కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు…
అదీ చేతకాకపోతే, పాకుతూ పో…
అంతేకానీ, ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు!
దేహానికి తప్ప దాహానికి పనికిరాని
ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే…
ఉద్యోగం రాలేదని,
వ్యాపారం దెబ్బతినిందని,
స్నేహితుడొకడు మోసం చేశాడని,
ప్రేమించినవాళ్ళు వదిలి వెళ్ళిపోయారనీ
అలాగే ఉండిపోతే ఎలా?
తలుచుకుంటే,
నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా
నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది!
అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే ఎలా?
సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు…
పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు,
అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే
ఆ నెత్తురుతో సహా – ఏదీ ఆగిపోడానికి వీల్లేదు!
లే…! బయలుదేరు…!
నిన్ను కదలనివ్వకుండా చేసిన
ఆ మానసిక బాధల సంకెళ్ళను తెంచేసుకో,
పడ్డ చోటు నుండే పరుగు మొదలుపెట్టు!
నువ్వు పడుకునే పరుపు,
నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్!
నీ అద్దం,
నిన్ను ప్రశ్నించకముందే సమాదానం వెతుక్కో!
నీ నీడ,
నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయ్!
మళ్ళీ చెప్తున్నా…
కన్నీళ్ళు కారిస్తే కాదు,
చెమట చుక్కని చిందిస్తేనే
చరిత్రను రాయగలవని తెలుసుకో…!
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*అష్టలక్ష్మి స్తోత్రం - మహత్యం*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎనిమిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో తెలుసుకుందాం
☘☘☘☘☘☘☘☘☘☘
అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశిష్టత, ఈ స్తోత్రం పఠించడం వలన కలిగే ప్రయోజనాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
☘☘☘☘☘☘☘☘☘☘
మన జీవితంలో ఎక్కువ కష్టాలు పడుతుంటే అష్టకష్టాలు పడుతున్నాం అని, ఎక్కువగా సుఖాలు అనుభవిస్తుంటే అష్టైశ్వర్యాలు పొందుతున్నాం అని అనుకోవడం పరిపాటి. మన కష్టాల నుంచి సుఖాల వైపు మళ్ళీంచగలిగే శక్తి ఆ ఆదిమాతకే ఉంది. అష్టకష్టాలు నుంచి అష్టైశ్వర్యాలు
ప్రసాదించు అద్భుత స్తోత్రమే " అష్టలక్ష్మీ స్తోత్రం "
అష్ట అంటే ఎనిమిది అని అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఆ ఎనిమిది లక్ష్ములు ఎవరు? వారి వలన మనకు లభించే పరమార్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
ఆదిలక్ష్మీ :- వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉండేది ఆదిమాత.. అదే ఆదిలక్ష్మి.. ఈ సృష్టికి మూలం నారాయణుడు అని కొందరు.. కాదు అమ్మే అని మరి కొందరి విశ్వాసం.. నిజానికి ఇద్దరిలా కనిపించే వీరు ఇద్దరూ ఒక్కరే! లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలము పవిత్రతకు చిహ్నం.. ఇందిరా దేవి అని కూడా ఈ రూపంలో వీరిని పూజిస్తారు. ఆది లక్ష్మిని ఆరాధించుట వలన సంతోషం, పవిత్రత మనకు లభిస్తాయి.
ధాన్య లక్ష్మి :- ధాన్యం అంటే పండించిన పంట అని అర్థం. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించుట వలన మన జీవితానికి కావల్సిన అన్ని రకాల విటమిన్స్, పండ్లు, ఆహారం మొదలైనవి అన్నీ సుఖంగా పొందుతాం.. అంతే కాకుండా పంటలు సరిగ్గా పండాలి అన్న.. అతి వృష్టి అనావృష్టిని కాపాడుకోవాలి అన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండవలసిందే!
ధైర్య లక్ష్మి :- కొంతమంది ఎన్నీ కష్టాలు .. ఉన్న ధైర్యంగా ఎదుర్కొంటారు, మరికొందరు పిరికిగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు..
మనకు కావలసిన అన్ని రకాల శక్తి - సామర్ధ్యాలు ఈ అమ్మ వలననే లభిస్తాయి.. పూర్వం ఒక కధ ప్రాచుర్యంలో ఉండేది.. ఒక మహారాజు గ్రహస్ధితి బాగుండక అష్ట లక్ష్ములు ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళి పోతుంటారు.. చివరికి ధైర్యలక్ష్మి వంతు వస్తుంది.. కాని అప్పుడు ఆ రాజు ఈమెని తనని విడచి వెళ్ళవద్దు.. వారందరూ వెళ్ళి పోయినా పర్వాలేదు ఒక్క నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు.. మళ్లీ వారందరినీ
పొందగలనని విశ్వాసంగా వుంది.. విడచి వెళ్ళవద్దు అని ప్రాధేయ పడతాడు... నిజమే ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సింది మానసిక స్ధైర్యమే.. అది ఉంటే ఎన్ని ఇబ్బందులు అయినా ధైర్యం గా ఎదుర్కోవచ్చు. ఇది ధైర్య లక్ష్మి ప్రాధాన్యత.
గజలక్ష్మి :- ఈ అవతారం దేవ దానవులు సముద్ర మధనం సాగించే సమయంలో సముద్రుని కూతురుగా ఈ రూపమ్లో ఉద్భవించినట్లు భాగవతం చెబుతుంది. రెండు ఏనుగులు అమ్మ ప్రక్కన నిలబడి జలధారని వర్షింప చేస్తూంటాయి ఇక్కడ ఏనుగులు మనం గణపతి స్వరూపంగా కూడ భావించవచ్చు.. లక్ష్మి గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించుట వలన ఇల్లు, వాహనాలు వంటి భౌతిక సుఖాలు
మనకు ఒనగూడుతాయి.
సంతాన లక్ష్మీ :- ఏ భార్య భర్తలకైనా తమ కుటుంబానికి కావల్సిన మొదటి సంపద సంతానమే.. అది లేకుంటే జీవితాన్ని నిస్సారం గా గడపవలసి వస్తుంది.. అలాగే కర్మ పరిపక్వత కూడా ఉండదు.. అందుకే ఈ శక్తి ని పూజించి తప్పక ప్రసన్నం చేసుకోవాలి.. అప్పుడే సంతానం పొందడమే కాకుండా వారికి సద్బుద్ధి, ధీర్ఘాయుస్సు లభిస్తాయి.
విజయ లక్ష్మీ :- పేరులోనే ఉంది పెన్నిది.. బాహ్య - అంతర్గత మనసుపై విజయం పొందాలని అన్నా.. శారీరకంగా, ఆర్ధికంగా ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై విజయం పొందాలి అంటే విజయ లక్ష్మి కృప ఉండి తీరవలసిందే!
ధనలక్ష్మి :- భూమిపై సంపద లేదా ధనం అంటే రూపాయలు బంగారు ఆభరణాలు కాదు.. పకృతిలో ఉండు అన్ని రకాల నదులు, ఫలవంతం అయిన చెట్లు, సమృద్ధిగా కురియు వర్షాలు ఇవ్వన్నీ సంపద క్రిందే వస్తాయి.. కనుక అవన్నీ మనకు ధన రూపంగా మార్చి ఇచ్చేది ఈ దేవతే.
విద్యాలక్ష్మి :- పాఠశాలలో, కళాశాల, విశ్వవిద్యాలయల్లో లభించే విద్యే కాదు.. ఏ తరహా విజ్ఞానం కావలన్న ఈమెను ఆశ్రయించ వలసినదే.. ఆధ్యాత్మికం.. భౌతికం ఎందులో ఏ విద్య అయినా మనకు అందులో దక్షత ఏర్పడాలి అంటే ఈ లక్ష్మి దయ మనకు ఉండవలసిందే. నిజానికి మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషికి తమ జీవితంలో ఏవైతే కోరుకుంటారో అవన్నీ అష్ట లక్ష్ముల ప్రతీకలే!
అష్ట లక్ష్ములని పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయి అనేది ఎందరో చెప్పిన మాట..షోడశ అంటే 16.. ఇప్పుడు ఆ ఫలాలు ఏమిటో చూద్దాం...
1 కీర్తి, 2 జ్ఞానం, 3 ధైర్యం.. బలం, 4 విజయం , 5 సత్సంతానం
6 యుద్ధ నైపుణ్యం, 7 బంగారం ఇతర సంపదలు,
8 సంతోషం, 9 భౌతిక సుఖాలు, 10 తెలివితేటలు, 11 అందం
12 విద్యాభివృద్ధి, 13 ఉన్నత విలువలు.. ధ్యానం,
14 నీతి నియమాలు, 15 మంచి ఆరోగ్యం, 16 దీర్ఘ ఆయుః.
అష్టలక్ష్మీ స్తోత్రం:-
ఆదిలక్ష్మి :-
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||
ధాన్యలక్ష్మి:-
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||
ధైర్యలక్ష్మి:-
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||
గజలక్ష్మి:-
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||
సంతానలక్ష్మి:-
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||
విజయలక్ష్మి:-
జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||
విద్యాలక్ష్మి:-
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||
ధనలక్ష్మి:-
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||
ఫలశృతి:-
శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ||
శ్లో|| శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్
కనుక దేవున్ని కొలిచే ప్రతి ఒక్కరూ నిత్యం ఈ స్తోత్రం చదవడం వలన పై ప్రయోజనాలు కొన్ననైనా పొందవచ్చు. అలాగే జాతక రిత్యా శుక్ర గ్రహ ప్రీతి కొరకు, దోష నివారణకు కూడా ఇది చదవవచ్చు.. దీని వలన భార్య భర్తల మధ్య సఖ్యత, సుఖాలు లభిస్తాయి. ఇంట్లో శ్రీ చక్రం ఉన్న వారు దానికి దగ్గర ఈ అష్ట లక్ష్ముల ఫొటో పెట్టి ఇది చదవడం మరింత వేగంగా ఫలించేలా చేస్తుంది.. అలాగే క్షీరాన్నము లేక పాల కోవా నివేదన చెప్పబడుతోంది. లక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు.. ఐశ్వర్య మస్తు.. !
🙏 *శ్రీ శ్రీనివాస గద్యమ్*🙏
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
శ్రీమదఖిలమహీమండలమండనధరణీధర మండలాఖండలస్య, నిఖిలసురాసురవందిత వరాహక్షేత్ర విభూషణస్య, శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచలాంజనాచలాది శిఖరిమాలాకులస్య, నాథముఖ బోధనిధివీథిగుణసాభరణ సత్త్వనిధి తత్త్వనిధి భక్తిగుణపూర్ణ శ్రీశైలపూర్ణ గుణవశంవద పరమపురుషకృపాపూర విభ్రమదతుంగశృంగ గలద్గగనగంగాసమాలింగితస్య, సీమాతిగ గుణ రామానుజముని నామాంకిత బహు భూమాశ్రయ సురధామాలయ వనరామాయత వనసీమాపరివృత విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస నిర్ఘరానంతార్యాహార్య ప్రస్రవణధారాపూర విభ్రమద సలిలభరభరిత మహాతటాక మండితస్య, కలికర్దమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగణనిషేవ్యమాణ ప్రత్యక్షీభవన్నిజసలిల సమజ్జన నమజ్జన నిఖిలపాపనాశనా పాపనాశన తీర్థాధ్యాసితస్య, మురారిసేవక జరాదిపీడిత నిరార్తిజీవన నిరాశ భూసుర వరాతిసుందర సురాంగనారతి కరాంగసౌష్ఠవ కుమారతాకృతి కుమారతారక సమాపనోదయ దనూనపాతక మహాపదామయ విహాపనోదిత సకలభువన విదిత కుమారధారాభిధాన తీర్థాధిష్ఠితస్య, ధరణితల గతసకల హతకలిల శుభసలిల గతబహుళ వివిధమల హతిచతుర రుచిరతర విలోకనమాత్ర విదళిత వివిధ మహాపాతక స్వామిపుష్కరిణీ సమేతస్య, బహుసంకట నరకావట పతదుత్కట కలికంకట కలుషోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశాహృత కమలారత శుభమంజన జలసజ్జన భరభరిత నిజదురిత హతినిరత జనసతత నిరస్తనిరర్గళ పేపీయమాన సలిల సంభృత విశంకట కటాహతీర్థ విభూషితస్య, ఏవమాదిమ భూరిమంజిమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హారిశంబర వివిధవిపుల పుణ్యతీర్థనివహ నివాసస్య, శ్రీమతో వేంకటాచలస్య శిఖరశేఖరమహాకల్పశాఖీ, ఖర్వీభవదతి గర్వీకృత గురుమేర్వీశగిరి ముఖోర్వీధర కులదర్వీకర దయితోర్వీధర శిఖరోర్వీ సతత సదూర్వీకృతి చరణఘన గర్వచర్వణనిపుణ తనుకిరణమసృణిత గిరిశిఖర శేఖరతరునికర తిమిరః, వాణీపతిశర్వాణీ దయితేంద్రాణిశ్వర ముఖ నాణీయోరసవేణీ నిభశుభవాణీ నుతమహిమాణీ య స్తన కోణీ భవదఖిల భువనభవనోదరః, వైమానికగురు భూమాధిక గుణ రామానుజ కృతధామాకర కరధామారి దరలలామాచ్ఛకనక దామాయిత నిజరామాలయ నవకిసలయమయ తోరణమాలాయిత వనమాలాధరః, కాలాంబుద మాలానిభ నీలాలక జాలావృత బాలాబ్జ సలీలామల ఫాలాంకసమూలామృత ధారాద్వయావధీరణ ధీరలలితతర విశదతర ఘన ఘనసార మయోర్ధ్వపుండ్ర రేఖాద్వయరుచిరః, సువికస్వర దళభాస్వర కమలోదర గతమేదుర నవకేసర తతిభాసుర పరిపింజర కనకాంబర కలితాదర లలితోదర తదాలంబ జంభరిపు మణిస్తంభ గంభీరిమదంభస్తంభ సముజ్జృంభమాణ పీవరోరుయుగళ తదాలంబ పృథుల కదలీ ముకుల మదహరణజంఘాల జంఘాయుగళః, నవ్యదల భవ్యమల పీతమల శోణిమలసన్మృదుల సత్కిసలయాశ్రుజలకారి బల శోణతల పదకమల నిజాశ్రయ బలబందీకృత శరదిందుమండలీ విభ్రమదాదభ్ర శుభ్ర పునర్భవాధిష్ఠితాంగుళీగాఢ నిపీడిత పద్మావనః, జానుతలావధి లంబ విడంబిత వారణ శుండాదండ విజృంభిత నీలమణిమయ కల్పకశాఖా విభ్రమదాయి మృణాళలతాయిత సముజ్జ్వలతర కనకవలయ వేల్లితైకతర బాహుదండయుగళః, యుగపదుదిత కోటి ఖరకర హిమకర మండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తుంగిత శృంగాపర బాహుయుగళః, అభినవశాణ సముత్తేజిత మహామహా నీలఖండ మదఖండన నిపుణ నవీన పరితప్త కార్తస్వర కవచిత మహనీయ పృథుల సాలగ్రామ పరంపరా గుంభిత నాభిమండల పర్యంత లంబమాన ప్రాలంబదీప్తి సమాలంబిత విశాల వక్షఃస్థలః, గంగాఝర తుంగాకృతి భంగావళి భంగావహ సౌధావళి బాధావహ ధారానిభ హారావళి దూరాహత గేహాంతర మోహావహ మహిమ మసృణిత మహాతిమిరః, పింగాకృతి భృంగార నిభాంగార దళాంగామల నిష్కాసిత దుష్కార్యఘ నిష్కావళి దీపప్రభ నీపచ్ఛవి తాపప్రద కనకమాలికా పిశంగిత సర్వాంగః, నవదళిత దళవలిత మృదులలిత కమలతతి మదవిహతి చతురతర పృథులతర సరసతర కనకసరమయ రుచిరకంఠికా కమనీయకంఠః, వాతాశనాధిపతి శయన కమన పరిచరణ రతిసమేతాఖిల ఫణధరతతి మతికరవర కనకమయ నాగాభరణ పరివీతాఖిలాంగా వగమిత శయన భూతాహిరాజ జాతాతిశయః, రవికోటీ పరిపాటీ ధరకోటీ రవరాటీ కితవీటీ రసధాటీ ధరమణిగణకిరణ విసరణ సతతవిధుత తిమిరమోహ గార్భగేహః, అపరిమిత వివిధభువన భరితాఖండ బ్రహ్మాండమండల పిచండిలః, ఆర్యధుర్యానంతార్య పవిత్ర ఖనిత్రపాత పాత్రీకృత నిజచుబుక గతవ్రణకిణ విభూషణ వహనసూచిత శ్రితజన వత్సలతాతిశయః, మడ్డుడిండిమ ఢమరు జర్ఘర కాహళీ పటహావళీ మృదుమద్దలాది మృదంగ దుందుభి ఢక్కికాముఖ హృద్య వాద్యక మధురమంగళ నాదమేదుర నాటారభి భూపాళ బిలహరి మాయామాళవ గౌళ అసావేరీ సావేరీ శుద్ధసావేరీ దేవగాంధారీ ధన్యాసీ బేగడ హిందుస్తానీ కాపీ తోడి నాటకురుంజీ శ్రీరాగ సహన అఠాణ సారంగీ దర్బారు పంతువరాళీ వరాళీ కళ్యాణీ భూరికళ్యాణీ యమునాకళ్యాణీ హుశేనీ జంఝోఠీ కౌమారీ కన్నడ ఖరహరప్రియా కలహంస నాదనామక్రియా ముఖారీ తోడీ పున్నాగవరాళీ కాంభోజీ భైరవీ యదుకులకాంభోజీ ఆనందభైరవీ శంకరాభరణ మోహన రేగుప్తీ సౌరాష్ట్రీ నీలాంబరీ గుణక్రియా మేఘగర్జనీ హంసధ్వని శోకవరాళీ మధ్యమావతీ జేంజురుటీ సురటీ ద్విజావంతీ మలయాంబరీ కాపీపరశు ధనాసిరీ దేశికతోడీ ఆహిరీ వసంతగౌళీ సంతు కేదారగౌళ కనకాంగీ రత్నాంగీ గానమూర్తీ వనస్పతీ వాచస్పతీ దానవతీ మానరూపీ సేనాపతీ హనుమత్తోడీ ధేనుకా నాటకప్రియా కోకిలప్రియా రూపవతీ గాయకప్రియా వకుళాభరణ చక్రవాక సూర్యకాంత హాటకాంబరీ ఝంకారధ్వనీ నటభైరవీ కీరవాణీ హరికాంభోదీ ధీరశంకరాభరణ నాగానందినీ యాగప్రియాది విసృమర సరస గానరుచిర సంతత సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందః శ్రీమదానందనిలయ విమానవాసః, సతత పద్మాలయా పదపద్మరేణు సంచితవక్షస్తల పటవాసః, శ్రీశ్రీనివాసః సుప్రసన్నో విజయతాం శ్రీ^^అలర్మేల్మంగా నాయికాసమేతః శ్రీశ్రీనివాస స్వామీ సుప్రీతః సుప్రసన్నో వరదో భూత్వా, పవన పాటలీ పాలాశ బిల్వ పున్నాగ చూత కదళీ చందన చంపక మంజుళ మందార హింజులాది తిలక మాతులుంగ నారికేళ క్రౌంచాశోక మాధూకామలక హిందుక నాగకేతక పూర్ణకుంద పూర్ణగంధ రస కంద వన వంజుళ ఖర్జూర సాల కోవిదార హింతాల పనస వికట వైకసవరుణ తరుఘమరణ విచుళంకాశ్వత్థ యక్ష వసుధ వర్మాధ మంత్రిణీ తింత్రిణీ బోధ న్యగ్రోధ ఘటవటల జంబూమతల్లీ వీరతచుల్లీ వసతి వాసతీ జీవనీ పోషణీ ప్రముఖ నిఖిల సందోహ తమాల మాలా మహిత విరాజమాన చషక మయూర హంస భారద్వాజ కోకిల చక్రవాక కపోత గరుడ నారాయణ నానావిధ పక్షిజాతి సమూహ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర నానాజాత్యుద్భవ దేవతా నిర్మాణ మాణిక్య వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగ పద్మరాగేంద్ర నీల ప్రవాళమౌక్తిక స్ఫటిక హేమ రత్నఖచిత ధగద్ధగాయమాన రథ గజ తురగ పదాతి సేనా సమూహ భేరీ మద్దళ మురవక ఝల్లరీ శంఖ కాహళ నృత్యగీత తాళవాద్య కుంభవాద్య పంచముఖవాద్య అహమీమార్గన్నటీవాద్య కిటికుంతలవాద్య సురటీచౌండోవాద్య తిమిలకవితాళవాద్య తక్కరాగ్రవాద్య ఘంటాతాడన బ్రహ్మతాళ సమతాళ కొట్టరీతాళ ఢక్కరీతాళ ఎక్కాళ ధారావాద్య పటహకాంస్యవాద్య భరతనాట్యాలంకార కిన్నెర కింపురుష రుద్రవీణా ముఖవీణా వాయువీణా తుంబురువీణా గాంధర్వవీణా నారదవీణా స్వరమండల రావణహస్తవీణాస్తక్రియాలంక్రియాలంకృతానేకవిధవాద్య వాపీకూపతటాకాది గంగాయమునా రేవావరుణా
శోణనదీశోభనదీ సువర్ణముఖీ వేగవతీ వేత్రవతీ క్షీరనదీ బాహునదీ గరుడనదీ కావేరీ తామ్రపర్ణీ ప్రముఖాః మహాపుణ్యనద్యః సజలతీర్థైః సహోభయకూలంగత సదాప్రవాహ ఋగ్యజుస్సామాథర్వణ వేదశాస్త్రేతిహాస పురాణ సకలవిద్యాఘోష భానుకోటిప్రకాశ చంద్రకోటి సమాన నిత్యకళ్యాణ పరంపరోత్తరోత్తరాభివృద్ధిర్భూయాదితి భవంతో మహాంతోzనుగృహ్ణంతు, బ్రహ్మణ్యో రాజా ధార్మికోzస్తు, దేశోయం నిరుపద్రవోzస్తు, సర్వే సాధుజనాస్సుఖినో విలసంతు, సమస్తసన్మంగళాని సంతు, ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, సకలకళ్యాణ సమృద్ధిరస్తు ‖
హరిః ఓం ‖
🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏
🙏 *వరలేఖరి.నరసింహశర్మ*🙏
శ్రీ రాముని గొప్ప దనం :-
*రాముడిలో* *ఏమంత* *గొప్పదనం* *ఉంది* ?
మాయలు మంత్రాలు చూపించలేదు.
విశ్వరూపం ప్రకటించలేదు.
జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు...
చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు...
పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు...
తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు...
కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు...
అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస వధ చేశాడు...
అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు.
లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు…
అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?
ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.
💠 శాస్త్ర ధర్మం :-
తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.
💠 స్నేహ ధర్మం :-
మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పుతిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.
💠 యుద్ధ ధర్మం :-
వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.
రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు
మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం | క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||
‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన.
💠 దయా ధర్మం :-
సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్యబహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా.. అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు.
💠 మనుష్య ధర్మం :-
రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు.
‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’
అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.
💠 సోదర ధర్మం :-
రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ, సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ.. పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.
పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి.. కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం. రాముడూ అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే శ్రీరామజయరామ జయజయ రామ
🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏 🙏🙏
*ప్రమాదం కాపుకాసుకుని ఉంది*.
ఈ నాలుగు మాటలు చదవండి! ఆచరించండి! జాగ్రత్తగా ఉండండి!
అందరికీ నమస్కారం🙏
*మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టు ప్రక్కల కరోనా మహమ్మారి దాక్కుని ఉంది.*
ఒక సర్వే ప్రకారం.....
*మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం.
టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు లక్షల్లో మనమధ్యే ఉన్నారు.
*అందుచేత.....*
*దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి!
*తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి!* *చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి!
*ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి!*
ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి! *చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి*!
*ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి!
*అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ అనవసరవిషయాలు మాట్లాడకండి!*
*వారు మొహమాటంతో, అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా, మీరు వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.
*వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా, మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి!అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు*
*మీరు వారికి ఎంత ప్రాణ స్నేహితులైనా కావచ్చు!
లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు! వారిని ఎట్టి పరిస్థితుల్లో కలవండి!
*ఇక ఇరుగుపొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి!*
*అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి!
*ఇచ్చి పుచ్చుకోవడాలు కొంతకాలం ఆపేయండి*.
*ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి!
*స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి*.
*ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
*అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి!*
*వాకింగ్ కూడా మానేయండి! ఇంట్లోనే యోగ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి!
*నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. అదే ఇరువురికి క్షేమదాయకం.*
ఇవి యదార్ధములుగా భావించి ఆచరించి, ఆరోగ్యంగా ఉండండి!
*సమస్త లోకా: సుఖినో భవంతు*!
"ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రామాణికంగా తీసుకొని చేపట్టిన సర్వేలో రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల్లో దాదాపు 19 లక్షల రేషన్ కార్డుల్లో కోత విధించింది. పౌరసరఫరాల శాఖ వర్గాల సమాచారం ప్రకారం ఈ సంఖ్య 20 లక్షలకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో కుటుంబంలో ఒక్కో కార్డుకు ముగ్గురు చొప్పున లెక్కేసిన రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మందికి వచ్చే నెల నుండి బియ్యం, ఇతర సరుకుల పంపిణీ నిలిచిపోనుంది.
అధికారికంగా ప్రభుత్వం నుండి దీనికి సంబంధించిన సమాచారం అందాల్సి ఉంది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ సంఖ్యలో రేషన్ కార్డుల్లో కోత విధించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రజలకు రేషన్ కార్డుల స్థానంలో బియ్యం కార్డులను పంపిణీ చేయనుంది. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను, ఆదాయపు పన్ను చెల్లించేవారిని, నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వారిని, 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నవారిని, నాలుగు చక్రాల వాహనాలు ఉన్నవారిని అనర్హులుగా తేల్చింది.
ఈ నెల 2వ తేదీ వరకు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించటంతో పాటు ఇప్పటికే తుది జాబితాను రూపొందించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుండి బియ్యం కార్డుల పంపిణీ జరగనుంది. కార్డుదారుల వివరాలను గ్రామ సచివాలయాలు, క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. కొత్త బియ్యం కార్డులు ఉన్నవారికి మాత్రమే మార్చి నెల నుండి బియ్యం పంపిణీ జరగనుంది. అధికారులు మాత్రం అర్హులై బియ్యం కార్డు మంజూరు కాకపోతే ధరఖాస్తులు తీసుకొని కొత్త కార్డులు ఇస్తామని చెబుతున్నారు.
ప్రభుత్వం భారీ సంఖ్యలో రేషన్ కార్డుల్లో కోత విధించటంపై ప్రజల నుండి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించాలని ప్రజల నుండి డిమ�
No comments:
Post a Comment