ఇందిరా తారకో బాభ్యాం ఇందిరాయై నమోనమః!!


*సర్వేజనా సుఖినోభవంతు✋*

*శుభం*


*_ ప్రాంజలి ప్రభ *

మీ మల్లప్రగడ 

Friday, 18 August 2023

చందస్సు


ప్రాంజలి ప్రభ.. పద్య పత్రిక (జనవరి మొదటి వారం )

రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 


భూతిలకం.. (భ భ ర స జ జ గ.. యతి 12)


01..దాసుడ గావర వేడుకన్ వరదా మదంబు దొలంగగా

వాసము నామది జేయుచున్ రిపువర్గమున్ దొలగించుమా

బాసల నేర్వని సంస్తుతిన్ మదపాశమున్ హరియించుమా

వాసవ సేవిత శ్రీధరా భవపాశసంహరశ్రీపతీ


02..దాసుడ నైతిని యార్తితో సహ ధర్మచారి సహాయమై

ద్యాసయు భక్తియు మూర్తిపై నిజ దాన ధర్మ సమానమై

కాసులు కోరను బాంధవా సమ కార్యసాధన ప్రేమమై

మూసగ జీవిత లక్ష్యమై జప మూల్యమేమియు కోరనే 


03..కాల మనోభవ రాగయుక్తసకాలమేను జయమ్ముగా

జ్వాల సహాయము నీరుశక్తియుఝాస మయమ్ముగా

నేల సమాధన వృక్ష ముక్తియు నీడ ససే పరమ్ముగా

బేల సుఖమ్ముయు దక్ష రక్తియు బంధ చిత్త సజీవమే


03..ఇంకను ఏమని చెప్ప లేనును యీ శ్వరా సహనమ్ముగా

సంకట మేమది దుష్టబుద్ధియు సామరస్యపు జీవిగా

వంకలు బెట్టను దైవమా సహవాంఛతీర్చ సుబుద్ధి గా

శంకలుతెల్పను ధర్మమా సమసంశయమ్మును తీర్చుమా


05..కాలము నీదయ నిత్య సత్యముగా గురుత్వ పటుత్వమై

శీలమనేదియు సిగ్గుదొంతర శీఘ్రమోన్నతగ తృప్తి కై

బేలల శోభలు సర్వ మౌయగు బంధభావము మొహమై

చేలము తప్తము శీతవర్షము చిన్మయాసొభగన్ సుధీ


06..ప్రేమకు ప్రేమయు ఇచ్చి పుచ్చుట ప్రీతిగన్ను సరాగమై

క్షేమము కోరిసుసంపదేయగు క్షేమమౌ సహనమ్ముగా

జాముల కాలము సమ్మొహమ్మగు సంతసమ్మగుకేళిలో

స్యూమము నాందుచు శాంతి నొందియు సోలిశీతల గాలిగన్


07..మక్కువ జూపవ మానసమ్మున మార్గ మాయను మార్చుమా

చక్కని రూపము నీది నామది చింతనిన్నుగ ప్రార్థనే

ఒక్కరు కాదును యిద్దరమ్మగు ఓర్పుగాను సహాయమే

తక్కువ యెక్కువ నెంచలేనులె తత్త్వమేగతిభక్తిగా


08..భారమునీదెగ కావఁగన్ ననుపర్తివాస సువంద్య సాయీ

నేరములెంచకు నాదునౌ హరినీపదాలుశరణ్యమందున్

నీరజపీఠిని శేషశయ్యనునిద్రనొందు మురారి పత్నీ

సారసుశాస్త్రవిదాంవరా హరిచందనాభ దయాబ్ధిదత్తా !!! "అప్పాజీ గారు )

----


పరామోదః (య స  స జ న మ.. యతి..10)


09..సహాయమ్ము సమాధనమ్ము సమర్ధతకథ నిత్యమ్మున్

ప్రహాసమ్ము ప్రయోజనమ్ము ప్రవర్తనలగు సత్యమ్మున్

విహారమ్ము విమోచనమ్ము వినమ్రతలగు సర్వాళిన్ 

సుహాసంబు సజీవణమ్ము సుఖమ్ము కలుగు శ్రీదేవీ


 010..సమూహంబు సహాయము సంచరింప సతము సౌఖ్యమ్మున్

సుమోదంబయి యెల్లరికిన్ శుభంబు గలుగ ప్రేమంబున్

సమైక్యంబగు శాంతముచే సమాధరమును పొందంగన్

నమోవాక్కులు సంభవమై నిరంతరమగు శ్రీదేవీ


011.. నరుణ్యాలయ సంతసమే క్రమన్ సముచిత సర్వంబున్ 

అరుణ్యా తరుణమ్ముగనే విధిన్ సముఖ విశేషంభో 

సరూప్యా వినయమ్ముగనే సమమ్ జయమగు వేగంబౌ

శ్వరా సేవలుగా జయమే సమం మగుటయె శ్రీదేవీ


012..సుఖం ముత్యము లాంటి యున్నత యోవనము సౌఖ్యమ్మున్ 

సుఖం నిత్యము వ్రాయను కాసులే యగుటయు ప్రేమమ్మున్ 

సుఖం సత్యము నేస్తము త్రాసు యే గమనము సౌమ్యమ్మున్ 

సుఖం గత్యము పాఠ్యము గా సుఖాల మయము శ్రీదేవీ


----

(13) భ  త  య  న  న   న  న  స     - సరసిజ 9    ...17

UII UUI  IUU  III III III  III  IIU

*సోజ్యము చూస్తుండు మనస్సే వినదు కనదు వశము అవదు కనుకా

జాడ్జ్యము నీవెంట తమాషా చెయుచు నిలబడ కనబడ వలదుగా

వాజము  నీతోను సహావాసము చెసిన అనుకరణముపు మదిలో

రాజ్యము నీదేను మురారీ మనసు మమత మనుగడకు తలపులే

*వెన్నెల కాంతుల్లొ ససేవే తహతహలు మది వసమగుటె మదనా 

ఉన్నటి ఆత్మీయ సమా ఊహల సుఖము తెలుపు సహనము చెలియా 

చిన్నది చింతే మరిచేలే చురుకు దనపు చెలి కలయు విధిగా 

మన్నన భావమ్మగు ప్రేమా చరితము కథల మనసగు సుఖమే

*వ్యాకరణ మేలే సకావ్యా విషయ వినయపు వివరముల మనసే

య్యాకుసుమమేలే సహాయం కనుల కదలిక యనెడి సుఖ తలపే 

వ్యాకుల మనేదే ససవ్యా విధి యగుటయు సవరణలగు వలపే 

తేకువయులేకే సుతత్వం సరిగమలు పలుతహతహల సుఖమే

*భాస్కరు డారోగ్యపు శాంతా కిరణములు మన భయముయె తొలగుటే

తస్కరు డాగ్నీ సహ శాంతా సిరులు కలుగుటయె తరము నిలుపుటే

భాస్కర మొక్షాన్కి సుఖంబే స్థిరము సమయ సహన వినయ మగుటే

తస్కర  యీశా మహిమంతా హృదయ విషయ పరమె సమరమగుటే

నేటి ఛందస్సు ... కల్పన..12
రచయత మల్లాప్రగడ

IIUI UIII IIUI UIII.. IIUI UIII II UI UU

అరిటాకు అన్నముయు - కధలౌను ఆకలియు 

కలిసాక సంతసము - విధి రాత కాదా 

విరజాజి పువ్వులకు  - చలనమ్ము వాసనయు
మరుమల్లె నవ్వులలొ  -
విధి రాత కాదా

వినయమ్ము చూపుటయు - కలమాయ మాపుటయు
- బతుకంత వేదనయు - విధి రాత కాదా
చిరునవ్వు పంచుటయు - మది తెల్పి ఆగుటయు
- దరిచేరి వేడుటయు  - విధి రాత కాదా

సకలమ్ము కారణము - మదిలోని మచ్చలుయె
- మనసంత రోదనము - విధి రాత కాదా
పరువాన ఉండుటయు - దరహాస మాడుటయు
- వినసొంపు మాటలయు -  విధి రాత కాదా

చతురత్వ విద్యయును - చతురత్వ భాషయును
చతురత్వ కోపమును - విధి రాత కాదా
మరుజన్మ యన్నదియు - సహజత్వ మాటలయు
అనునిత్య  నాటకము - విధి రాత కాదా

కల మాయ  కోన కధ - గిరి మాయ నీతి కధ
చిరు గాలి  గోలి కధ - విధి గాలి భీతీ
కరి మాయ కోరి కధ - నిధి మాయ వీధి కధ
మది గాలి మౌన కధ - తిధి గాలి  తీపీ
  
దరహాస తీరు దయ - విరజాజి మా రు కృప
- మది తెల్పు  మాయకల - తనువంత బాధా 
కావచ్చు కాలమున - వినవచ్చు శబ్దమున
-కానవచ్చు చీకటిన - మనసంత బాధా      

--(())--


(11) పద్య..సోయగాలు 

మల్లాప్రగడ 


ఆగ్రహం మనసు ను మధించు .... ఉగ్ర రూప మవ్వు

నిగ్రహం మనసు ను రక్షించు  .....  స్వర్గ సీమ నైన

పరికించి పరవశించు లతల్లొ  ......  సిరుల లక్ష్మి నుండు

పరిమళం పారవశ్యం ముగా    .....  పరిపరి విధములుగ 


పరితోషమును పొంది శాంతించి ..... కరుణ చూపి కదులు

పరమాత్ముని తలచి జీవించు  ....... విరిసిన లత వలెను

యవనిలో ఆశలుండుటయేను  ...... అవసరమ్ము యేను

అత్యాశలు పనికి రావులే        ......... నిత్య సత్య పలుక


దేశభక్తి ఘనము నరులకు    ......... పాశ మవ్వు చుండు

భాషలందు తెలుగు వెలుగులు ...... వేష భాష లందు

మట్టి మనిషి ఆకశమ్మునా ... గట్టి పలుకు లాగ  ..

కొనగోట మీటిన జీవిత౦ ... ..కనుమరుగున పడెను 


కలిసి నడిచిన కలంతోను ...  కలలు కంటి నాను  .

కర్పూర వెలుగుల వాసన   ....ఆర్పనులుగ నున్న    ..

కొలువు దీర్చినదేవ పిలుపులు ... కళల మనసునిచ్చు .

కలము సాక్షిగ రెక్కలుకదిలె ...  వాళ్లకు చిక్క కున్న 


భూగోళపు మనిషిగానేను ..... ... భగ్గు మనక ఉన్న 

నింగి నేలను నిండిఉన్నాను ... ఒగ్గి అగ్గి లాగ 

నీ జన్మ దినమున మాకల ..... నిజము తెల్పు చున్న ..

అక్షరాంజలులతో అర్పణ .... శిక్షనిచ్చు దేవ 


ప్రాంజలి ఘటియించి తెల్పితి .. సృజన పలుకు లన్ని 

తెలుగుతనముకు అద్దముగను .. తలచు చున్న కవిని

--(())__

(10) శ్వేని 

..  ర  జ ర ల గ...6


స్వప్రకాశశ్వర రూపిణీ విన

మ్ర ప్రభావ ధీర యీశ్వరీ జయ

మ్ము ప్రధాన దమ్ము మంజరీ క్షమ

మ్ము ప్రసూన గమ్య వర్ణనీ సుధీ


నాసికా పరమ్ము నాళరంధ్రమై

శ్వాసనా స్థిరమ్ము సాయమర్మమై

వీసమెత్తులేని వీర రక్తమై

యీశ్వరా చక్రంబు ఇచ్ఛగాసుధీ 


సానుకూల ప్రాసరశ్యమేవిధీ 

మానుచేయు ప్రేమభాగ్యమేనులే

కానివారు సౌకుమార్యమేనులే

ఆనతీయుని అచ్చెరమ్ముగానులే


నాకు నీవు నీకు నేనులే నిధీ 

ఏకు మేకు సాకు ఏలనో విధీ 

మాకు లాగ చుట్ట మాన సమ్మునా 

తాక మాకు రాకు తాతనో సుధీ 


ఏకమన్ననే సయోధ్యగానులే

శోకమీను బాపు చూపులే గతీ

లోకమేను తీర్పు లోల్లి గాదులే

మాకరమ్ములేను మానసమ్ముగా


లక్ష్యమే వరించు లాహిరీ విధీ

సాక్షిగా సుదీర్ఘ సాధనే మదీ

శిక్షనే ప్రయోగ చంద్రయాణమై

రక్షనే సహాయ మార్గమే సుధీ


కన్నులే ననమ్మి గాతువే మనో

వెన్నలే స్వతల్పవేడుటే జయమ్

మన్ననే సరాగ మౌనమే శుభమ్

బన్నమేనుదొర్కు భద్రమే సుధీ


.....

(9) వృత్త.. న స త గ..6


గురువు నిజ గుర్తే గమ్యమై 

కరుణ కళ కామ్యమ్మే విధీ 

తరుణ ఝష తాత్పర్య మదీ

చరణ సమచాతుర్య సుధీ


జయరామగుణా దీక్షారమా

జయవీరగణా రక్షారమా

జయధీరమదీ రక్తారమా

జయసూరవిధీ విద్యారమా 


మనసి జని మాంగళ్యమ్ముగా 

దనపతి సుధా రుద్రం మ్ముగా 

వినయ నయ విశ్వాసమ్ముగా 

అణుకువయె ఆదర్శమ్ముగా


కలలు సమకాలమ్మే నులే

కళలు యుగకర్తమ్మే నులే

గళము మదిగమ్యమ్మేనులే

పలుకుల ఉపాధ్యాయమ్ములే


ప్రముఖ మది ప్రాధాన్య మ్ము లే

సముఖ సహ సామాన్యమ్ము లే

విమిఖ జయ విశ్వాసమ్ము లే

మమత సుఖ మార్గమ్మేనులే


కథలు కలకాలమ్మేనులే

విధులు సహవిద్యామేలులే

నిధులు జయనిర్వాహమ్ములే

సుధలు సమ సౌందర్యంములే


సమయ నిధి సాధ్యమ్మేనులే

భ్రమల విధి బంధుత్వమ్ము లే

కమల మది కాలంలో కలే

శ్రమల గతి సామర్ధ్యమ్ము గా

ప్రాంజలి ప్రభ పాఠము 

(8) స్రగ్విణీ ... ర  ర  ర  ర....6


జ్ఞాన సద్భాగ్యదాయీ దిశా తేజమై

నిత్య సత్యామహీశా ప్రకాశిత్వమై 

ధర్మమైనిత్య ధ్యానమ్ముగా లక్ష్మిగా

సర్వలోకాలు సత్యమ్ముగాదృష్టియే


ఏమియన్నా సయోధర్మమే నీమదీ 

కామితార్ధమ్ముగా కాల నిర్మాణమే

సామి తీర్ధమ్ము సంసారమే జీవితం

ప్రేమమాధుర్యమే నిత్య సత్యమ్ముగన్


 దివ్య భవ్యా నిధీ రంజనీ పెన్నిదై

సవ్య లక్ష్యాల సౌమ్యమ్ముగా సన్నిధై

నవ్య రంజింప నాట్యాసమానమ్ముగై 

శ్రావ్య శక్తీ స్థితీ స్వేచ్ఛగా ణే సుధీ


ఇంటిలో కోట్లు యిచ్ఛా కలా పాలుగా

పంటిలో గాట్లు ప్రత్యేకమై మంటగా

కంటిలో నల్సు పడ్డాక బాధే విధీ

వంటి ఆరోగ్య పంతమ్ముగా పాట్లుయే


భీకర మ్మైన భేధ్యంముగా పోటీయే

చీకటీ రాత్రులే చెప్పకే వత్తురే

యేకమే డబ్బుయే ఎన్నియోజూపు లే

నాకసమ్మేవినా ట్యంమ్ముయే ధన్యుడౌ

(6) దృత విలంభర... న భ  భ ర.. 6


నడక సాగుట నమ్మక మేనురా

పడక చేర పసందను తేలరా

తడవనేర తపమ్ముగ ఏలరా

మడమతిప్ప మనస్సును ఎంచరా


కడలి పొంగు కథల్లుగ సాగురా

వడలి పోవు వరాలగు ఏలరా

పడవ లాగ ప్రయాణము చేయరా

గడప దాటి గరమ్ముగ వద్దురా


పలకరింపు పెదాలను చూడురా

చిలకరింపు చిరాకుగ ఏలరా

కులుకు మాట కులానికి చేటురా

వలపు ఆట వరాలకు ముద్దురా


చిరుకు గుడ్డ చిరాకును తెచ్చురా

బెరుకు మాటబలమ్మును మార్చురా

పరుగు లాట ప్రమాదము తెచ్చురా

జరుగు వేట జపమ్మును కూల్చురా


కలలు మన్నిక కాలము బట్టిరా 

పలక రింపు ప్రమాదము బట్టిరా

కళలు బుద్ది కథమ్మును బట్టిరా

పులకరింపు పురమ్మున బట్టిరా


గురువు నేర్పగువిద్యలు పొందురా 

ఉరుత మౌనయు చుష్ణుడు నీవురా 

పురహ నాజ్ఞను గాచుచు చూడరా 

స్థిరమ సంపద సాక్షిగ నువ్వురా


***

ప్రాంజలి ప్రభ.. నేటి పాఠము 

(7) తోదక.....న జ జ య..7


సకలజయమ్ము సమస్యలు లున్నా 

వికసిత లక్ష్య వినమ్రత చూపూ

వికటిత భావ నిజమ్మును తెల్పూ

ఒకటొకటే అవ కాసము పొందూ


ఎవరికి ఎవ్వరె ఏమియు చేయా

సవరణ చేయ సహాయము ఏదీ

వివరణ కోర వినమ్రత ఏదీ

అవసర మన్న అనేకము ఏలా


వలదు ననేది వివాదమ్ము మేళా

తలవనిదే పతనమ్మగు ఏలా

పిలవనిదే ది వరించుట ఏలా

అలసినవేళ అనంతము శోభా


అనుభవమేసమమౌనముగానే

అనుకరణే సమలక్ష్యము గానే

అనుమతి సేవ సమంత్రము గానే

అణుయనుహృద్యము శాంతిని కూర్చే


సమయ సమాది సమానము చేసే

సమర సహాయ సశాంతియు మార్చే

యమరిక దైవ యమః కళ కాదా

సుమ మధురం సుధావిధి కాదా


నుచితముయే ననునేకము ఏదీ 

విచలిత భావవి నమ్రత ఏదీ

ప్రచరత లక్ష్య ప్రభావము ఏదీ

రచనల వల్ల రసమ్ముయు కారే

***

ప్రాంజలి ప్రభ.. చందస్సు 


(6) దృత విలంభర... న భ  భ ర.. 6


నడక సాగుట నమ్మక మేనురా

పడక చేర పసందను తేలరా

తడవనేర తపమ్ముగ ఏలరా

మడమతిప్ప మనస్సును ఎంచరా


కడలి పొంగు కథల్లుగ సాగురా

వడలి పోవు వరాలగు ఏలరా

పడవ లాగ ప్రయాణము చేయరా

గడప దాటి గరమ్ముగ వద్దురా


పలకరింపు పెదాలను చూడురా

చిలకరింపు చిరాకుగ ఏలరా

కులుకు మాట కులానికి చేటురా

వలపు ఆట వరాలకు ముద్దురా


చిరుకు గుడ్డ చిరాకును తెచ్చురా

బెరుకు మాటబలమ్మును మార్చురా

పరుగు లాట ప్రమాదము తెచ్చురా

జరుగు వేట జపమ్మును కూల్చురా


కలలు మన్నిక కాలము బట్టిరా 

పలక రింపు ప్రమాదము బట్టిరా

కళలు బుద్ది కథమ్మును బట్టిరా

పులకరింపు పురమ్మున బట్టిరా


గురువు నేర్పగువిద్యలు పొందురా 

ఉరుత మౌనయు చుష్ణుడు నీవురా 

పురహ నాజ్ఞను గాచుచు చూడరా 

స్థిరమ సంపద సాక్షిగ నువ్వురా


***

5.. ఓం శ్రీ రామ.. శ్రీ మాత్రేనమః

మణి భూషణశ్రీ... ర న భ భ ర..9


సానుకూలతయు విద్యసమర్ధత నెంచియే

మానలేవు మదినేస్తము మాటను ఎప్పుడూ

ఆనతీయమని భక్తి అనంతము కోరుటే

ప్రాణమైనకళయుక్తి ప్రభావము పొందుకే


భిన్నమై వికృతి సాధు వినమ్రత లక్ష్యమై 

మన్ననై మహిమ జూప మనోమయి మార్గమై 

చిన్న పెద్ద గురువై విధి ఆటగ నేస్తమై

కన్నులే హృదయ శబ్ద కలోచిత లక్ష్మియై


ఆయుధాలు మనఆశయశాంతికి మూలమై

సాయుధమ్ము బల దేశసహాయమె నుండుటే

చేయువారు కడువృత్తిచరిత్రగ చూపుటే

ప్రాయమే విజయవాంఛ పదాలగు దేశమే 


తప్పు ఒప్పుకల కాల తపస్సుగ మారుటే

చెప్పు కో నలవి కాని చెరిత్రయనే విధి జేరుటే

ముప్పు వచ్చినను సాధ్యము యుక్తిని వాడుటే

మెప్పుకోరుటయు మోసమె నెం చకుమాసుధీ


పాల వారధిన పాఠపదాలగు సంపదే

కాల నీడలగు కావ్య కళమ్మగు సత్యమై

శాలయే మనసు వెంట సమర్ధత నెంచుటే

మాలగా సహనమేను మనస్సు చెంతనే


పర్ణశాల మది మాన ప్రపంచము జీవమై

అర్ణ సంపదగ ఆది అనంతము ప్రేమగా

వర్ణనే సహ సువర్ణ వనాలయ మందిరం

స్వర్ణ సంబరము

(4) మాధవ (నర భభ భర లగ - 13) 


పలుకులే మనోశ్శక్తియు యుక్తియు పంతము సొంతమే యగున్

కళల విద్య నమ్మే స్థితి భుక్తియు కాలము నేర్పుటే మదిన్

తులువ మాటలన్నీ విని దూరము గుండియు నమ్ముకుండుటే

చెలన బుద్దిగానే సహకల్పన చేష్టలు కాలతీర్పులే


మనముగా సహాయమ్ము చరిత్రయు మానస జీవితమ్ముగన్

అణువుగా విశేషాలు భరించియు ఆశ్రయ సౌఖ్యమే విధిన్

చినుకులా చిత్ర విచిత్రము చూపుచు చేరువ నేస్తమేయగున్

అనుకువా గలిగే సహనమ్మును శాంతిని జెర్చియు ధర్మమార్గమున్


పరుల సేవచేయాసహనమ్ముయు పాలన నేస్తమేయగున్

సిరులు కోరుటేబాధలు నెంచుట శీ ఘ్రము జీవితమ్ముగన్

నురుగు జీవితం గాలిన నీరుగ ఊరుట కాలమాయగన్

పరుగు పందెమే నీకును నాకును పాఠము నేర్పు కాలమున్

 .(3) కాంత :: త  జ  జ  లగ  ... 7


సాహిత్య జయమ్ము సహాయ ముగా 

దేహమ్ము బలమ్ము విధానము గా  

దాహమ్ము చరిత్ర ధరావతిగా  

మోహమ్ము విశాల మనస్స గుటే    


ప్రావిన్య తనేది పదాలు సహా 

య విశ్వేశ్వరమ్ము యశస్సు మహా 

భావాల విధాన తరాలు విహా 

ర విధ్యా సకాల రసాల కధా 


రామా కథదీప్తి రకాల నిఖా 

భామా సమపోష భరించ విధీ

శ్యామా లహరీ శశాంతి నిధీ

ప్రేమా లయమ్ముగ సహాయ్ సుధీ


వేవేల జనాల విలాస మదీ 

దేవా సహమిత్ర విచిత్ర విధీ

నీవే గురువర్య ననెమ్మి సుధీ

భావమ్ము సపర్య ప్రధాన నిధీ

కాంత 

దేవానినునేపిలిచేదను లే

రావాననుజేరవనీదయలే

కావుమ్ముమనస్సు వయస్సునులే

చావైననునీనిజ నిరూపణలే

(2) ప్రాంజలి ప్రభ వారి 

రచన.. మల్లాప్రగడ రామకృష్ణ


స  స  స స .....తోటకము.. యతి.8


మికి ష్టమైన అంశం లో


 కరుణా కరుడై వెలుగౌ నతడే

దరిచే రుటకై పదదా సుడనై

 పరిపా లకనా వెతబా పుటకై

కరుణిం చుమయా హరి కంఠనమో 


కమలా కుచచూచుక కుంకుమ తో

విమలంబర చూపువినమ్ర తగా 

సమలంకృత నిత్యము సాధనతో

సముఖం విముఖమ్ము సహాయముగా 

 

తిరువీధిన నీస్థితియే కదిలే

చిరుహాసముచెంతని దానముగా

అరునోదయమేను అనన్యతగా

తరుణం వికసించిత భావముగా


చదవంగసహృద్య జయమ్ముగనే

మదిలోన చలించు మజా తపమై

హృదయంబునభక్తి మృదుత్వముగా 

విధి యాడెడిఆట వినమ్రతగా కదిలే


కలకానిది కానక జెప్పకళే

అలవోకగ సాధన ఒప్పు కళే

కలలోనుకధా ఒకటైన కళే

మలుపే మదియందుమనస్సుకళే


గమనం జరిగేనుగళం తెలిపే

సమయం ఒకటౌనుసమం కదిలే

విముఖం పెరిగేనువినమ్రముగా 

సముఖం పరుగేనుసమం హృదయం


మనసే బరువై మమతే కరువై

తణువే బరువై సతతం సమరం

చినుకే పడినే తిమిరం కదిలే

వణుకే విజయం నవనాడులకే 


రకమే కదిలేను రణం జరిగే 

వికసించుటయేను వినాస్థితిగా 

ఒకరొక్కరుగాను ఒకే మనసే 

సకలం ఒకటౌను సమంసుఖమౌ


సరితూగనులేరు సరాజముగా

విరితావు వినోదవివాదముగా

చరితమ్ము చెకోర జయమ్మనగా

సిరిమావి కలేను శివా యనగా

Ramakrishna Mallapragada 

భుజంగప్రయాతము (18=08=2023)

య య య య  యతి 7


మహేశా!గిరీశా!మహాదేవదేవా!

మహానందమాయెన్ మనస్సెల్లనిండెన్

మహాయోగయోగీ మహాదేవశంభో!

సహాయంబునీవే సదానిన్నుకొల్తున్.


వినాశాపరీక్షా వినంమ్రా సురేశా 

అనంతా సునందా అనర్ధం ఎలాగో

మనమ్మే సహాయం మనస్సే మహేశా 

క్షణమ్మే యుగమ్మే క్షమాలీల సమర్ధం


సకాలం సహాయం సమర్ధం సవేదం 

వికాసం వివాదం వినోదం విమర్శం 

ప్రకోపం ప్రభావం ప్రమాదం ప్రపీఠం 

స్వకామం సమర్ధం సహాయం సుధామ్యం


గుణాలే సుదర్మం గురించేను పూర్తీ

మనమ్మేను విద్యా మహాశక్తి గానే

మనో శక్తి శూన్యం మహా యుక్తి మార్గం

ధ్వనీచేయడం సంద్రఘోషా ప్రయుక్తం


సహాయమ్ము గానే సమర్ధమ్ము జూపే

మ్మహావిద్య సాధ్యమ్ము విశ్వాస యుక్తం 

ప్రహాసమ్ము ఏలా ప్రభావమ్ము గాస్వీ

యహమ్మే వివాదం యశస్సే కోరే



Wednesday, 2 August 2023

*



 **

ప్రాంజలి ప్రభ కధలు

మనిషి ఈ భూమిపైన మరిమరి వూపిరి పోసుకోవటానికి కారణం- కర్మఫలం అనుభవించటానికే. ఆ మాటే నిజమైతే- ఆలోచించటానికి మనసు, ఎలాగైనా జీవించాలన్న ఆలోచన, మనసులో ఏ భావం ఉన్నా దాన్ని కట్టడి చేసి నలుగురు మెచ్చుకునేలా మాట్లాడే వాక్‌చాతుర్యం, కంటితో ప్రత్యక్షంగా చూడగలగడం, చెవితో పరోక్షంగా వినగలగడం- వీటితో పనేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం- కర్మ కోసమే కాకుండా ఈ జన్మలో ఆత్మోన్నతి సాధించటమే ముఖ్యమైన కారణమని చెప్పక తప్పదు. అలాంటి ఉన్నతమైన ఆదర్శం లేకపోతే, మనిషి కావటంకన్నా అడవిలో మానై నిలిచిపోవటం నయం. మనిషిగా పుట్టడమే ఒక గొప్పవరం అయినప్పుడు అది శాపం కాకుండా కాపాడుకుంటూ, జీవితంలో ఉన్నతశిఖరం అందుకోవటం ఎంతో ముఖ్యం. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతూ, శిఖరాగ్రం చేరుకోవటానికి ఈ శరీరాన్ని, మనసును, అందుబాటులో ఉన్న జీవితావకాశాల్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. అందుకు ఏం చేయాలి? ఇది రెండో ప్రశ్న.
రుషులు, దార్శనికులు ఇందుకు తగ్గ మార్గనిర్దేశం ముందుగానే చేశారు. ఇప్పుడు మనం చేయవలసిందల్లా, ఆ మార్గదర్శకాలను జీవితంలో అమలుపరచటమే. మనకు శ్రమలేకుండా, వేదవేత్తలు నాలుగు ఆశ్రమధర్మాలను అందజేశారు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం- ఈ నాలుగింటిని శిఖరాగ్రం చేరటానికి మేడమెట్లలా ఉపయోగించుకోవాలి.  మనిషి ఒక జీవితకాలంలో ఇహమైనా పరమైనా సాధించాలనుకుంటే, ఒక లక్ష్యం ముందుగానే నిర్ణయించుకోవాలి. ఒక పథకం ప్రకారం ఆ లక్ష్యం వైపు సర్దుబాట్లు, దిద్దుబాట్లు చేసుకుంటూ- అడుగు ముందుకు వెయ్యాలి. ఈ పనిని నిర్దుష్టంగా, నిర్దిష్టంగా చేపట్టడానికి బ్రహ్మచర్యాన్ని మించిన అవకాశం లేదు. జిజ్ఞాస, జ్ఞానసముపార్జన, పరిశీలన, విశ్లేషణ... ఇవన్నీ నిర్విఘ్నంగా చేయటానికి ఏ చీకూచింతా లేని బ్రహ్మచర్య ఆశ్రమమే ఆదర్శప్రాయమైన సమయం. గార్హస్థ్యంలో ఒక కుటుంబ యజమానిగా సంసార సాగరం ఈదటంవల్ల జీవితంలోని లోతుపాతులు తెలుసుకోవచ్చు. అంతకుమించి, అనుభవపూర్వకంగా ఇంద్రియాల లాలస, విషయభోగాల స్వభావం గ్రహించవచ్చు. భోగించి యోగించటమే ఉత్తమమైందని, జీవితాన్ని కాచి వడబోసిన వేమన తన వేదంలో చెప్పాడు. అసలైన వైరాగ్యానికి సిసలైన వేదిక గృహస్థ జీవితమే. మూడోదైన వానప్రస్థం మహాప్రస్థానానికి ఒక ఉపోద్ఘాతంగా చెప్పుకోవచ్చు. సహనం దాని సారాంశం. రాజులు రాజర్షులై భర్తృహరిలా సుభాషితాలు, హితబోధకాలైన గ్రంథరచనలు, ధర్మ, న్యాయసూత్రాలు సృష్టించింది ఈ స్థితిలోనే. చరమ పాదమైన సన్యాసం జీవన పరిసమాప్తికోసం నిర్దేశితమైంది. కర్మఫలాన్ని ఆశ్రయించకుండా కర్తవ్యకర్మ ఆచరించేవాడే నిజమైన సన్యాసి, యోగి అంటోంది గీత. ఒక సమన్వయకర్తగా మనిషి ఎదుగుదలకు నిదర్శనమే సన్యాసం. అలాంటి నిఖార్సయిన సన్యాసి కాషాయం కట్టి, సిగచుట్టి, విభూతిపెట్టి, కమండలం పట్టి వూరూ, వాకిలీ వదిలి వెళ్లవలసిన అవసరం లేదు. మనలాగే మన మధ్యనే ఉంటూ, తామరాకుపైన నీటిచుక్కగా నిలవటమే జీవిత సాఫల్యం. ఈ జీవన్ముక్తి వివేకమే సర్వగమ్య మోక్షానికి సహజమైన మార్గం.
......
*అందరూ అమ్మ కడుపు నుండి ఒకేలా బయటపడుతారు ఎలా జీవించాలి అనేది మనం ఎన్నుకుని జీవించే పద్ధతిలో ఉంటుంది---//-*

*నిజాయితీగా ఉండేవాళ్ళు ఎప్పుడు పొగరుగా, మొండిగానే  ఉంటారు...*

*ఎందుకంటే వాళ్లకు నటిం చడం రాదు కాబట్టి  అలాగే అవసరానికి వాడుకొని వది లేసే గుణం కూడా వారికి ఉండదు...*

*అందరిలో మంచిని మాత్రమే చూస్తారు,దేనికి లొంగరు ప్రేమకి, మంచి వ్యక్తిత్వానికి తప్ప...*

*వారి జీవితానికి వారే  కర్త, కర్మ, క్రియగా జీవిస్తారు...*

*వారి కష్టనష్టాలకి ఒకరిని బాధ్యులను చేయరు...*

*ఎప్పుడు ఆత్మ విశ్యసముతో  ఉంటారు...ఆపనమ్మకం వారి దరిదాపుల్లో ఉండదు!*

*అందరూ అమ్మ కడుపు నుండి ఒకేలా బయటపడుతారు... ఎలా జీవించాలి అనేది మనం ఎన్నుకుని జీవించే పద్ధతిలో ఉంటుంది---//-*
.....
#కార్తీక_మాసంలో "#ఉసిరి"

కార్తీక మాసంలో చలి పెరుగుతుంది. అపుడు కఫసంబంధమైన, జీర్ణసంబంధమైన వ్యాధులు అనేకం వచ్చే అవ కాశం ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం, ఉసిరికి దగ్గరగా ఉండటం వల్ల ఈ దోషాలు కొంతవరకూ తగుతాయి. ఆయుర్వేదం ప్రకారం ఉసిరి చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యాన్ని కలిగించేదే! ఉసిరి వేళ్లు బావిలోకి చేరితే ఉప్పునీరు కూడా తియ్యగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తులసి, ఉసిరి, వేప చెట్ల నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమని మన పెద్దల నమ్మిక.బావుల్లో ఉసిరి విత్తనాకు పోస్తారు. దీనివల్ల ఆనీరు శుధ్ధి అవుతుందని పూర్వుల నమ్మిక.

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేస్తారు.ఈ విధంగా పూర్వం స్నేహితులు బంధువులు కలిసి వేద పండితులను సర్కరించడం ,పూజాదికాలు చేయడం వల్ల పరస్పర స్నేహ భావన, బంధుభావన , రోజువారీ పనినుండీ కాస్తంత సేదతీరడం జరిగేవి.

కార్తికమాసం వచ్చిందంటే చాలు... వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడుందా అని అన్వేషిస్తుంటారంతా. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరిచెట్టు కింద ఒక్కపూటయినా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకెళ్లి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తికంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరిచెట్టులో కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగానూ కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృతబిందువులు పొరబాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం. ఇది సకల మానవాళినీ రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరకసంహిత. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు. అంతటి మహత్తరమైనదిగా భావించే ఆ చెట్టు ఫలం మరెంతటి ఉత్తమోత్తమమైనదో వేరే చెప్పాలా? అందుకే ఆయుర్వేద వైద్యానికి ఉసిరే కీలకం.

ఉసిరిని సంస్కృతంలో ఆమ్లాకి లేదా ధాత్రీఫలం అనీ పిలుస్తారు. ఏదో ఆపిల్ మాదిరిగానో అరటిపండులానో ఉసిరి గబగబా కొరికి తినేసేదేం కాదు. ఎందుకంటే పులుపు దాని ఇంటిపేరు. కానీ ఆ పులుపే ఈ పండుకున్న బలం. కమలారసంతో పోలిస్తే ఉసిరి రసంలో విటమిన్-సి 20 రెట్లు ఎక్కువ. అలాగని ప్రొటీన్లు లేవనుకునేరు... ఆపిల్‌లోకన్నా మూడురెట్లు ఎక్కువ. ఇతర పండ్లలోకన్నా యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. అనేకానేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి. అందుకే దీన్ని సర్వదోషహర అనీ పిలుస్తారు. శీతకాలం నుంచి వేసవివరకూ వచ్చే ఈ కాయల్ని ఎండబెట్టి నిల్వచేసుకుని ఏడాదిపొడవునా వాడతారు. కొందరు పంచదారపాకంలో మురబ్బా రూపంలో నిల్వచేసుకుని తింటారు. నిల్వపచ్చడి రూపంలో వాడుకున్నా ఉసిరి అద్భుత ఔషధమే.

అయితే ఉసిరిలో మనకు తెలిసి రెండు రకాలున్నాయి. ఒకటి పుల్లని రాచ ఉసిరి, మరొకటి చేదూ తీపీ వగరూ ఘాటూ పులుపూ కలగలిసినట్లుండే ఉసిరి. రాచ ఉసిరిని కేవలం తినడానికో పులిహోరకో మాత్రమే వాడతాం. ఈ ఉసిరి పొడిని దుస్తుల అద్దకాల్లోనూ ఎక్కువగా వాడతారు. కానీ ఉసిరిలో పండేకాదు, వేరు నుంచి చిగురు వరకూ ప్రతీదీ ఔషధమే.

ఉసిరితో తయారు చేసిన మాత్రలు వాత, పిత్త, కఫ రోగాలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఉసిరిని నిత్యం వంటల్లో లేదా ఉదయాన్నే తిన్నా మనకు మంచి శక్తి, ఆరోగ్యం వస్తుందనడంలో ఎంత మాత్రం అతిశ యోక్తి కాదు. ఉప్పు లో ఎండ బెట్టిన ఉసిరిని నిల్వచేసుకుని ప్రతిరోజు ఒక ముక్క బుగ్గన పెట్టుకుని చప్ప రిస్తూవుంటే, జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్తి రోగాన్ని నిర్మూలిస్తుంది, ఎసిడిటీ, అల్సర్ వంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. ప్రతి ఇంటిలో ఉసిరిని పెంచితే ఆగాలికే ఆరోగ్యం లభిస్తుందని శాస్త్రజ్ఞులమాట. . భార తీయ వాస్తుశాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇంటి పెరటిలో గనుక ఉసిరి చెట్టు ఉంటే, ఆ ఇంటి వాస్తుదోషాలు ఏవైనా ఉంటే హరిస్తుందని జ్యోతిషశాస్త్రం, వాస్తుశాస్త్రం చెప్తున్నాయి.

ఉసిరి కంటిచూపును మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. జ్వరం వచ్చి పచ్చెం పెట్టే సమయం లో నూ, బాలింతకూ పచ్చం పెట్టేప్పుడూ పాత చింతకాయ పచ్చడితోపాటుగా ఉసిరి కూడా ఎండు మిర్చితో ,ఇంగు వ వేసి చేసి పెడతారు. రక్త శుధ్ధికి ఇది మంచి మందుగా పని చేస్తుంది.

ఆదిశంకరులవారు ఆశువుగా చెప్పిన కనక ధారా స్తవం మనకు ప్రతిరోజూ చదవ దగ్గ స్తోత్రరాజం.శంకరులు బాల బ్రహ్మ చారిగా ఏడెనిమిదేళ్ళ వయస్సులో భిక్షకోసం ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిల్చి ' మాతా బిక్షం దేహి 'అని కేకవేయగా ఆపేద బ్రాహ్మణి రెండో వస్త్రం సైతం లేక చీర ఆరేవరకూ ధరించిన చిన్న వస్త్రంతో బయ టకు రాలేక తన ఇంట ఉన్న ఒకేఒక ఎండిన ఉసిరికాయను తన లేమికి చింతి స్తూ ఆబ్రహ్మచారి జోలెలో తన పూరి పాక తలుపు చాటు నుంచీ విసిరివేస్తుంది. శంకరులు ఆమె దారిద్యాన్ని గ్రహించి, అంత లేమిలోనూ తనకున్న ఒకే ఒక ఉసిరికాయను త్యాగ భావంతో తనకు దానం చేసినందుకు సంతసించి ' కనక ధారాస్తవం ' ఆశువుగా చదువుతారు. వెంటనే లక్ష్మి కరుణీంచి ఆమె ఇంట బంగారు ఉసిరి కాయలవాన కురిపిస్తుంది. ఇల్లు నిండిపోతుంది. త్యాగానికి ఋజువు , ఆభావనను గ్రహించి కరుణించిన శంక రులవారి మనస్సూ ఈ కధ ద్వారా మనకు తెలుస్తాయి. అదే కనక ధారా స్తవం 'గా భక్తులు ప్రతిరోజూ చదివి సంపదలు పొందుతారు.
శుభం
......
*కృతజ్ఞత*

“కృతజ్ఞత” అంటే ఒకరు మనకు చేసిన మేలును మరచిపోకుండా ఉండటం.

మనం,
ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడో,
ఏదో ఒక సహాయం మనకు అవసరమైనపుడో,
మనం అడిగితే సహాయపడేవారు కొందరుంటారు.

మనం అడగకపోయినా మనకు అవసరమైన ఉపకారం చేసే ఉదారులు కొందరుంటారు.

వీరికెప్పుడూ,
మనం కృతజ్ఞులమై ఉండాలి.

కృతజ్ఞత అనేది నాగరిక సంస్కారం.

వాల్మీకి, రాముణ్ణి వర్ణిస్తూ “ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ” అన్నాడు.

సీతమ్మను అపహరించు కొనిపోతున్న రావణునితో పోరాడి ఆ సమాచారాన్ని రామునికి చెప్పి ప్రాణాలు కోల్పోయిన జటాయువుకు రాముడు కృతజ్ఞతతో అంతిమసంస్కారం చేశాడు.

రావణ సంహారంలో తనకు తోడ్పడిన వానరుల కోసం,

ఈ వానరులు, ఎక్కడ ఉంటే అక్కడ త్రికాలాలలోనూ మధురఫలాలను ఇచ్చే వృక్షాలు ఉండేటట్లు,
అక్కడి నదులలో నిరంతరం స్వాదుజలం ప్రవహిస్తూ ఉండేటట్లు వరం ఇవ్వవలసిందిగా,
రాముడు ఇంద్రుణ్ణి కోరాడు.

ఇదీ ఆయన కృతజ్ఞతా లక్షణం.

మహాభారతం లో,

దగ్ధమైన లాక్షాగృహం లోంచి ప్రాణాలతో బయటపడి,

ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో,
తన కుమారులతో తల దాచుకుంటున్న కుంతి,

తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ బ్రాహ్మణునకు ఒక కష్టదశ సంభవించగా,
అతనికి ప్రత్యుపకారం చేయటం తన ధర్మమని భావించిన సందర్భంలో కుంతీదేవి తన ఒక కుమారుడను రాక్షసుడుకు ఆహారముగా పంపడం ద్వారా కృతజ్ఞత తెలియజేసింది.

ఒకరు తమకు చేసిన ఉపకారాన్ని గ్రహించటం పుణ్యం,

దానికి సమమైన ప్రత్యుపకారాన్ని చేయటం మధ్యమం,

వారు చేసిన ఉపకారానికి మించిన ప్రత్యుపకారం చేయటం ఉత్తమం అంటుంది ధర్మం.

“ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం”
అనే చందంగా కాకుండా,

మన ఉనికికి, ఉన్నతికి కారకులైన వారిపట్ల మనం కృతజ్ఞులమై ఉండాలి.

ఒకనాడు మనకు మేలుచేసిన మనిషి ,
విధివశాత్తూ ఒక కష్టంలో పడినట్టు మనకు తెలిస్తే,

అతని యందు సకాలంలో,
అవసరానికి తగినట్టుగా స్పందించకపోతే,
అది కృతఘ్నత ఔతుంది.

ఈ విషయాన్ని మహాభారతం అనుశాసనికపర్వంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడు ఒక కథారూపంలో ధర్మరాజుకు చెప్పాడు.

ఒక బోయవాడు వేటకు వెళ్ళి "ఘనతర విషదగ్ధ శరం" తో ఒక మృగాన్ని కొట్టబోయాడు.
అది గురి తప్పి ఒక చెట్టును తాకింది.
పువ్వులతో, కాయలతో పచ్చగా ఉన్న ఆ వృక్షం, విష శరాఘాతం వల్ల నిలువునా శుష్కమైపోయింది.

ఆ చెట్టే ఆశ్రయంగా,
దాని తొర్రలో నివాసముంటున్న ఒక మహాశుకం,
దానిని వదలలేక దాని మీదనే ఉండిపోయింది.

దీనిని గమనించిన ఇంద్రుడు మానుషరూపంలో దాని దగ్గరకు వెళ్ళి,

ఓ కీరమా! ఈ వృక్షం బెండువారి పోయింది.

ఫలసంపద గల అనేక ఇతర వృక్షాలు ఈ అరణ్యంలో ఉండగా,
ఇంకా దీనినే అంటిపెట్టుకున్నావెందుకు..?
అని అడిగాడు.

అపుడా శుకం,
ఈ చెట్టు తాను మధురఫలాలతో నిండిఉన్న సమయంలో నాకు ఆశ్రయం ఇచ్చింది.

ఈవేళ ఇది ఎండిపోయిందని, నేను దీనిని వదలి వెళ్ళిపోవటం కృతఘ్నత కాదా! అనిమిషనాథా! అంది.

తాను మానుషరూపంలో వచ్చినా
"పురాకృత సంజనిత విశేషము" చేతనే,
ఈ మహాశుకం తనను ఇంద్రునిగా పోల్చుకోగలిగిందని ఆశ్చర్యపోయి,

నీ మాటలకు మెచ్చాను, నీకేం కావాలో కోరుకో,
అన్నాడు ఇంద్రుడు.

అపుడా మహాశుకం,
ఈ వృక్షానికి మేలు చెయ్యి, చాలు. అంది.

ఇంద్రుడు సంతోషించి,
అమృతసేచనంతో ఆ వృక్షానికి పూర్వం కంటే ఎక్కువ శోభను, ఫలసంపదను కలుగజేశాడు.

ఈ కథ వల్ల,
ఉత్తములైన ఆశ్రితులు,
ఆశ్రయదాత క్షేమాన్ని కోరుకోవాలని,
కృతజ్ఞత ఉత్తమలక్షణమని తెలుస్తోంది.

సజ్జనులు,
ఇతరులు తమకు చేసిన ఉపకారాన్ని మరచిపోరు.

🙏 సర్వే జనా సుఖినోభవంతు🙏
A Collection from
Admin
Pranjali prabha
.......
*****  ...........జీవితం.............
యవ్వనంలో ఉన్నప్పుడు *"మొటిమల్ని"* గురించి బాధపడే వాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు  *"ముడతల్ని"*  గురించి బాధపడుతుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు *"ఆమె"* చెయ్యి పట్టుకోవాలని ఆశతో ఎదురుచూసే వాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి *"చేయి"*  పట్టుకుంటారా....అని ఎదురు చూస్తుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను *"ఒంటరిగా"* వదిలేస్తే బాగుండును...అనుకునేవాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు అందరూ *"ఒంటరిగా"* వదిలేస్తారేమో.... అని బాధపడుతుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే *"చికాకు"* పడేవాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు ఎవరూ కనీసం *"మాట్లాడటం"* లేదే అని బాధపడుతుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు *"అందాన్ని"* ఆస్వాదించే వాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ *"అందాన్ని"* చూసుకుంటుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు నాకు *"చావు"* లేదు అనుకుంటాం!

ముసలితనం వచ్చినప్పుడు .... *"రోజులు దగ్గర పడ్డాయి"* అని బాధపడుతుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులతో *"ప్రతి క్షణాన్ని"* పండగ చేసుకునే వాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు ఆ *"తీపి జ్ఞాపకాల్ని"*  నెమరు వేసుకుంటుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు *"నిద్రలేవడం"* కష్టంగా ఉండేవాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు *"నిద్రపోవడానికి"* కష్టపడుతుంటాం!!

యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా *"గుండెల మీద"* పిడిగుద్దులతో  గుద్దుకునే వాళ్ళం!

ముసలితనం వచ్చినప్పుడు ఈ *"గుండె ఎప్పుడు ఆగి పోతుందో"*  అని భయపడుతుంటాం!!

కనుక........

జీవితంలో రకరకాల *"ఆటు పోట్లు"* వస్తుంటాయి.
దేనికీ భయపడ కూడదు.

ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం  కావాలి.
అదే నిజమైన *"జీవితానుభవం".*

అది *"యవ్వనంలో"* నైనా.. *"ముసలితనంలో"* నైనా.....అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా *"ప్రశాంతంగా"*  ఉంటుంది.

అందుకే, మిత్రమా....

*యవ్వనంలో..... విర్రవీగకు!*
*వృద్దాప్యంలో..... బాధ పడకు!!*  పరోపకారచింతనతో ప్రశాంతంగా బతికేద్దాం......
......

ప్రభుత్వం మారాలి అంటె ముందు ప్రజలు మారాలి

*ఈ దేశంలొ తప్పు చేసినోడు " బాబా " అవుతాడు
*హత్యలు చేసినోడు " నాయకుడు " అవుతాడు
*అవినీతి చేసినోడు " అధికారి " అవుతాడు
*పంట పండించేవాడు " అడుక్కు " తింటాడు
*కష్టపడి చదివేవాడు " నిరుద్యోగి " అవుతాడు
*న్యాయoగ ఉండేవాడు " నాశనం " అవుతాడు
*నాయకుని బట్టి న్యాయం వాయిదా అధికారి అవుతాడు.
*అవకాశ వక్రబుద్ధి రాజకీయ లబ్ది ఆశ పోరాట నాయకుడౌతాడు.
*ఇదే మన 70 ఏళ్ల స్వాతంత్ర దేశం

*ఇంకా చెప్పాలంటే ఈ దేశంలొ పేదవారు ఉన్నారు కాని " పేద " దేశం కాదు
*అభివృద్ధి ఉంది అలాగని అభివృద్ధి చెందిన దేశం కాదు....కారణాలు ఇవే

* మనం అంబులెన్స్ కి phone చేస్తే దానికంటే ముందు pizza మన ఇంటికి వస్తుంది..

*కారు loan కి వడ్డీ 5% అయితె, చదువుకోవడానికి మాత్రం bank లు వసూలు చేసేది 12% వడ్డి..

*మనం కాళ్లకు వేసుకునె చెప్పులు a/c room లొ కొంటున్నాం,
*అదె తినే ఆహార పదార్థాలు మాత్రం రోడ్డుపైన కొంటున్నాం..

* పర్యావరణం కాలుష్యం చేసె ఫ్యాక్టరీలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం
*కాని అన్నం పండించే రైతన్నకు 7 గంటలు కరెంట్ ఇస్తున్నాం..

*70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలొ నేటికి రూపాయికి కిలో బియ్యం & 5 రూపాయలకు అన్నం కోసం line లొ నిలపడుతున్నారు అంటె నా దేశంలొ పేదరికం ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోండి...

*లిక్కర్ కి ఆశపడి మగవాళ్ళు
కుక్కర్ కి ఆశపడి ఆడవాళ్లు ఓట్లు వేస్తె
*చివరికి నిక్కర్ కూడ మిగులకుండ చేస్తారు
ఈ రాజకీయ నాయకులు...
నిజా నిజాలు గమనించే వారు, అమ్ముడుపోకుండా నిస్వార్ధ పరులు, కుల, మత, భాష బేధం చూపేవారిని గమనించి ఓటు వేస్తారని నా భావన.

మీ ప్రాంజలి ప్రభ

ఉద్యోగ ప్రాప్తి కొరకు :*
*$$$$$$$$$$$$$$$$$*

*శ్రీరామ పట్టాభిషేకం :*

*ఉద్యోగం లేని వాళ్ళు,ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు, ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు, తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీమద్రామాయణము నందలి బాలకాండము నందు మొదటి సర్గము నందు గల శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 21 సార్లు పఠించాలి.*

*నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |*
*రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||*

*ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |*
*నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||*

*న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |*
*నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||*

*న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |*
*న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||*

*న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |*
*నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||*

*నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |*
*అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||*

*గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |*
*అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||*

*రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |*
*చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||*

*దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |*
*రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||*

*ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |*
*యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||*

*ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |*
*సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||*

👉 చక్కగా పితృవాక్యపరిపాలనమొనర్చివచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నంది గ్రామమున తనసోదరులను కలిసికొని, జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితో కలిసి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టేను.

👉 శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరును సంతోషముతో పొంగిపోవుచు, ఆయన పాలనలో సుఖఃసౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తితత్పరులై ధర్మమార్గమున ప్రవర్తించుదురు, ఆరోగ్యభాగ్యములతో హాయిగానుందురు, కఱువు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు.

👉 రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును, స్త్రీలు పాతివ్రత్యధర్మములను పాటించుచు. నిత్యసుమంగళులై వర్థిల్లుచు ఉందురు. అగ్నిప్రమాదములు గాని, జలప్రమాద(మరణ)ములు గాని, వాయు భయములుగాని లేకుండును. జ్వరాదిబాధలు, అట్లే ఆకలిదప్పుల బాధలు, చోరభయములు మచ్చుకైనను ఉండవు - (ఆధ్యాత్మిక - ఆధిదైవిక - ఆధి భౌతిక బాధలు లేకుండును). రాజ్యములోని నగరములు, ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడిపంటలతో తులతూగుచుండును. జనులు కృతయుగమునందువలె ఎల్లవేళల సుఖశాంతులటో వర్థిల్లుచుందురు.

👉 అనేకములైన అశ్వమేథాదిక్రతువులను, సువర్ణ్క యాగములను శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్లకొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమొనర్చి, వాసికెక్కును.

👉 రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్థిపఱచును. నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరముల కాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును.

👉 ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమొనర్చును, సర్వపాపములను రూపుమాపును, పుణ్యసాధనము, వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నియును పటాపంచలై పోవును, ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును, వారి పుత్త్రపౌత్త్రులకును, పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మఱియు అంత్యకాలమున మోక్షప్రాప్తియు కలుగును.

*సేకరాణ :*
*_ ప్రాంజలి ప్రభ

 *వైశాఖ పురాణం 4 వ అధ్యాయము* 🕉️
సేకరణ మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*
*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*


🌻 *వైశాఖధర్మ ప్రశంస* 🌻
💫🌹నారద మహర్షిని అంబరీష మహారాజు "మహర్షీ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను. అంబరీషమహారాజా! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది.
 

💫🌹వినుము, నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము, పగటినిద్ర, కంచుపాత్రలో భుజించుట, (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు. వ్రతమునాచరించువారు పాత్రలో, కంచములో భుజింపరాదు. అరటీఅకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము.
 

💫🌹ధనవంతులు - బంగారు, వెండిపాత్రలలోను, సామాన్యులు కంచుపాత్రలలోను ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖమాసవ్రతము చేయువారు మానవలెను. రెండుమార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను.
 

💫🌹వైశాఖమాసవ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసవ్రతము పాటించువారు, యెండలోనడచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్దలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమమాసమున గూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగ భావించి వాని పాదములను నీటిచే కడిగి యా పవిత్రజలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నియు పటాపంచలై నశించును.
 

💫🌹ఆ జలమును తలపై జల్లుకొనిన గంగ మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును. విష్ణుప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిదకడుపున బుట్టి తరువాత జన్మయందు కంచరగాడిదగా జన్మించును.
 

💫🌹ఆరోగ్యవంతుడై యుండి దృఢశరీరము కలిగి స్వస్థుడైయున్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనందును వైశాఖమున బహిస్నానము నదీ/తటాకాదులలో చేయనివాడు వందలమార్లు శునక జన్మమునందును. స్నానాదులు లేక వైశాఖమాసమున గడిపినవాడు పిశాచమై యుండును. వైశాఖమాసవ్రత మాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభియై జలమును, అన్నమును దానము చేయనివాడు పాపదుఃఖముల నెట్లు పోగొట్టుకొనును? పోగొట్టుకొనలేడని భావము.
 

💫🌹శ్రీమహావిష్ణువును ధ్యానించుచు నదీస్నానము నాచరించినవారు గత మూడు జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనును. ప్రాతఃకాలమున సూర్యోదయ సమయమున సముద్రస్నానము నాచరించినచో నేడు జన్మలలో చేసిన పాపములును పోవును. జాహ్నవి, వృద్దగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి యని గంగానది యేడు విధములుగ ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్దినందినది. అట్టి సప్తగంగలలో ప్రాతఃకాలస్నానమున వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనుచున్నారు.
 

💫🌹దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతఃకాలమున చేసినవారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున(లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్లు) గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్దలతో వాని యందు స్నానమాడవలెను.
 

💫🌹రసద్రవ్యములలో క్షీరముత్తమము. క్షీరము కంటె పెరుగు ఉత్తమము. పెరుగుకంటె నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తికమాసముత్తమము. కార్తికముకంటె మాఘమాసముత్తమము. మాఘముకంటె వైశాఖముత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును.
 

💫🌹కావున నిట్టి పవిత్రమాసమున ధనవంతుడైనను, దరిద్రుడైనను, యధాశక్తి వ్రతము నాచరించుచు బ్రాహ్మణునకు యధాశక్తిగ దానమీయవలెను కంద మూలములు, పండ్లు, వ్రేళ్లు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగువానిని నిచ్చినను కలుగు పుణ్యమనంతము. బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికిని యీ మాసమున వ్రతదానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు.
 

💫🌹దానము చేయనివాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపముల నాచరించును. అందుచే నరకము నందును. కావున యధాశక్తిగ దానము చేయుట యెట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుచు దానము చేయవలయును. ఇంటిలో నెన్నియలంకారములున్నను పైకప్పులేనిచో ఆ యిల్లు నిరర్ధకమైనట్లు జీవి యెన్ని మాస వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో వాని జీవితమంతము వ్యర్థము.
 

💫🌹అన్ని మాసముల వ్రతముల కంటె వైశాఖమాస వ్రతము ఉత్తమమను భావము. స్త్రీ సౌందర్యవతియైనను, గుణవంతురాలైనను, భర్త కలిగియున్నదైనను, భర్తను ప్రేమించుచు, భర్తృప్రేమను కలిగియున్నను, వైశాఖవ్రతము నాచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని యెరుగుము. అనగా సర్వశుభలాభములనంది యువతులును వైశాఖవ్రతమును చేయనిచో వారికి నున్నవన్నియు నిష్పలములు వ్యర్థములునని భావము.
 

💫🌹గుణములెన్ని యున్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్ర్వతము లెన్నిటిని చేసినను వైశాఖమాస వ్రతమును చేయనిచోయన్నియు వ్యర్థములగును సుమా! శాక సూపాదులు(కూర పప్పు) యెంత యుత్తమములైనను, యెంత బాగుగవండినను ఉప్పులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖవ్రతమును చేయనిచో నెన్ని వ్రతములును చేసినను అవియన్నియు వ్యర్థములే యగును సుమా...
 

💫🌹స్త్రీ యెన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే యెన్ని సద్ వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున శ్రీమహావిష్ణువు దయను వైశాఖ వ్రతమునాచరించి పొందవలెను. ఇట్ళు చేయనిచో నరకము తప్పదు.
 

💫🌹వైశాఖ స్నానాదికముచే సర్వపాపక్షయమై వైకుంఠప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని యితర మాసములలో చేసినచో వచ్చు ఫలములకంటె వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలమత్యధికము. వైశాఖవ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసినవానికంటె వీనిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను, కాముకుడైనను, యింద్రియలోలుడైనను వైశాఖమాస వ్రతము నాచరించినచో వైశాఖస్నానమాత్రముననే సర్వదోషముల నశింపజేసి కొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసమునకు శ్రీమహావిష్ణువే దైవము.
 

💫🌹వైశాఖమాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీమహావిష్ణువు నిట్లు ప్రార్థింపవలయును.
*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ |*
*ప్రాతః స్నానంకరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ ||*
 

💫🌹పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యము నీయవలయును.
*వైశాఖే మేషగేభానౌ ప్రాతః స్నాన పరాయణః |*
*అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన ||*
*గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |*
*ప్ర గృహ్ణీతమయాదత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ ||*
*ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |*
*గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||*


💫🌹అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడి/పొడి బట్టలను కట్టుకొని వైశాఖమాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలయును. వైశాఖమాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను/చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నియు నశించును. ముక్తి లభించును.
 

💫🌹ఇట్లు చేసినవారు భూలోక వాసులైనను స్వర్గలోకవాసులైనను, పాతాళలోకవాసులైనను యెచటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు. అనగా పునర్జన్మయుండదు. ముక్తి సిద్దించును.
 

💫🌹వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు, శ్రీమహావిష్ణువు సత్కధలను విననివారును, స్నానము, దానము చేయనివారును, నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖస్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు.
 

💫🌹తను స్వతంత్రుడై యుండి తన శరీరము తన యధీనములోనే యుండి, నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడవీలున్నను, స్నానమాడక నాలుక తన యధీనములో నుండి 'హరి' యను రెండక్షరములను పలుకకయున్న నీచ మానవుడు జీవించియున్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుటమున్నగు లక్షణములు లేని 'శవము' వలె నతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని యెట్లైనను సేవింపనివాడు పందిజన్మనెత్తును.
 

💫🌹పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును పాటించుచు ప్రాతఃకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీమహావిష్ణువు నర్చించి విష్ణు కధాశ్రవణము దానము చేసినవారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో గలసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలయును సుమా....
 

🌺 *వైశాఖ పురాణము నాలుగువ అధ్యాయము సంపూర్ణము* 🌺
 

    🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు*


శుకబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు, కారణజన్ముడు. పరమ విరాగి. దర్బలు చేబూని, ఎల్లప్పుడూ సత్‌కర్మలు చేయుచుండెడివాడు. ఒక సందర్భములో శుకుడు నడిచి వెళుతుండగా, స్నానము చేయు ఆడవారు వివస్తల్రుగా వుండి కూడా, ఆ మహానుభావుని గురించి శంకించలేదు. అంతటి పరబ్రహ్మ స్వరూపుడైన శుక బ్రహ్మ భాగవతం చెప్పడానికి పూనుకొన్నాడు. కడుపులోనే భగవంతుని తేజాన్ని చూచి అటువంటి తేజము ఎక్కడఉందా అని అనుక్షణమూ వెతుకుతూ తన పేరును సార్థకం చేసుకున్న పరీక్షిత్తు ఆ భాగవతాన్ని శుకబ్రహ్మద్వారా విన్నాడు.

శమీక మహాముని తపస్సులో మునిగిన ఉన్నసమయంలో మరణించిన సర్పమును ఆ మహర్షిమెడలో వేసిన శృంగి శాపానికి గురయన పరీక్షిత్తు తన శాపం తనను కబళించేలోపల నేను జన్మసార్థక్యాన్ని పొందడమెలా అని విచారిస్తున్న కాలంలో శుకబ్రహ్మ వలన భాగవతాన్ని శ్రవణం చేశాడు.

అటువంటి భాగవతాన్ని అందరూ చదవాలి. ఎందుకు చదవాలి అంటే భాగవతము ఎల్లవేళలా పఠిస్తే, ఆ ఇంటిలోగాని, ఆ గ్రామంలోగాని, ఆ ఊరిలోగాని శుభ పరంపరలు కలుగుతాయ. భాగవత పఠనముచే జీవునిలో సర్వదోషములు హరించబడుతాయ. భాగవత పఠనముచే దోష నివృత్తి చెంది, సత్‌సంగములు ఏర్పడుతాయ అని పురాణాలు చెబుతున్నాయ.

కానీ భగవంతుని లీలను వినడంతో మనసు రంజిల్లుతుంది. భగవంతునిపై ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమే భక్తిగా పరిణమిస్తుంది. విషయ భోగాలపై విరక్తి ఏర్పడుతుంది. దానివలన మనిషి శుద్ధసత్వగుణస్థుడౌతాడు. ఆ సత్వగుణ ప్రభావంతో అతనిలో ఇతరజీవాల పట్ల ప్రేమకరుణ వృద్ధి అధికవౌతుంది. సర్వప్రాణి కోటిని పరమాత్మస్వరూపంగా ఎంచుతాడు. అట్లాంటి జ్ఞానం ఉద్భవిస్తుంది. తనపర భేదభావాన్ని మరిచి మనసును ఎల్లప్పుడూ భగవంతుని చింతన చేస్తూ మనుషులందరూ ఒక్కటిగా ఉంటారు. అందరూ ఒక్కటేనన్న భావాన్ని కలిగి వ్యత్యాసాలు దూరమవుతాయ. వైషమ్యాలు తొలుగుతాయ. మైత్రీ భావం ఏర్పడుతుంది.

........


గానం-పానం

‘నేను భాగవతాన్ని వింటున్నాను/చదువుతున్నాను’ అని ఎప్పుడూ అనుకోకూడదంటారు. మరేమనాలని అడిగేవారికి ‘పిబత భాగవతం’ (భాగవతాన్ని తాగండి) అనాలని చెబుతారు భాగవతులు. చెవులతో వినేదాన్ని తాగడం ఎలా కుదురుతుంది?


కుదురుతుంది. అలా అనడంలో లోతైన అంతరార్థం ఉంది.


ఏదైనా తాగుతున్నప్పుడు మనసు ఎక్కడో ఉన్నా ఆ పదార్థాన్ని నోరు నేరుగా కడుపులోకి పంపిస్తుంది. ద్రవంలో సాధారణంగా తీసిపారేసేది ఏదీ ఉండదు. ఆ దృఢమైన నమ్మకంతో రెండో ఆలోచన లేకుండా తాగేస్తాం. ‘భాగవతమూ అలాంటిదే. దాన్ని రచించినప్పుడే అనేక వడపోతలు జరిగిపోయాయి. (భక్తులు, భగవంతుల కథలు కాబట్టి, వాటివల్ల అనేకమందికి మార్గదర్శనం అవుతుంది కాబట్టి) దీనిలో తీసి పారేయవలసింది ఏదీ ఉండదు’ అని వేదాంత ప్రవచనకర్తల మాట. భాగవతంలో భగవంతుడు శబ్దరూపిగా వసించడమే అందుకు కారణం. కాబట్టి భావంతో సంబంధం లేకుండా గా(పా)నం చెయ్యవచ్చు.


‘తెలుగు భాషకు ముగ్గురు మకుటంలేని మహారాజులు ఉన్నారు. వారు వరసగా- త్యాగరాజు, పోతరాజు, గోపరాజు. వీరి ముగ్గురి పేర్లలో రాచరికం ఉంది. కానీ వీరు ముగ్గురూ భగవంతుణ్ని సేవించి, ఆ సేవల్లోని మాధుర్యాన్ని గ్రోలి (తాగి), ఆ రుచి మరిగి ‘ఈ రాచరికం వల్ల ఏమీ సుఖంలేదు. కాబట్టి మాకు వద్దు’ అని విడిచిపెట్టేశారు.


ఆ పరంపరలో ఒక రాజు దాసుడయ్యాడు. అతడే రామదాసుగా మారిన గోపరాజు. ఆయన తన కీర్తనల్లో ‘రామజోగి మందు కొనరే...’ అనే కీర్తనలో ‘శ్రీరామ దివ్య నామస్మరణ అనే పానం చెయ్యండి’ అన్నాడు. మరోచోట ‘తారక నామమనే రసాన్ని పానం చేసేవారికి అమృతాన్ని తాగే అవసరం లేదు’ అన్నాడు.


మరో రాజు అయ్య (తండ్రి)గా మారి త్యాగయ్య అయ్యారు. ఆయనా తన కీర్తనల్లో చాలాచోట్ల ‘దైవ నామ పానం చెయ్యండి’ అని ప్రయోగించారు.


పోతరాజు ‘పోతన్న’ పేరుతో అందరికీ అన్న అయ్యారు. ఆయన తన భాగవత అనువాదంలో అనేకచోట్ల నామపానం అనే ప్రయోగం చేశారు. ప్రహ్లాదుడి గురించి చెబుతూ, నారాయణుడి పాదపద్మాల గురించి ఆలోచించడమనే అమృత పానం చేసేవాడు- అని ప్రయోగించారు. ‘మందార మకరంద...’ అనే పద్యంలో విష్ణు పాదాల గురించి ఆలోచనలనే అమృతాన్ని గ్రోలేవాడు అని ప్రయోగించారు.


ఇలా ఆ ముగ్గురూ పరమేశ్వరుడి పాదాల దగ్గర దాస్యాన్నే అభిలషించారు. భక్తి అనే రసం పంచారు. భక్తి సామ్రాజ్యాలను ఏలారు.


సదాశివ బ్రహ్మేంద్రులవారు ‘పిబరే రామరసం’ అంటూ రామ నామమనే రసాన్ని పానం చెయ్యండన్నారు. ఇలా విష్ణునామ సంకీర్తనలు చేసినవారంతా పానం చెయ్యమనే చెప్పారు.వేదాలనే కల్పవృక్షాల శాఖల చిట్టచివర పండిన పళ్లు ఉపనిషత్తులు. అవి జ్ఞాన రసాత్మకమైనవి. దాన్ని చిలక కొరికింది. పండు బాగా పక్వానికొచ్చినప్పుడే చిలక కొరికి రుచి చూస్తుంది. చిలక రుచి చూసిన పండ్లను ఎంగిలిగా భావించరు. ఇక్కడ చిలక ఎవరు? శుకబ్రహ్మ. శుకుడు తన నోటిద్వారా ప్రవచనం చేశారు. అదే భాగవతం. దేనిమీదా ఆపేక్ష లేని మహాపురుషుడు శుకుడు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది కాబట్టి భాగవతం ఎంగిలికాని, మధురమైన పానద్రవ్యం అయింది. అందుకని ఆ భాగవతాన్ని రెండో ఆలోచన లేకుండా తాగెయ్యవచ్చు అంటారు.


నాలుక లాగానే చెవి, కన్ను లాంటి ఇంద్రియాలు సైతం రుచిని ఆస్వాదించగలుగుతాయి. భగవన్నామం అన్నా, విన్నా, కన్నా మధురమే కదా! అంత గొప్పదైన రసాన్ని, అమృతసమమైనదాన్ని గానం చేస్తుంటే, ఆ గానం ఏ అడ్డంకీ లేని పానం కావాలి. కాబట్టి భాగవతాన్ని వినడం అనేకన్నా పానం చెయ్యడం అనడమే అన్నిందాలా సబబు.

- అయ్యగారి శ్రీనివాసరావు

.........


శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు. శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు. పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే 'శివసిద్ధి'. అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.


శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు. జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.

........


సర్వ సాధారణంగా ఆధ్యాత్మికత అంటే..

సగటు మనిషికి మత సంబంధమైన, ఆరాధన సంబంధమైన ప్రార్థన, భజన, పూజ, జప, ధ్యాన, యోగాలు అని భావిస్తారు. అయితే, అవన్నీ వ్యక్తిలో, సమాజంలో ఆధ్యాత్మికతను పురిగొల్పే సాధన సంబంధ ఉపకరణాలు మాత్రమే! ఆధ్యాత్మికత అన్నది అత్యున్నత సంస్కార విశేషం. ఆధ్యాత్మికత జీవితంలోని అన్ని పార్శాలను అలుముకొని

ప్రభావితం చేసే సంస్కారం. అందుకు ప్రధాన మార్గం శ్రవణం, మననం, నిధి ధ్యాసనం. శాస్ర్తాన్ని అధ్యయనం చేయడం, అధ్యయనం చేస్తున్న దానిలోని విషయాన్ని శాస్త్రీయంగా గ్రహించడం, ఆధ్యాత్మిక బోధలు వినడం.. శ్రవణం. ఈ విధంగా గ్రహించిన విషయాన్ని తరచి తరచి చూచి స్పష్టత ఏర్పర్చుకోవడం మననం. ఆ స్పష్టమైన అవగాహనను హృదయంలో స్థిరపరచుకొని, ఆచరణలోకి అనువదించడం నిధి ధ్యాసనం. ఈ ప్రధాన మార్గానికి పైన పేర్కొన్న ఉపకరణాలు ప్రబల సహాయకారులుగా నిలుస్తాయి.

అవగాహనలో, అనుభూతిలో అనన్యత, అన్యోన్యత, ఆత్మీయత అనంతంగా విస్తరించడమే ఆధ్యాత్మికత. అదే సాధకుడి మార్గాన్ని అనుభవింపజేసే విస్తరణం. అంతిమంగా పొందేది అమృతత్వం. ‘మృత్యోర్మా అమృతం గమయ’ అంటే ఇదే ప్రస్థానం. పరిమితిలో కూరుకుపోయిన అహంకారం రకరకాల ఆధిక్యతా ఆకాంక్షలుగా వ్యక్తమవుతుంది. అది ఇతరులను తొక్కివేయాలన్న భావన

కలిగించవచ్చు. మాయమాటలతో ఆధ్యాత్మిక వేదికను ధనార్జనకు భూమికగా మార్చుకునే ప్రయత్నమూ జరగవచ్చు. అయితే, ఆధిక్యత సాధించాలన్న అభిలాష, ఆశయం తప్పు కాదు. అది లోక క్షేమానికి దారితీయాలి. ఆ మార్గంలో ఉన్న వ్యక్తులు వివేకంతో మసలుకోవాలి. తమ శక్తియుక్తులను సమాజ శ్రేయస్సుకు ధారపోయాలి. ఇలాంటి భావనను విస్తారంగా వినియోగంలోకి

తేవాలన్న ఆధిక్యతాభిలాష ఎప్పుడూ మంచిదే. అదే సాత్వికాధిక్యత. అయితే, పరుల విశిష్టతను, ఉన్నతిని ఓర్వలేక ప్రదర్శించే ఆధిక్యత సరైనది కాదు. ఇలాంటి తామసాధిక్యత సమాజంలో భేదాలకు, ఘర్షణలకు దారితీస్తుంది. మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. సంస్కృతిని దెబ్బతీస్తుంది.


సారభూతంగా నిస్వార్థత, ప్రేమను పెంచడమే నిజమైన ఆధ్యాత్మికత. అటువంటి విధానం వ్యక్తిలో, సమాజంలో, దేశంలో పరివ్యాప్తమై పరిఢవిల్లాలి. అయితే అనేక వికృతులు విస్తరిస్తున్న ఈ కాలంలో ఇది అసాధ్యం అనిపించవచ్చు. కానీ, ఈ మార్గంలో మాత్రమే మానవాళి భవిష్యత్తు క్షేమంగా ఉండగలుగుతుంది. ఇందుకు విరుద్ధమైన విధానం వినాశనాన్ని ఆహ్వానిస్తుందన్నది కూడా

తథ్యం. ప్రస్తుత వినియోగవాద ప్రపంచంలో ఇటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచిపోషించేవి వ్యవస్థలు కాదు. నిష్పక్షపాత దార్శనికత, ధైర్యం కలిగిన బుద్ధిజీవులుగా, మేధావులైన శిష్టజనులు మాత్రమే ఈ పనిని సాకారం చేయగలరు. సమాజంలో వీరి సంఖ్య పరిమితమే కావచ్చు. కానీ, వీరంతా ఒక బలమైన వేదికగా ఏర్పడి, సాఫల్య వైఫల్యాలపై దృష్టిపెట్టక ధర్మనిష్ఠతో

ముందుకుసాగాలి. నిరంతరం ప్రజలకు మార్గదర్శనం చేస్తుండాలి.


శ్రేష్ఠజనుల ఉద్ఘోష , అచంచల ఆచరణే మానవాళికి ప్రేరణ. ఆర్ష వైదిక దర్శనం, ధర్మం, వాఙ్మయం, సంస్కృతి ఈ దిశలోనే సంప్రదాయాన్ని నిర్మించింది. స్వేచ్ఛ పేరుతో అన్ని రంగాలలో స్వార్థం, సంకుచితత్వం పెరుగుతున్న ఆధునిక సమాజంలో ఆర్షవైదిక స్ఫూర్తిని విస్ఫారింపజేయడం అత్యావశ్యకం. సంస్కారకాంతులను అన్ని దిశల నుంచి గ్రహిస్తూ తాము వికసిస్తూ, సమాజాన్నిమేల్కొలిపే శిష్టజనుల పాత్ర ఆధ్యాత్మిక శ్రేయస్సుకు శ్రీరామ రక్ష.

........


ధర్మరాజు, ఆయన తమ్ముళ్లు వనవాసం చేస్తున్నప్పుడు వాళ్లను చూడటానికి లోమశ మహర్షి వచ్చాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత లోమశుడు, ‘ధర్మరాజా! మీరు తీర్థయాత్రలు చెయ్యండి. మనసు కొంత కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేసుకుంటూ అక్కడి స్థల విశేషాలు తెలుసుకుంటూ కాలక్షేపం చెయ్యండి. కాలం ఇట్టే గడిచిపోతుంది’ అని సలహా ఇచ్చాడు.

లోమశుడి మాట ప్రకారం కొన్నాళ్లకు పాండవులు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్లారు. అలా వెళ్లినప్పుడు వాళ్లకు గంగానది ఒడ్డున రైభ్య మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆ పక్కనే భరద్వాజుని ఆశ్రమం ఉంది. భరద్వాజుడు, రైభ్యుడు మంచి స్నేహితులు. ఇద్దరూ బాగా చదువుకున్నారు. నదీ తీరాన పక్కపక్కనే ఆశ్రమాలు ఏర్పర్చుకొని నివసిస్తుండేవారు. రైభ్యుడికి ఇద్దరు కొడుకులు. వారి పేర్లు పరావసు, అర్వావసు. వాళ్లిద్దరూ కూడా చక్కగా వేదం చదువుకొని గొప్ప పండితులుగా పేరు పొందారు. భరద్వాజుడికి ఒక్కడే కొడుకు. అతని పేరు యవక్రీతుడు. అతనికి రైభ్యుడన్నా, ఆయన కొడుకులన్నా గిట్టేది కాదు. పరావసు, అర్వావసులను చూసి యవక్రీతుడు అసూయపడేవాడు.

పరావసు, అర్వావసుల కన్నా తను గొప్పవాడు కావాలని ఇంద్రుణ్ని గురించి తపస్సు చేశాడు. నిప్పుతో ఒళ్లంతా మండించుకున్నాడు. ఇంద్రుడికి జాలి కలిగింది. భూ లోకానికి వచ్చి, ‘ఎందుకు నాయనా ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు?’ అని అడిగాడు. ‘ఎవరూ చదువని వేద విద్యలన్నీ నాకు రావాలి. నేను గొప్ప పండితుణ్ని కావాలి. దానికోసం నేనీ కఠోర తపం చేస్తున్నాను. గురువు గారి దగ్గరికి పోవటం, ఆశ్రమవాసం చేయడం, కొన్నాళ్లు ఆయనకు సేవ చేయటం నాకు కుదరవు. అవేవీ లేకుండా విద్యలన్నీ క్షణాల మీద పొందటానికి ఈ తపస్సు చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి’ అని యవక్రీతుడు వేడుకున్నాడు. అది విని ఇంద్రుడు నవ్వాడు. ‘పిచ్చివాడా! నీ తెలివి అపమార్గం పట్టింది. తక్షణమే వెళ్లి గురువును ఆశ్రయించు. ఆయన దగ్గర శుశ్రూష చేసి వేద విద్యలన్నీ నేర్చుకో. గురువు వద్ద నేర్చుకుంటేనే ఎవరికైనా చదువు అబ్బుతుంది. అది లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు’ అని హితవు పలికాడు.

కానీ, యవక్రీతుడుకి ఇంద్రుడి మాటలు నచ్చలేదు. ఇంకా ఘోరమైన తపస్సుకు పూనుకున్నాడు. ఇంద్రుడు మళ్లీ వచ్చి, ‘నాయనా! మూర్ఖంగా ఏ పనీ చెయ్యకూడదు. నీ తండ్రిగారికి వేదాలు తెలుసు. ఆయన నీకు నేర్పుతారు. వెళ్లి వేదవిద్యలన్నీ నేర్చుకో. ఇలా ఒళ్లు కాల్చుకోవటం మానుకో’ అని చెప్పాడు. యవక్రీతుడికి కోపం వచ్చి, ‘నేను కోరిన వరం కనుక మీరు ఇవ్వకపోతే నా శరీరంలోని అవయవాలన్నిటినీ విరిచి ఈ అగ్నిగుండంలో పడేస్తాను’ అన్నాడు.

అలా ఉండగా ఒకనాడు యవక్రీతుడు గంగానదిలో స్నానం చెయ్యడానికి వెళ్లాడు. అక్కడ ఓ వృద్ధుడు నది ఒడ్డున కూర్చుని పిడికెడు పిడికెడు ఇసుక తీసి నదిలోకి విసురుతున్నాడు. అది చూసి యవక్రీతుడు ‘ఏం చేస్తున్నావు. తాతా?’ అని అడిగాడు. ‘గంగానది దాటడానికి వంతెన కడుతున్నా’ అన్నాడు ఆ వృద్ధుడు. ఆ మాటలకు యవక్రీతుడు పెద్దగా నవ్వాడు. ‘వేగంగా పోయే ప్రవాహానికి ఇలా ఇసుకతో అడ్డంగా కట్టవేయడం కుదరని పని. వేరే మార్గం చూడు’ అని సలహా ఇచ్చాడు. ‘గురువు లేకుండానే, అసలు చదువకుండానే, కష్ట పడకుండానే విద్య రావాలని కొందరు ఎలా తపస్సు చేస్తున్నారో! అలాగే నేనూ గంగానదికి ఇసుకతో వంతెన కడుతున్నా’ అని వృద్ధుడు బదులు చెప్పాడు.

ఆయన ఎవరో యవక్రీతుడికి అప్పుడు అర్థమైంది! వెంటనే కాళ్లమీద పడ్డాడు. ఇంద్రుడు నవ్వుతూ యవక్రీతుడిని దగ్గరకు తీసుకుని, ‘నీ తండ్రి దగ్గర వేద విద్యలు నేర్చుకో. అనతికాలంలోనే నువ్వు గొప్ప విద్వాంసుడివి అవుతావు’ అని ఆశీర్వదించాడు.

నాకు అవకాశం, ఆలోచనకు పదును పదవి విరమణ ( విశ్రాంతి అకౌంట్స్ ఆఫీసర్, స్కూల్ 

ఎడ్యుకేషన్, హెడ ఆఫ్ ది డిపార్టుమెంటు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్)  ఆయన తర్వాతే దొరికింది: లెక్కలు చెప్పాలా, తెలుగు లో వ్రాయాలా అనే మీమాంస ఏర్పడింది . 9 సంవత్సరాలు లెక్కల మాష్టర్ గాను, గుంటూరు లో అనగా (1981 నుండి 1990) ఆ తదుపరి గ్రూపు 2బి ఎపిపిస్ రావటం హైద్రాబాద్లో స్థిరపడటం జరిగింది వివిధ అకౌంట్స్ బ్రాంచేస్ , ట్రెజరీస్  టైపిస్ట్, సీనియర్  అకౌంటెంట్,  శ్రీ.అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసితిని (03-031990 నుండి 30-06- 2019వరకు ప్డరభుత్వ ఉద్యోగము చేసితి)     అప్పుడే స్మార్టు  ఫోన్  విలువ, మెసేజ్ మేలూ  పంపడం అనేది కొద్దిగా తెలిసింది.   మా తాతగారు, నాన్న పెదనాన్నలు కవులు పండితులు వారి దారిలో నడవాలని, తెలుగుని బ్రతికించాలని సంకల్పంతో 2012 నుండి నేటి వరకు 11 బ్లాగులు, 11 పేస్ బుక్లు , వార్డ్సప్ లు ప్రాఞ్జలిప్రభగా మీకందఱకు తెలిసినదే ఇక           

 *సూన్యం కానీ స్థితి కానీ గగనం లేనీ, గాలి లేనీ వెలుతురూ చేరనీ చీకటి లేనీ, నది లేనీ,
అగ్ని లేనీ, భూమి లేనీ ఆణువణువూ ఖగోళ మేది అనంతానికి భద్రతా ?
 *. ఇది అణువు కథ, మనిజ కథ మనుగడ కథ, మాను కథ, మున్ను కథ, ఇన్ను కథ, ప్రాణి కథ, పరమాణువు కథ,  ప్రకరణ ఇది, చరిత్ర ఇది  

*. శోధన, సాధన చేసిన జ్ఞానం శాశ్వత మైనది నమ్మకం ..
ప్రశ్నించకు నిరంతరం నిజాన్ని అన్వేష ప్రయత్నం  నేను ఏర్పరుచుకున్న ప్రపంచం అవకాశం , సాధనం, సుముఖం  

*. జీవితం నాది, బతుకు నాది, మంచైనా, చెడైనా, సమయమిది కష్టమైనా, సుఖమైనా కానరానిది ...
ఇష్టమైనా, నాకిష్టమైన బతుకంది

 

ఏడు గొప్ప నేర్చుకోవడాలు :- ప్రకృతి సహజ లక్షణాలు.
1.స్త్రీ జాతి నుంచి నేర్చుకోవలసింది సహనంం, స్థిరత, దయ, లాలిత్యం
2. చిన్నవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది నిత్యనూతనత్వం, నిత్య ఉత్సాహం
3. పల్లెవాసుల నుంచి నేర్చుకోవాల్సింది నిరాడంబరత, సరళత
4. జంతు ,వృక్షాల నుంచి నేర్చుకోవలసింది మౌనం, టెలీపతి, ఆకలయినప్పుడు మాత్రమే తినడం
5. చదువులేనివాళ్ళ నుంచి నేర్చుకోవలసింది స్వచ్ఛత,వాక్శుద్ధి
6.ధ్యానుల నుంచి నేర్చుకోవలసింది త్రినేత్రం, అతీంద్రియ శక్తి
7. సూక్ష్మ లోకవాసుల నుంచి నేర్చుకోవలసింది
-

కర్మ ఫలం* ప్రాంజలి ప్రభ. కథలు 

కర్మ తలుచుకుంటే

స్నేహ మాధుర్యం*

*కర్మ ఫలం* ప్రాంజలి ప్రభ.

కర్మ తలుచుకుంటే  మనుషుల పరిస్థితిని ఎలాగైనా మారుస్తుంది

ఒక భార్యాభర్తల జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్నవేళ ఒక వ్యక్తి తలుపు కొట్టిన శబ్దం వినిపించింది .ఎవరై ఉంటారు అని భర్త అడుగుతుంటే అంతలో ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు. దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది. ఏమీ  అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి
రేపటికి మనకే పనికి వస్తాయి అన్నాడు పిసినారి భర్త. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీద అనేకసార్లు మాట మాట పెరిగి మనస్పర్ధలతో భార్యాభర్తలు విడాకులు తీసుకొని విడిపోయారు.

ఆ తర్వాత అతడి పరిస్థితి తలకిందులైయింది, ఉద్యోగం పోయింది, అన్నం పెట్టేవారు లేరు . అతను కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు
అయితే భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా జీవితం గడుపుతుంది
ఒకరోజు భర్తతో కలిసి భోజనానికి సిద్ధం అవుతున్న వేళ ఒక బిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమంటే ఆ భర్త మొదట అతడికి పెట్టేసేయ్ తరువాత మనం తిందాంలే అన్నాడు
సరే అని ఆమె బయటకెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆ భర్త . వచ్చిన ఆ బిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది .దానికి తాను నవ్వుతు నేనెవరో తెలుసా అని అడిగాడు . నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టిన బిక్షగాడిని అన్నాడు.

మిత్రులారా జీవితం చాలా నేర్పిస్తుంది
నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది .అహంకారం అసలు పనికిరాదు .జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం తీసుకోదు.
ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని
నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోను దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు.
అలాగే మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం, కర్మ ఎప్పటికీ మర్చిపోవు. ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది కచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది.

***

ప్రాంజలి ప్రభ రోజువారి కథలు

*స్నేహ మాధుర్యం*

మనసులో రేగిన దాహాన్ని మోహం అనుకొంటే,
గుండెల్లో దాగిన దాహాన్ని స్నేహంగా చెప్పుకోవచ్చు. 'స్నేహమంటే ఎదలోని
చిరుగులను కలిపి కుట్టే దారం' అన్నాడు ఉత్తర రామచరిత్రలో భవభూతి. అది దేవుడిచ్చే వరం. ‘దేవుని చిరునవ్వులోంచి స్నేహం పూసింది... జీవునికది చూడగానె దాహం వేసింది' అన్న రసరాజు కవితా హృదయంలోని ఆంతర్యం అదే. స్నేహానికి- నెయ్యం సఖ్యం చెలిమి కూరిమి... వంటి ఎన్నో పర్యాయ పదాలను సూచిస్తుంది నిఘంటువు. వాస్తవానికి అవన్నీ కలగలిసిందే- స్నేహం! కాబట్టే కృష్ణ నిర్యాణ వార్తను ధర్మజుడికి నివేదిస్తూ భాగవతంలో-‘మన సారథి మన సచివుడు మన వియ్యము మన సఖుండు మన బాంధవుడున్ మన విభుడు, గురువు, దేవర...' అంటూ అర్జునుడు తమ స్నేహబంధంలోని ఎన్నో కోణాలను ప్రస్తావించాడు. 'బ్రతుకునందు పెక్కు బంధాలు విలసిల్లు, శ్రేష్ఠమైనది- అందు స్నేహ నిరతి’ అని తేల్చారు నండూరి రామకృష్ణమాచార్య.
తేల్చారు నండూరి రామకృష్ణమాచార్య. దుర్మార్గుడని లోకం తీర్మానించిన దుర్యోధనుడి స్నేహ నిరతిని సైతం ప్రత్యేకించి 'శీర్ణమేఖల'లో ' ఆయన ప్రస్తుతించారు. ఏకాంతంలో తనతో కించిత్ అనుచితంగా ప్రవర్తించిన కర్ణుడిపై సుయోధనుడి భార్య భానుమతి కోపం తెచ్చుకొంటుంది. ఆ సన్నివేశంలో 'ఆగ్రహం బందిరొ రాణిగారు! క్షమకు అర్హుడు నా ప్రియమిత్రుడు' అంటూ సముదాయిస్తాడు సుయోధనుడు. నిజమైన స్నేహంలో అరమరికలకు, అపార్థాలకు తావు లేదని నిరూపించే ఘట్టమది. పాణిగ్రహణ వేళ వేదమంత్రాల్లో సైతం ప్రతిధ్వనించే గొప్ప మాట సఖ్యం.

ఆలుమగలుగానే కాదు- ప్రాణసఖులుగానూ జీవించమని సప్తపది మంత్రాల్లో వేదం ఆశీర్వదించింది. 'అనుబంధ మరందపు మధురంబు రూపము వహించినట్లు అతిభాసురమై విలసిల్లు స్నేహముల్- ప్రాణసఖులనెడు అని కవులు తీర్మానించారు. 'సృష్టిలో తీయనిది స్నేహమే' అనే మాటలో ఇన్ని అంతరార్ధాలున్నాయి.

'నవ్వునొకడు సఖుల నవ్వించునొక్కడు ముచ్చటాడునొకడు మురియునొకడు' అంటూ భాగవతంలో పోతన ఊరించిన చిలిపి బాల్యం మనలో చాలామందికి చిరస్మరణీయం. అందరి గుండెల్లోనూ అది ఆకుపచ్చని జ్ఞాపకం. అందుకే చిన్ననాటి మిత్రులు ఒకచోట చేరినప్పుడు తిరిగి పసివాళ్లయిపోతుంటారు.

చదరంగం ముగిశాక ఒకే పెట్టెలోకి చేరుకొనే బంటు మంత్రి రాజుల్లా 'హోదాలు దర్పాలు పదవులు ముసుగులు మరపించి మురిపించే..... ఆ అచ్చమైన ఆనందాన్ని జుర్రుకొనే బాల సావాస గాళ్లయిపోతారు. వయసును మరచిపోతారు. రెచ్చిపోతారు. అయితే అలా కూడి, ఎడమయ్యే ఘట్టాల్లో అందరూ పైకి నవ్వుతూనే వీడిపోతుంటారు గాని, ఎద చెలమల్లో తేమ ఊరుతూనే ఉంటుంది. ముఖ్యంగా మనుగడ మలిదశకు చేరుకున్న వయసులో 'మళ్ళీ కలుస్తామో లేదో' అనే బెంగ ఆవరించినప్పటి గుండె మూలుగులకు విశ్వకవి రవీంద్రులు అద్భుతమైన అక్షరాకృతిని ఇచ్చారు. 'నాతో మరింత సమయాన్ని గడిపి ఉండాల్సిందని నేను లేనప్పుడు నీకు తప్పకు అనిపిస్తుంది కదా మిత్రమా! అందుకని ఇప్పుడే మరికాస్సేపు నాతో ఉండరాదా! నేనిక లేనని తెలియగానే నీ కళ్లు విషాదాశ్రువులను స్నేహితులను సైతం ఏవో కారణాల వల్ల మనం అలిగి దూరం చేసుకొంటాం కదా, అప్పుడు 'నేనంటూ నివురైపోయాక నా తప్పులను క్షమిస్తావు ఎలాగూ నీవు! కానీ నాకా సంగతి తెలియదే... ఓ ప్రియమైన నేస్తమా... అదేదో నా ఊపిరి నిలిచేలోగా చేసేయరాదా? " అన్న రవీంద్రుడి కవితలోని అభ్యర్ధనను నెమరేసుకుందాం. మంచి స్నేహితులుగానే ఉందాం... జన్మ కడదాక!
ఈనాడు సంపాదకీయం