Sunday, 9 August 2020

కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు…

అదీ చేతకాకపోతే, పాకుతూ పో…

అంతేకానీ, ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు!


దేహానికి తప్ప దాహానికి పనికిరాని

ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే…


ఉద్యోగం రాలేదని,

వ్యాపారం దెబ్బతినిందని,

స్నేహితుడొకడు మోసం చేశాడని,

ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళిపోయారనీ

అలాగే ఉండిపోతే ఎలా?


తలుచుకుంటే,

నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా

నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది!

అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?


సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు…

పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు,

అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే

ఆ నెత్తురుతో సహా – ఏదీ ఆగిపోడానికి వీల్లేదు!


లే…! బయలుదేరు…!

నిన్ను కదలనివ్వకుండా చేసిన

ఆ మానసిక బాధల సంకెళ్ళను తెంచేసుకో,

పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు!


నువ్వు పడుకునే పరుపు,

నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్!


నీ అద్దం,

నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో!


నీ నీడ,

నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్!


మళ్ళీ చెప్తున్నా…

కన్నీళ్ళు కారిస్తే కాదు,

చెమట చుక్కని చిందిస్తేనే

చరిత్రను రాయగలవని తెలుసుకో…!


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*అష్టలక్ష్మి స్తోత్రం - మహత్యం*




🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎనిమిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో తెలుసుకుందాం

☘☘☘☘☘☘☘☘☘☘


అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత, ఈ స్తోత్రం పఠించడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

☘☘☘☘☘☘☘☘☘☘


మన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతుంటే అష్టకష్టాలు పడుతున్నాం అని, ఎక్కువగా సుఖాలు అనుభవిస్తుంటే అష్టైశ్వర్యాలు పొందుతున్నాం అని అనుకోవడం పరిపాటి. మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్ళీంచగలిగే శక్తి ఆ ఆదిమాతకే ఉంది. అష్టకష్టాలు నుంచి అష్టైశ్వర్యాలు 

ప్రసాదించు అద్భుత స్తోత్రమే " అష్టలక్ష్మీ స్తోత్రం "


అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎనిమిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. 


ఆదిలక్ష్మీ :- వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉండేది ఆదిమాత.. అదే ఆదిలక్ష్మి.. ఈ సృష్టికి మూలం నారాయణుడు అని కొందరు.. కాదు అమ్మే అని మరి కొందరి విశ్వాసం.. నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరూ ఒక్కరే! లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం.. ఇందిరా దేవి అని కూడా ఈ రూపంలో వీరిని పూజిస్తారు. ఆది లక్ష్మిని ఆరాధించుట వలన సంతోషం, పవిత్రత మనకు లభిస్తాయి. 


ధాన్య లక్ష్మి :- ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించుట వలన మన జీవితానికి కావల్సిన అన్ని రకాల విటమిన్స్, పండ్లు, ఆహారం మొదలైనవి అన్నీ సుఖంగా పొందుతాం.. అంతే కాకుండా పంటలు సరిగ్గా పండాలి అన్న.. అతి వృష్టి అనావృష్టిని కాపాడుకోవాలి అన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండవలసిందే! 


ధైర్య లక్ష్మి :- కొంతమంది ఎన్నీ కష్టాలు .. ఉన్న ధైర్యంగా ఎదుర్కొంటారు, మరికొందరు పిరికిగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు.. 

మనకు కావలసిన అన్ని రకాల శక్తి - సామర్ధ్యాలు ఈ అమ్మ వలననే లభిస్తాయి.. పూర్వం ఒక కధ ప్రాచుర్యంలో ఉండేది.. ఒక మహారాజు గ్రహస్ధితి బాగుండక అష్ట లక్ష్ములు ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళి పోతుంటారు.. చివరికి ధైర్యలక్ష్మి వంతు వస్తుంది.. కాని అప్పుడు ఆ రాజు ఈమెని తనని విడచి వెళ్ళవద్దు.. వారందరూ వెళ్ళి పోయినా పర్వాలేదు ఒక్క నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు.. మళ్లీ వారందరినీ 

పొందగలనని విశ్వాసంగా వుంది.. విడచి వెళ్ళవద్దు అని ప్రాధేయ పడతాడు... నిజమే ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సింది మానసిక స్ధైర్యమే.. అది ఉంటే ఎన్ని ఇబ్బందులు అయినా ధైర్యం గా ఎదుర్కోవచ్చు. ఇది ధైర్య లక్ష్మి ప్రాధాన్యత.


గజలక్ష్మి :- ఈ అవతారం దేవ దానవులు సముద్ర మధనం సాగించే సమయంలో సముద్రుని కూతురుగా ఈ రూపమ్లో ఉద్భవించినట్లు భాగవతం చెబుతుంది. రెండు ఏనుగులు అమ్మ ప్రక్కన నిలబడి జలధారని వర్షింప చేస్తూంటాయి ఇక్కడ ఏనుగులు మనం గణపతి స్వరూపంగా కూడ భావించవచ్చు.. లక్ష్మి గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించుట వలన ఇల్లు, వాహనాలు వంటి భౌతిక సుఖాలు

మనకు ఒనగూడుతాయి.


సంతాన లక్ష్మీ :- ఏ భార్య భర్తలకైనా తమ కుటుంబానికి కావల్సిన మొదటి సంపద సంతానమే.. అది లేకుంటే జీవితాన్ని నిస్సారం గా గడపవలసి వస్తుంది.. అలాగే కర్మ పరిపక్వత కూడా ఉండదు.. అందుకే ఈ శక్తి ని పూజించి తప్పక ప్రసన్నం చేసుకోవాలి.. అప్పుడే సంతానం పొందడమే కాకుండా వారికి సద్బుద్ధి, ధీర్ఘాయుస్సు లభిస్తాయి.


విజయ లక్ష్మీ :- పేరులోనే ఉంది పెన్నిది.. బాహ్య - అంతర్గత మనసుపై విజయం పొందాలని అన్నా.. శారీరకంగా, ఆర్ధికంగా ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై విజయం పొందాలి అంటే విజయ లక్ష్మి కృప ఉండి తీరవలసిందే!


ధనలక్ష్మి :- భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయలు బంగారు ఆభరణాలు కాదు.. పకృతిలో ఉండు అన్ని రకాల నదులు, ఫలవంతం అయిన చెట్లు, సమృద్ధిగా కురియు వర్షాలు ఇవ్వన్నీ సంపద క్రిందే వస్తాయి.. కనుక అవన్నీ మనకు ధన రూపంగా మార్చి ఇచ్చేది ఈ దేవతే.


విద్యాలక్ష్మి :- పాఠశాలలో, కళాశాల, విశ్వవిద్యాలయల్లో లభించే విద్యే కాదు.. ఏ తరహా విజ్ఞానం కావలన్న ఈమెను ఆశ్రయించ వలసినదే.. ఆధ్యాత్మికం.. భౌతికం ఎందులో ఏ విద్య అయినా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఈ లక్ష్మి దయ మనకు ఉండవలసిందే. నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్ట లక్ష్ముల ప్రతీకలే!


అష్ట లక్ష్ములని పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయి అనేది ఎందరో చెప్పిన మాట..షోడశ అంటే 16.. ఇప్పుడు ఆ ఫలాలు ఏమిటో చూద్దాం...


1 కీర్తి, 2 జ్ఞానం, 3 ధైర్యం.. బలం, 4 విజయం , 5 సత్సంతానం

6 యుద్ధ నైపుణ్యం, 7 బంగారం ఇతర సంపదలు,

8 సంతోషం, 9 భౌతిక సుఖాలు, 10 తెలివితేటలు, 11 అందం 

12 విద్యాభివృద్ధి, 13 ఉన్నత విలువలు.. ధ్యానం, 

14 నీతి నియమాలు, 15 మంచి ఆరోగ్యం, 16 దీర్ఘ ఆయుః.

 

అష్టలక్ష్మీ స్తోత్రం:-


ఆదిలక్ష్మి :-

సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే 

మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే | 

పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే 

జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||


ధాన్యలక్ష్మి:-

అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే 

క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |

మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే 

జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||


ధైర్యలక్ష్మి:-

జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే 

సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే | 

భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే 

జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||


గజలక్ష్మి:-

జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే 

రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే | 

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే 

జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||


సంతానలక్ష్మి:-

అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే 

గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |

సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే 

జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||


విజయలక్ష్మి:-

జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే 

అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే | 

కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే 

జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||


విద్యాలక్ష్మి:-

ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే 

మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |

నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే 

జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||


ధనలక్ష్మి:-

ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే 

ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |

వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే 

జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||


ఫలశృతి:-

శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి | 

విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ||


శ్లో|| శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |

జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్


కనుక దేవున్ని కొలిచే ప్రతి ఒక్కరూ నిత్యం ఈ స్తోత్రం చదవడం వలన పై ప్రయోజనాలు కొన్ననైనా పొందవచ్చు. అలాగే జాతక రిత్యా శుక్ర గ్రహ ప్రీతి కొరకు, దోష నివారణకు కూడా ఇది చదవవచ్చు.. దీని వలన భార్య భర్తల మధ్య సఖ్యత,  సుఖాలు లభిస్తాయి. ఇంట్లో శ్రీ చక్రం ఉన్న వారు దానికి దగ్గర ఈ అష్ట లక్ష్ముల ఫొటో పెట్టి ఇది చదవడం మరింత వేగంగా ఫలించేలా చేస్తుంది.. అలాగే క్షీరాన్నము లేక పాల కోవా నివేదన చెప్పబడుతోంది. లక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు.. ఐశ్వర్య మస్తు.. !


🙏 *శ్రీ శ్రీనివాస గద్యమ్*🙏

^^^^^^^^^^^^^^^^^^^^^^^^


శ్రీమదఖిలమహీమండలమండనధరణీధర మండలాఖండలస్య, నిఖిలసురాసురవందిత వరాహక్షేత్ర విభూషణస్య, శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య, నాథముఖ బోధనిధివీథిగుణసాభరణ సత్త్వనిధి తత్త్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద పరమపురుషకృపాపూర విభ్రమదతుంగశృంగ గలద్గగనగంగాసమాలింగితస్య, సీమాతిగ గుణ రామానుజముని నామాంకిత బహు భూమాశ్రయ సురధామాలయ వనరామాయత వనసీమాపరివృత విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస నిర్ఘరానంతార్యాహార్య ప్రస్రవణధారాపూర విభ్రమద సలిలభరభరిత మహాతటాక మండితస్య, కలికర్దమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణనిషేవ్యమాణ ప్రత్యక్షీభవన్నిజసలిల సమజ్జన నమజ్జన నిఖిలపాపనాశనా పాపనాశన తీర్థాధ్యాసితస్య, మురారిసేవక జరాదిపీడిత నిరార్తిజీవన నిరాశ భూసుర వరాతిసుందర సురాంగనారతి కరాంగసౌష్ఠవ కుమారతాకృతి కుమారతారక సమాపనోదయ దనూనపాతక మహాపదామయ విహాపనోదిత సకలభువన విదిత కుమారధారాభిధాన తీర్థాధిష్ఠితస్య, ధరణితల గతసకల హతకలిల శుభసలిల గతబహుళ వివిధమల హతిచతుర రుచిరతర విలోకనమాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామిపుష్కరిణీ సమేతస్య, బహుసంకట నరకావట పతదుత్కట కలికంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాహృత కమలారత శుభమంజన జలసజ్జన భరభరిత నిజదురిత హతినిరత జనసతత నిరస్తనిరర్గళ పేపీయమాన సలిల సంభృత విశంకట కటాహతీర్థ విభూషితస్య, ఏవమాదిమ భూరిమంజిమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధవిపుల పుణ్యతీర్థనివహ నివాసస్య, శ్రీమతో వేంకటాచలస్య శిఖరశేఖరమహాకల్పశాఖీ, ఖర్వీభవదతి గర్వీకృత గురుమేర్వీశగిరి ముఖోర్వీధర కులదర్వీకర దయితోర్వీధర శిఖరోర్వీ సతత సదూర్వీకృతి చరణఘన గర్వచర్వణనిపుణ తనుకిరణమసృణిత గిరిశిఖర శేఖరతరునికర తిమిరః, వాణీపతిశర్వాణీ దయితేంద్రాణిశ్వర ముఖ నాణీయోరసవేణీ నిభశుభవాణీ నుతమహిమాణీ య స్తన కోణీ భవదఖిల భువనభవనోదరః, వైమానికగురు భూమాధిక గుణ రామానుజ కృతధామాకర కరధామారి దరలలామాచ్ఛకనక దామాయిత నిజరామాలయ నవకిసలయమయ తోరణమాలాయిత వనమాలాధరః, కాలాంబుద మాలానిభ నీలాలక జాలావృత బాలాబ్జ సలీలామల ఫాలాంకసమూలామృత ధారాద్వయావధీరణ ధీరలలితతర విశదతర ఘన ఘనసార మయోర్ధ్వపుండ్ర రేఖాద్వయరుచిరః, సువికస్వర దళభాస్వర కమలోదర గతమేదుర నవకేసర తతిభాసుర పరిపింజర కనకాంబర కలితాదర లలితోదర తదాలంబ జంభరిపు మణిస్తంభ గంభీరిమదంభస్తంభ సముజ్జృంభమాణ పీవరోరుయుగళ తదాలంబ పృథుల కదలీ ముకుల మదహరణజంఘాల జంఘాయుగళః, నవ్యదల భవ్యమల పీతమల శోణిమలసన్మృదుల సత్కిసలయాశ్రుజలకారి బల శోణతల పదకమల నిజాశ్రయ బలబందీకృత శరదిందుమండలీ విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవాధిష్ఠితాంగుళీగాఢ నిపీడిత పద్మావనః, జానుతలావధి లంబ విడంబిత వారణ శుండాదండ విజృంభిత నీలమణిమయ కల్పకశాఖా విభ్రమదాయి మృణాళలతాయిత సముజ్జ్వలతర కనకవలయ వేల్లితైకతర బాహుదండయుగళః, యుగపదుదిత కోటి ఖరకర హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహుయుగళః, అభినవశాణ సముత్తేజిత మహామహా నీలఖండ మదఖండన నిపుణ నవీన పరితప్త కార్తస్వర కవచిత మహనీయ పృథుల సాలగ్రామ పరంపరా గుంభిత నాభిమండల పర్యంత లంబమాన ప్రాలంబదీప్తి సమాలంబిత విశాల వక్షఃస్థలః, గంగాఝర తుంగాకృతి భంగావళి భంగావహ సౌధావళి బాధావహ ధారానిభ హారావళి దూరాహత గేహాంతర మోహావహ మహిమ మసృణిత మహాతిమిరః, పింగాకృతి భృంగార నిభాంగార దళాంగామల నిష్కాసిత దుష్కార్యఘ నిష్కావళి దీపప్రభ నీపచ్ఛవి తాపప్రద కనకమాలికా పిశంగిత సర్వాంగః, నవదళిత దళవలిత మృదులలిత కమలతతి మదవిహతి చతురతర పృథులతర సరసతర కనకసరమయ రుచిరకంఠికా కమనీయకంఠః, వాతాశనాధిపతి శయన కమన పరిచరణ రతిసమేతాఖిల ఫణధరతతి మతికరవర కనకమయ నాగాభరణ పరివీతాఖిలాంగా వగమిత శయన భూతాహిరాజ జాతాతిశయః, రవికోటీ పరిపాటీ ధరకోటీ రవరాటీ కితవీటీ రసధాటీ ధరమణిగణకిరణ విసరణ సతతవిధుత తిమిరమోహ గార్భగేహః, అపరిమిత వివిధభువన భరితాఖండ బ్రహ్మాండమండల పిచండిలః, ఆర్యధుర్యానంతార్య పవిత్ర ఖనిత్రపాత పాత్రీకృత నిజచుబుక గతవ్రణకిణ విభూషణ వహనసూచిత శ్రితజన వత్సలతాతిశయః, మడ్డుడిండిమ ఢమరు జర్ఘర కాహళీ పటహావళీ మృదుమద్దలాది మృదంగ దుందుభి ఢక్కికాముఖ హృద్య వాద్యక మధురమంగళ నాదమేదుర నాటారభి భూపాళ బిలహరి మాయామాళవ గౌళ అసావేరీ సావేరీ శుద్ధసావేరీ దేవగాంధారీ ధన్యాసీ బేగడ హిందుస్తానీ కాపీ తోడి నాటకురుంజీ శ్రీరాగ సహన అఠాణ సారంగీ దర్బారు పంతువరాళీ వరాళీ కళ్యాణీ భూరికళ్యాణీ యమునాకళ్యాణీ హుశేనీ జంఝోఠీ కౌమారీ కన్నడ ఖరహరప్రియా కలహంస నాదనామక్రియా ముఖారీ తోడీ పున్నాగవరాళీ కాంభోజీ భైరవీ యదుకులకాంభోజీ ఆనందభైరవీ శంకరాభరణ మోహన రేగుప్తీ సౌరాష్ట్రీ నీలాంబరీ గుణక్రియా మేఘగర్జనీ హంసధ్వని శోకవరాళీ మధ్యమావతీ జేంజురుటీ సురటీ ద్విజావంతీ మలయాంబరీ కాపీపరశు ధనాసిరీ దేశికతోడీ ఆహిరీ వసంతగౌళీ సంతు కేదారగౌళ కనకాంగీ రత్నాంగీ గానమూర్తీ వనస్పతీ వాచస్పతీ దానవతీ మానరూపీ సేనాపతీ హనుమత్తోడీ ధేనుకా నాటకప్రియా కోకిలప్రియా రూపవతీ గాయకప్రియా వకుళాభరణ చక్రవాక సూర్యకాంత హాటకాంబరీ ఝంకారధ్వనీ నటభైరవీ కీరవాణీ హరికాంభోదీ ధీరశంకరాభరణ నాగానందినీ యాగప్రియాది విసృమర సరస గానరుచిర సంతత సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందః శ్రీమదానందనిలయ విమానవాసః, సతత పద్మాలయా పదపద్మరేణు సంచితవక్షస్తల పటవాసః, శ్రీశ్రీనివాసః సుప్రసన్నో విజయతాం౤ శ్రీ^^అలర్మేల్మంగా నాయికాసమేతః శ్రీశ్రీనివాస స్వామీ సుప్రీతః సుప్రసన్నో వరదో భూత్వా, పవన పాటలీ పాలాశ బిల్వ పున్నాగ చూత కదళీ చందన చంపక మంజుళ మందార హింజులాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచాశోక మాధూకామలక హిందుక నాగకేతక పూర్ణకుంద పూర్ణగంధ రస కంద వన వంజుళ ఖర్జూర సాల కోవిదార హింతాల పనస వికట వైకసవరుణ తరుఘమరణ విచుళంకాశ్వత్థ యక్ష వసుధ వర్మాధ మంత్రిణీ తింత్రిణీ బోధ న్యగ్రోధ ఘటవటల జంబూమతల్లీ వీరతచుల్లీ వసతి వాసతీ జీవనీ పోషణీ ప్రముఖ నిఖిల సందోహ తమాల మాలా మహిత విరాజమాన చషక మయూర హంస భారద్వాజ కోకిల చక్రవాక కపోత గరుడ నారాయణ నానావిధ పక్షిజాతి సమూహ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర నానాజాత్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ పద్మరాగేంద్ర నీల ప్రవాళమౌక్తిక స్ఫటిక హేమ రత్నఖచిత ధగద్ధగాయమాన రథ గజ తురగ పదాతి సేనా సమూహ భేరీ మద్దళ మురవక ఝల్లరీ శంఖ కాహళ నృత్యగీత తాళవాద్య కుంభవాద్య పంచముఖవాద్య అహమీమార్గన్నటీవాద్య కిటికుంతలవాద్య సురటీచౌండోవాద్య తిమిలకవితాళవాద్య తక్కరాగ్రవాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ ధారావాద్య పటహకాంస్యవాద్య భరతనాట్యాలంకార కిన్నెర కింపురుష రుద్రవీణా ముఖవీణా వాయువీణా తుంబురువీణా గాంధర్వవీణా నారదవీణా స్వరమండల రావణహస్తవీణాస్తక్రియాలంక్రియాలంకృతానేకవిధవాద్య వాపీకూపతటాకాది గంగాయమునా రేవావరుణా

శోణనదీశోభనదీ సువర్ణముఖీ వేగవతీ వేత్రవతీ క్షీరనదీ బాహునదీ గరుడనదీ కావేరీ తామ్రపర్ణీ ప్రముఖాః మహాపుణ్యనద్యః సజలతీర్థైః సహోభయకూలంగత సదాప్రవాహ ఋగ్యజుస్సామాథర్వణ వేదశాస్త్రేతిహాస పురాణ సకలవిద్యాఘోష భానుకోటిప్రకాశ చంద్రకోటి సమాన నిత్యకళ్యాణ పరంపరోత్తరోత్తరాభివృద్ధిర్భూయాదితి భవంతో మహాంతోzనుగృహ్ణంతు, బ్రహ్మణ్యో రాజా ధార్మికోzస్తు, దేశోయం నిరుపద్రవోzస్తు, సర్వే సాధుజనాస్సుఖినో విలసంతు, సమస్తసన్మంగళాని సంతు, ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, సకలకళ్యాణ సమృద్ధిరస్తు ‖


హరిః ఓం ‖


🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏


🙏 *వరలేఖరి.నరసింహశర్మ*🙏


శ్రీ రాముని గొప్ప దనం :-


*రాముడిలో* *ఏమంత* *గొప్పదనం* *ఉంది* ? 


మాయలు మంత్రాలు చూపించలేదు. 

విశ్వరూపం ప్రకటించలేదు. 

జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు... 

చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు... 


పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు... 

తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు... 


కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు... 

అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస       వధ చేశాడు... 


అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. 

లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు… 


అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది? 


ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.


💠   శాస్త్ర ధర్మం :-


తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.


💠   స్నేహ ధర్మం :-


  మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పుతిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.


 💠    యుద్ధ ధర్మం :-


వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.


రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు


మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం | క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||


 ‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన.


💠     దయా ధర్మం :-


సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్యబహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా.. అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు. 


💠      మనుష్య ధర్మం :-  


రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు.


 ‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’ 


అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.


💠      సోదర ధర్మం :-


రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ.. పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.


పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి.. కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం. రాముడూ అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే శ్రీరామజయరామ జయజయ రామ


             🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏 🙏🙏


*ప్రమాదం కాపుకాసుకుని ఉంది*.


ఈ నాలుగు మాటలు చదవండి! ఆచరించండి! జాగ్రత్తగా ఉండండి!

అందరికీ నమస్కారం🙏


*మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం.  మన చుట్టు ప్రక్కల కరోనా మహమ్మారి దాక్కుని ఉంది.*


ఒక సర్వే ప్రకారం..... 

*మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం. 

టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు లక్షల్లో మనమధ్యే ఉన్నారు. 


*అందుచేత.....*


*దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి! 

*తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి!* *చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి! 

*ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి!*

ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి! *చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి*! 

*ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి!

*అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ అనవసరవిషయాలు మాట్లాడకండి!*

*వారు మొహమాటంతో, అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా, మీరు వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.

*వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా, మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి!అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు*


*మీరు వారికి ఎంత ప్రాణ స్నేహితులైనా కావచ్చు! 

లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు! వారిని ఎట్టి పరిస్థితుల్లో కలవండి!

*ఇక ఇరుగుపొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి!* 

*అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి! 

*ఇచ్చి పుచ్చుకోవడాలు కొంతకాలం ఆపేయండి*. 

*ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి!


*స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి*. 

*ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.


*అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి!*


*వాకింగ్ కూడా మానేయండి!                                    ఇంట్లోనే యోగ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి!


*నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. అదే ఇరువురికి క్షేమదాయకం.*


ఇవి యదార్ధములుగా భావించి ఆచరించి, ఆరోగ్యంగా ఉండండి! 


*సమస్త లోకా: సుఖినో భవంతు*!


 "ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రామాణికంగా తీసుకొని చేపట్టిన సర్వేలో రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల్లో దాదాపు 19 లక్షల రేషన్ కార్డుల్లో కోత విధించింది. పౌరసరఫరాల శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఈ సంఖ్య 20 లక్షలకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో కుటుంబంలో ఒక్కో కార్డుకు ముగ్గురు చొప్పున లెక్కేసిన రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మందికి వచ్చే నెల నుండి బియ్యం, ఇతర సరుకుల పంపిణీ నిలిచిపోనుంది.

అధికారికంగా ప్రభుత్వం నుండి దీనికి సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ సంఖ్యలో రేషన్ కార్డుల్లో కోత విధించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రజలకు రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డులను పంపిణీ చేయనుంది. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయపు పన్ను చెల్లించేవారిని, నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వారిని, 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారిని, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారిని అనర్హులుగా తేల్చింది.

ఈ నెల 2వ తేదీ వరకు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించటంతో పాటు ఇప్పటికే తుది జాబితాను రూపొందించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుండి బియ్యం కార్డుల పంపిణీ జరగనుంది. కార్డుదారుల వివరాలను గ్రామ సచివాలయాలు, క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. కొత్త బియ్యం కార్డులు ఉన్నవారికి మాత్రమే మార్చి నెల నుండి బియ్యం పంపిణీ జరగనుంది. అధికారులు మాత్రం అర్హులై బియ్యం కార్డు మంజూరు కాకపోతే ధరఖాస్తులు తీసుకొని కొత్త కార్డులు ఇస్తామని చెబుతున్నారు.

ప్రభుత్వం భారీ సంఖ్యలో రేషన్ కార్డుల్లో కోత విధించటంపై ప్రజల నుండి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించాలని ప్రజల నుండి డిమ�

Thursday, 6 August 2020

 🙏😊

*శిక్ష*    

తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం  నేర్చుకున్నాడు  

15 ఏళ్లకే  మందు తాగడం నేర్చుకున్నాడు 

ఎలాగోలా స్కూల్  చదువు నుండి కాలేజీ కి వచ్చాడు 

అక్కడ పేకాట  పడుచుపిల్లల్తో  ఆటలు నేర్చుకున్నాడు. 

దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది.

20 ఏళ్ళకే డబ్బుకోసం దొంగతనం నేర్చుకున్నాడు.

అది సరిపోక  హత్యలు చేయడము  మొదలెట్టాడు.

దొంగ ఎన్ని రోజులో  దొరలాగా  తిరగలేడు కదా...

ఒకరోజు దొరికిపోయాడు.

మూడేళ్ళ విచారణ  తరువాత అతనికి ఉరిశిక్ష  పడింది.

మళ్ళీ ఎన్ని అప్పీళ్లు  పెట్టుకున్న అవన్నీ  కొట్టేసి  ఉరిశిక్షనే ఖరారూ చేసీ ఆ    రోజును చెప్పేసారు

చివరగా  అతని కోరిక ఏమని అడగగా

 తన తల్లిదండ్రులను చూడాలని కోరాడు  

అతని కోరిక మేరకు వారిని పిలిపించారు  

కన్నవాళ్ళు కదా  కన్నపిల్లలు రాక్షసులైన  ప్రేమిస్తారు  

పోలీసులు  లాయర్లు  సాక్షులు  అందరూ మోసం చేసి నీ ఉరికి  కారణమయ్యారని  ఏడ్చారు తల్లి తండ్రులు 

అప్పుడు అతను వారు కాదు *నా మరణానికి  కారణం మీరే అని చెప్పాడు* 

ఐదేళ్ల వయసులో ఉపాధ్యాయుడు  కొట్టడాడని చెప్పగానే బంధువులతో కలిసి వెళ్లి పోలీస్ కంప్లైంట్  చేసి మరి అతన్ని నిందించారు.

అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం 

ఈరోజు ఉరితాడు  నా మెడకు  రావడానికి  కారణం మీరే అని కంటతడి పెట్టాడు 

ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు  

చిన్న తప్పులే కదా అని *వెనుకేసుకురాకండి* అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి..

✍️..... *నేటి చిట్టికథ* 

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భం గా..

సేకరణ రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

ఠాగూర్ రాసిన చిలుక కథ 

పిల్లలని చదివిస్తున్న ప్రతి తల్లీతండ్రీ చదవాల్సిన కథ ..

ఒక చిలుక ఉండేది.చక్కగా పాడేది. స్వేచ్ఛగా ఎగిరేది.

 కానీ చదవలేకపోయేది.అది రాజు గారి తోటలోని చిలుక.

 ఒకరోజు అది రాజు గారి కంట్లో పడింది. వెంటనే మంత్రిని పిలిచి 'ఎడ్యుకేట్ ఇట్' అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్ చేసే బాధ్యతను రాజు గారి మేనల్లుడి మీద ఉంచాడు మంత్రి.

ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్ చేయటం? విద్యావేత్త లు కూర్చుని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే... మొదట అది కుదురుగా ఉండాలి. అంటే.... అది ఎగురకూడదు.వెంటనే ఒక మంచి పంజరం చేయించారు. చిలుకను అందులో కూర్చోబెట్టారు. 

కోచింగ్ ఇవ్వటానికి ఒక పండితుడు వచ్చాడు. చిలుకను చూశాడు. ' ఈ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు' అన్నాడు.గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేశాయి గంటల కొద్దీ చదువు మొదలైంది.

పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్లేవరూ ' అబ్బా... భలే చిలుక' అనటం లేదు. ' అబ్బా... ఏం పంజరం!' అంటున్నారు. లేదంటే ' అబ్బా ... ఎంత చదువు!' అంటున్నారు. రాజు గారిని మెచ్చుకుంటున్నారు.మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు.రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారుచేసిన కంసాలిని, చదువు చెప్పటానికి వచ్చిన పండితుడిని ' ఆహా... ఓహో ' అని కీర్తిస్తున్నారు.

రాజు గారు మంత్రి గారికి మళ్ళీ ఒకసారి చెప్పారు... ఎన్ని లక్షల వరహాలు ఖర్చైన పర్వాలేదు. చిలక్కి బాగా చదువు రావాలని. మంచి మేనర్స్ కూడా రావాలని.

' అలాగే ' అని లక్షల వరహాలు దఫా దఫాలుగా కోశాగారం నుంచి తెప్పించారు మంత్రిగారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి.

ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతుందో చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. 'చిలుకను చూడడానికి రాజుగారు వస్తున్నారహో ' అని తప్పెట్లు, తాళాలు ,పెద్ద పెద్ద శబ్దాలు చేసే బూరలతో ఒకటే హోరు. 

రాజు పరివారం అంతా రాజు కన్నా ముందే చిలుక దగ్గరికి చేరిపోయింది. అయితే పంజరం లోని చిలుకను ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరూ దాని వైపు చూడటం లేదు.పండితుడు ఒక్కడే చూస్తున్నాడు. ఆయనైనా చిలుక సరిగా చదువుతుందా లేదా అని చూస్తున్నాడు తప్ప , చిలకెలా ఉందో చూడటం లేదు. చిలుక బాగా నీరసించి పోయింది. మానసికంగా బాగా నలిగిపోయి ఉంది. 

ఆ రోజైతే .... రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది. తర్వాత కొద్దిరోజులకే పూర్తి ప్రాణం విడిచింది ! ఆ సంగతి ఎవరికీ తెలీదు. తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు

రాజుగారు మళ్ళీ మేనల్లుడిని పిలిచి, ' చిలుక ఎలా చదువుతోంది? ' అని అడిగాడు.

' చిలుక స్టడీస్ కంప్లీట్ అయ్యాయి' అన్నాడు మేనల్లుడు

రాజుగారు సంతోషించారు. తన కృషి ఫలించిందన్నమాట.

' ఇప్పటికి అల్లరి చిల్లర గానే ఎగురుతోందా?'

' ఎగరరదు'

' ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా? '

'పాడదు'

' సరే, చిలుకను ఒకసారి నా దగ్గరికి తీసుకురా'

తీసుకొచ్చాడు మేనల్లుడు. చిలుక నోరు తెరవడం లేదు.ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.చిలుక కడుపు ఉబ్బెత్తుగా ఉంది. చిలుక అసలు కదలనే కదలటం లేదు.

" ఆ కడుపులోనిది ఏమిటి!" అని అడిగారు రాజు గారు.

' జ్ఞానం మామయ్య ' అని చెప్పాడు మేనల్లుడు.

' చిలుక చనిపోయినట్లు ఉంది కదా ' అన్నారు రాజుగారు.

చిలుక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత. చచ్చిందా బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనల్లుడు.

🍂🍂🍂🍂🍂🍂🍂🍂

నూరేళ్ళ క్రితం విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ రాసిన చిలుక కథ ఇది.ఇప్పటి కార్పోరేట్ విద్యాసంస్థలకు సరిగా సరిపోతుంది కదా ...


stories













శరీరాలు మూడు రకాలుగా ఉంటాయి.*

*1. స్థూల శరీరం (సాధారణ భౌతిక శరీరం)*

*2. సూక్ష్మ శరీరం* (కేవలం మనస్సు, బుద్ధిలతో కూడినది)

*3. కారణ శరీరం* (పాప పుణ్యాల శేష ఫలితాలు బీజరూపకంగా ఉన్న శరీరం)ఇలా మనం చేసిన పాపం ఈ మూడు శరీరాల్లో నిలువ ఉంటుందని శాస్త్రం చెబుతుంది.

మనలో పాపం ఎక్కువ నిలువ ఉందా?

లేదా పుణ్యం ఎక్కువ నిలువ ఉందా?

అన్న విషయం ఎలా తెలుస్తుంది? అన్న సందేహం మనకు రావచ్చు!

దుర్గంధాన్ని బట్టి చెడువస్తువులనూ, సుగంధాన్ని బట్టి మంచి వస్తువులను అంచనా వేసినట్లు ఈ మూడు శరీర లక్షణాలను బట్టి మనలో నిలువ ఉన్న పాప పుణ్యాలను కూడా అంచనా వేయవచ్చు. 

*1. స్థూల శరీర లక్షణాలు :*

సాధారణంగా స్థూల శరీరలక్షణాలు ఎక్కువగా ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలమీద ఆధారపడి ఉంటాయి.

*అ)* స్థూల శరీరం పాపరహితంగా పవిత్రంగా ఉంటే తెల్లవారు జామునే మేల్కొంటుంది. (లేదా తెల్లవారు జామున మేలొన్నా పవిత్రమౌతుంది)

పాపం పెరిగిన కొద్దీ సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తంలోనే గాఢ నిద్ర పట్టడం, ఆలస్యంగా నిద్రలేవడం ఎక్కువౌతుంది.

*ఉదా :* ఈ ప్రపంచంలో పాపం అంటే తెలియని స్థితిలో ఉన్న శిశువులు కానీ, పాప రహితులైన మహాత్ములుగాని తెల్లవారు జామునే మేల్కొటాంరు.

*ఆ)* స్థూల శరీరం పాప రహితంగా పవిత్రంగా ఉంటే ఏ మాత్రం బద్ధకం, సోమరితనం లేకుండా ఉపయుక్తమైన ఏ పని చేయడానికైనా సన్నద్ధంగా, ఉత్సాహంగా ఉంటుంది.

ఒకవేళ పాపం పెరుగుతూ ఉంటే సోమరితనం, బద్ధకం కూడా పెరుగుతాయి. ఉపయుక్తమైన పనులు చేసే విషయంలో శరీరం ఏ మాత్రం సన్నద్ధంగా ఉత్సాహంగా ఉండదు. నిరుపయోగకరమైన మరియు కాలాన్ని వ్యర్థం చేసే విషయాల్లో ఉత్సాహం, సన్నద్ధత పెరుగుతాయి.

ఈ విషయంలో కూడా పాపం అంటే తెలియని శిశువులనూ, పాపరహితులైన మహాత్ములను గమనించండీ. వారు బద్ధకంగా వ్యవహరించింది ఎప్పుడూ కనిపించదు.

*ఇ)* స్థూల శరీరం పవిత్రంగా ఉంటే నియతిబద్ధంగా, క్రమశిక్షణతో వ్యవహరించడం జరుగుతోంది. పాపంతో అపవిత్రమైనకొద్దీ క్రమశిక్షణ లోపిస్తుంది.

*ఈ)* స్థూల శరీరంలో పాపం పెరిగి అపవిత్రమైనకొద్దీ అనవసర ఆహారం, దోష భూయిష్టమైన ఆహారమే తీసుకోవాలనిపిస్తుంది లేదా అలా తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. పవిత్రత పెరిగిన కొద్దీ మితాహారం, ఆరోగ్యాన్ని పవిత్రతను ఇచ్చే ఆహారం తీసుకోవడం జరుగుతుంది.

*ఉ)* స్థూలశరీరం అపవిత్రమైనకొద్దీ

అవసరానికి మించి నిద్రించడం జరుగుతుంది. పవిత్రమైనకొద్దీ ఎంత అవసరమో అంతే నిద్రించడం ఉంటుంది.

*ఊ)* స్థూల శరీరం పవిత్రంగా ఉంటే నిద్ర లేచిన క్షణంలో వెంటనే (కాన్సియస్‌) స్పృహలోకి వచ్చి ఉత్సాహంగా ఉంటారు లేదా ఉత్సాహంగా నిద్రలేస్తారు.

నిద్ర లేచిన తర్వాత వారి ముఖం మబ్బు లేకుండా ఫ్రెష్‌గా ఉంటుంది.

పాపంతో అపవిత్రమౌతున్న కొద్దీ నిద్ర లేచిన 10, 15 నిమిషాల వరకు (కాన్సియస్‌) స్పృహలోకి రాలేకపోతారు. కారణమేమిటంటే ఆత్మతో శరీరానికి బంధం ఎక్కువౌతుంది.

*ఇలా స్థూల శరీర లక్షణాలను బట్టి పాప పుణ్యాల నిలువను గుర్తించవచ్చు.*

దుర్గంథాన్ని బట్టివాతావరణంలో అపవిత్రతను కలుగజేస్తున్న చచ్చిన ఎలుకను గుర్తించినట్లు స్థూల శరీర లక్షణాలను బట్టి జీవితంలో వ్యాపించిన అపవిత్రతనూ, పాపాన్ని గుర్తించాలి. దీని వల్లనే శుభాలు వాయిదా పడుతున్నాయని, భవిష్యత్తులో కష్టాలు రావడం వల్ల పాపం ప్రక్షాళన కావలసి వస్తుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి వెంటనే జాగ్రత్తపడి కఠినమైన సాధన వల్ల స్థూల శరీరాన్ని సరియైన విధంగా ఉంచుకోవాలి.

🙏 *వరలేఖరి.నరసింహశర్మ*🙏


💦🌺🌻🌸💦🌺🌻🌸💦🌺

          *_🌹నేటి మంచి విచారం   🌹_*




*_ఆత్మీయ మిత్రులకు శుభోదయం🙏_*

*_✡సర్వేజనాః_* *_సుఖినోభవంతు._*🙏

    🌺 *_🕉 జై యోగేశ్వర్ _🕉*  🌸

💫 *_మీ..డా,, తుకారాం జాదవ్ ,_* 🙏
[06/08, 10:57 am] +91 6281 264 412: పంచ మహాపురుష యోగాలు వాటి గురించి తెలుసుకుందాం అందులో హంస యోగం ఇది ఇది గ

చ్చ పెట్టడం వల్ల కలుగుతుంది ఇది కలిగితే సమాజంలో వారికి చక్కటి శాస్త్రజ్ఞానం పదిమందిలో గౌరవం మొదలైనవి కలుగుతాయి ఈ యోగము కలిగిన వారికి అన్ని విధాల కాలం ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది గుడికి గురు గ్రహానికి కర్కాటకం ఉచ్చ శ్రీరామచంద్రమూర్తి జాతకంలో గురు గ్రహం ఉండగా జన్మించిన కారణంగా ఆయన గ్రహాలు అనుకూలంగా లేని కాలంలో వనవాసం చేసినప్పటికీ ఆయనని ఎప్పుడూ పూజిస్తూ ఉన్న పరిస్థితి మనకి రామాయణంలో కనపడుతుంది విచిత్రమేమిటంటే అతని శత్రువు రావణుని భార్య మండోదరి కూడా శ్రీరామచంద్రమూర్తిని రావణుని దగ్గరే అతని గుణగణాలను కీర్తించడం జరుగుతుంది అంటే గురు బలం ఉన్న వారికి కాకుండా వారి బుద్ధి కూడా సద్గుణ రాసి ఉంటుంది దానివలన సత్యం ఎప్పుడూ వీడకుండా వారు అనుసరిస్తూ ఉంటారు దానివలన మిగిలిన గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి శ్రీరామచంద్రమూర్తి జాతకంలో కర్కాటక లగ్నం గురుడు రాజ్యాన్ని చూస్తూ ఉండడం వల్ల
[06/08, 10:57 am] +91 6281 264 412: *ఓం దత్తాత్రేయాయ నమ:*

*కర్పూరకాంతి దేహాయ బ్రహ్మమూర్తి ధరాయ చ |*
*వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే ||*

బంగారు వర్ణ శరీరము కలవాడు,సృష్టి కర్తయు, వేద శాస్త్రం లను అవపోసకుడు అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము

*హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |*
*పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే |*|

పొట్టి,పొడుగు,సన్నము,లావును,కుల గోత్ర రహితుడును,పంచ భూతములతో ప్రకాశించు వాడును అయిన శ్రీ దత్తాత్రేయయునికి నమస్కారము.

*సుప్రభాతం - శుభోదయం*

*మిత్రులందరికీ శుభోదయం*💐🙏
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰



*మనుషులూ – గౌరవం*
0><><><><><><><><0

పైసా ఖర్చుపెట్టకుండా ఇతరులకు మనం ఇవ్వగలిగే గిఫ్ట్ ఏదైనా ఉంటుందీ అంటే… అది Respect.. డబుల్ మీనింగులు లేని స్వచ్ఛమైన స్మైల్…

మనకు బాగా తెలుసు, ఎవరి లోపాలేంటో పనులు మానుకుని మరీ స్టడీ చేసుకుంటూ ఉంటాం. ప్రతీ మనిషినీ పూచికపుల్లలా తీసిపారేయడానికి మన దగ్గర సవాలక్ష కారణాలు సిద్ధంగా ఉంటాయి.

కళ్లెదురు ఏ మనిషి కన్పించినా పైకి వచ్చే expressions వేరు.. లోపల మనకు మనం అనుకునే అంతర్గత సంభాషణలు వేరు..

లైఫ్‌లోకి తారసపడిన ప్రతీ ఒక్కర్నీ కొన్నాళ్లపాటు విపరీతంగా అభిమానించేసి.. కొత్తదనం పోగానే, సహజసిద్ధమైన మానసిక లోపాలు కన్పించగానే జీవితాంతం దూరం పెట్టేయడం మనకు సరదా.

ఓ మాటలో చెప్పాలంటే మనకు ఒళ్లంతా పొగరు.. “పోతే పోనీయ్… ఆ మనిషి కాకపోతే బోలెడు మంది మనుషులు దొరుకుతారు” అని ఈసడించిపారేస్తాం.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

నిజమే.. కోట్ల కొద్దీ జనాభా ఉన్న ప్రపంచంలో రోజుకి కొన్ని వందల మందిని కొత్త వాళ్లని చూసుకోవచ్చు. అలాగే కన్పించిన ప్రతీ మనిషినీ పైకీ.. క్రిందికీ ఆపాదమస్తకం చూసేసి… “నాకీ మనిషి నచ్చలేదు ఎందుకో” అని పెదవి విరిచేయనూ వచ్చు. అంతేకాదు.. అతవలి మనిషి ఏంటో, ఆ మనిషి గొప్పదనం ఏంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండానే అవమానకరంగా మాట్లాడనూవచ్చు.

బట్ మనుషులకు విలువ ఇవ్వని ఏ మనిషికీ జీవితం లేనట్లే! అలాంటి మనుషులు చాలా దారుణమైన లైఫ్ లీడ్ చెయ్యాల్సి ఉంటుంది. ఈ విషయం కాలక్రమేణా లైఫ్ ముందుకు సాగుతుండే కొద్దీ గానీ అర్థం కాదు. అప్పటికే నోటి దురుసుతో, లెక్కలేనితనంతో కన్పించిన ప్రతీ వాళ్లనీ దూరం చేసుకుంటారు, ఆల్రెడీ కాస్తో కూస్తో మంచిగా ఉన్న వాళ్లనీ నెట్టి పారేస్తారు.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

మనుషుల్ని అన్‌కండిషనల్‌గా ప్రేమించాలి… చాలామంది తరచూ కంప్లయింట్ చేస్తుంటారు… అంతా అవకాశవాదులే కన్పిస్తున్నారు.. అవసరానికే ఫోన్లు చేస్తున్నారు.. హెల్ప్ చేయించుకుంటున్నారు అని!!

పనుల కోసం కాకపోతే మీతో కూర్చుని.. “ముస్తాఫా ముస్తాఫా… డోంట్ వర్రీ ముస్తాఫా” అంటూ పాటలు పాడుకునే తీరిక ఎవరికుంది? అసలు మీరు ఇతరులకు ఏయే సందర్భాల్లో కాల్ చేస్తున్నారో ఓసారి రీకాల్ చేసుకోండి.. అందరూ అంతే! లైఫ్ ఫాస్ట్ అయిపోయింది.. అవసరాలే మనుషుల్ని కలిపి ఉంచుతున్నాయి.. ఒక మనిషితో మరో మనిషికి ఏదో రకమైన అవసరం లేకపోతే అసలు ఒకర్నొకరు లెక్కచెయ్యలేనంత ఏటిట్యూడ్‌లు కూడా తలకెక్కాయి. సో అవసరాలకు వాడుకుంటున్నారని నిందించకండి…

చేతనైన సాయం చెయ్యడం, చేతకాని సాయాలను నిర్మొహమాటంగా చెప్పేయడం, అవసరమైనప్పుడు సాయం తీసుకోవడం.. అన్నింటికన్నా ముఖ్యంగా హృదయంలో స్వచ్ఛంగా, అవతలి మనిషి పట్ల ప్రేమగా ఉండడం, ఏదో మైండ్‌లో పెట్టుకుని ఏదోలా స్టుపిడ్‌గా ప్రవర్తించకుండా ఉండడం.. ఈ కొన్ని క్వాలిటీస్ చాలు అందరం హాపీగా ఉండడానికి!

లేదంటే మనుషులందరూ చాలా చెడ్డవాళ్లగానే కన్పిస్తారు.. ప్రతీ మనిషీ శత్రువుగానో, వేస్ట్ ఫెలోగానో అన్పిస్తారు.. అసలు విషయం ఏమిటంటే ఇలాంటి అద్భుతమైన మనుషుల మధ్య మన మనస్సు కలుపు మొక్కగా తయారవుతోందని! తప్పు ఎవరిదో కాదు, మన ఆలోచనా విధానానిది! సో మనుషుల్ని గౌరవిద్దాం, ప్రేమగా మసలుకుందాం!!

*మీ*
*వరలేఖరి.నరసింహశర్మ*

Monday, 3 August 2020

హిందూ పూజా విధానం

హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము.


1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. 
ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, 
రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. 
దైవమే కాంతి. 
ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది.  స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. 
కాంతివి నీవే. 
నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, 
మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.

3. ధూపం:
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. 
వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. 
వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. 
విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన 
అందరిలో కలుగుతుంది. 
ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ 
జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి:
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. 
ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని 
భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ:
ఈ సేవలో చాలా అర్థం ఉంది. 
భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. 
అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. 
ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. 
ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం. 

6. పూజ:
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. 
కాని భగవంతునికి వీటితో పనిలేదు. 
నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. 
కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7 పత్రం(శరీరము):
ఇది త్రిగుణాలతో కూడుకున్నది. 
పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8 పుష్పం (హృదయము):
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు 
అని అర్థం కాదు. 
సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం 
అని అర్థం. 
ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9 ఫలం (మనస్సు):
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.
దాన్నే త్యాగం అంటారు.

10. తోయం(నీరు):
భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన 
దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు 
దైవానికే అర్పితం కావాలి.

11 కొబ్బరికాయలు:
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. 
దానిలో ఉండే నీరు సంస్కారము. 
కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. 
అదే నిజమైన నివేదన. 
లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, 
హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. 
హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. 
మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.
మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము:
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. 
ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. 
ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము:
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. 
ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. 
అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.
🌹🙏🌻🙏🌹🙏.🌹🌻

*వివాహమునకు కూడని షష్టాష్టకములు -- శత్రు షష్టాష్టకము:—*
********************************************

*వధువు ---- వరుడు*
   తుల  ......... మీనం
మిథునం ....... వృశ్చికం
మేషం  ..........  కన్య
ధనస్సు  ........ వృషభం
సింహం ....... మకరం
కుంభం  ....... కర్కాటకం.
********************************************
*వరుడు  ------ వధువు*
   కన్య   ...........   మేషం
మీనం   ............  తుల
వృశ్చికం  ........ మిథునం
మకరం  ......... సింహం
కర్కాటకం   ..... కుంభం
వృషభం  ........  ధనస్సు
********************************************

*శుభ షష్టాష్టకములు:—*
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

*వరుడు ....... వధువు*

వృశ్చికం ....... మేషం
మకరం ........ మిథునం
వృషభం  ........  తుల
మీనం  .........  సింహం
కర్కాటకం  ......  ధనస్సు
    కన్య    ......... కుంభం.
********************************************
*శుభ నవ పంచకములు:--*
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

*వరుడు ........ వధువు*
మేషం   .........  సింహం
వృషభం  .........  కన్య
మీనం   ........  కర్కాటకం
మకరం  ........  వృషభం
కన్య   ...........  మకరం
వృశ్చికం   .......   మీనం
కుంభం  ......... మిథునం
మిథునం   .........   తుల
కర్కాటకం ........ వృశ్చికం.

*మీ*
*వరలేఖరి.నరసింహశర్మ*
*స్త్రీల మంచి నక్షత్రములు :*
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
 అశ్వని,రోహిణి,మృగశిర,పునర్వసు,పుష్యమి,మఘ,పుబ్బ,ఉత్తర,హస్త,స్వాతి,విశాఖ - 1,2,3, పాదములు,అనూరాధ,పూర్వాషాఢ,ఉత్తరాషాఢ,శ్రవణం,ధనిష్ఠ,శతభిషం,పూర్వాభాద్ర,ఉత్తరాభాద్ర,రేవతి నక్షత్రములు మంచివి.

*మధ్యమ నక్షత్రములు*
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
భరణి,కృత్తిక,ఆర్థ్ర,చిత్త.

*దోష నక్షత్రములు*
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
మూల,ఆశ్లేష,విశాఖ - 4వ పాదము,జ్యేష్ట.
మూల నక్షత్రమునకు భర్త తండ్రికి దోషము. 2,3 పాదములకు దోషము లేదు.
ఆశ్లేష నక్షత్ర వధువునకు అత్తకు దోషము.మొదటి పాదమునకే దోషము.2,3,4, పాదములకు దోషము లేదు.
జ్యేష్ఠ నక్షత్ర వధువు వలన భర్త అన్నకు దోషము.
విశాఖ నక్షత్రము 4వ పాదములో పుట్టిన వధువునకు భర్త తమ్మునికి దోషము.

*ఈ నక్షత్రములు స్త్రీలకే గానీ పురుషులకు వర్తించదు.*

*తల్లి లేని వరునకు* " ఆశ్రేష " నక్షత్ర జాతకురాలిని ఇచ్చి వివాహము చేయవచ్చును.
అలాగే ....
*తండ్రి లేని వరునకు*
" మూల " నక్షత్ర జాతకురాలిని,
*అన్న లేని వరునకు* " జ్యేష్ఠ " నక్షత్ర జాతకురాలిని,
*తమ్ముడు లేని వరునకు*
 " విశాఖ " నక్షత్ర జాతకురాలిని ఇచ్చి వివాహము చేయవచ్చును.
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

*వధూవరులకు ఏక నక్షత్రములైన దోషము లేని నక్షత్రములు*
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
రోహిణి,ఆర్ద్ర,విశాఖ,పుష్యమి,శ్రవణం,ఉత్తరాభాద్ర,మఘ,రేవతి.

*మధ్యమ నక్షత్రములు*

అశ్వని,భరణి,స్వాతి,ఆశ్రేష,పుబ్బ,అనూరాధ,శతభిషం,మూల.

*కూడని నక్షత్రములు*

మృగశిర,పునర్వసు,ఉత్తర,హస్త,జ్యేష్ఠ,పూర్వాషాఢ,ఉత్తరాషాఢ!ధనిష్ఠ,పూర్వాభాద్ర,కృత్తిక,చిత్త.

*ఏక నక్షత్రమైననూ రాశి బేధము,పాద బేధమున్న దోషము లేదు.*

*కూడని జంట నక్షత్రములు*
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
*ముందు స్త్రీ నక్షత్రముగానూ,తర్వాత పురుషుల నక్షత్రములు గానూ గ్రహించాలి.*
~~~~~~~~~~~~~~
కృత్తిక -- ఆశ్లేష
ఆశ్లేష --- స్వాతి
చిత్త   ---- పూర్వాషాఢ
అనూరాధ -- ధనిష్ఠ
ధనిష్ఠ ----- భరణి
శతభిషం --- కృత్తిక.

*క్రిందివి ముందు పురుష నక్షత్రములు తర్వాత స్త్రీ నక్షత్రములు గానూ గ్రహించాలి.*
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

కృత్తిక --- శతభిషం
ఉత్తర --- ఆర్ద్ర
మూల ---- హస్త
విశాఖ ----- మఖ
శ్రవణం ---- విశాఖ
మృగశిర --- ఉత్తరాభాద్ర
అశ్వని ----- శ్రవణం.

*జంట నక్షత్రములు మంచివి.*
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
*ముందు పురుష నక్షత్రములు తర్వాత స్త్రీల నక్షత్రములుగా గ్రహించాలి.*
~~~~~~~~~~~~

ఆర్ద్ర ---- ఉత్తర
పుబ్బ --- అనూరాధ
పుష్యమి ---- చిత్త
పునర్వసు ---- హస్త
రోహిణి ---- మఘ
పూర్వాభాద్ర ---- రోహిణి
అశ్వని ---- పునర్వసు
స్వాతి ----- ఉత్తరాషాఢ
ఉత్తరాషాఢ ---- రేవతి
మూల ---- పూర్వాభాద్ర
పూర్వాషాఢ -- ఉత్తరాభాద్ర
భరణి --- పుష్యమి.

*పరస్పర నక్షత్రములు కూడనివి.*
॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

చిత్త --- మృగశిర -- ధనిష్ఠ.
********************************************

*మరికొన్ని విషయాలు మరో పోస్టులో...*

*మీ*
*వరలేఖరి.నరసింహశర్మ*