శ్రీ కృష్ణ మహత్యం.. మల్లప్రగడ
కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీ, గోపస్త్రీ పరివేష్టితో విజయతే.
శ్రీకృష్ణుడు అంటే హిందూమతానికి, హిందూధర్మానికి అంతరాత్మ లాంటివాడు. కృష్ణుడు, రాముడు గుర్తురాకుండా హిందూమతం గుర్తుకురాదనే చెప్పవచ్చును. అంతేకాదు నవభారత నిర్మాణానికి మూలపురుషుడుగా శ్రీకృష్ణుడు భారతదేశ చరిత్రకే కధానాయకుడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడుగా జన్మించాడు. కృష్ణుడి జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి సంతానంగా ఎనిమిదో గర్భంలో జన్మించాడు.
దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన లీల ద్వారా భక్తి, జ్ఞానం, యోగం, మోక్షాల గురించి ప్రపంచానికి తెలియజేశారు శ్రీకృష్ణపరమాత్మ. దుర్గుణాలను వదిలి.. ధర్మమార్గాన్ని అనుసరించి జీవితానికి సార్థకత ఏర్పరచుకోవాలని దివ్యోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు.చెప్పడం మాత్రమే కాదు.. అనుసరించి చూపించారు. అందుకే వాసుదేవుడి బోధనలకు విలువ ఎక్కువ.
ఈ కృష్ణాష్టమి పర్వదినాన్ని దేశంలో అందరూ ఒకే రోజు కాకుండా వేరు వేరుగా ఎందుకు చేసుకుంటారు పరిశీలిద్దాం! స్మార్ధులు :- వీరిని రెండు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు: - (1) వైదికులు - వేదాలు నేర్చుకొని పఠించువారు, (2) నియోగులు - ఆయా రాజులు వీరిని అధికారిక స్థానాలలో ఉద్యోగులుగా నియమించబడినవారు. స్మార్ధులు అంటే జగద్గురు ఆది శంకరాచార్యునికి చెందిన అనుచరులు అని అనుకోవచ్చును. వైష్ణవులు :- కేవలం విష్ణువుయందు మాత్రమే భక్తిని కలిగినవారు. పొరుగు రాష్ట్రం తమిళనాడు నుండి విశిష్ఠాద్వైతము అనుసరించే రామానుజాచార్యుడి అనుచరులు అయిన శ్రీ వైష్ణవం ఇతర ముఖ్యమైన శాఖ సమూహాలలో ఒకటి అయినది. వీరినే శ్రీ వైష్ణవులు అని అంటారు. ఈ కృష్ణాష్టమిని ఇందులో కొందరు 'అష్టమి' తిధిని అనుసరించి జరుపుకుంటే ఇంకొందరు 'రోహిణి' నక్షత్రం ఉన్న రోజు జన్మాష్టమిని జరుపుకుంటారు. ఇష్కాన్ సాంప్రదాయ ప్రకారం సూర్యోదయంతో అష్టమి తిధి ఉన్న రోజు ఇస్కాన్ వారు వేడుక జరుపుకుంటారు
కృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ వంటకాలను తయారు చేస్తారు. శ్రీ కృష్ణుడు అర్ధరాత్రి తర్వాత జన్మిస్తాడు. అప్పుడు భక్తులు నూతన దుస్తులు ధరించి 56 భోగ సమర్పణలు చేస్తారు. ఈ పండుగ రోజు ఈ సంప్రదాయం ఎందుకు పాటిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
పెంచిన తల్లిదండ్రులు యశోద, నందుడితో కలిసి కృష్ణుడు గోకులంలో నివసించేటప్పుడు అతని తల్లి ప్రతి ఎనిమిది పహార్లకు అంటే రోజుకు 8 సార్లు భోజనం తినిపించేది. ఒకసారి ప్రజలు ఇంద్రుడిని ఆరాధించేందుకు పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణుడు ఈ కార్యక్రమం ఎందుకు అని నందుడును అడుగుతాడు. ఇంద్రుడును పూజిస్తే ఆయన సంతోషించి వర్షాలు బాగా కురిపిస్తాడని, ఫలితంగా పంటలు బాగా పండుతాయని కన్నయ్యకు బదులిచ్చాడు
ఇంద్రుడు పని వర్షం కురిపించడమైతే ఆయనకు ఎందుకు పూజలు చేయడం అని నందుడితో కృష్టుడు అంటాడు. మీరు పూజించాలనకుంటే గోవర్ధన పర్వతాన్ని ఆరాధించండి. ఎందుకంటే ఇది పండ్లు, కూరగాయలు, జంతువులకు మేత ఇస్తుందని చెబుతాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ కృష్ణుడి మాట విని ఇంద్రుడిని ఆరాధించకుండా గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారు. దీంతో ఇంద్రుడు అవమానంగా భావించి బృందావన వాసులపై కోపోద్రిక్తుడవుతాడు.
ఆగ్రహంతో ఇంద్రుడు బృందావనంలో భారీ రాళ్ల వర్షం కురిపిస్తాడు. ఈ కారణంగా ప్రతి చోటా రాళ్లతో పాటు నీరు ఉప్పొంగుతుంది. ఈ దృశ్యాన్ని చూసి బృందావన వాసులు భయానికి లోనయ్యారు. అప్పుడు శ్రీ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి బృందావనాన్ని రక్షిస్తాడు. ఏడు రోజుల పాటు గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తి ఉంచి ప్రజలను కాపాడుతాడు. 8వ రోజు వర్షం ఆగిపోయింది. ఇంద్రుడు ఓటమిని అంగీకరించాడు. అనంతరం బృందావనవాసులు పర్వతం నుంచి బయటకు వచ్చారు. అప్పటి వరకు కృష్ణుడు ఏమి తినలేదని భావించిన వారు తమను రక్షించినందుకు గాను 56 రకాల వంటకాలను సిద్ధం చేస్తారు. రోజుకు 8 సార్లు చొప్పున ఏడు రోజుల పాటు ఈ 56 వంటకాలను కన్నయ్యకు తినిపించేవారు. మధవుడు కూడా వీటి ఎంతో ఇష్టంగా తినేవాడట.
చాలా మంది భక్తులు 56 వంటకాల్లో 20 రకాల స్వీట్లు, 16 రకాల కారాలతో కూడిన వంటలు, 16 రకాల డ్రై ఫ్రూట్లను అందిస్తారు. అయితే 56 వంటకాల్లో వెన్న, పిస్తా, లడ్డు, ఖీర్, బాదంపాలు, రసగుల్లా, జిలేబీ, జీడిపప్పు, యాలకు, గుమ్మడి కాయలు లాంటి పలు రకాల పదార్థాలు ఉంటాయి. కూరగాయాల్లో వంకాయ, ఆకుకూరలు, కుడుములు, పెరుగు, బియ్యం, ఖిచ్డి, పప్పు కూర, అప్పడాలు లాంటి మన దైనందీన ఆహారాలు కూడా ఈ 56 వంటకాల్లో భాగంగా ఉంటాయి. కృష్ణాష్టమి పూజలో భాగంగా గుమ్మం దగ్గరి నుంచి.. పూజ మంటపం వరకు శ్రీ కృష్ణ పాదాలను వేస్తుంటారు. అసలు ఇలా వేయడం వెనక ఉన్న అంతరార్థం ఏమిటి? ఇలా చేయడం వల్ల తమ ఇంట్లోకి సుఖసంతోషాలు ప్రవేశిస్తాయని నమ్ముతారు. అలాగే పాదాలను బయట నుంచి లోపలికి వస్తున్నట్టుగా వేస్తారు. పూజా మందిరాన్ని మన అంతరంగంగా భావిస్తే.. కృష్ణ పాదాలు మన అంతరంగాన్ని తెలుసుకొనేలా చేసే దిక్సూచిగా చెబుతారు.
కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతారు. దీన్నే ఉత్తర భారతంలో ‘దహీ హండి’ అని పిలుస్తారు. మట్టి కుండలో పెరుగు, పాలు, చిల్లరడబ్బులు సేకరించి దాన్ని ఉట్టిలో పెట్టి.. ఆ తర్వాత పొడవైన తాడు కట్టి ఒకరు పైకి కిందకు లాగుతుంటే.. మరొకరు కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒక్కరిగా కొట్టడం విఫలమైతే సమష్టిగా దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు. చేయీ చేయీ కలిపి ఒకరి భుజాలపై మరొకరు ఎక్కి దాన్ని పగలగొడతారు. ఈ ప్రయత్నాన్ని చెడగొట్టడానికి ముఖాలపై వసంతం నీళ్లు పోస్తుంటారు. అయినా పట్టు వదలకుండా ఉట్టి కొడతారు. దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటంటే.. సమష్టిగా కృషి చేస్తే ఎంతటి అవరోధాన్నైనా అధిగమించవచ్చు. కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడానికి ఉన్న మరో కారణం చిన్నతనంలో గోపాల కృష్ణుడు ఉట్టిపై దాచిన వెన్న కుండలను పగలగొట్టి.. దాన్ని గోప బాలకులకు పంచిపెట్టేవాడు. నలుగురితో పంచుకోవడంలో ఉన్న ఆనందమేమిటో లోకానికి చాటి చెప్పాడు. దాన్ని స్మరించుకుంటూనే ఉట్టి కొడతారు. అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్ఞానమనే నల్లటి కుండను బద్దలుకొట్టి మానవులలో జ్ఞానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ ఉంటారు. ఆ కుండ మానవశరీరము అనుకుంటే ఆ కుండ లోని నీరు అహంకారం. ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు. కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రధసారధియై అర్జునిలో ఏర్పడిని అజ్ఞాననాంధకారాన్ని తొలగించుటకు ” విశ్వరూపాన్ని ” చూపించి గీతను బోధించి, తద్వారా మానవళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించాడు. ఇలా కృష్ణతత్వాన్ని కొనియాడి చెప్పుటకు వేయి తలలు కలిగిన ఆదిశేషునకే సాధ్యముకాదని చెప్పగా! అట్టి శ్రీకృష్ణ భగవానుని జ్ఞానబోధతో అందించిన ‘ గీతామృతం ‘ మనకు ఆదర్శప్రాయం.
చివరగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా "నీ కర్తవ్యాన్ని నీవు చిత్త శుద్ధితో నిర్వహించు పలితాన్ని నాకు వదిలేయి"..అనే మాటను ఆచరణ లో పెడితే మనమందరం సుఖం గా జీవించవచ్చు.......
[30/08, 7:21
శ్రీకృష్ణుని జనన సమయంలో జరిగిన అద్భుతాలు
గ్రహ నక్షత్రతారకలన్నీ సౌమ్యులై వెలిగిన మహాద్భుత క్షణం . శ్రావణమాసం.. కృష్ణపక్షం, అష్టమి, అర్ధరాత్రి రోహిణీ నక్షత్రయుక్త వృషభలగ్నంలో కృష్ణుడు జన్మించాడు.
సకలలోకాలకూ మంగళప్రద మైన సమయం అది. కృష్ణుడు అవతరించగానే దేవ దుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. గంధర్వులు గానం చేశారు. విద్యాధరాంగనలు, అప్సరసలు నాట్యం చేశారు. పరిమళభరితంగా గాలి వీచింది. సకలప్రాణి కోటీ సంతోషించింది. ఎందుకు ఆ సంతోషం అన్నది అంతుచిక్కలేదెవరికీ.
శంఖం, చక్రం, గద మొదలయిన ఆయుధాలు ధరించిన నాలుగు చేతులతోనూ, శిరస్సున మణిమయ కిరీటంతోనూ, మెడలో కౌస్తుభమణితోనూ, చేతులకు కేయూరాది భూషణాలతోనూ, వక్షస్థలాన శ్రీవత్సం పుట్టుమచ్చతోనూ, పద్మపత్రాలవంటి నేత్రాలతోనూ, వెలుగులు విరజిమ్ముతున్న ముఖబింబంతోనూ, పట్టువస్త్రంతోనూ, సకల జగత్తునూ సమ్మోహింపజేసే నీల మోహనరూపంతోనూ జన్మించిన శిశువును చూసి దేవకీ వసుదేవులు దిగ్భ్రాంతి చెందారు. ఆ తేజస్సును తట్టుకోలేకపోయారు.
కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసుకుని నిల్చున్న వసుదేవునికి అప్పుడు తెలిసింది, తనకి జన్మించింది విష్ణుమూర్తి అని. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. విష్ణుమూర్తికి ప్రణమిల్లాడు. అనేక విధాల స్తోత్రం చేశాడతన్ని. అవతారమూర్తిగా తన కడుపున జన్మించిన విష్ణుమూర్తిని చూసి చేతులు జోడించింది దేవకి. నమస్కరించిందతనికి. అనేక విధాల కీర్తించింది. పూర్వజన్మ సుకృతం కారణంగానే భగవంతుణ్ణి కన గలిగాననుకున్నది.
[
*కృష్ణం వందే జగద్గురుమ్*
శ్రీకృష్ణుడి జీవితాన్ని అనుశీలిస్తుంటే మనం ఎంతో ఆశ్చర్యానికి లోనవుతాం. కళ్లు తెరిచింది కటకటాల్లో... ఊపిరి పీల్చింది అపాయాల్లో... బతుకు గడిచింది గండాల్లో... చివరకు చరమ దశా పరమ చేదే! కాలి బొటన వేలికి వేటగాడి బాణం నాటుకొని ప్రాణాలు తోడేస్తుంటే... బొట్టు బొట్టుగా నెత్తురు స్రవించి కడకు దేహం నిర్జీవంగా నేలకూలిపోవడమంటే- బతుక్కి ఎంత విషాదభరితమైన ముగింపు! ఏమనాలి ఆ జాతకాన్ని?
చిత్రం ఏమంటే- అదే జాతకుడి చిరు కర స్పర్శ మృతశిశువు పరీక్షిత్తుకు ప్రాణం పోసింది. కురూపి కుబ్జను అద్భుత సౌందర్యరాశిని చేసింది. కన్ను తెరవలేని స్థితిలో అంపశయ్యపై మేను వాల్చిన భీష్మ పితామహుడి చేత గొప్పగా ధర్మబోధ చేయించి లోకం కళ్లు తెరిపించింది.
ఆశ్చర్యం ఏమంటే- ఆయనను నమ్ముకున్న వారంతా రకరకాల చిక్కుల్లోంచి, అపాయాల్లోంచి, పెను గండాల్లోంచి ఆయన అండతోనే క్షేమంగా బయటపడ్డారు. ‘నీలో లేని చోద్యాలు ఈ లోకంలోనే ఉండవు సుమా! అసలు చోద్యం అంటే నువ్వే...’ అని ఆశ్చర్యపోయాడు భాగవతంలో అక్రూరుడు. కోరికతో, భయంతో, భక్తితో, బంధంతో, ప్రేమతో, కోపంతో, స్నేహంతో... ఏదో రకంగా తనను పొందమని ప్రోత్సహించాడాయన. అలా పొందినవారందరినీ అందలాలెక్కించాడు. ముక్తిని ప్రసాదించాడు.
భాగవత కృష్ణుడు రసజ్ఞ మనోజ్ఞ మూర్తి. భారత కృష్ణుడు (అ)లౌకిక విశేష ప్రజ్ఞానిధి. రెండూ సర్వ సమగ్ర వ్యక్తిత్వాలే! ‘కృష్’ అనే ధాతువుకు ఆకర్షించేదని అర్థం. కృష్ణుడి భారత భాగవత వ్యక్తిత్వాలు రెండూ పరమ ఆకర్షణీయమైనవే. భారత కృష్ణుడు ధీరోదాత్తుడు. సమీపించాలంటే సందేహం పుట్టించే గంభీరమూర్తి. మొదట్లో రాజనీతిజ్ఞుడిగా, వ్యూహ చతురుడిగా... గీతాచార్యుడిగా మారాక, అనన్య సామాన్య వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, స్ఫూర్తిదాతగా, నేతగా ప్రౌఢమైన వ్యక్తిత్వం భారత కృష్ణుడిలో మనకు పరిచయం అవుతుంది. ముక్క చెక్కలైన చిన్ని చిన్ని రాజ్యాలను ఒక్క ఛత్రం కిందకు తెచ్చి, కేంద్ర రాజ్య వ్యవస్థను నిర్మించి, దేశాన్ని బలోపేతం చేసిన రాజ్యాంగ నాయక నిర్మాతగా భారత కృష్ణుడి పాత్ర ఆలోచనా రమణీయం.
నీలి వెన్నెలలు, వేణుగానాలు, వన విహారాలు, దాగుడు మూతలు, రాసలీలలు... వీటి అన్నింటి రమణీయ రసానుభూతులను గోపికలకే కాదు, మనకూ పంచిన ఆర్ద్ర మనోహర ఆప్తసఖుడు భాగవత కృష్ణుడు. చిలిపి చేష్టల ముసుగులో అఖండ చిన్మయ తత్త్వాన్ని ఆవిష్కరించి ‘కృష్ణమాయ’లో ముంచెత్తిన చిత్తచోరుడు, ధీర లలితుడు. భాగవత కృష్ణుడు. ధీరోదాత్తుడైన భారత కృష్ణుణ్ని అధ్యయనం చేయడమంటే- విశ్వరూప సందర్శన భాగ్యాన్ని అన్వేషించడం. ధీర లలితుడైన భాగవత కృష్ణుణ్ని ఆస్వాదించడమంటే- మనిషి తన అంతర లోకాల్లోకి ప్రయాణించడం. ఇవి విభిన్న అభిరుచులకు చెందిన సంస్కార విశేషాలు. మనిషిలోని స్త్రీ ప్రకృతి- భాగవత కృష్ణుణ్ని ఆరాధిస్తుంది. పురుష ప్రకృతి- భారత కృష్ణుణ్ని ఆవాహన చేసుకోవాలని ఆశిస్తుంది.
కృష్ణాష్టమిని- గోకులాష్టమిగాను, కృష్ణజయంతిగాను రెండు రకాలుగా వ్యవహరించడంలో రహస్యం ఏమంటే- మొదటిది భాగవత కృష్ణుడికి చెందినది. అది అనుభూతి ప్రధానం. రెండోది, భారత కృష్ణుడికి సంబంధించినది. అది ఆలోచనామృతం. ఆలోచన, అనుభూతి ఏకమైన మనిషికి ‘రాసయోగం’ సిద్ధించడమే కృష్ణ ఆరాధనకు పరమ గమ్యం!
✍️ఎర్రాప్రగడ రామకృష్ణ,రాజమండ్రి
[
*గాంధారి శాపం*
కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు అందరూ హతమయ్యారు. ఐశ్వర్యం పోయింది. బంధువులంతా నాశనమయ్యారు. "ఇంత దారుణం జరిగినా చావురాలేదు నాకు" అని వాపోయాడు ధృతరాష్ట్రుడు.
వ్యాసమహాముని ధృతరాష్ట్రుణ్ణి ఓదారుస్తూ, "నాయనా! ఎవ్వరి ప్రాణాలూ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనస్సుకు బాగ పట్టించుకున్నావంటే ఇంక నీకే దుఃఖం వుండదు. ఇప్పుడు విచారిస్తున్నావు కాని , జూదమాడేనాడు విదురుడెంత చెప్పినా విన్నావా? దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా?" అన్నాడు.
"రాజా! ఒకనాడు దేవసభకు వెళ్ళాను నేను. దేవతలతో, మహామునులతో మట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ వచ్చిందక్కడికి.
'నా భారం తొలగిస్తానని మీరంతా బ్రహ్మసభలో ప్రతిజ్ఞలు పలికారు. ఇప్పుడిలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలీడం లేదు. ఇంక నా భారం తొలిగే మార్గమేమిటి?' అని దేవతలను ప్రశ్నించిందామె.
'ధృతరాష్ట్రుడనే రాజుకు నూరుగురు కొడుకులు పుడతారు. వాళ్ళలో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల నీ భారమంతా నశిస్తుంది. వాణ్ణి చంపడానికీ, రక్షించడానికీ ముందుకు వచ్చి భూమిమీద వున్న రాజులంతా సేనలతో సహా కురుక్షేత్రంలో హతులవుతారు. ఆ దుర్యోధనుడు కూడా తమ్ములతో పాటు మరణిస్తాడు. అంతటితో నీ భారం తీరిపోతుంది. వెళ్ళు! నిశ్చింతగా భూతధారణం చెయ్యి ' అన్నాడు నారాయణుడు చిరునవ్వుతో.
"విన్నావు కదా రాజా! మరి కౌరవులు నాశనమయ్యారంటే ఆశ్చర్యమేముంది! విధిని ఎవరు తప్పిస్తారు?"
ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని గాంధారినీ, కుంతినీ, కోడళ్ళనూ వెంటపెట్టుకుని యుద్ధభూమికి బయలుదేరాడు.
పెదతండ్రి వస్తున్నాడని తెలిసి ధర్మనందనుడు ముందే అక్కడికి వెళ్ళాడు. అతని వెంట తమ్ములూ ద్రౌపదీ కృష్ణుడూ కూడా వున్నారు.
ధర్మరాజు కంటపడగానే ధృతరాష్ట్రుడి కోడళ్ళందరూ బిగ్గరగా ఏడ్చారు. దుఃఖంతో, అవేశంతో పేరుపేరునా పాండవులందర్నీ నిందించారు.
కళ్ళనీళ్ళు కారుస్తూ మౌనంగా తల వంచుకున్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించాడు. తరువాత పాండవులు కృష్ణసహితంగా వెళ్ళి గాంధారికి నమస్కరించారు.
కోపంతో మండిపడిందామె.
"శత్రువుల్ని చంపొచ్చు. కాని ఈ గుడ్డివాళ్ళిద్దరికీ ఊతకర్రగా ఒక్కణ్ణయినా మిగల్చకుండా అందర్నీ నాశనం చేశారే! మీకు అపకారం చెయ్యనివాడు వందమందిలో ఒక్కడైనా లేకపోయాడా? ఒక్కణ్ణి అట్టేపెడితే మీ ప్రతిజ్ఞ భంగమౌతుందా? అ ఒక్కడూ మిమ్మల్ని రాజ్యం చెయ్యనివ్వకుండా అడ్డగిస్తాడా? ఇంతకూ ఏడీ మీ మహారాజు?" ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది.
అజాతశత్రుడు మోకరిల్లాడు. గాంధారి తలవంచి దీర్ఘంగా నిట్టూర్చింది. నేత్రాలను బంధించిన వస్త్రం సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి లిప్తపాటు ధర్మరాజు కాలిగోళ్ళ మీద పడింది. ఆ గోళ్ళు వెంటనే ఎర్రగా కందిపోయాయి. అది చూసి హడలిపోయి కృష్ణుడి వెనకాల దాగాడు అర్జునుడు.
మహాజ్ఞానీ, సంయమనం కలదీ కనుక గాంధారి కోపాన్ని శమింప చేసుకుని "నాయనా! వెళ్ళి కుంతీదేవిని చూడండి" అంది.
కానీ ఇంతటికీ కారణమైన కృష్ణుడి పట్ల ఆమె క్రోధం కట్టలుతెంచుకుంది.
"వాసుదేవా! ఇలా రావయ్యా" అని పిలిచింది గాంధారి.
"కృష్ణా! కౌరవ పాండవ కుమారులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చచెప్పకపోయావు. కదన రంగాన కాలూనినప్పుడూ నువ్వు అడ్డుపడకపోయవు. సమర్ధుడవై వుండి కూడా ఉపేక్ష చేశావు. అందర్నీ చంపించావు. దేశాలన్నీ పాడుబెట్టావు. జనక్షయానికి కారకుడైన జనర్థనా! దీని ఫలం నువ్వు అనుభవించవలసిందే. నా పాతివ్రత్య పుణ్యఫల తపశ్శక్తితో పలుకుతున్నాను - నువ్వు వీళ్ళందర్నీ ఇలా చంపావు కనుక ఈనాటికి ముప్ఫై ఆరో సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీళ్ళలాగే పరస్పరం కలహించుకుని చస్తారు. అదే సమయాన నువ్వు దిక్కులేక నీచపు చావు చస్తావు. మీ కుల స్తీలు కూడా ఇలాగే అందర్నీ తలుచుకుని ఏడుస్తారు. ఇది ఇలాగే జరుగుగాక" అని శపించిండి గాంధారి.
సమ్మోహకరంగా చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు.
"అమ్మా! ఈ శాపం యాదవులకు ఇదివరకే ఇచ్చారు కొందరు మునులు. నువ్విప్పుడు చర్చిత చర్వణం చేశావు. యదువంశీయులను దేవతలు కూడా చంపలేరు. అందుచేత వాళ్ళలో వాళ్ళే కొట్టుకుచస్తారు. పోనీలే కానీ అందువల్ల నీకేం వస్తుంది చెప్పు?" అన్నాడు నవ్వుతూనే.
పుత్రశోకంతో పరితపిస్తూ అవధులెరగని ఆక్రోశంతో అచ్యుతుని శపించిన గాంధారి జవాబు చెప్పలేక మౌనం వహించింది.
* జీవించడం ఒక కళ.
చెట్టుమీద పాకే గొంగళి పురుగు జీవించడం అంటే ఏమిటో చెబుతుంది.
అది మనిషి ముందే సీతాకోకచిలుకై ఎగిరి వెళ్తుంది.
మనిషి మనసు మాత్రం గొంగళి పురుగులా ఉండిపోతోంది. ‘ఎప్పటికైనా ఎదగాలి, ఎగరాలి’
అని ప్రణాళిక సిద్ధం చేసు కోవడంతోనే మానవుడి సమయమంతా గడచిపోతోంది.
జీవించడంలో ఎంత ఉదాత్తత, ఔన్నత్యం ఉంటాయో తెలుసుకోవాలని ప్రకృతి పలు విధాలుగా బోధిస్తోంది.
అంతటా ఒకే రకమైన ప్రేమతత్వం పంచుతున్నా- ఈ జీవితం ఎందుకో, ఎలా జీవించాలో మనిషికి ఇంకా అవగాహన కావడం లేదు.
ఏదో విధంగా బతకడమన్నది నిజమైన జీవనం అనిపించుకోదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమూ జీవనం కాదు.
బతుకు బండిని ఎలాగోలా లాగించడమన్నదే మానవుడి అంతిమ లక్ష్యం కాకూడదు.
మనము ఎక్కడి నుండి వచ్చినాము? ఎందుకు వచ్చినాము? ఏమి చే స్తున్నాం? ఏమి చేయాలి? మనము ఎక్కడికి వెళతాము ?
అనే ప్రశ్నలు మీలో తలెత్తి ,వాటి గురించి వివరంగా తెలియ జేసే జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం
చేయడ మే నిజమైన జీవితము
కాళీమాత ఆలయంలో ఓరోజు ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు.
అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు..
లడ్డూకి చీమలు పట్టడం మొదలైంది.
లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలీలేదు.
చీమలను చంపకుండా ఎలా?" అని ఆలోచనలో పడ్డారు.
వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంసను సలహా అడిగారు.
అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి. వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి,
ఇక ఇటు రావు అని సూచించారు.
పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారిలో
చక్కెర పొడి చల్లారు.
ఆ పొడిని చూడటంతోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి....
సమస్య కొలిక్కి వచ్చింది....
ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు.... "మనుషులూ ఈ చీమల్లాంటివారే.
తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే
తమకు తెలియకుండానే దానిని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటేదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు....
అని చెప్పారు.
తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని
ఒక్క చీమా ముందుకు రాలేదు.
మనం కూడా అలానే ‘భగవంతుడు సర్వస్వము’ అనుకొనే ధ్యాన సాధన మొదలు పెడతాము,
మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి
మన సాధన అంతా వృధా చేసుకొంటాము..
తీయగా ఉందన్న చక్కెరతో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు.
రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి.
లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.
........
*గరుత్మంతుడి గర్వభంగం*
ఇంద్రుని రథసారధి పేరు మాతలి. ఆ మాతలికి ఒక అందమైన, గుణవంతురాలైన కూతురు ఉంది. ఆమె పేరు గుణకేశిని. గుణకేశిని యుక్తవయస్సుకి వచ్చేసరికి ఆమెకు తగిన వరుని కోసం మాతలి పధ్నాలుగు లోకాలనూ వెతికాడు. ప్చ్! తన కూతురికి సరిపోయే జోడీ ఎవ్వరూ ఆయనకి కనిపించలేదు.
ఇదే విషయాన్ని నారదుని దగ్గర ప్రస్తావించగా... పాతాళలోకంలో ఆర్యకుడు అనే రాజుకి సుముఖుడు అనే మనవడు ఉన్నాడనీ... అతను గుణకేశినికి తగిన వరుడు కావచ్చునని సూచించాడు నారదుడు.
నారదుని సూచన మేరకు సుముఖుడిని చూసిన మాతలికి నిజంగానే అతను తన కూతురికి తగిన వరునిగా తోచాడు.
ఈ విషయం ఆర్యకునికి చెప్పగానే అతను సంతోషంతో ఉప్పొంగిపోయాడు. కానీ అంతలో ఏం గుర్తుకువచ్చిందో కానీ విచారంలో మునిగిపోయాడు. ‘మాతలీ! నీ కూతురిని మించిన సంబంధం మరేముంటుంది? కానీ నా మనవడికి ఒక గొప్ప ఆపద పొంచి ఉంది. విష్ణుమూర్తి వాహనమైన ఆ గరుత్మంతుడు మా జాతి మీద పగపట్టిన విషయం తెలిసిందే కదా! అతని పగని చల్లార్చేందుకు మేమే స్వచ్ఛందంగా మాలో ఒకరిని అతనికి ఆహారంగా పంపుతూ వస్తున్నాము. ఇప్పటికే అలా సుముఖుని తండ్రి గరుత్మంతునికి బలైపోయాడు.
ఇక త్వరలో సుముఖుని వంతు కూడా రాబోతోంది. త్వరలో చావు మూడబోతున్న వ్యక్తికి చూస్తూ చూస్తూ నీ కూతురిని ఇచ్చి వివాహం చేయలేవు కదా!’ అని వాపోయాడు.
ఆర్యకుని విషాదం విన్న మాతలికి ఏం చేయాలో పాలుపోలేదు. అలాగని సుముఖుని వదులుకునేందుకూ మనసు ఒప్పలేదు. దాంతో సుముఖుని తీసుకుని నేరుగా దేవలోకానికి వెళ్లాడు మాతలి. అక్కడ కొలువై ఉన్న ఇంద్రునికి తన సమస్యను నివేదించాడు. మాతలి సమస్యను విన్న ఇంద్రుడు వారిని తీసుకుని విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. వైకుంఠంలో విష్ణుమూర్తి చెంత ఇంద్రుడు, మాతలి, సుముఖుడు వినమ్రంగా నిలబడి ఉండగానే... అక్కడికి ప్రవేశించాడు గరుత్మంతుడు.
అక్కడ ఏం జరుగుతోందో గమనించగానే అతని క్రోధానికి అడ్డులేకుండా పోయింది. నిప్పులు కక్కతూ- ‘ఇంద్రా! నా మాట కాదని ఈ సుమఖుని చిరాయువుగా చేసే ప్రయత్నం చేస్తావా. దగ్గరుండి ఇతని వివాహం జరిపించాలని తలపెడతావా. నా శక్తి గురించి నీకు తెలియదా! నిన్ను నేను అవలీలగా ఓడించిన రోజులు మర్చిపోయావా.
ఈ విశ్వం మొత్తాన్నీ ఒక్క ఈక మీద మోయగలను. సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే మోసే సామర్థ్యం నాకు ఉంది...’ అంటూ ఇంద్రుని వైపు దూసుకుపోయాడు.
ఇదంతా గమనిస్తున్న విష్ణుమూర్తి- ‘గరుత్మంతా! నేను ఇక్కడున్నానన్న విషయం కూడా మర్చిపోయి ప్రగల్భాలు పలుకుతున్నావే! నువ్వు అంతటి వీరుడవా? నన్ను సైతం అవలీలగా మోయగలవా! సరే నీ శక్తి ఏ పాటితో చూద్దాం ఉండు,’ అంటూ తన చేతిని గరుత్మంతుని మీద మోపాడు. అంతే! గరుత్మంతుడు ఒక్కసారిగా నేలకరిచాడు.
నోట మాటరాక చెమటలు కక్కుతూ దిక్కు తోచక మిన్నకుండిపోయాడు. విష్ణుమూర్తి తన చేతిని తీసిన తరువాత కానీ అతను ఊపిరిపీల్చకోవడం సాధ్యపడలేదు.
‘నేను నీకు మోసే అవకాశం ఇస్తున్నాను కాబట్టే నువ్వు నన్ను మోయగలుగుతున్నావు. కానీ నీ బాధ్యత గర్వంగా మారి తలకెక్కినట్లుంది. నువ్వు మోసే బరువుకంటే తలబరువే ఎక్కువగా ఉన్నట్లుంది. ఆ గర్వం తగ్గించుకుని బుద్ధిగా ఉండకపోతే ఇలాంటి పరాభవం తప్పదు,’ అంటూ హెచ్చరించాడు విష్ణుమూర్తి. దేవాదిదేవుడైన ఆ విష్ణుమూర్తి చేతిలో గర్వభంగం పొందిన గరుత్మంతుడు తన తప్పుని తెలుసుకున్నాడు. ఆ తప్పుని మన్నించమంటూ ఇంద్రుని వేడుకుని, తల వంచుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు.
[....
*భక్తి - భుక్తి - ముక్తి*
ఎంతటి జ్ఞాని అయినా మనుషులకు దూరంగా ఒంటరి జీవితం గడిపితే, ఆయన వల్ల సమాజానికి కలిగే మేలు ఏమీ ఉండదు. ప్రజలతో కలవని సాధువృత్తికి ఫలం లేదు. అజ్ఞానులు ఎప్పుడూ మూర్ఖత్వంలో పొర్లాడుతూ ఉంటారు. వాళ్లు తమను తాము గొప్పగా భావించుకుంటారు. భక్తులకు వీటితో పని లేదు. తమ సామర్థ్యాన్ని లోకోపకారానికి ఉపయోగిస్తారు. దైవభక్తుల గుణాలు ఎలా ఉంటాయి? స్కంద పురాణం వైష్ణవ ఖండం ఇలా చెబుతోంది…
ప్రశాంత చిత్తం, సౌమ్యత, జితేంద్రియత, మనోవాక్కాయాల చేతా పరులకు కీడు తలపెట్టకుండటం, దయాగుణం, పరుల ఆనందాన్ని తనదిగా భావించడం, అందరి హృదయాల్లో ఉండే వాసుదేవుణ్ని గుర్తించడం...’ అనే గుణాలు గలవాళ్లు భక్తులు! శ్రీహరి చరణారవిందాలనే సదా ధ్యానిస్తూ ఉండటం చేత, చూసేవారికి జడులుగా కనిపిస్తారు. రామకృష్ణ పరమహంస అలాగే కనబడేవాడు. మనసును, వాక్కును వినయంతో భగవంతుడికి సమర్పించడం వల్ల భక్తులు పరమశాంతంగా జీవిస్తారు. సదా భజనలతో కాలం గడుపుతారు. తానొక నీటిబొట్టు. భగవంతుడు మహాసముద్రం. ఆ మహాసముద్రంలో తాను కలిసిపోవడమే మోక్షం. భక్తుడి జీవితమే ఒక తపస్సు. ఆ మార్గంలో అతడు అనేకమై, అనంతమై, బ్రహ్మమై, తుదకు వాసుదేవుడవుతాడు.
భక్తిమార్గంలో ప్రయాణించేవారి హృదయంలో మానవత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. ‘నిరంతర కృషి, సాటివారిపై దయ చూపడం’- ఇవే మానవత్వ లక్షణాలు. ఈ సుగుణాలు లేకుండా ఉంటే 'భక్తి' ప్రదర్శన కేవలం 'భుక్తి' కోసమే. పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు, ఒంటినిండా బొట్లు మాత్రమే ఉంటే- అది 'భుక్తి' మార్గం. 'భక్తులను భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి భక్తి ఒక్కటుంటే చాలు బతికిపోవచ్చు' అని కొందరు భావిస్తుంటారు.
ఇద్దరు భక్తులు తీర్థయాత్రలకు బయలుదేరారు. నడిచీ నడిచీ అలసి సొలసి ఒక చెట్టుకింద కూర్చున్నారు. 'మిత్రమా! ఆకలి వేస్తూ ఉంది. అలా వనంలోకి వెళ్ళి తినడానికేమైనా కాయాగసరూ దొరుకుతాయేమో వెదుకుదాం పద!' అన్నాడు ఒకడు.
నాకూ ఆకలిగానే ఉంది. నేను నిజమైన భక్తుణ్ని గదా! నా తిండి సంగతి దేవుడే చూసుకుంటాడు. నాకు రాసిపెట్టి ఉంటే ఆహారం అదే నా వద్దకు నడుచుకుంటూ వస్తుంది!' అని రెండోవాడు కాళ్లు బార చాపుకొని పడుకున్నాడు. మొదటి బాటసారి రామ నామాన్ని జపిస్తూ, పరిసర ప్రాంతాల్లోని చెట్టూ చేమల్ని గాలించి, కొన్ని పండ్లు సేకరించి తెచ్చాడు. 'మిత్రమా! కొన్ని పండ్లు నువ్వు కూడా తిను!' అంటూ తానుతెచ్చిన వాటిలో సగాన్ని రెండో భక్తుడి ముందర పెట్టాడు.
అతడు సంతోషంగా వాటిని అందుకున్నాడు. 'నేను ముందే చెప్పలా... ఆ దేవుడే నాకు పంపిస్తాడు! చూశావా? ఇప్పుడీ పండ్లు అవే నడుచుకుంటూ వచ్చాయా లేదా?' అన్నాడు తన భక్తి మహత్తుకు మురిసిపోతూ.
మొదటి భక్తుడు నింపాదిగా అన్నాడు…'మిత్రమా! దేవుడు నేను కష్టపడి తెచ్చినవి నీకు ఇవ్వమనలేదు. పైగా సోమరిపోతు తనాన్ని ఏ దేవుడూ మెచ్చడు. పని చెయ్యమనే శ్రీకృష్ణుడి ఉపదేశం. కానీ... నేను దైవాన్ని కూడా ధిక్కరించి నీకు పండ్లు ఇస్తున్నాను. సాటి మనిషి ఆకలి పట్టించుకోకుండా ఒక్కడే తినడాన్ని దేవుడు హర్షించడు. ఇప్పుడు నీకు పండ్లు లభించడంలో నీ భక్తి మహిమ ఏమీ లేదు. నాలోని మానవత్వం నీకు పండ్లు ప్రసాదించింది!'
భక్తిమార్గం సమాజాన్ని సంస్కారం వైపు నడిపిస్తుంది. సంఘచైతన్యానికి పాటుపడిన భక్తులెందరో ఉన్నారు. పంజాబులో భక్తి సంప్రదాయంతోనే సిక్కుమతం ప్రారంభమైంది. ‘వీరఖల్సా’ ఉద్భవించింది. వల్లభ భక్తి సంప్రదాయకులు సైనిక శక్తిని పునరుజ్జీవింపజేయడానికి సంకీర్తన సంఘాన్ని ఏర్పాటుగావించారు. రసఖాన్ వంటి సామాజిక సమరసతా భక్తులు తయారయ్యారు. హిందీ భాషీయులు ‘రామచరిత మానస్’ను శిరసున పెట్టుకొని పూజిస్తారు. వంగ భాషీయులు చైతన్య మహాప్రభువుల సంకీర్తనలను పారవశ్యంతో గానం చేస్తారు. వీరి భక్తి ఉద్యమాలు సమాజంలో పెనుమార్పులకు కారణమయ్యాయి. పాదుషా ప్రభుతను లెక్క చేయని భక్తరామదాసు కీర్తనలు మనకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. రాజులను సైతం లెక్క చేయకుండా, దైవభక్తి ఆధిక్యాన్ని స్పష్టంగా ప్రకటించిన అన్నమయ్య, పోతన, ధూర్జటి వంటి మహాకవులు తమ ఇష్ట దేవతారాధనతో ముక్తి పొందారు. వారంతా సమాజంలోని సాటివారితో కలిసి మెలిసి జీవించారు. భుక్తి కోసమైతే రాజభక్తిని ప్రకటించి ఉండేవాళ్లు! గొప్ప భక్తులందరూ యోగీశ్వరులే! 'సమస్త ప్రాణుల సుఖదుఃఖాలను తమవిగా భావించి ఎవరు సేవిస్తారో అటువంటి యోగీశ్వరులు సర్వోత్తములు.
విద్య లేనివారికి విద్యను, రోగగ్రస్తుడికి ఔషధాన్ని, పేదలకు అన్న వస్త్రాలను ఎవరు అందజేస్తారో వారే యోగీశ్వరుల్లో శ్రేష్ఠులు'- అంటుంది భగవద్గీత.
[
*ఊర్వశి శాపం*..
ధర్మరాజు దివ్యాస్త్రాలు సంపాదించుకురమ్మని అర్జునుణ్ణి హిమగిరి ప్రాంతాలకు పంపాడు. అర్జునుడు దక్షిణదిశగా వెళ్ళి ఇంద్రలోక పర్వతం మీద తపస్సు చేసాడు. ఇంద్రుడు సంతోషించి కోరినన్ని వరాలు ఇచ్చాడు. అటు తరువాత యమధర్మరాజు దండాస్త్రాన్నీ, వరుణుడు పాశాన్నీ, కుబేరుడు అంతర్ధానాస్త్రాన్నీ ఇచ్చారు. అర్జునుడు ఇన్ని దివ్యాస్త్రాలు సంపాదించడం ఇంద్రుడికి నిజంగా ప్రీతి కలిగించింది. తన రథ సారథి మాతలిని పిలిచి అర్జునుణ్ణి దేవలోకానికి తీసుకురావల్సిందిగా ఆజ్ఞాపించాడు.
మాతలి సరేనని వెళ్ళాడు.
మాతలి సారథ్యంలోని రథం బంగారు ఆభరణాలతో చూడముచ్చటగా వుంది. వాయువేగంతో పరుగులు తీసే గుర్రాలు ఆ రథానికి పూంచి వున్నాయి. అవి మహాఘోషతో మేఘాలను చీల్చుకుంటూ వెళ్ళాయి.
మాతలి అర్జునుడి దగ్గరకు వెళ్ళి, "అర్జునా! అమరనాథుడు నిన్ను స్వర్గానికి తీసుకురమ్మని నన్ను పంపాడు. దేవ, ముని, గంధర్వ, అప్సరసలతో కొలువుతీర్చి దేవేంద్రుడు నీ రాకకై ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ళు అక్కడే అమర సుఖాలు అనుభవించి తిరిగి భూలోకానికి వెళ్లవచ్చని ఇంద్రుడు నీతో చెప్పమన్నాడు" అన్నాడు.
అది విని అర్జునుడు మహదానందపడ్డాడు. దేవరథం అధిరోహించాడు. తక్షణం అది దివ్యపథం పట్టింది.
అమరావతీనగర మొగసాలలో ఆగింది. రథం దిగి లోకానికి నడిచాడు. అక్కడ దేవేంద్రుడు కొలువుతీరి ఉన్నాడు.
సవ్యసాచి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఇంద్రుడు అర్జునుణ్ణి కౌగలించుకుని ఆప్యాయంగా శిరస్సు నిమిరాడు. నారదుడు ఆశీర్వదించాడు. తుంబురుడు పాట పాడాడు. అప్సరసలు నృత్యం చేశారు.
పార్థుడు అమరలోకంలో కొన్నాళ్ళుండి భూలోకంలో లేని సంగీత నృత్యగానాలూ, విలువిద్యలో మెళకువలూ తెలుసుకున్నాడు.
అర్జునుడి అందానికీ, ఠీవికీ, శక్తియుక్తులకీ దేవలోకంలోని అప్సరస్త్రీలు సమ్మొహితులయ్యారు. పాండవ మధ్యముడికి తన ప్రేమను అర్పించాలని సౌందర్యరాశి ఊర్వశి తహతహలాడసాగింది. అర్జునుడితో తన ప్రేమ సఫలమయ్యేట్టు చూడమని ఇంద్రుణ్ణి ప్రార్థించింది.
పార్థుడికి తన కోరిక తెలియపరచమని పరిచారిక చిత్రసేనను వేడుకుంది.
చిత్రసేన వెళ్ళి "మన్మథాకారా! అప్సరకన్య మా ఊర్వశి నిన్ను మోహించింది. నీవు లేకుండా క్షణమైనా గడపలేనంటోంది. కనుక ఆమెను చేపట్టి సుఖాలు అనుభవించు" అని అర్జునుడితో చెప్పింది.
అది విని ధనుంజయుడు చెవులు మూసుకున్నాడు. "ఆమె నాకు తల్లితో సమానం. పూజ్యురాలు. మా వంశానికి మూల పురుషుడైన పురూరవుణ్ణి ఆమె వరించింది. కనుక ఇలాంటి చెడు ఆలోచన ఆమె మనస్సులో రావటం మంచిది కాదని చెప్పు " అని బదులు చెప్పాడు.
చిత్రసేన వెళ్ళి ఆ సంగతి ఊర్వశితో చెప్పింది.
జగదేకసుందరి ఊర్వశి చిరుకోపం తెచ్చుకుని అందెలు ఘల్లుఘల్లున మోగుతుండగా తానే బయలుదేరి పార్థుడి మందిరానికి వెళ్ళింది.
"మేము అప్సరకాంతలం. భూలోకంలో పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వచ్చిన మహనీయులను సంతోషపెట్టటం మా విధి. పూరు వంశంలో జన్మించిన ఎందరో రాజులు స్వర్గానికి వచ్చి నాతో సౌఖ్యం అనుభవించారు. కాబట్టి నీవూ సంశయించక నాతో సుఖాలు అనుభవించు" అని చెప్పింది.
"తల్లీ! నీవు చెప్పింది నిజమే కావచ్చు. పెద్దలూ మహనీయులూ ఏమీ చేసినా ఒప్పే. కాని నా వంటి వాడికి అది తగని పని. ఈ అనుచితకార్యానికి నా మనస్సు అంగీకరించదు. నన్ను మన్నించు" అన్నాడు పార్థుడు.
అర్జునుడు అలా తిరస్కరించేసరికి ఊర్వశి కోపం పట్టలేకపోయింది. "పార్థా! నేను స్త్రీని. పైగా నా అంతట నేను వలచి వచ్చినందుకు నన్ను చులకన చేశావు. పరాభవించావు. కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నీవు మానరహితుడవై ఆడపిల్లలకు ఆట పాటలు నేర్పుతూ స్త్రీ, పురుష జాతికి దేనికీ చెందకుండా వుందువు గాక!" అని తీవ్రంగా పలికి వెను దిరిగి వెళ్లి పోయింది.
ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. నాయనా! ఊర్వశి శాపానికి భయపడకు. నీకు ఒక ఏడాది అజ్ఞాత వాసం ఎలాగో చెయ్య వలసి ఉంది. ఆ సమయంలో ఇతరులు నిన్ను ఎవరూ పోల్చు కోకుండా ఉండేందుకు ఈ శాపం బాగా ఉపకరిస్తుంది. అజ్ఞాత వాసం పూర్తయ్యాక నీ అసలు రూపం నీకు వస్తుంది" అని దీవించాడు.
అర్జునుడు సంతుష్టుడైనాడు.
.....
మనం చేసే పూజను బట్టి ఫలితం ఉంటుందని ధర్మ శాస్త్రాలు వుద్గో ఘోషిస్తున్నాయి .ఎంపిక చేసుకున్న.ఆ దైవం ఏ రూపం లో పూజిస్తే ,పుర్నానుగ్రహం తో మన కోర్కెలను నెరవేరుస్తాడో ముందే గ్రహించాలి . దైవం పట్ల నిష్ఠ వుండాలి .ఆ విధి విధానాన్ని ఆచరించి మనోభీస్తాన్ని నెరవేర్చు కోవాలి ఇది తెలిసి అర్జునుడు శ్రీ కృష్ణుడు శివుణ్ణి అర్చించి విశేష ఫలితం పొందితే అది తెలియక వేరొక విధానం లో పరమేస్వరున్ని పూజించి ఫలితం పొందలేక పోయాడు అశ్వథామ .ఈ వివరాలు మహాభారతం లో ద్రోణ పర్వం లోని చిన్న కధ వివరం గా తెలిపింది
మహా భారతయుద్ధం భీభత్చం గా జరుగుతోంది .ద్రోనసుతుడు ,మహా శస్త్రాస్త్ర నిపుణుడు అస్వస్తామ ,కృష్ణార్జునుల్ని తీవ్ర శరాఘాతం తో చీల్చి చెందాడు తున్నాడు .శరీరాలు గాయాలై రక్తం వరదగా పారుతోందికృష్ణార్జునులకు .అర్జునుడు ఇవేమీ లెక్క చేయకుండా అస్వస్తామ ను తీవ్ర బాణాలతో బాధిస్తూనే వున్నాడు .వీరిద్దరిని ఇంక ఏమి చేయ లేనని తేర్మ్కానిన్చు కున్నాడు .కోపం ,పరాభవం తో చెలరేగి పోయాడు .పరిస్థితి చెయ్యి దాటి పోతోందన్న ఆవేశము తోడైంది .చివరి ప్రయత్నం గా నారాయనాస్త్రాన్ని ప్రయోగించాడు మంత్ర పూతం గా .ఈ దెబ్బ తో వారిద్దరి పని సరి అనుకోని ఆనందించాడు .మహా మహిమాన్వితమైన ఆ నారాయణాస్త్రం కృష్ణార్జునులను ఏమీ చేయలేక పోయింది .చిరునవ్వు వీరిడైతే చిరాకు అతనిదయింది .ఎందుకు తన అస్త్రం విఫలమయిందో తెలియటం లేదు ద్రోణ సుతుడికి .తీవ్రం గా విచారించాడు .ఆవిశాయమేదో చేల్చుకోవాలని వ్యాసమహర్శిని ధ్యానించాడు .ఆయన ప్రత్యక్షమైనాడు .నమస్కరించి ”ఇది ఏమి మాయో తెలియటం లేదు స్వామీ దేవ గంధర్వాది జాతులను కూడా బాదిన్చాగాలిగిన దివ్యాస్త్రమైన నారాయణాస్త్రం కేవలం మనుష్యులైన కృష్ణార్జునులను దహించ లేదు కారణం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం గా వుంది తెలియ జేయండి ”అన్నాడు అస్వస్తామ .అప్పుడు వ్యాసమహర్షి నవ్వి ”ఎవరు చేసుకున్న పుజాఫలితం వారికి లభిస్తుంది .నువ్వు పరమేస్వరున్ని ప్రతిమా రూపం లో అర్చిన్చావు .వాళ్ళిద్దరూ లింగరూపం లో వున్న శివుడిని ఆరాధించారు .పూర్వజన్మలో మీరు చేసుకున్న పూజాఫలితమే ఇప్పుడు ఆ రూపం లో ఫలితం గా కన్పిస్తుంది .లింగార్చన చేసిన వారిని శివుడు మెచ్చి రక్షిస్తాడు .అందుకే కృష్ణార్జునులను నీ నారాయణాస్త్రం ఏమీ చేయలేక పోయింది .”అని సవివరం గా తెలియ జేశాడు మహర్షి వ్యాసుడు .అసలు రహస్యం అప్పుడు తెలిసింది అతనికి .శివుణ్ణి లింగ రూపం లో ,అభిషేకం చేసి పూజ చేస్తేనే ఆయన సంతోషించి అభీస్త సిద్ధినిస్తాడని .కనుక శివ ప్రతిమను పూజించటం కంటే ,శివలింగాన్ని పూజిస్తే అధిక ఫలితం ఈ విషయాన్ని ఆనుసాసనిక పర్వం లో కూడా శ్రీ కృష్ణుని చేత ధర్మరాజు కు చెప్పించాడు వ్యాస మహర్షి శివలింగ సన్నిధానం లో చేసే ప్రతి పని ఆయురారోగ్య ఇస్వర్యాలనిస్తుందని తెలియ జేసారు .
ఇంతకీ లింగం ఆంటే ఏమిటి ?సమ్యక్ జ్ఞానమే లింగం .అని శైవ ఆగమాలు బోధిస్తున్నాయి .శివ లింగమే పరబ్రహ్మమని చెప్పాయి .ఓంకారమే లింగం .శివపురాణం లో లింగమే తన రూపు అని శివుడే చెప్పాడు . లింగాన్నే అర్చించమని కుడా చెప్పాడు .శివలింగం ఆంటే శివుని యొక్క లింగం అని మాత్రమే కాదు శివుడే లింగం అని శైవ ప్రకాశిక లో వుంది .పద్మపురాణం కూడా లింగానికే శివార్చన చేయాలని బోధించింది .త్రికాల శివలింగార్చనశ్రేస్తామని ఉపనిషత్తు వుద్ఘోషించింది .కనుక సాధకుడు ఇందులోని రహస్యం గ్రహించి ,తన కోర్కెలను తీర్చుకోవటానికి తన ఇష్టదైవం ఏ రూపం లో అర్చించితే ,ధ్యానిస్తే భక్త సులభుడై వరదానం చేస్తాడో ,ఆపదల నుంచి రక్షిస్తాడో ,తెలుసుకొని పూజించి అభీష్ట సిద్ధిని పొందాలి .ఇదే ఈ కధలోని ధర్మ సూక్ష్మం .ఆ ధర్మ సూక్ష్మం తెలిసి శ్రీకృషుడు ,అర్జునుడు శివలింగార్చనచేసారు అందుకే అస్వత్తామ ప్రయోగించిన నారాయణాస్త్రం శివుని అనుగ్రహం వల్ల వారిని ఏమీ చేయ లేక పోయింది .ఇది తెలియక అస్వత్తామ శివప్రతిమనే పూజించి ,నారాయాన్నాస్త్ర ప్రయోగ ఫలితాన్ని పొందలేక పోయాడు .కనుక పూజను బట్టే పురుషార్ధం లభిస్తుందని తెలుసుకోవాలి
........
[
పాండవులు సత్యానికి, ధర్మానికి కట్టుబడినవారు. ధార్మికంగా బతుకుతూ, రుషులను పోషిస్తూ, మంచి మాటలు వింటూ యజ్ఞం చేస్తున్నారు. కానీ భోగభాగ్యాలనుభవిస్తున్న కౌరవుల అదృష్టాన్ని చూసి తాము పడుతున్న కష్టాలను పోల్చుకుని వాళ్ళు కుమిలిపోవాలని, దుఃఖించాలని అనుకుని దాని కోసం ఒక కుతంత్రం పన్నాడుదుర్యోధనుడు. అరణ్యంలో ఉన్న ఆవులన న్నింటినీ క్రూరమృగాలు తినేస్తున్నాయనీ వాటిని రక్షించాలన్న ఒక ఫిర్యాదును పనిగట్టుకుని సృష్టించి దానికోసం 'ఘోష యాత్ర' కు బయల్దేరుతున్నానని చెప్పి ధృతరాష్ట్రుని అనుమతి తీసుకున్నాడు. స్నేహితులు, సోదరులతోపాటూ రాణివాసంలో ఉన్న భార్యలను కూడా తీసుకుని మందీ మార్బలాన్ని వెంటబెట్టుకుని అట్టహాసంగా నేరుగా వెళ్ళి ధర్మరాజాదులు ఎక్కడ ఉన్నారో. ఆ సరోవరానికి అవతలిగట్టున గుడారాలు వేయించి ఆటపాటలతో సందడి చేస్తున్నాడు. ఈలోగా చిత్రసేనుడు అనే గంధర్వుడి భటులు వెళ్ళి "ఈ ప్రాంతంలో మారాజు చిత్ర సేనుడు వచ్చి గడుపుతుంటాడు. ఇక్కడ ఎవరూ గుడారాలు వేయకూడదు" అని అభ్యం తరం తెలిపారు. దుర్యోధనుడికి ఎంత పొగరో అంతకంటే ఎక్కువగా అతని భటులకు కూడా ఉండడంతో మాటామాటా పెరిగి యుద్ధానికి దారి తీసింది. గంధర్వులు కూడా లెక్కకు
మిక్కిలి సిద్ధమయ్యారు. దుశ్శాసనుడు, కర్ణుడు తదితర వాళ్లంతా ఓడిపోయి చెల్లాచెదురైపోయారు. తరువాత దుర్యోధనుడిని కిందపడేసి రెక్కలు వెనకకు విరిచి కట్టి అతనితో పాటూ కౌరవుల పక్షంలోని స్త్రీలనందరినీ కూడా బంధించి రథాల్లోకి ఎక్కించుకుని గంధర్వులు వెళ్ళి పోతున్నారు. మిగిలినవారు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి శరణు వేడారు. దుర్యోధనాదులు మీకు అపకారం తలపెట్టి మిమ్మల్ని అవమానించాలని వచ్చిన విషయం వాస్తవమేనని, మీరు తప్ప తమకు దిక్కులేదని, క్షమించి కాపాడమని వేడుకున్నారు.
ధర్మరాజు యజ్ఞదీక్షలో ఉన్నందు వల్ల భీమసేనుడి వంక చూసాడు.
'మనం చేయవలసిన కార్యాన్ని గంధ ర్వులు చేసేసారు. మనల్ని పరాభవించాలని వచ్చిన వారికి జరగాల్సిన శాస్తే జరిగింది. మనం జోక్యం చేసు కోవద్దు అన్నయ్యా...” అన్నాడు.
దానికి ధర్మరాజు .."బలం కలిగిన వాడి వద్దకు బలహీనుడు వెళ్ళి రక్షించమని అడిగితే సామాన్య బలం ఉన్నవాడు కూడా ప్రయత్నించాలి. అటువంటిది మహావీరులమయి ఉండి మనం రక్షించకపోతే ఆ బలం వల్ల ఉపయోగం ఏముంటుంది? అలా చేయనప్పుడు వాళ్ళకూ మనకూ తేడా ఏముంటుంది? అందుకని భీమసేనా నేను లేవకూడదు కనుక నిన్ను అడుగుతున్నా.. వెళ్ళు రక్షించు. పైగా వాళ్ళు మన సోదరులు కూడా ప్రమాదం బయటినుండి ఉన్నప్పుడు అన్నదమ్ములందరం ఒకటిగా ఉండాలి కూడా.. వెళ్ళు" అని ఆదేశించాడు. భీముడు తమ్ముళ్ళతో కలి సివెళ్ళి గంధర్వులను ఓడించి దుర్యోధనుడిని బంధనాలతో సహా తెచ్చి ధర్మరాజు ముందుంచాడు. అయితే తమకు తలపెట్టిన అపకారాన్ని కూడా మరిచిపోయి కట్లు విడిపించి దుర్యోధనుడిని ధర్మరాజు మందలించి పంపేసాడు. అదీ "...అపకారికి నుపకారము నెపమెన్నక.... చేయడం అంటే... అలా బతికిన వాళ్ల కథలు చరిత్రలో శాశ్వతంగా ఉండిపోతాయి. మనకు ఆదర్శంగా నిలుస్తాయి.
......
[
*ఫాంచాలీ పరిణయం వెనుక..*
ధరించేది ధర్మం అన్నారు. ధర్మాన్ని రక్షిస్తేచాలు ధర్మమే మనలను రక్షిస్తుంది. స్వధర్మాన్ని ఆచరిస్తూ అందులో ప్రాణాలు కోల్పోయినా ఫర్వాలేదు కాని పరధర్మాన్ని ఆశ్రయించరాదని శ్రీకృష్ణ్భగవానుడు అన్నారు. రూపుకట్టిన ధర్మమే రాముడన్నారు. ధర్మాన్ని ఆచరించనివారు నరకలోక ప్రయాణికులేకాని మరే దారి వారికి లేదన్నారు. ఇలా ధర్మాన్ని గురించి ఎందరో ఎన్నో చెప్పారు. ధర్మం అంటే అంతా తెలిసినట్టే ఉంటుంది. కాని ఆచరించటానికి పోతే ఏన్నో సందేహాలు కలుగుతుంటాయి. ధర్మం తెలిసిన వారు ధర్మం చాలా సూక్ష్మమైనది. ధర్మసూక్ష్మం తెలుసుకొన్నవారు జ్ఞానస్వరూపులే. వారు భగవంతునికి అనురూపులే అంటారు. అలాంటి ధర్మాన్ని గురించి సామాన్యులు కూడా తెలుసుకోవటానికి మహాభారత గ్రంథం ఉపయుక్తమైంది. వేదవ్యాసమహర్షి ఏ సమయంలో ఏవిధమైన ధర్మాన్ని ఆచరించాలో ధర్మం ఆచరిస్తే కలిగే ప్రయోజనమేమిటో ఉపాఖ్యానాలతో చిన్న చిన్న కథలతో మనసుకు హత్తుకునే విధంగా మహాభారతంలో చెప్పారు. కాని మహాభారతం ఉద్గ్రంథం. ఈ పరిగెత్తి పాలుతాగే ఈ కంప్యూటర్యుగంలో మహాభారత గ్రంథాన్ని చదివే ఓపికగాని, ఆసక్తిగాని లేకుండానే తరాలు ముందుకు సాగుతూ కొత్త తరాలకు వాకిళ్లు తెరుస్తున్నాయి.
దానివల్లే నేడు మానవుల్లో అభద్రతాభావం, అనిశ్చిత, అయోమయం బంధువుల మధ్య స్నేహితుల మధ్య చివరకు తల్లితండ్రులు, అక్కచెళ్లెళ్లు, అన్నదమ్ముల మధ్యా కూడా సఖ్యత కరువు అవుతోంది. అటువంటి వారు కనీసం భారతం అంతా చదవకపోయినా కొన్ని కొన్ని ఘట్టాలు కొన్ని ధర్మసూక్ష్మాలు తెలుసుకొంటే వారి జీవనపథంలో వికాసం కలుగుతుందని అనిపిస్తుంది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది కొండంత ఉంది అనిపించే మన వాఙ్మయసంపదలో భాగమైన మహాభారతంలో వేదవ్యాసుడు చెప్పిన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలిసినంత వివరిస్తున్నాను. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకోకుండానే ఇతరులు ముఖ్యంగా విదేశీయులుకాని, పరమతం వారు ఆ ఏముంది? మీ సంస్కృతీ సంప్రదాయాలు చెట్టుపుట్టను మొక్కుతారు కాని మా మతంలో ఇది చాలా ప్రముఖమైంది అనగానే దాన్ని వెంట పోయేవారు ఎక్కువ అవుతున్నారు. అసలు మనది సనాతన ధర్మం. మనకు ఉన్న రామాయణాది కావ్యాలు మహాభారతం లాంటి ఇతిహాసాలు పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు ఇలా ఎన్నో మన ధర్మాన్ని కాదు కాదు అసలు మానవులంతా ఆచరించదగ్గ ధర్మాన్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఉద్ఘోషించి ఉన్నారు. అలా ఋషులు దర్శించి చెప్పిన వాటిని మనం మరొక్కసారి స్మరించుకుంటే నేటి తరమూ ధర్మానికి మారుపేరుగా మారుతారని ఈ ప్రయత్నం. మహాభారతంలో ఒక స్ర్తికి ఐదుగురు భర్తలా అంటూ హేళన చేసే వర్గమూ మనలో ఉంది. అటువంటి వారికి అసలు ఐదుగురు భర్తలు కలిగి ఉండడంలో ఔచిత్యమూ, ధర్మము ఇలా వివరిస్తోంది మహాభారతం.
అది పాంచాల రాజైన ద్రుపదుని రాజ్యసభ. అక్కడ కొద్ది సేపట్లో ద్రుపదుని కుమార్తె రాజకుమారి ద్రౌపదీ స్వయంవరం జరుగనున్నది. అక్కడికి దేశ దేశాల నుండి అనేక రాజులు, రాజకుమారులు వచ్చారు. దుర్యోధనుడు, అతని తమ్ములు, కర్ణుడు, జయద్రధుడు, శల్వశకునులాంటి వారే కాకుండా కృష్ణబలరాములు కూడా ఉన్నారు.
రాజకుమార్తె సర్వాలంకార భూషితయైన ద్రౌపది తన అన్న దృష్ట్ధ్యుమ్నునితో సభకు విచ్చేసింది. అందరి చూపులూ అద్వితీయ సౌందర్యవతియైన ద్రౌపది మీదే నిలిచాయి. అప్పుడే బ్రాహ్మణ రూపంలో ఉన్న పాండవులు కూడ సభకు వచ్చారు ఆ స్వయవరంలో బ్రాహ్మణ వేషధారులై వచ్చిన పాండవులలో పాండవ మధ్యముడు చివరకు మత్స్యయంత్ర భేదనం చేసి ద్రౌపది చేతిలోని వరమాలను పొందగలిగాడు. శ్రీకృష్ణుని ఆదేశంతో ద్రుపదరాజ పరివార ఆదరంతో పాండవులు ద్రౌపదీతో కూడ తమ తల్లి అయిన కుంతీదేవి దగ్గరకు బయలుదేరారు. అర్జునుడు భీముడితో ‘‘అన్నయ్యా మనం సరదాగా, నీకు మంచి భిక్ష తీసుకుని వచ్చాము తల్లీ’ అని ద్రౌపదిని ముందు నిలబెడితే ఎలా ఉంటుంది?’’ అని అడిగాడు. ‘‘రాజకుమార్తెను భిక్ష అని చెపుతావా, వద్దు’’ అని మందలించాడు భీముడు. ‘‘పరిహాసానికి అలా అనటంలో నష్టమేముందన్నయ్యా! ఏమంటావు పాంచాలీ? అని అడిగాడు. ‘‘మీ ఇష్టప్రకారమే కానివ్వండి’’ అన్నది ద్రౌపది. ఇంటి ద్వారం వద్ద ముగ్గురూ నిలబడి, ‘‘నీకోసం ఈ మంచి భిక్ష తెచ్చామమ్మా’’ అని ముక్తకంఠంతో అన్నారు భీమార్జునులు. పనిలో నిమగ్నమై ఉన్న కుంతి ద్వారం వంక తిరిగి చూడకుండానే ‘‘మీ ఐదుగురన్నదమ్ములు సమంగా పంచుకోండని’’ ఆదేశించింది. భీమార్జునులు ద్రౌపదీ సమేతంగా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నోటమాట రాకుండా నిల్చుండిపోయారు. తిరిగి చూచిన కుంతికి ఎదురుగా ద్రౌపది దర్శనం!
అపుడు భీముడు స్వయంవరంలో అర్జునుడు ద్రౌపదిని గెలుచుకున్న వైనాన్ని వివరించాడు. వెంటనే ద్రౌపది వంగి కుంతికి పాదాభివందనం చేసింది. అఖండ సౌభాగ్యవతీభవ అని ఆశీర్వదించింది కుంతి. అప్పుడు అర్జునుడు తల్లీ మీరు ఈమెను మమ్మల్నందర్ని సమానంగా పంచుకోమని ఆదేశించారు... ఇపుడెలా?’’ అని అన్నాడు. ఇంతలో యుధిష్టురుడు నకుల సహదేవులతో సహా అక్కడికి వచ్చాడు. సమస్య తెలుసుకున్నాడు. తన వివరణ ఇలా చెప్పాడు.
‘‘తల్లీ స్ర్తి శక్తి స్వరూపిణి. స్ర్తిలేనిదే పురుషుడు అసంపూర్ణుడు. నారి తల్లీ రూపంలో గానీ, భార్యరూపంలో గానీ ఎల్లప్పుడు ఆదరణీయురాలు. భీమార్జునులు ద్రౌపదిని భిక్షగా ప్రకటించి నారిని అవమానించారు. ఇక తల్లి పరమ గురువు. తల్లి నోట్లోంచి ఎపుడూ అస్వీకరణీయమైన ఆదేశం రాదు.’’ మ్రాన్పడి చూస్తున్న భీమాదులతో ధర్మరాజు- అమ్మ చెప్తున్న ఆదేశంలో ఏదో ఒక రహస్యం అవశ్యం దాగి ఉండవచ్చు.
ఇలా ఎక్కడైనా జరిగిన సంఘటనలున్నాయా అని వెదికితే - గౌతమ కులకన్య ‘జటిల’ యొక్క వివాహం ఏడుగురు ఋషులతో జరిగుంది. అట్లే హిరణ్యాక్షుడి కుమార్తె ‘ప్రత్తిచ్ఛి’ యొక్క వివాహం పది మంది సోదరులతో అయింది. కనుక మనకు అమ్మ ఆదేశాన్ని పాటించటమే మార్గమంటున్న తరుణంలో శ్రీకృష్ణుడూ వచ్చాడు. పాండవులంతా విషయం వివరించారాయనకు. తమ సందేహాన్ని నివృత్తి చేయమని కోరారు. దీనికి జవాబు ద్రౌపదే ఇవ్వగలదు అన్నాడా కృష్ణుడు.
పూర్వజన్మలో ద్రౌపది శివుడి గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షం అయాక ఐదు వరాలడిగింది. తనకు ధర్మానికి ప్రతీకయైన మరియు సత్యానికి సంకేతాక్షరమైనవాడు హనుమంతుని వలె బలవంతుడు, పరశురాముడి వంటి ధనుర్ధనుడు, అందరికంటె అందగాడు, అందరికన్న సహనశీలియైన భర్తను ఇవ్వమని అడిగింది. మహాదేవుడు అన్ని శ్రేష్టమైన గుణాలు ఒక్కరిలో ఉండవని అంటున్నా, ఆమె తన పట్టు విడువలేదు. అందుకే ఆ మహాదేవుడే ఈ రోజు అత్తనోట్లోంచి ఇలా అందరూ పంచుకోండని పలికించాడు. ఆధునిక యుగంలో యుధిష్టురుడు ధర్మానికి చిహ్నము. ఇది ఆమె అడిగిన మొదటి వరం, భీముడు అందరికన్నా బలశాలి. ఇది ఆమె అడిగిన రెండవ వరం. అర్జునుడు సర్వశ్రేష్ట ధనుర్ధరుడు. ఇది ఆమె కోరిన మూడవ వరం. అందరిలోకి అందగాడు నకులుడు. ఇది ఆమె నాల్గో వరము. సహదేవుని మించిన సహనశీలి ఈ యుగంలో లేడు. ఇదామె ఐదవ వరం. ఇవన్నీ ఈ జన్మలో పరమేశ్వరుడు పంచపాండవుల రూపంలో ద్రౌపదికి ప్రసాదించాడు. ఇక ఈ వరాలను తిరస్కరించి ఆమె మహేశ్వరుణ్ణి అవమానించదలుచుకుంటే అది ఆమె ఇష్టం మీద ఆధారపడి ఉంది.
అనంతరం అర్జునుణ్ణి ఉద్దేశించి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ‘‘అర్జునా నీవు స్వయంవరం అవశ్యం గెలిచావు. కానీ అంతమాత్రం చేత జీవించి ఉన్న ద్రౌపది భిక్ష అయినట్లు కాదు కదా! నీవు పరమగురువైన నీ తల్లితో అసత్యం చెప్పావు’’ అని కుంతివైపు తిరిగి అత్తా ‘‘అమ్మ అయినందుకు అర్థం ఏదీ చూడకుండా, ఆలోచించకుండా, అర్థంచేసుకోకుండా ఆదేశించడం కాదుకదా! నీవు నీ మాతృత్వం యొక్క మర్యాదను ఉల్లంఘించావు. అందుకే ఇకనుంచి మీ జీవితం ఒక తపస్సే కాదు, ప్రాయశ్చిత్తం కూడా’’ అని పాండవులకు కుంతికి బోధించాడు శ్రీకృష్ణుడు.
*🎣
.....
ఒక బోయవాడు అయిన ఒక అతి సాధారణ మనిషి, ఒక మహామంత్ర సాధనచే మహామనిషిగా ఆవిష్కరింపబడి, మహర్షిగా పేరుపొందాడు. ఆ మహర్షి నాడు వ్రాసిన రామాయణమే నేటికీ అందరి మనస్సుల్లో సజీవంగా వుంది. కారణం, కథ, కథలోని పాత్రలు, వారు ఆ పాత్రల్లో అనుభవిస్తూ చెప్పింది సమాజంలో జనసామాన్యానికి చేరువుగా వుండి, పోలివుండటమే!! భారతీయ పురాణాల్లో చాలా ప్రాముఖ్యం పొందినవి దశావతారాలు. విష్ణువుయొక్క ఈ దశ అవతారాలు మనిషి మనుగడతో ఎంతో లోతుగా ముడిపడివున్నాయి. పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. కానీ వాటిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఆ అవతారలు బట్టే విష్ణువు ఎక్కువ ప్రాచుర్యం పొందాడు.
దశావతారాలు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే పరమేశ్వరుడు అవతారాలు ఎందుకు స్వీకరిస్తాడు, దశావతారాలు అని పది అవతారాలు ఎందుకు విశిష్టతను పొందాయి? అన్న విషయం మీద మనకు ఒక సంగ్రహమైన అవగాహన ఏర్పడుతుంది. తార అన్న మాటకి వ్యతిరేకపదం అవతార. తార అంటే నక్షత్రం కాదు. తార అంటే ముత్యం. ఎంత నైర్మల్యంతో, మలినం లేకుండా శుద్ధమైనదిగా ఉంటుందో అంత శుద్ధమైనది అని ఒక అర్థం. తరింపచేసేది కాబట్టి తార అని రెండవ అర్థం.
ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ప్రకృతిలో అనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమంలో నుంచే రకరకాల జీవరాశులు ఉద్భవించాయన్నది వాస్తవం. పురాణేతిహాసాల్లోనూ ఇది విషయం మనకు స్పష్టమౌతున్నది. కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఆనాటి నుంచే జీవపరిణామం కనిపిస్తోందనేది నిర్వివాదాంశం. అంతేకాక...మనిషి మనుగడకు సహకరిస్తున్న ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలోని జీవరాశులకు తగిన విలువనిచ్చి పూజించడం మన సంస్క్రతిలో భాగమే...విష్ణువు పది అత్యంత ప్రసిధ్ద అవరోహణల్ని సమిష్టిగా దశావతారలని అంటారు. ఇది గరుడు పురాణంలో రాసుంది. మానవ సమాజంలో వాటి ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి. మొదటి నాలుగు అవతారాలు సత్య యుగంలో కనిపించాయని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత మూడు అవతారాలు, త్రేతాయుగంలో, ఎనిమితో అవతారం ద్వారపర యుగంలో తొమ్మిదో అవతారం కలియుగంలో, పదోది కలియుగాంతంలో కనిపిస్తుందని అంచనా ...
చాలాకాలము నుండి విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు *నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జామదగ్న్య, రామ, కృష్ణ, కల్కి అవతారములు* పది ప్రధానావతారాలని పేర్కొనబడింది. ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. మహాభారతమునందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు. మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామనావతారములు సంభూత్యవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగి పోవుచున్నప్పుడును నన్ను నేను సృజించు కొందును. సత్పురుషులను పరి రక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.
అనంతరూపాలు, నామధేయాలు గలిగిన భగవంతుని అవతారాలు అనంతాలు. ప్రభావవంతాలైన అవతారాలు లెక్కకు మిక్కిలిగానే ఉన్నాయి. అవతారధర్మాలు, ఉద్దేశ్యాలను అనుసరించి వీటిని అంశావతారాలు, కళావతారాలు, స్ఫూర్త్యవతారాలు, వైభవాతారాలు, అర్చావతారాలు, ఆవేశావతారాలుగా వింగడించవచ్చు.
అష్టాదశపురాణాల కర్తయైన వ్యాసుడు 17 పురాణములను రచించి, పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన మహాభారతాన్ని రచించినప్పటికి అతని మనసును ఏదోఒక అసంతృప్తి వెంటాడుతూ ఉండింది. వ్యాసుడు ‘సర్వజ్ఞుడవైన ఓ నారదా। నీ వెరుగని దేమున్నది. నా కొరతకు కారణమును నీవే చెప్పు’ మని పలికినాడు. నారదుడు “పరాశరాత్మజా” ధర్మచయ మంతా నీచే ప్రపంచింపబడింది. కాని, అందులో విష్ణుకథలు లేవు, హరిని కోరి నుతింపక పోవుటయే నీ యీ కొంచెపుతనానికి కారణం. అని చెప్పినాడు. అప్పుడు కృష్ణద్వైపాయనుడు కృష్ణకథలను శ్రీమద్భాగవత పురాణంగా వర్ణించినాడు. భగవంతునికి ప్రత్యేకంగా కథలంటూ ఉండవు. భక్తులకథలే భగవంతుని లీలలు. అట్లే భగవంతుని లీలానుకంపనాలే భక్తుల చరిత్రలు, భగవంతుడు, భాగవతుల మధ్య నున్న అద్వైతభావమే భాగవతం.
దశావతారాల నుంచి మానవుడు గ్రహించి ఆచరించవలసిన సత్యాలు
మత్స్య – నిత్య చైతన్య స్థితి
కూర్మ – ప్రాపంచిక విషయాలతో అవసరముంటే కూడాలి, లేదంటే ముడుచుకోవాలి.
వరాహం – భూ భారాన్ని మోయాలి. అంటే భూలోకంలోని అజ్ఞాన భారాన్ని
నృసింహ – సమాజంలోని చెడును చీల్చి చెండాడాలి.
వామన – ఒకపాదం, భూమి మీద రెండోపాదం ఆకాశం మీద, అంటే స్థూల శరీరంతో భూమి మీద ఉంటూ ధ్యానంతో సూక్ష్మశరీరయానం సాగుస్తూ ఊర్ధ్వలోకాలు దర్శించాలి.
పరుశురామ – ఒక లక్ష్యం కోసం పోరాడియైనా జయించాలి.
రామ – కుటుంబ విషయాలని బాధ్యాతతో చూసుకోవాలి.
బలరామ – కష్టపడి ఎవరి సంపాదన వారు సంపాదించుకోవాలి.
కృష్ణ – ఎప్పుడూ మెలకువగా వుండాలి.
బుద్ధ – ధ్యానంతో బుద్ధుడవ్వాలి.
ప్రపంచంలో తరింపచేసేది ఏది? భగవంతుని నుండి విడిపోయిన వాడు మళ్ళీ భగవంతునిలో కలసిపోవడం లేదా తాను ఆత్మ అని ఎరుకలోకి రావడం తరించడం. ఈ తరింపచెయ్యగలవాడు పరమేశ్వరుడు ఒక్కడే. తార శబ్దం భగవంతునికి ఒక్కడికే అన్వయం అవుతుంది. భగవంతుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఆయన రూపం ఏమిటి అని అడిగితే ఎన్నో శ్లోకాలు మనవిచేసి ఆయన మెడలో పాములు వేసుకుంటాడు, చంద్రవంక ధరించి, పెద్ద జటాజూటంతో ఉంటాడు అని అంటే అది శివస్వరూపం అని చెప్పగలరు. పచ్చని పట్టుపుట్టం కట్టుకుని, మెడలో వనమాల, శంఖ, చక్ర, గదా, పద్మాలను పట్టుకుని, నీల మేఘశ్యాముడై ఉంటాడు అంటే విష్ణువు అంటారు. ఏ రూపం గురించిన శ్లోకాలను చెప్పి వివరణ చేస్తే ఆ రూపం భగవంతుడు అంటారు. ఇన్ని రూపాలు భగవంతునికి ఉంటాయా? ఇన్ని రూపాలలో ఏదో రూపం భగవంతుడా? అసలు భగవంతునికి రూపం లేదు కనక ఏదో రూపాన్ని పొందుతుంటాడా? ఏది నిజం? తార, అవతార వ్యతిరేకపదాలు అయితే తార అంటే పైన ఉన్నది. సంగీతం పాడేవాళ్ళు తారస్థాయి అంటారు అంటే పై స్థాయి. పైన అంటే ఎంత అనగా దాని వెలుతురు తప్ప, దాని రూపాన్ని స్పష్టంగా మన మాంసనేత్రం చూడలేదు.
[
మయూరధ్వజుడు
పంచమవేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం .. నేటీ మానవ జీవన విధానానికి సోపానం. రామాయణం మనిషి ఎలా జీవించాలో నేర్పిస్తే.. మహాభారతం ఎలా జీవించకూడదో తెలుపుతుంది.
మహాభారతంలోని శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవులు, కర్ణుడు, భీష్ముడు, శకుని, ద్రౌపతి, కుంతి ఇలా అనేకమంది ఉన్నారు. స్త్రీ, పురుషుల జీవితాలను తరచి చూస్తే మనకు జీవితంలో మంచి చెడులు అర్ధమవుతాయి. ఈరోజు మహాభారతంలోని గొప్ప వ్యక్తి మయూరధ్వజుడు గురించి అతని త్యాగ నిరతి గొప్పదనం గురించి తెలుసుకుందాం..
ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తూ.. యాగాశ్వాన్నివిడిచాడు. ఆ యావశ్వాన్ని వీర ధర్మం పాటిస్తూ పట్టుకున్నాడు మయూరధ్వజుడనే రాజు. అతడు ధర్మాత్ముడు అమితపరాక్రమవంతుడు శ్రీ కృష్ణుని పరమ భక్తుడు. యాగాశ్వం విడిపించడానికి మయూరధ్వజునితో యుద్ధం చేయటానికి శ్రీ కృష్ణార్జునులు వచ్చారు. శ్రీ కృష్ణుడు.. అర్జునుని ప్రార్థనపై మయూరధ్వజుడుతో యుద్ధం చేశాడు. భగవంతునితో యుద్ధం చేయకూడదని ఉన్నా యుద్దనీతి పాటించి ప్రతి బాణాం వేసే ముందు శ్రీ కృష్ణ నామ స్మరణ చేస్తూ యుద్ధం చేశాడు మయూరధ్వజుడు. భక్తులచేతిలో ఓడిపోవటం భగవంతునికి పరిపాటి. అందుకే శ్రీకృష్ణారుజునులు మయూరధ్వజుని గెలవలేకపోయారు.
దీంతో అర్జునుడు యాగాశ్వం సంపాదించడానికి .. మయూరధ్వజుడిని సంహరించాల్సి అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు "ఫల్గుణా.. నీ గాండీవం కాని నా సుదర్శన చక్రం కాని ఈ పరమభక్తుని మీద పని చేయవు. అతని ధర్మబుద్ధి నీకు చెబుతా విను అంటూ చెప్పడం ప్రారంభించాడు శ్రీ కృష్ణుడు.
మర్నాడు శ్రీ కృష్ణార్జునులు బ్రాహ్మణుల వేషంలో మయూరధ్వజుని వద్దకు అతిథులుగా వెళ్లారు. అతిథులకు తగు మర్యాద చేసి మయూరధ్వజుడు తన ఇంట ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించాడు. అది విన్న శ్రీకృష్ణుడు "రాజా! నీ ఇంట భుజించుటకు వ్యవధి లేదు. మాకొక చిక్కు వచ్చింది. అది తీరిన తరువాతే మేము ఇంకొక విషయం పై దృష్టిపెడతాం అని అన్నాడు. దీంతో మయూరధ్వజుడు మీ కష్టం ఏమిటి చెప్పండి.. నాకు చేతనైన సాయం చేస్తా అని అడిగాడు. దీంతో "రాజా.. మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు నా కుమారుని ఓ పెద్దపులి పట్టుకుంది. ఆ పసివాడి శరీరాన్ని సగం తిన్న తరువాత ఒక అశరీరవాణి ఇలా పలికింది "మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే నీ పుత్రుడు సజీవుడు అవుతాడు". నాకు పుత్రభిక్ష పెట్టమని నిన్ను ప్రార్థిస్తున్నాను" అని మారు వేషంలో ఉన్న శ్రీ కృష్ణుడు చెప్పాడు.
దీంతో మయూరధ్వజు "ఆహా.. ఈరోజు కదా ఈ దేహానికి సార్థకత ఏర్పడింది. ఒక పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడుతోంది. నిస్సందేహంగా నా శరీరములోని అర్ధభాగమును తీసుకుని ఆ వ్యాఘ్రేశ్వరునికి సమర్పించండి" అని అర్థించాడు మయూరధ్వజుడు. వెంటనే తన భార్యాబిడ్డలను పిలిచి తన శరీరాన్ని రెండుగా చేసి అతిథులకు ఇవ్వమని చెప్పాడు. అతని అర్ధాంగి తన భర్త ఇలా చేయమన్నాడు అంటే.. ఏ పరమధర్మ సంరక్షణార్థమో ఏ మహత్తర కార్యానికో చేయమని వుంటాడని గ్రహించి తన బాధను దిగమింగుకుంది. వెంటనే మయారధ్వజుని శరీరాన్ని ఛేదించడం మెదలుపెట్టారు. అప్పుడు శ్రీకృష్ణార్జులకు ఒక దృశ్యం కనిపించింది.
మయూరద్వజుని ఎడమ కన్ను నుండి కన్నీరు కారుతుంది. దీంతో శ్రీ కృష్ణుడు రాజా "రాజా! బాధపడుతూ దానం ఇవ్వకూడదు. సంతోషంగా, మనస్ఫూర్తిగా చేస్తేనే అది త్యాగమవుతుంది. ఎదుటి వాడి కష్టాలు చూసి బాధపడటం దివ్యత్వమని చెప్పాడు. విప్రుడు మాటలకు మయూరధ్వజుడు స్పందిస్తూ.. అయ్యా .. నా శరీరం మనస్ఫూర్తిగానే మీకు సమర్పించాను. కాని నా శరీరము యొక్క కుడి భాగమే పరోపకారార్థం వినియోగపడుతుంది. ఎడమ భాగ శరీరం "నాకా అదృష్టం లేదే" అని విచారిస్తూ కన్నీరు కారుస్తోంది. మిగిలిన శరీరం దేనికీ ఉపయోగపడకుండానే నాశనమవుతున్నదనే నా బాధ" అని అమృతవాక్కులు పలికాడు మయూరధ్వజుడు. ఆ రాజు పరోపకార బుద్ధికి సంతోషించి శ్రీ కృష్ణుడు తన నిజరూపం దర్శనం ఇచ్చి మయూరధ్వజునికి యథా రూపం కల్పించి దీవించాడు. మయూరధ్వజుడు నరనారాయణులకు మ్రొక్కి యాగాశ్వాన్ని సమర్పించి కృతార్థుడయ్యాడు.
ఈ కథలోని నీతి:
మయూరధ్వజుని పరోపకారబుద్ధి అనన్యం అసామాన్యం. శ్రీ కృష్ణుడు అడిగినదే తడవుగా సంతోషంగా బాలుని ప్రాణ రక్షణ కోసం తన శరీరాన్ని త్యాగంచేయటానికి సిద్ధపడ్డాడు. అంతేకాక అర్ధ శరీరమే ఉపకరిస్తున్నది మిగిలిన శరీరం వ్యర్థమవుతున్నదని చింతించాడు. అతని త్యాగనిరతితో గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు.
[
*గాంధారి శాపం*
కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు అందరూ హతమయ్యారు. ఐశ్వర్యం పోయింది. బంధువులంతా నాశనమయ్యారు. "ఇంత దారుణం జరిగినా చావురాలేదు నాకు" అని వాపోయాడు ధృతరాష్ట్రుడు.
వ్యాసమహాముని ధృతరాష్ట్రుణ్ణి ఓదారుస్తూ, "నాయనా! ఎవ్వరి ప్రాణాలూ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనస్సుకు బాగ పట్టించుకున్నావంటే ఇంక నీకే దుఃఖం వుండదు. ఇప్పుడు విచారిస్తున్నావు కాని , జూదమాడేనాడు విదురుడెంత చెప్పినా విన్నావా? దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా?" అన్నాడు.
"రాజా! ఒకనాడు దేవసభకు వెళ్ళాను నేను. దేవతలతో, మహామునులతో మట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ వచ్చిందక్కడికి.
'నా భారం తొలగిస్తానని మీరంతా బ్రహ్మసభలో ప్రతిజ్ఞలు పలికారు. ఇప్పుడిలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలీడం లేదు. ఇంక నా భారం తొలిగే మార్గమేమిటి?' అని దేవతలను ప్రశ్నించిందామె.
'ధృతరాష్ట్రుడనే రాజుకు నూరుగురు కొడుకులు పుడతారు. వాళ్ళలో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల నీ భారమంతా నశిస్తుంది. వాణ్ణి చంపడానికీ, రక్షించడానికీ ముందుకు వచ్చి భూమిమీద వున్న రాజులంతా సేనలతో సహా కురుక్షేత్రంలో హతులవుతారు. ఆ దుర్యోధనుడు కూడా తమ్ములతో పాటు మరణిస్తాడు. అంతటితో నీ భారం తీరిపోతుంది. వెళ్ళు! నిశ్చింతగా భూతధారణం చెయ్యి ' అన్నాడు నారాయణుడు చిరునవ్వుతో.
"విన్నావు కదా రాజా! మరి కౌరవులు నాశనమయ్యారంటే ఆశ్చర్యమేముంది! విధిని ఎవరు తప్పిస్తారు?"
ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని గాంధారినీ, కుంతినీ, కోడళ్ళనూ వెంటపెట్టుకుని యుద్ధభూమికి బయలుదేరాడు.
పెదతండ్రి వస్తున్నాడని తెలిసి ధర్మనందనుడు ముందే అక్కడికి వెళ్ళాడు. అతని వెంట తమ్ములూ ద్రౌపదీ కృష్ణుడూ కూడా వున్నారు.
ధర్మరాజు కంటపడగానే ధృతరాష్ట్రుడి కోడళ్ళందరూ బిగ్గరగా ఏడ్చారు. దుఃఖంతో, అవేశంతో పేరుపేరునా పాండవులందర్నీ నిందించారు.
కళ్ళనీళ్ళు కారుస్తూ మౌనంగా తల వంచుకున్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించాడు. తరువాత పాండవులు కృష్ణసహితంగా వెళ్ళి గాంధారికి నమస్కరించారు.
కోపంతో మండిపడిందామె.
"శత్రువుల్ని చంపొచ్చు. కాని ఈ గుడ్డివాళ్ళిద్దరికీ ఊతకర్రగా ఒక్కణ్ణయినా మిగల్చకుండా అందర్నీ నాశనం చేశారే! మీకు అపకారం చెయ్యనివాడు వందమందిలో ఒక్కడైనా లేకపోయాడా? ఒక్కణ్ణి అట్టేపెడితే మీ ప్రతిజ్ఞ భంగమౌతుందా? అ ఒక్కడూ మిమ్మల్ని రాజ్యం చెయ్యనివ్వకుండా అడ్డగిస్తాడా? ఇంతకూ ఏడీ మీ మహారాజు?" ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది.
అజాతశత్రుడు మోకరిల్లాడు. గాంధారి తలవంచి దీర్ఘంగా నిట్టూర్చింది. నేత్రాలను బంధించిన వస్త్రం సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి లిప్తపాటు ధర్మరాజు కాలిగోళ్ళ మీద పడింది. ఆ గోళ్ళు వెంటనే ఎర్రగా కందిపోయాయి. అది చూసి హడలిపోయి కృష్ణుడి వెనకాల దాగాడు అర్జునుడు.
మహాజ్ఞానీ, సంయమనం కలదీ కనుక గాంధారి కోపాన్ని శమింప చేసుకుని "నాయనా! వెళ్ళి కుంతీదేవిని చూడండి" అంది.
కానీ ఇంతటికీ కారణమైన కృష్ణుడి పట్ల ఆమె క్రోధం కట్టలుతెంచుకుంది.
"వాసుదేవా! ఇలా రావయ్యా" అని పిలిచింది గాంధారి.
"కృష్ణా! కౌరవ పాండవ కుమారులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చచెప్పకపోయావు. కదన రంగాన కాలూనినప్పుడూ నువ్వు అడ్డుపడకపోయవు. సమర్ధుడవై వుండి కూడా ఉపేక్ష చేశావు. అందర్నీ చంపించావు. దేశాలన్నీ పాడుబెట్టావు. జనక్షయానికి కారకుడైన జనర్థనా! దీని ఫలం నువ్వు అనుభవించవలసిందే. నా పాతివ్రత్య పుణ్యఫల తపశ్శక్తితో పలుకుతున్నాను - నువ్వు వీళ్ళందర్నీ ఇలా చంపావు కనుక ఈనాటికి ముప్ఫై ఆరో సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీళ్ళలాగే పరస్పరం కలహించుకుని చస్తారు. అదే సమయాన నువ్వు దిక్కులేక నీచపు చావు చస్తావు. మీ కుల స్తీలు కూడా ఇలాగే అందర్నీ తలుచుకుని ఏడుస్తారు. ఇది ఇలాగే జరుగుగాక" అని శపించిండి గాంధారి.
సమ్మోహకరంగా చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు.
"అమ్మా! ఈ శాపం యాదవులకు ఇదివరకే ఇచ్చారు కొందరు మునులు. నువ్విప్పుడు చర్చిత చర్వణం చేశావు. యదువంశీయులను దేవతలు కూడా చంపలేరు. అందుచేత వాళ్ళలో వాళ్ళే కొట్టుకుచస్తారు. పోనీలే కానీ అందువల్ల నీకేం వస్తుంది చెప్పు?" అన్నాడు నవ్వుతూనే.
పుత్రశోకంతో పరితపిస్తూ అవధులెరగని ఆక్రోశంతో అచ్యుతుని శపించిన గాంధారి జవాబు చెప్పలేక మౌనం వహించింది.
[02/09, 6:19 am] +91 80995 58991: జీవించడం ఒక కళ.
చెట్టుమీద పాకే గొంగళి పురుగు జీవించడం అంటే ఏమిటో చెబుతుంది.
అది మనిషి ముందే సీతాకోకచిలుకై ఎగిరి వెళ్తుంది.
మనిషి మనసు మాత్రం గొంగళి పురుగులా ఉండిపోతోంది. ‘ఎప్పటికైనా ఎదగాలి, ఎగరాలి’
అని ప్రణాళిక సిద్ధం చేసు కోవడంతోనే మానవుడి సమయమంతా గడచిపోతోంది.
జీవించడంలో ఎంత ఉదాత్తత, ఔన్నత్యం ఉంటాయో తెలుసుకోవాలని ప్రకృతి పలు విధాలుగా బోధిస్తోంది.
అంతటా ఒకే రకమైన ప్రేమతత్వం పంచుతున్నా- ఈ జీవితం ఎందుకో, ఎలా జీవించాలో మనిషికి ఇంకా అవగాహన కావడం లేదు.
ఏదో విధంగా బతకడమన్నది నిజమైన జీవనం అనిపించుకోదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమూ జీవనం కాదు.
బతుకు బండిని ఎలాగోలా లాగించడమన్నదే మానవుడి అంతిమ లక్ష్యం కాకూడదు.
మనము ఎక్కడి నుండి వచ్చినాము? ఎందుకు వచ్చినాము? ఏమి చే స్తున్నాం? ఏమి చేయాలి? మనము ఎక్కడికి వెళతాము ?
అనే ప్రశ్నలు మీలో తలెత్తి ,వాటి గురించి వివరంగా తెలియ జేసే జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం
చేయడ మే నిజమైన జీవితము
కాళీమాత ఆలయంలో ఓరోజు ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు.
అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు..
లడ్డూకి చీమలు పట్టడం మొదలైంది.
లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలీలేదు.
చీమలను చంపకుండా ఎలా?" అని ఆలోచనలో పడ్డారు.
వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంసను సలహా అడిగారు.
అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి. వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి,
ఇక ఇటు రావు అని సూచించారు.
పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారిలో
చక్కెర పొడి చల్లారు.
ఆ పొడిని చూడటంతోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి....
సమస్య కొలిక్కి వచ్చింది....
ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు ఇలా అన్నారు.... "మనుషులూ ఈ చీమల్లాంటివారే.
తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే
తమకు తెలియకుండానే దానిని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటేదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు తప్ప ముందనుకున్న లక్ష్యాన్ని విడిచిపెడతారు....
అని చెప్పారు.
తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని
ఒక్క చీమా ముందుకు రాలేదు.
మనం కూడా అలానే ‘భగవంతుడు సర్వస్వము’ అనుకొనే ధ్యాన సాధన మొదలు పెడతాము,
మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి
మన సాధన అంతా వృధా చేసుకొంటాము..
తీయగా ఉందన్న చక్కెరతో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు.
రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి.
లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే అని పరమహంస చెప్పారు.
*గరుత్మంతుడి గర్వభంగం*
ఇంద్రుని రథసారధి పేరు మాతలి. ఆ మాతలికి ఒక అందమైన, గుణవంతురాలైన కూతురు ఉంది. ఆమె పేరు గుణకేశిని. గుణకేశిని యుక్తవయస్సుకి వచ్చేసరికి ఆమెకు తగిన వరుని కోసం మాతలి పధ్నాలుగు లోకాలనూ వెతికాడు. ప్చ్! తన కూతురికి సరిపోయే జోడీ ఎవ్వరూ ఆయనకి కనిపించలేదు.
ఇదే విషయాన్ని నారదుని దగ్గర ప్రస్తావించగా... పాతాళలోకంలో ఆర్యకుడు అనే రాజుకి సుముఖుడు అనే మనవడు ఉన్నాడనీ... అతను గుణకేశినికి తగిన వరుడు కావచ్చునని సూచించాడు నారదుడు.
నారదుని సూచన మేరకు సుముఖుడిని చూసిన మాతలికి నిజంగానే అతను తన కూతురికి తగిన వరునిగా తోచాడు.
ఈ విషయం ఆర్యకునికి చెప్పగానే అతను సంతోషంతో ఉప్పొంగిపోయాడు. కానీ అంతలో ఏం గుర్తుకువచ్చిందో కానీ విచారంలో మునిగిపోయాడు. ‘మాతలీ! నీ కూతురిని మించిన సంబంధం మరేముంటుంది? కానీ నా మనవడికి ఒక గొప్ప ఆపద పొంచి ఉంది. విష్ణుమూర్తి వాహనమైన ఆ గరుత్మంతుడు మా జాతి మీద పగపట్టిన విషయం తెలిసిందే కదా! అతని పగని చల్లార్చేందుకు మేమే స్వచ్ఛందంగా మాలో ఒకరిని అతనికి ఆహారంగా పంపుతూ వస్తున్నాము. ఇప్పటికే అలా సుముఖుని తండ్రి గరుత్మంతునికి బలైపోయాడు.
ఇక త్వరలో సుముఖుని వంతు కూడా రాబోతోంది. త్వరలో చావు మూడబోతున్న వ్యక్తికి చూస్తూ చూస్తూ నీ కూతురిని ఇచ్చి వివాహం చేయలేవు కదా!’ అని వాపోయాడు.
ఆర్యకుని విషాదం విన్న మాతలికి ఏం చేయాలో పాలుపోలేదు. అలాగని సుముఖుని వదులుకునేందుకూ మనసు ఒప్పలేదు. దాంతో సుముఖుని తీసుకుని నేరుగా దేవలోకానికి వెళ్లాడు మాతలి. అక్కడ కొలువై ఉన్న ఇంద్రునికి తన సమస్యను నివేదించాడు. మాతలి సమస్యను విన్న ఇంద్రుడు వారిని తీసుకుని విష్ణుమూర్తి చెంతకు చేరుకున్నాడు. వైకుంఠంలో విష్ణుమూర్తి చెంత ఇంద్రుడు, మాతలి, సుముఖుడు వినమ్రంగా నిలబడి ఉండగానే... అక్కడికి ప్రవేశించాడు గరుత్మంతుడు.
అక్కడ ఏం జరుగుతోందో గమనించగానే అతని క్రోధానికి అడ్డులేకుండా పోయింది. నిప్పులు కక్కతూ- ‘ఇంద్రా! నా మాట కాదని ఈ సుమఖుని చిరాయువుగా చేసే ప్రయత్నం చేస్తావా. దగ్గరుండి ఇతని వివాహం జరిపించాలని తలపెడతావా. నా శక్తి గురించి నీకు తెలియదా! నిన్ను నేను అవలీలగా ఓడించిన రోజులు మర్చిపోయావా.
ఈ విశ్వం మొత్తాన్నీ ఒక్క ఈక మీద మోయగలను. సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే మోసే సామర్థ్యం నాకు ఉంది...’ అంటూ ఇంద్రుని వైపు దూసుకుపోయాడు.
ఇదంతా గమనిస్తున్న విష్ణుమూర్తి- ‘గరుత్మంతా! నేను ఇక్కడున్నానన్న విషయం కూడా మర్చిపోయి ప్రగల్భాలు పలుకుతున్నావే! నువ్వు అంతటి వీరుడవా? నన్ను సైతం అవలీలగా మోయగలవా! సరే నీ శక్తి ఏ పాటితో చూద్దాం ఉండు,’ అంటూ తన చేతిని గరుత్మంతుని మీద మోపాడు. అంతే! గరుత్మంతుడు ఒక్కసారిగా నేలకరిచాడు.
నోట మాటరాక చెమటలు కక్కుతూ దిక్కు తోచక మిన్నకుండిపోయాడు. విష్ణుమూర్తి తన చేతిని తీసిన తరువాత కానీ అతను ఊపిరిపీల్చకోవడం సాధ్యపడలేదు.
‘నేను నీకు మోసే అవకాశం ఇస్తున్నాను కాబట్టే నువ్వు నన్ను మోయగలుగుతున్నావు. కానీ నీ బాధ్యత గర్వంగా మారి తలకెక్కినట్లుంది. నువ్వు మోసే బరువుకంటే తలబరువే ఎక్కువగా ఉన్నట్లుంది. ఆ గర్వం తగ్గించుకుని బుద్ధిగా ఉండకపోతే ఇలాంటి పరాభవం తప్పదు,’ అంటూ హెచ్చరించాడు విష్ణుమూర్తి. దేవాదిదేవుడైన ఆ విష్ణుమూర్తి చేతిలో గర్వభంగం పొందిన గరుత్మంతుడు తన తప్పుని తెలుసుకున్నాడు. ఆ తప్పుని మన్నించమంటూ ఇంద్రుని వేడుకుని, తల వంచుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు.
[
*భక్తి - భుక్తి - ముక్తి*
ఎంతటి జ్ఞాని అయినా మనుషులకు దూరంగా ఒంటరి జీవితం గడిపితే, ఆయన వల్ల సమాజానికి కలిగే మేలు ఏమీ ఉండదు. ప్రజలతో కలవని సాధువృత్తికి ఫలం లేదు. అజ్ఞానులు ఎప్పుడూ మూర్ఖత్వంలో పొర్లాడుతూ ఉంటారు. వాళ్లు తమను తాము గొప్పగా భావించుకుంటారు. భక్తులకు వీటితో పని లేదు. తమ సామర్థ్యాన్ని లోకోపకారానికి ఉపయోగిస్తారు. దైవభక్తుల గుణాలు ఎలా ఉంటాయి? స్కంద పురాణం వైష్ణవ ఖండం ఇలా చెబుతోంది…
ప్రశాంత చిత్తం, సౌమ్యత, జితేంద్రియత, మనోవాక్కాయాల చేతా పరులకు కీడు తలపెట్టకుండటం, దయాగుణం, పరుల ఆనందాన్ని తనదిగా భావించడం, అందరి హృదయాల్లో ఉండే వాసుదేవుణ్ని గుర్తించడం...’ అనే గుణాలు గలవాళ్లు భక్తులు! శ్రీహరి చరణారవిందాలనే సదా ధ్యానిస్తూ ఉండటం చేత, చూసేవారికి జడులుగా కనిపిస్తారు. రామకృష్ణ పరమహంస అలాగే కనబడేవాడు. మనసును, వాక్కును వినయంతో భగవంతుడికి సమర్పించడం వల్ల భక్తులు పరమశాంతంగా జీవిస్తారు. సదా భజనలతో కాలం గడుపుతారు. తానొక నీటిబొట్టు. భగవంతుడు మహాసముద్రం. ఆ మహాసముద్రంలో తాను కలిసిపోవడమే మోక్షం. భక్తుడి జీవితమే ఒక తపస్సు. ఆ మార్గంలో అతడు అనేకమై, అనంతమై, బ్రహ్మమై, తుదకు వాసుదేవుడవుతాడు.
భక్తిమార్గంలో ప్రయాణించేవారి హృదయంలో మానవత్వం తొణికిసలాడుతూ ఉంటుంది. ‘నిరంతర కృషి, సాటివారిపై దయ చూపడం’- ఇవే మానవత్వ లక్షణాలు. ఈ సుగుణాలు లేకుండా ఉంటే 'భక్తి' ప్రదర్శన కేవలం 'భుక్తి' కోసమే. పెద్ద పెద్ద రుద్రాక్షమాలలు, ఒంటినిండా బొట్లు మాత్రమే ఉంటే- అది 'భుక్తి' మార్గం. 'భక్తులను భగవంతుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి భక్తి ఒక్కటుంటే చాలు బతికిపోవచ్చు' అని కొందరు భావిస్తుంటారు.
ఇద్దరు భక్తులు తీర్థయాత్రలకు బయలుదేరారు. నడిచీ నడిచీ అలసి సొలసి ఒక చెట్టుకింద కూర్చున్నారు. 'మిత్రమా! ఆకలి వేస్తూ ఉంది. అలా వనంలోకి వెళ్ళి తినడానికేమైనా కాయాగసరూ దొరుకుతాయేమో వెదుకుదాం పద!' అన్నాడు ఒకడు.
నాకూ ఆకలిగానే ఉంది. నేను నిజమైన భక్తుణ్ని గదా! నా తిండి సంగతి దేవుడే చూసుకుంటాడు. నాకు రాసిపెట్టి ఉంటే ఆహారం అదే నా వద్దకు నడుచుకుంటూ వస్తుంది!' అని రెండోవాడు కాళ్లు బార చాపుకొని పడుకున్నాడు. మొదటి బాటసారి రామ నామాన్ని జపిస్తూ, పరిసర ప్రాంతాల్లోని చెట్టూ చేమల్ని గాలించి, కొన్ని పండ్లు సేకరించి తెచ్చాడు. 'మిత్రమా! కొన్ని పండ్లు నువ్వు కూడా తిను!' అంటూ తానుతెచ్చిన వాటిలో సగాన్ని రెండో భక్తుడి ముందర పెట్టాడు.
అతడు సంతోషంగా వాటిని అందుకున్నాడు. 'నేను ముందే చెప్పలా... ఆ దేవుడే నాకు పంపిస్తాడు! చూశావా? ఇప్పుడీ పండ్లు అవే నడుచుకుంటూ వచ్చాయా లేదా?' అన్నాడు తన భక్తి మహత్తుకు మురిసిపోతూ.
మొదటి భక్తుడు నింపాదిగా అన్నాడు…'మిత్రమా! దేవుడు నేను కష్టపడి తెచ్చినవి నీకు ఇవ్వమనలేదు. పైగా సోమరిపోతు తనాన్ని ఏ దేవుడూ మెచ్చడు. పని చెయ్యమనే శ్రీకృష్ణుడి ఉపదేశం. కానీ... నేను దైవాన్ని కూడా ధిక్కరించి నీకు పండ్లు ఇస్తున్నాను. సాటి మనిషి ఆకలి పట్టించుకోకుండా ఒక్కడే తినడాన్ని దేవుడు హర్షించడు. ఇప్పుడు నీకు పండ్లు లభించడంలో నీ భక్తి మహిమ ఏమీ లేదు. నాలోని మానవత్వం నీకు పండ్లు ప్రసాదించింది!'
భక్తిమార్గం సమాజాన్ని సంస్కారం వైపు నడిపిస్తుంది. సంఘచైతన్యానికి పాటుపడిన భక్తులెందరో ఉన్నారు. పంజాబులో భక్తి సంప్రదాయంతోనే సిక్కుమతం ప్రారంభమైంది. ‘వీరఖల్సా’ ఉద్భవించింది. వల్లభ భక్తి సంప్రదాయకులు సైనిక శక్తిని పునరుజ్జీవింపజేయడానికి సంకీర్తన సంఘాన్ని ఏర్పాటుగావించారు. రసఖాన్ వంటి సామాజిక సమరసతా భక్తులు తయారయ్యారు. హిందీ భాషీయులు ‘రామచరిత మానస్’ను శిరసున పెట్టుకొని పూజిస్తారు. వంగ భాషీయులు చైతన్య మహాప్రభువుల సంకీర్తనలను పారవశ్యంతో గానం చేస్తారు. వీరి భక్తి ఉద్యమాలు సమాజంలో పెనుమార్పులకు కారణమయ్యాయి. పాదుషా ప్రభుతను లెక్క చేయని భక్తరామదాసు కీర్తనలు మనకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. రాజులను సైతం లెక్క చేయకుండా, దైవభక్తి ఆధిక్యాన్ని స్పష్టంగా ప్రకటించిన అన్నమయ్య, పోతన, ధూర్జటి వంటి మహాకవులు తమ ఇష్ట దేవతారాధనతో ముక్తి పొందారు. వారంతా సమాజంలోని సాటివారితో కలిసి మెలిసి జీవించారు. భుక్తి కోసమైతే రాజభక్తిని ప్రకటించి ఉండేవాళ్లు! గొప్ప భక్తులందరూ యోగీశ్వరులే! 'సమస్త ప్రాణుల సుఖదుఃఖాలను తమవిగా భావించి ఎవరు సేవిస్తారో అటువంటి యోగీశ్వరులు సర్వోత్తములు.
విద్య లేనివారికి విద్యను, రోగగ్రస్తుడికి ఔషధాన్ని, పేదలకు అన్న వస్త్రాలను ఎవరు అందజేస్తారో వారే యోగీశ్వరుల్లో శ్రేష్ఠులు'- అంటుంది భగవద్గీత.
[.....
*ఊర్వశి శాపం*..
ధర్మరాజు దివ్యాస్త్రాలు సంపాదించుకురమ్మని అర్జునుణ్ణి హిమగిరి ప్రాంతాలకు పంపాడు. అర్జునుడు దక్షిణదిశగా వెళ్ళి ఇంద్రలోక పర్వతం మీద తపస్సు చేసాడు. ఇంద్రుడు సంతోషించి కోరినన్ని వరాలు ఇచ్చాడు. అటు తరువాత యమధర్మరాజు దండాస్త్రాన్నీ, వరుణుడు పాశాన్నీ, కుబేరుడు అంతర్ధానాస్త్రాన్నీ ఇచ్చారు. అర్జునుడు ఇన్ని దివ్యాస్త్రాలు సంపాదించడం ఇంద్రుడికి నిజంగా ప్రీతి కలిగించింది. తన రథ సారథి మాతలిని పిలిచి అర్జునుణ్ణి దేవలోకానికి తీసుకురావల్సిందిగా ఆజ్ఞాపించాడు.
మాతలి సరేనని వెళ్ళాడు.
మాతలి సారథ్యంలోని రథం బంగారు ఆభరణాలతో చూడముచ్చటగా వుంది. వాయువేగంతో పరుగులు తీసే గుర్రాలు ఆ రథానికి పూంచి వున్నాయి. అవి మహాఘోషతో మేఘాలను చీల్చుకుంటూ వెళ్ళాయి.
మాతలి అర్జునుడి దగ్గరకు వెళ్ళి, "అర్జునా! అమరనాథుడు నిన్ను స్వర్గానికి తీసుకురమ్మని నన్ను పంపాడు. దేవ, ముని, గంధర్వ, అప్సరసలతో కొలువుతీర్చి దేవేంద్రుడు నీ రాకకై ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ళు అక్కడే అమర సుఖాలు అనుభవించి తిరిగి భూలోకానికి వెళ్లవచ్చని ఇంద్రుడు నీతో చెప్పమన్నాడు" అన్నాడు.
అది విని అర్జునుడు మహదానందపడ్డాడు. దేవరథం అధిరోహించాడు. తక్షణం అది దివ్యపథం పట్టింది.
అమరావతీనగర మొగసాలలో ఆగింది. రథం దిగి లోకానికి నడిచాడు. అక్కడ దేవేంద్రుడు కొలువుతీరి ఉన్నాడు.
సవ్యసాచి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఇంద్రుడు అర్జునుణ్ణి కౌగలించుకుని ఆప్యాయంగా శిరస్సు నిమిరాడు. నారదుడు ఆశీర్వదించాడు. తుంబురుడు పాట పాడాడు. అప్సరసలు నృత్యం చేశారు.
పార్థుడు అమరలోకంలో కొన్నాళ్ళుండి భూలోకంలో లేని సంగీత నృత్యగానాలూ, విలువిద్యలో మెళకువలూ తెలుసుకున్నాడు.
అర్జునుడి అందానికీ, ఠీవికీ, శక్తియుక్తులకీ దేవలోకంలోని అప్సరస్త్రీలు సమ్మొహితులయ్యారు. పాండవ మధ్యముడికి తన ప్రేమను అర్పించాలని సౌందర్యరాశి ఊర్వశి తహతహలాడసాగింది. అర్జునుడితో తన ప్రేమ సఫలమయ్యేట్టు చూడమని ఇంద్రుణ్ణి ప్రార్థించింది.
పార్థుడికి తన కోరిక తెలియపరచమని పరిచారిక చిత్రసేనను వేడుకుంది.
చిత్రసేన వెళ్ళి "మన్మథాకారా! అప్సరకన్య మా ఊర్వశి నిన్ను మోహించింది. నీవు లేకుండా క్షణమైనా గడపలేనంటోంది. కనుక ఆమెను చేపట్టి సుఖాలు అనుభవించు" అని అర్జునుడితో చెప్పింది.
అది విని ధనుంజయుడు చెవులు మూసుకున్నాడు. "ఆమె నాకు తల్లితో సమానం. పూజ్యురాలు. మా వంశానికి మూల పురుషుడైన పురూరవుణ్ణి ఆమె వరించింది. కనుక ఇలాంటి చెడు ఆలోచన ఆమె మనస్సులో రావటం మంచిది కాదని చెప్పు " అని బదులు చెప్పాడు.
చిత్రసేన వెళ్ళి ఆ సంగతి ఊర్వశితో చెప్పింది.
జగదేకసుందరి ఊర్వశి చిరుకోపం తెచ్చుకుని అందెలు ఘల్లుఘల్లున మోగుతుండగా తానే బయలుదేరి పార్థుడి మందిరానికి వెళ్ళింది.
"మేము అప్సరకాంతలం. భూలోకంలో పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వచ్చిన మహనీయులను సంతోషపెట్టటం మా విధి. పూరు వంశంలో జన్మించిన ఎందరో రాజులు స్వర్గానికి వచ్చి నాతో సౌఖ్యం అనుభవించారు. కాబట్టి నీవూ సంశయించక నాతో సుఖాలు అనుభవించు" అని చెప్పింది.
"తల్లీ! నీవు చెప్పింది నిజమే కావచ్చు. పెద్దలూ మహనీయులూ ఏమీ చేసినా ఒప్పే. కాని నా వంటి వాడికి అది తగని పని. ఈ అనుచితకార్యానికి నా మనస్సు అంగీకరించదు. నన్ను మన్నించు" అన్నాడు పార్థుడు.
అర్జునుడు అలా తిరస్కరించేసరికి ఊర్వశి కోపం పట్టలేకపోయింది. "పార్థా! నేను స్త్రీని. పైగా నా అంతట నేను వలచి వచ్చినందుకు నన్ను చులకన చేశావు. పరాభవించావు. కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నీవు మానరహితుడవై ఆడపిల్లలకు ఆట పాటలు నేర్పుతూ స్త్రీ, పురుష జాతికి దేనికీ చెందకుండా వుందువు గాక!" అని తీవ్రంగా పలికి వెను దిరిగి వెళ్లి పోయింది.
ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. నాయనా! ఊర్వశి శాపానికి భయపడకు. నీకు ఒక ఏడాది అజ్ఞాత వాసం ఎలాగో చెయ్య వలసి ఉంది. ఆ సమయంలో ఇతరులు నిన్ను ఎవరూ పోల్చు కోకుండా ఉండేందుకు ఈ శాపం బాగా ఉపకరిస్తుంది. అజ్ఞాత వాసం పూర్తయ్యాక నీ అసలు రూపం నీకు వస్తుంది" అని దీవించాడు.
అర్జునుడు సంతుష్టుడైనాడు.
[
*యాదవ ముసలం*
కణ్వ, విశ్వామిత్ర, నారద మహర్షులు ముగ్గురూ కృష్ణభగవానుణ్ణి చూడటానికని ద్వారకానగరానికి బయలుదేరారు. వాళ్ళు రాజవీధిని వస్తూండడం చూసిన యాదవులకు దుర్బుద్ధి పుట్టింది. కృష్ణుడి కొడుకు సాంబుడికి ఆడపిల్ల వేషం వేసి తీసుకువచ్చి "అయ్యా! ఇది భద్రుడి భార్య. దీనికి సంతానం కలుగుతుందా?" అని అడిగారు మునుల్ని యదుకుమారులు.
అంతమాత్రం తెలుసుకోలేరు గనుకనా ఆ మహర్షులు!
"వీడు కృష్ణుడి కొడుకు సాంబుడని తెలుసు మాకు. వీడికి యాదవవంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది! కృష్ణుడూ, బలరముడూ తప్ప తక్కిన యాదవులంతా అ రోకలి వల్ల చస్తారు. బలరాముడు అదికనిష్ఠతో శరీరం విడిచి సముద్రంలో ప్రవేశిస్తడు. నేలమీద పడుకుని వుండగా కృష్ణుణ్ణి 'జర ' అనే రాక్షసి పుట్టి అక్రమిస్తుంది. పొండి" అన్నారు వాళ్ళు కోపంగా.
ఇంత చేసి ఇంక మనం వాసుదేవుణ్ణి చూడడం మంచిది కాదనుకుని మహర్షులు ముగ్గురూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు.
తరువాత కృష్ణుడు ఇదంతా తెలుసుకుని జరగవలసింది జరిగే తీరుతుందనుకుని ఉదాసీనంగా వూరుకున్నాడు.
ఆ మర్నాడు సాంబుడి కడుపులోంచి భయంకరంగా వున్న ఒక రోకలి పుట్టింది. యాదవులందరూ భయంతో పరుగెత్తుకు వెళ్ళి ఆ సంగతంతా వసుదేవుడికి చెప్పారు.
"ఆ రోకలిని పిండి పిండి చేసి సముద్రంలో కలిపిరండి" అని ఆజ్ఞాపించాడు. యాదవులంతా వెళ్ళి అయన చెప్పినట్లే చేశారు. కాని గాంధారి శాపం, మహర్షుల ఆగ్రహం ఎక్కడికి పోతాయి?
ద్వారకాపట్టణంలో అనేక ఉత్పాతాలు కనిపించాయి. రాత్రివేళల్లో చిలుకలు గుడ్లగూబల్లా అరవసాగాయి. పగలు మేకలు నక్కల్లా కూశాయి. ఆవులకు గాడిదలూ, ముంగీసలకు ఎలుకలూ, కుక్కలకు పిల్లులూ పుట్టాయి. కృష్ణబలరాములు తప్ప మిగిలిన యాదవులందరూ సజ్జనులను బాధపెట్టడం మొదలుపెట్టారు. గురువులను అవమానించారు. స్త్రీలు ఇష్టం వచ్చినట్లు సంచరించారు. కూడూ కూరలూ అప్పుడే పొయ్యిమీద నుంచి దింపినాసరే - పురుగులు పట్టడం మొదలెట్టాయి. ఈ అశుభ సూచనలన్నీ చూసి గాంధారి శాపం ఫలించే సమయం ఆసన్నమైందనుకున్నాడు కృష్ణుడు. యాదవులు తీర్థసమీపంలో చావడం మంచిదని భావించాడు కృష్ణుడు. ఇంక తెల్లవారితే వాళ్ళంతా కాలం చేస్తారనగా అంతకు ముందురోజే కొలువుతీర్చి "సముద్రానికి జాతర చెయ్యాలి. అందరూ బయల్దేరండి" అని ఆజ్ఞ ఇచ్చాడు.
రాబోతున్న ప్రమాదం గ్రహించుకోలేక పానీయాలూ, భక్ష్యభోజ్యాలు, మాంసాహారాలూ సమకూర్చుకుని, అందంగా అలంకారాలు చేసుకుని చతురంగ బలాలతో బయలుదేరారు యాదవులు.
నిర్వికారుడై బయలుదేరాడు కృష్ణుడు.
అందరూ సముద్రతీరాన వున్న పందిళ్ళ దగ్గరకు చేరుకున్నారు. బలరాముడు మాత్రం అరణ్యాలకు వెళ్ళాడు. యాదవులు తెచ్చుకున్న భక్ష్యాలన్నీ తిన్నారు. ప్రభువైన కృష్ణుడి ఎదురుగానే మత్తుపానీయాలు సేవించారు. అసంబద్ధపు ప్రేలాపనలు సాగిస్తూ నవ్వడం మొదలుపెట్టారు.
"ప్రద్యుమ్నా! అడుగో కృతవర్మ! చూశావా! నిద్రపోతున్న వాళ్ళను చంపాడు. ఏంపౌరుషంరా! ఎంత నీచుడైనా అలాంటి పని చేస్తాడా?" సాత్యకి కృతవర్మను ఎగతాళి చేశాడు.
"అర్జునుడు చెయ్యి నరికితే శాంతించిన భూరిశ్రవుణ్ణి చంపావు నువ్వు. అది మరిచిపోయావా? నువ్వు చేసింది రణనీతి కాబోలు!" కృతవర్మ ఆక్షేపించాడు.
సాత్యకికి కోపం వచ్చి కత్తి దూసి గబగబ వెళ్ళి కృతవర్మ కంఠం నరికేసాడు. సముద్రతీరాన తుంగగా మొలిచిన రోకలి ప్రభావం ఆ నిమిషంలో ఆ కత్తిని ఆక్రమించి వుంది. అంతటితో వూరుకోక సాత్యకి భోజులందరిమీదా విజృంభించాడు. వారించడానికి కృష్ణుడు వెళ్ళేలోగానే భోజులంతా సాత్యకిని చుట్టుముట్టారు. అయితే జరగబోయేదంతా తెలిసిన వాడవడం వల్ల కాలస్వరూపుడైన కృష్ణుడు సాత్యకిని రక్షించే ప్రయత్నం చెయ్యలేదు.
సాత్యకిని కాపాడడం కోసం ప్రద్యుమ్నుడు విజృంభించాడు. ఈ విధంగా వాళ్ళల్లో వాళ్ళకు కయ్యం ప్రారంభమైంది. ఆ సముద్రతీరంలో మొలిచిన తుంగ పీకి దాంతో ఒకరినొకరు కొట్టుకుని హతులయ్యారు వాళ్ళందరూ.
ఆనాడు వాళ్ళు అరగదీసి సముద్రంలో కలిపిన రోకలే అక్కడ తుంగగా మొలిచింది! అదే వాళ్ళ యుద్ధానికి సాధనమై చావుకు కారణమైంది!!
దారుకుడూ, బభ్రుడూ తప్ప మిగిలిన యాదవులంతా నాశనమయ్యారు. వాళ్ళిద్దర్నీ వెంటబెట్టుకుని బలరాముడు వెళ్ళినమార్గానే సాగాడు కృష్ణుడు.
[
*అధికారం ధనం ప్రేమ..కర్మ సిద్ధాంతం*
ఒక వ్యక్తి ని పరీక్షించ దలచుకుంటే అధికారం కానీ ధనం కానీ లభింప చేయాలి. అతడి అంతర్గత గుణం వ్యక్తిత్వం వెలికి వస్తాయి.
భగవంతుడు కొన్ని ఇచ్చి పరీక్షిస్తాడు.కొన్ని దూరం చేసి పరీక్షిస్తాడు. ప్రారబ్ధ కర్మలో ఈ అధికార ధనాలు పొందాలనే ఉంది కాని, దాని వల్ల అహంకారం పొందమని కానీ, దుర్వినియోగం చేయమని కానీ లేదు.
కర్మ సిద్ధాంతానుసారం దుర్వినియోగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనకి లభించిన శక్తి ఒక సత్కర్మ ఫలితమే అని గ్రహించాలి.. అలా లభించిన శక్తి పది మందికి ఉపయోగ పడేలా చేయక పోయినా,
లాభం తో , స్వార్ధం తో అహంకారం తో తన స్వ ప్రయోజనానికి మాత్రమే పరిమితం చేసుకుంటే , లభించిన ఆ శక్తి ,తిరిగి ఎప్పటికి , ఏ జన్మ కి లభించదు. తిరిగి మళ్లీ ఆ శక్తి పొందాలంటే ,అంతటి కృషి శ్రమ అటువంటి కర్మ చేయ వలసిందే..
అధికారం ద్వారా ఇతరులకు బాధ కలిగిస్తే, హింస పెడితే, ఆ ఆధికారం ఒక భయంకర చక్రం లా తిరిగి అతడి పైకి వస్తుంది.. తాను ఇతరులను ఎలా పీడించాడో , దుఃఖం కలిగించాడో మరచి పోయి , " దేవుడు కాపాడడా ? అని ఒకరోజు దుఃఖిస్తాడు..
ఇదే విధం గా ఎంతో ప్రేమ ని పొందినా తిరస్కరించి , అవమానించి , దూరం చేసినా,, ఇదే ఫలం. తల్లి తండ్రి. ప్రేయసీ ప్రియులు అక్క తమ్ముడు ప్రతి బంధానికి ఈ కర్మ వర్తిస్తుంది..
ప్రేమ కి ద్రోహం చేస్తే , తిరిగి , తాను కోరుకున్న చోట ఆ ప్రేమ లభించక పోగా , అదే ద్రోహానికి మోసానికి గురి అవుతారు.. ప్రతి ఒక్కరు తాను ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించారో జ్ఞాపకం తెచ్చుకోరుగా..
ప్రతి ఒక్క కర్మ స్వయం కృతమే. దీనిని తెలుసు కోకుండా భగవంతుడిని నిందిస్తారు.. అధికారం పొందగానే సర్వ విధ జ్ఞానం పొందినట్లు అనిపిస్తుంది. కొద్దీ అధికారమే సంపూర్ణం గా. వినయాన్ని. హరిస్తుంది..ప్రతి మాట. ఒక దుష్కర్మ గా మరి ఒక శరం లా తిరిగి వస్తుందని గ్రహించరు..
వ్యంగ్యాలు వెటకారాలు పరుష వాక్కులు ఉత్తముడని తెలిసినా నింద లు వేస్తూ హృదయాన్ని గాయ పరుస్తూ మాట్లాడే. అహంకారులు ఎందరో. ఉన్నారు..దీనికి. కర్మ ఫలం గా. వారి. మనస్సు భవిష్యత్తు లో అతి దారుణంగా శిక్షించ బడుతుంది అనే విషయం గ్రహించరు..ఆనాడు. పరుష వాక్కులు చాలా " తప్పు ".అనే. విషయం గ్రహిస్తారు.
అహంకారం విపరీతం అవుతుంది తన క్రింద పని చేసే వాళ్ళందరు
తెలివి తక్కువ వాళ్ళు గా కనిపిస్తారు.. తన క్రింద పనిచేసే వారికి
కీర్తి పేరు వస్తే తమ గొప్పతనం తగ్గిపోతుందని...వారిని. ప్రతిక్షణం కించ పరుస్తూ అవమానిస్తూ మాట్లాడతారు.. ఈ. అధికారం లేకపోతే తాము ఇలా మాట్లాడ లేమనే విషయం. వారికి. గుర్తుకు. రాదు.
చాలామంది అధికారులు ఆత్మన్యూనత భావం తో
బాధ పడతారు. దీని వలన ఒక భజన బృందం చుట్టూ ఏర్పడుతుంది.
ఇది పతనానికి మార్గం..
వంద యజ్ఞాలు చేసి ఇంద్ర పదవి పొందిన నహుషుడు అధికారం
తో గర్వించి సప్త ఋషులను అవమానించాడు...ఒక సర్పమయి
అరణ్యం లో పడి ధర్మ రాజు తో తన దీన గాధ చెప్పుకుంటాడు.
వినయం కలిగిన అధికారులు చాలా తక్కువ..
మీ మాట లోని శృతి లో మీ అహంకారం లేదా వినయం శాంతం
సౌజన్యం వినిపిస్తాయి....పరీక్షించుకుందామా. !
డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్
[
అచ్చులన్నీ అచ్చుపోసి .. ..
హల్లులు హరివిల్లులా..
పదాలపారాణి అద్ది..
ఆ శర్వాణి పాదాలకు
అక్షరనీరాజనం అర్పించువాడు గురువు.
తల్లి తండ్రి జన్మనిచ్చి..
తప్పటడుగులు వేయిస్తే..
మన లో జ్ఞానజ్యోతి ని
వెలిగించి తప్పుడడుగులు
పడకుండా కాపాడే అదృశ్యశక్తి
గురువు..
మన అజ్ఞానాందకారాన్ని తొలిగించే ఆపద్భాంధవుడు గురువు...
ఆలోచన పెంచేది గురువే..
వివేచన కలిగించేది గురువే..
మన హృది లో విజ్ఞానసుమాలు పూయించి
జీవితాన్ని ఓ నందనవనం లా
మార్చేది గురువే.
దేశాని కి రాజైనా,చక్రవర్తి అయినా మోకరిల్లేది గురువుకే..
సంస్కారబీజాలను
అంకురార్పణ చేస్తూ
కాలజ్ఞానాన్ని బోధించిన వీరబ్రహ్మంలాంటి వాడు గురువు..
జీవన రణక్షేత్రo లో
వ్యక్తిత్వవికాస గీత ను
బోధించే కృష్ణుడoతడి వాడు గురువు..
జగతి ని సన్మార్గంలో నడిపే
జగద్రక్షకుని లాంటి వాడు
గురువంటే..
వ్యాసుడు, వాల్మీకి,పరమహంసలను
లను సంభోధించే గురువు అనే
సంభోధన తో పిలువబడు... ఉపాధ్యాయులందరిది ..
ఎంతటి భాగ్యమో కదా!!!
ఆ జన్మము ఎంతటి ధన్యమో కదా!!!..
వారందరి కి శిరస్సు వంచి..
నమస్కరిస్తూ నా కవిత తో
అక్షరనీరాజనం అర్పిస్తున్నా.
🙏🙏🙏🙏🙏
మాధవి శ్రీనివాస్ నందిమళ్ల
[
*గురువందనం*
గురువును వ్యక్తిగా, దైవాన్ని ప్రతిమగా, మంత్రాలను అక్షరాలుగా పొరబడుతుందీ లోకం. లోచూపుతో గ్రహిస్తే గాని తెలియదా సత్యం. ‘సారమతిం కవీంద్రులు...’ అనే నన్నయ పద్యంలో ‘లోనారసి’ పదానికి అర్థమదే! ప్రహ్లాదుడు ‘ఇందుగలడందు లేడను సందేహము వలదు’ అంటూనే విష్ణువును ‘వెదకి’ చూడమన్నది ఎందుకంటే- వెతకవలసింది లోచూపుతో కనుక. ఆ చూపును అలవరచే తొలి గురువులు- తల్లి, తండ్రి. తదుపరి ఉపాధ్యాయుడు. శాస్త్రం అందుకే అమ్మానాన్నల సరసన గురువుకు పెద్దపీట వేసింది. ‘గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః’ అంటూ పరబ్రహ్మ స్వరూపుడిగా ఆరాధించింది. జగద్గురువు శ్రీకృష్ణుడు సైతం ‘సర్వజ్ఞత్వముతో సంపూర్ణుడై ఉండినన్’ లోక రీతిని మన్నించి సాందీపని ఆశ్రమంలో చేరి అరవైనాలుగు విద్యలూ నేర్చాడని భాగవతం చెబుతోంది. శిష్యులకు తిండిపెట్టి బట్టలిచ్చి చదువు చెప్పే గురుకుల వ్యవస్థలోని సాందీపని తరహా గురువులను ‘కులపతులు’ అంటారు. ‘పుత్రభావము ఉనిచి సత్కరుణను ధన్యుల చేయుట’ కులపతుల సహజ ధర్మం. ఆధునిక యుగంలోనూ ఆ ధర్మాన్ని కొనసాగించిన గురువులను తిరుపతి వేంకట కవుల ‘కథలూ గాథలు’, శ్రీపాద ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’, దువ్వూరి ‘స్వీయచరిత్ర’ల్లో గమనించవచ్చు. ‘విద్యోపదేశ గురుడు అనవద్యమతి సుబోధకత్వ పద్ధతి వైశారద్యుడు వందనీయుడు’ అంటూ మహేంద్ర విజయంలో సుబ్బరాయకవి స్తుతించింది వారినే! ‘చెళ్ళపిళ్ళ వేంకన గురువంచు చెప్పికొనగా అది గొప్ప- తెలుంగు నాడునన్’ అంటూ విశ్వనాథ చేసిన గురువందనంలో ఆ వ్యవస్థ అవశేషాలు ప్రతిఫలిస్తాయి. ‘ఆ ఎలనాగ(రుక్మిణి) నీకు తగును, అంగనకున్ తగుదు ఈవు(కృష్ణుడు) మా ఉపాధ్యాయుల ఆన! పెండ్లియగు తప్పదు’ అని పురోహితుడు తన గురువులపై ఒట్టేసి చెప్పడం- గురుకుల సంప్రదాయానికి నీరాజనం!
ఉపాధ్యాయుడు అనే పదానికి శాస్త్రం ‘ఉపేత్య అధీయతే అస్మాత్... వేతనం అందుకొంటూ, బోధనను వృత్తిగా చేపట్టినవారు’ అని నిర్వచనం చెప్పింది. వారు ‘శిష్టులయ్యు ధనార్జనా విష్టులగుచు మాస భృతి చేకొని’ విద్యను బోధిస్తారన్నారు- వేంకట రామకృష్ణ కవులు. వృత్తిగానే స్వీకరించినా, ‘గురుశబ్దం తరుశబ్దం నీడనివ్వడానికే’ అని గ్రహించి నిరంతర అధ్యయన అధ్యాపనాలతో దాన్నొక యజ్ఞంలా నిర్వహిస్తూ, ‘అయ్యది అమృతంబు, దానిట్టి చవి యది’ అని ఊరిస్తూ శిష్యులకు చదువుల్లోని మర్మాలను విశదీకరించేవారు ఇప్పటికీ ఉన్నారు. అలనాటి ఆచార్యులు, కులపతులతో వారు తప్పక తులతూగుతారు. ‘గురువంటే ఎవరు? గుడి వెలుపలి దైవం, చీకటి చిందేసినప్పుడు వేకువలో ధైర్యం’ వంటి వర్ణనలు వారికీ వర్తిస్తాయి. ‘ఉపాధ్యాయుడు వెలుగుతున్న కొవ్వొత్తిలా ఉండాలి’ అని ప్రవచించడమే కాదు- అక్షరాలా ఆచరించి శిష్యులను వెలిగించిన మహోపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ వారిలో ఒకరు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ఆరంభించి, ఇటు రాజనీతిజ్ఞుడిగాను- అటు దార్శనికుడిగాను ఎదిగిన తత్త్వశాస్త్ర విద్యాకోవిదుడాయన. భారత పాశ్చాత్య దేశాల మధ్య తాత్త్విక మహా సేతువును నిర్మించి, అటు అత్యున్నత నైట్హుడ్(1931)ను- ఇటు భారతరత్న(1954)ను అందుకొన్న మేధావి సర్వేపల్లి. ‘నేను మీ అర్జునుణ్ని... మీరు నాకు గీతాచార్యులు’ అని మన జాతిపిత గాంధీజీ నోట జేజేలు అందుకొన్నారంటే- సర్వేపల్లి వ్యక్తిత్వం ఎంతటిదో మనం ఊహించుకోవచ్చు. కవి రసరాజు చెప్పినట్లు ‘తత్త్వార్థ చాంద్రీకల్హార సుశోభితుండయిన సర్వేపల్లి మావాడు’ అంటూ ఈ జాతి ఎందుకు గర్వించిందో మనం గ్రహించవచ్చు. ఆయన పుట్టినరోజును ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్ణయించడంలోని ఔచిత్యాన్ని అర్థం చేసుకోవచ్చు!
✍️ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి
[
*ఆచార్య దేవోభవ*
బిడ్డకు తొలి దైవం అమ్మ. లోకానికి శిశువును, శిశువుకు లోకాన్ని పరిచయం చేసేది ఆమే. కాబట్టి తల్లి తొలి గురువు. ఆ బిడ్డకు నడత నేర్పే నాన్న మలి గురువు. ఆ తరవాతి స్థానం గురువుది. లోకంలో ఎలా మెలగాలో చెబుతూ, విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. అందుకే పెద్దలు మాతృదేవో భవ... పితృదేవో భవ... ఆచార్య దేవోభవ అన్నారు.
విలువలతో కూడిన విద్య సమాజాభివృద్ధికి బాటలు వేస్తుంది. కాబట్టి విద్య మానవత్వానికి మారుపేరు కావాలి. వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక విలువలు నేర్పించేదై ఉండాలి. సామాజికాభివృద్ధికి దోహద పడాలి. ఈ ప్రక్రియలన్నింటికీ వెన్నంటి ఉండేవాడే ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయులు, గురువులు సనాతన భారతావనిలో ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందినవారు సర్వేపల్లి రాధాకృష్ణన్.
గురువు- మనసును ఆవరించుకుని ఉన్న అజ్ఞానపు పొరలను తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగిస్తాడు. దైవం మంచి గురువును చూపలేక పోవచ్చేమో, కానీ మంచి గురువైతే మాత్రం దేవుణ్ని సైతం చూపగలడంటారు పెద్దలు. ‘దేవుడు, గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను’ అన్నారు కబీర్ దాసు. అంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పినవారు డాక్టర్ రాధాకృష్ణన్.రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడం వెనక ఒక కథ ఉంది. రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొందరు విద్యార్థులు, మిత్రులు సెప్టెంబర్ అయిదున ఆయన పుట్టినరోజు వేడుకలు జరపడానికి సన్నద్ధులయ్యారు. అనుమతించమని ఆయనను కోరారు. దానికి ఆయన నవ్వుతూ ‘నా పుట్టిన రోజున ఈ రకమైన వేడుకలకు బదులు, ఉపాధ్యాయులను గౌరవించే దినోత్సవంగా జరిపితే బాగుంటుందేమో’ అని సూచించారట. అప్పటి నుంచి ఏటా రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ అయిదో తేదీన ఉపాధ్యాయ దినంగా దేశమంతా జరుపుకొంటోంది.
వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ మాతృభాష తెలుగు. 21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. రాధాకృష్ణన్ చెప్పే పాఠాలు, ప్రసంగాలు, ఆయన వ్యక్తిత్వం విద్యార్థులను ఉత్తేజపరచేవి. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను విన్న మైసూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి హెచ్.వి. నంజుండయ్య పిలిపించి ఆచార్య పదవిలో నియమించారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని డాక్టర్ ఆశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ్ టాగోర్ కోరడంతో- ఆయన అక్కడికి వెళ్ళారు. కలకత్తా కాలేజీలో ప్రొఫెసర్గా చేరేందుకు రాధాకృష్ణన్ బయలుదేరినప్పుడు మైసూరు విద్యార్థులు పువ్వులతో అలంకరించిన ఒక గుర్రపు బగ్గీని ఏర్పాటు చేశారు. ఆ గుర్రపు బగ్గీని శిష్యులందరూ లాక్కుంటూ రైల్వేస్టేషన్ వరకు తీసుకువెళ్ళి వీడ్కోలు పలికారట!
కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్నప్పుడు ఆయన ‘భారతీయ తత్వశాస్త్రం’ అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది. సంస్కృతి, మతం, వేదాంతం, తత్త్వశాస్త్రం తదితర అంశాలపై ఇరవై మూడు గ్రంథాలు రచించారు. ఆయన తాత్విక చింతనకు సాహిత్య మాధుర్యాన్ని చేకూర్చిన మహా రచయిత. సనాతన భారతీయ పారమార్థిక విషయాలను ప్రపంచానికి సులభంగా, సుస్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు రాధాకృష్ణన్.
✍️అయ్యగారి శ్రీనివాసరావు
[
*సామాన్యుడి సమస్య* నారంశెట్టి ఉమామహేశ్వరరావు
ప్రహ్లాదపురంలో చిన్నడు ఎకరా భూమి ఉన్న రైతు . అతడి పొలం చుట్టూ మోతుబరుల పొలాలే. ఉన్న భూమినే నాలుగు భాగాలుగా చేసుకుని, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, వరి పండించుకునేవాడు చిన్నడు. ఏడాదంతా ఆదాయం వచ్చేలా పంటల్ని వేసేవాడు.
చిన్నడి పొలంలో కాపుకొచ్చిన ఆనబ, గుమ్మడి కాయల్ని రాత్రిళ్ళు ఎవరో పట్టుకుపోతున్నారు. ఆదాయమిచ్చే కాయలు పోతుండేసరికి బాధ పడ్డాడు చిన్నడు. గ్రామపెద్దని కలుసుకుని దొంగతనం విషయం చెప్పాడు.
చిన్నడిని చులకనగా చూసి “తప్పు నీదే. ఎకరా పొలాన్ని కూడా సరిగా చూసుకోలేవా? ఏభయి ఎకరాల భూమిని నేను చూసుకోవట్లేదా? ఇలా చిన్న విషయాలు చెప్పి సమయం వృధా చెయ్యకు. పోపో” అని కసిరేసాడు గ్రామపెద్ద. చుట్టూ ఉన్న జనం పకాలున నవ్వారు.
తనలాంటివాడికి కష్టమొస్తే తీర్చేవారుండరని చిన్నడు అనుకున్నాడు.ఎలాగైనా పంట కాపాడుకోవాలని రాత్రయ్యేసరికి పొలం గట్టు మీద మకాం వేసేవాడు చిన్నడు. చిన్న శబ్దమైతే చాలు అలికిడికి కూర్చుని పొలం వైపు చూసేవాడు. ప్రక్కనే దుడ్డుకర్ర, కారం పొడి ఉంచుకున్నాడు.
ఒక రోజు అర్ధరాత్రి పొలంలో చప్పుడైతే చిన్నడు మేలుకుని చూసాడు. ఇద్దరు దొంగలు గుమ్మడి కాయలు కోస్తున్నారు. దొరికార్రా దొంగలు అనుకున్న చిన్నడు ఒక పిడికిలిలో కారం మరోచేత్తో దుడ్డుకర్ర పట్టుకుని చప్పుడు చెయ్యకుండా వెళ్ళాడు. వెనక నుండి నడ్డిమీద కొట్టాడు. ఉలిక్కిపడిన దొంగలు తనవైపు చూసేసరికి వాళ్ళ కంట్లో కారం కొట్టాడు. ‘చచ్చాన్రోయ్ దేవుడా’ అంటూ దొంగలు బయటకి పరిగెత్తారు. వాళ్ళను ఎలాగైనా పట్టుకోవాలని వెంటపడ్డాడు చిన్నడు.
కళ్ళు మండుతున్నా అరిస్తే దొరికిపోతామని జాగ్రత్త పడ్డారు దొంగలు. బాధ భరిస్తూనే పొలాల మధ్యనున్న గొడ్ల చావిడిలో దూరారు. అది గ్రామపెద్దదే. పశువుల కుడితి తొట్లో ఉన్న నీటితో కళ్ళను కడిగి బయటకు చూసారు దొంగలు. తమకోసం వెతుకుతున్న చిన్నడు కనిపించాడు వాళ్ళకి.
ఇద్దరూ కూడబలుక్కుని గేదెలు, ఆవుల మెడలోని పలుపుతాళ్ళు విప్పేసి తోకలు మెలిపెట్టి చిన్నడి వైపుకు తరిమారు. భయంతో పరిగెత్తాయి పశువులు. వాటిని దుడ్డుకర్రతో అదిలించి ప్రక్కకు తప్పుకుని పాకలోకి వెళ్ళాడు చిన్నడు.
అప్పటికే అక్కడినుండి తప్పించుకుని ఊళ్లోకి పరిగెత్తారు దొంగలు. వాళ్ళవైపు పరిగెత్తాడు చిన్నడు.
ఈసారి దొంగలు ఒక ధాన్యం గిడ్డంగిలో దూరారు. అదీ గ్రామపెద్దదే. ధాన్యపు బస్తాల వెనుక దాక్కున్నారు. అక్కడికీ చిన్నడు రావడం చూసిన దొంగలు వాడికి దొరక్కూడదనుకున్నారు. మళ్ళీ పరుగు పెడుతూ, కళ్ళ మంట వలన సరిగా చూడలేక ప్రక్కనున్న దీపపు బుడ్డిని కాలితో తన్నారు. అది ఎగిరి పైకప్పుకి తగలడంతో గడ్డి అంటుకుని మంటలు లేచాయి. గిడ్డంగి మొత్తం అంటుకుని తగలబడింది.
మంటల్ని చూసి చిన్నడు లోపలకు రాకుండా ఆగగానే ముసుగుల్ని తీసేసి మంటల్లోకి విసిరారు దొంగలు. మంటలార్పడానికి వచ్చిన వాళ్లలా నటిస్తూ గట్టిగా అరిచి అందర్నీ రమ్మన్నారు. మంటలు ఆర్పడానికి తెచ్చిన నీళ్లతో తమను శుభ్రం చేసుకున్నారు దొంగలు.
బిందెలతో నీళ్లను తెచ్చి మంటల్ని అదుపు చేశారు ఊరి ప్రజలు. అయినప్పటికీ గిడ్డంగి పైకప్పు కాలిపోయింది.
ఊరంతా గోల పెడుతుంటే గ్రామపెద్ద ఇంట్లో నిద్ర లేచి గిడ్డంగి దగ్గరకు వచ్చాడు. అదంతా తగలబడి పోవడంతో గుండెలు బాదుకున్నాడు.
తెల్లారిన తరువాత పొలం పనివాళ్ళు వచ్చి ‘పశువుల పాకలో ఆవులు, దున్నపోతులు, గేదెలు పొలాల్లో నుండి పారిపోయాయని’ చెప్పారు. గ్రామపెద్ద భయపడుతూనే పొలానికి వెళ్ళాడు. పశువులు లేవు. పైగా పంటల్ని ఇష్టం వచ్చినట్టు తొక్కి పాడుచేశాయి. మళ్ళీ గుండెలు బాదుకున్నాడతడు.
చిన్నడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఒక దొంగ గ్రామపెద్ద దగ్గరకి వెళ్లి “మంటల్ని మొదట చూసింది నేను. వాటిని ఆర్పడానికి వెళ్లేసరికి అక్కడ చిన్నడు కనబడ్డాడు. వాడే మంట పెట్టాడేమో” అని అనుమానం రేకెత్తించాడు. చిన్నడిని పిలిపించాడు గ్రామపెద్ద.
ప్రజల ముందు నిలబెట్టి ఏమి జరిగిందో చెప్పమని గట్టిగా బెదిరించాడు గ్రామపెద్ద.
“నాకేమీ తెలియదు. మీరు చెయ్యమన్నట్టే దొంగల్ని పట్టుకోడానికి పొలంలో ఉన్నాను. నిన్న రాత్రి ఇద్దరు దొంగలు గుమ్మడి కాయలు కోస్తుంటే వెంటబడ్డాను. మీ పశువుల పాకలో దూరి పశువుల్ని విడిపించి నా మీదకు పంపారు. అటునుండటే వెళ్లి ధాన్యం గిడ్డంగి లో దూరారు. అక్కడ వాళ్ళేం చేసారో తెలియదు కానీ మంటలు లేచాయి. ఇంతకు మించి నాకేం తెలీదు. నేనే పాపం ఎరుగను” అన్నాడు చిన్నడు.
గ్రామపెద్ద చిన్నడి వైపు కొరకొరా చూసి “ఒక్కడివే దొంగల్ని పట్టేద్దామనే వెళ్ళావా?మేమంతా లేమా?” అన్నాడు కోపంగా.
“మరేం చెయ్యమంటారు? ఇలాంటి చిన్న విషయాలు చెప్పొద్దని తమరే అన్నారు” అనగానే ఎక్కడో కాలినట్టయింది గ్రామపెద్దకి. చిన్నడితో ఆ మాట చెబుతున్నప్పుడు ఉన్న గ్రామస్తులు ఇప్పుడు ప్రక్కనే ఉండడం వలన కాదనలేకపోయాడు గ్రామపెద్ద.
చిన్నడు తనతో పొలంలో దొంగతనం విషయం చెప్పినప్పుడే దృష్టి సారించవలసింది. సమస్యను విని సానుకూలంగా స్పందించి ఉంటే ఇన్ని దెబ్బలు తనకి తగలకపోను అనుకున్నాడు గ్రామపెద్ద.
—-****——-
[
*యదువంశ క్షయం*
కృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుణ్ణి వెంటబెట్టుకొచ్చేందుకు దారుకుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ఏడుస్తున్న దారుకుణ్ణి చూసేసరికి పాండవుల గుండెలు ఝల్లుమన్నాయి. యాదవులందరూ మరణించారని దారుకుడు చెప్పగానే కన్నీళ్ళు కార్చారు అన్నదమ్ములు అయిదుగురూ.
"కృష్ణుడు నిన్ను తీసుకురమ్మని పంపాడు నన్ను" అన్నాడు దారుకుడు అర్జునుడితో. అర్జునుడు ధర్మరాజు ఆజ్ఞ తీసుకుని ద్వారకకు బయలుదేరాడు.
చంద్రుడు లేని రాత్రీ, దినమణి లేని ఆకాశం ఎలా వుంటాయో అలాగ వుంది కృష్ణుడు లేని ద్వారక. తమ విభుని ప్రియసఖుణ్ణి చూడటంతోనే కృష్ణుడి భార్యలు పదహరువేలమందీ గట్టిగా ఏడుస్తూ చుట్టూ నిలబడ్డారు. దైన్యం స్త్రీల రూపాలు ధరించి వచ్చినట్టున్న వాళ్ళని చూసి అర్జునుడు మరింతగ దుఃఖపడ్డాడు.
ఏడ్చి ఏడ్చి కృశించి శయ్య మీద పడివున్న వసుదేవుడు అర్జునుణ్ణి చుట్టేసుకుని దుఃఖించాడు. "మనుష్యమాత్రులు కారు యదుకుమారులు! దేవ పరాక్రములు! దానవులనైనా చంపి ప్రకాశించే దర్పంగలవారు! అకారణంగా వైరం పెంచుకుని తమలో తాము కొట్టుకుని మరణించారు. అయినా వాళ్ళననడమెందుకులే! ముని శాపం అలా పరిణమించింది. చచ్చిన పరీక్షిత్తుని బతికించిన శౌరి, జరిగిన ఘోరమంతా చూస్తూనే ఉపేక్షించాడు!" అన్నాడు వసుదేవుడు కన్నీళ్ళు కారుస్తూ.
"బావ ఎక్కడ వున్నాడు!" అని అడిగాడు అర్జునుడు.
"పార్థా! 'అర్జునుడు వస్తాడు. నీ ఆజ్ఞలన్నీ అతడు నెరవేరుస్తాడు. కార్యజ్ఞుడూ శౌర్యశాలీ కూడా అతడు! కిరీటీ నేనూ ఒకటే! నువ్వు శోకం విడిచి అతన్ని చేతపట్టి అందర్నీ రక్షించుకో. ఇంక కొద్దిరోజుల్లో ఈ నగరాన్ని సముద్రం ముంచేస్తుంది ' అని చెప్పి నన్ను ఊరడించి, అన్నతో పాటూ తపస్సు చేసుకోవడానికి కృష్ణుడూ వెళ్ళి పోయాడు" అన్నాడు వసుదేవుడు.
అర్జునుడు దారుకుణ్ణి పిలిచి, "కృష్ణుడు వెళ్ళిన దిక్కుగా వెళ్దాం మనం. ఇక్కడ చెయ్యవలసిన పనులన్నీ మంత్రులకు అప్పగిద్దాం. మంత్రుల్నీ, పౌరుల్నీ పిలిపించు" అన్నాడు.
దారుకుడు వెంటనే అజ్ఞ పాటించాడు.
వాళ్ళందర్నీ ఒక్కసారి కలయచూసి "ఈనాటికి ఏడవరోజున ఈ పట్టణాన్ని సముద్రం ముంచేస్తుందని దేవతల వాక్కు! కనుక మనమందరం త్వరగా ద్వారకను విడిచివెళ్ళాలి. ఇంద్రప్రస్థానికి వసుదేవుడి మనుమడైన వజ్రుణ్ణి రాజుగా చేస్తాను. మీరందరూ వెళ్ళి అక్కడ అతని పరిపాలనలో సుఖంగా వుండండి. మొయ్యగలిగినన్ని సరుకులు మోయించండి. బళ్ళు సిద్ధం చెయ్యండి. ఇదివరకు గోవిందుని నీడన యాదవవీరులంతా ఎలా సుఖంగా ఉన్నారో, అలగే ఇప్పుడు ఈ దేశపు ప్రజలంతా ధర్మరాజు ఆదర గౌరవాలందుకుంటూ వుంటారు" అని ఆజ్ఞాపించాడు అర్జునుడు.
ప్రజలు వెళ్ళిపోయారు.
ఆ రాత్రంతా భారమైన మనస్సుతో కృష్ణమందిరంలోనే గడిపాడు అర్జునుడు.
తెలతెలవారే సమయంలో వసుదేవుడు యోగనిష్ఠతో శరీరం విడిచిపెట్టాడు.
అంతఃపురమంతా రోదన ధ్వనులతో మారుమోగిపోయింది.
వసుదేవుడి భార్యలు దేవకి, రోహిణి, భద్ర, మదిర సహగమనం చేశారు.
'నన్ను పిలిపించి తన తండ్రికి కావలి పెట్టాడు మాధవుడు. అలాంటివాడికి తండ్రి మరణవార్త ఎలా చెప్పను? ఈ చావుకబురు చెప్పి తపోనిష్ఠలో వున్న నారాయణుడికి బాధ కలిగించడమెందుకు?' అనుకున్నడు అర్జునుడు. అంతలోనే 'అయ్యో! పెదతల్లి గాంధారీదేవి శాపం ఎందుకో అస్తమానం జ్ఞాపకం వస్తోంది. ఏకాంత ప్రదేశంలో దిక్కులేని చావు చావమని కృష్ణుణ్ణి శపించిందామె. ఎలా వున్నాడో ఏమో!' అనుకుంటూ త్వరత్వరగా బయలుదేరాడు అర్జునుడు. కలతపడిన వృదయంతో కృష్ణుడి కోసం అరణ్యమంతా గాలించసాగాడు. ఒకనాడు అతనికొక బోయవాడు ఎదురయ్యాడు.
"ఎక్కడకు వెళ్ళాలి దొరా?" అని ప్రశ్నించాడు.
"కృష్ణభగవానుడు తపస్సు చేసుకుంటున్న చోటికి!" అర్జునుడు జవాబు చెప్పాడు.
"అ మహానుభావుణ్ణి ఒకనాడు ఒకచోట చూశాను. మరి ఇప్పుడు అక్కడున్నాడో లేడో తెలీదు. అయినా అ చోటు చూపిస్తాను రండి" అని బోయవాడు బయలుదేరాడు. ఇద్దరూ కలిసి తిన్నగా అచ్యుతుడు వున్న చోటుకు వెళ్ళారు. అక్కడ నేలమీద పడివున్న జగదేకవంద్యుడి మృతదేహాన్ని చూసి మూర్చపోయాడు అర్జునుడు.
'ఈ మహానుభావుడికి ఈ గతి ఎలా సంభవించింది?' అనుకుంటూ శరీరమంతా కలయచూశాడు అర్జునుడు. పాదంలో గుచ్చుకున్న బాణపు గాయం కనిపించింది. అది చూస్తూనే దుర్వాసుడి మాటలు గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాడు అర్జునుడు. 'కృష్ణుడి కళేబరాన్ని నగరానికి తీసుకుపోవడమా? లేకపోతే బంధువులందర్నీ ఇక్కడికే పిలిపించడమా?' అని ఆలోచిస్తూ వుండగా సముద్రం పట్టణాన్ని ముంచేయబోతున్న విషయం జ్ఞాపకం వచ్చింది అర్జునుడికి.
వెంటనే చితి పేర్చి మృతదేహానికి అగ్ని సంస్కారం చేశాడు. గబగబ ద్వారకకు బయలుదేరాడు. తెల్లవారేలోపల బలరామకృష్ణుల భార్యలనూ, మిగిలిన ప్రజలనూ పురం దాటించాడు పార్థుడు. అందరికీ తానే దిక్కై ముందుకు నడిచాడు. ఇంతలో కిరాతకుల గుంపొకటి యాదవ స్త్రీలపై దాడి చేసింది. సవ్యసాచి అగ్రాహావేశాలతో అస్త్రప్రయోగం చెయ్యబోయాడు. చిత్రం - ఒక్క మంత్రం కూడా గుర్తు రాలేదు! ఆశ్చర్యం, విషాదం కూడా కలిగాయి విజయుడికి. గాండీవంతోనే అ దొంగలను మోదసాగాడు. చివరకు ఎలాగైతేనేం - కృష్ణుడి ఎనమండుగురి భార్యలనూ, బలరాముడి భార్యలనూ, ఇంకా కొంతమంది స్త్రీలనూ మాత్రం రక్షించగలిగాడు. వాళ్ళను వెంటబెట్టుకుని కురుక్షేత్రానికి చేరుకున్నాడు.
అక్కడ తాను కృష్ణుణ్ణి వెదకడానికి వెళ్ళింది మొదలు, మళ్లీ ద్వారకకు వచ్చేవరకూ జరిగినదంతా అందరికీ దీనంగా వివరించాడు అర్జునుడు. రామకృష్ణుల భార్యలు మొదలు నరికిన మానుల్లా నేలకొరిగారు.
[
*శ్రీ కృష్ణ నిర్యాణం*
దారుకుణ్ణి, బభ్రుణ్ణి వెంటపెట్టుకుని బలరాముడిని వెతుకుతూ బయలుదేరాడు కృష్ణుడు. కొంచం దూరం వెళ్ళేసరికి ఒక చెట్టుకింద అన్న కనిపించాడు.
"దారుకా! నువ్వు వెళ్ళి పాండవులతో యాదవనాశనం గురించి చెప్పి అర్జునుణ్ణి తీసుకురా. బభ్రూ! నువ్వు ఆడవాళ్ళనందర్నీ పట్టణానికి చేర్చి మళ్ళీ రా" అని ఆజ్ఞాపించాడు కృష్ణుడు. ఇద్దరూ బయలుదేరారు. కనుచూపు మేరలోనే ఒక బోయవాడు బభ్రుణ్ణి తుంగతో మోది చంపాడు.
అది చూసి మునివర్యుల శాపశక్తికి ఆశ్చర్యపడ్డాడు కృష్ణుడు.
బలరాముని దగ్గరకు వెళ్ళి, "అన్నా! నేను ఈ వాహనాలనూ, వనితలనూ మన పురానికి తీసుకువెళ్ళి విడిచి, తండ్రి ఆజ్ఞ తీసుకుని వస్తాను. అందాకా నువ్వు ఇక్కడే వుండు" అని చెప్పి ద్వారకానగరానికి వెళ్ళాడు.
వసుదేవుణ్ణి చూసాడు. "తండ్రీ! ఇంతవరకు కౌరవ నాశనం, ఇప్పుడు యాదవ నాశనం చూశాను. బంధుమిత్రులెవరూ లేని ఈ నగరంలో వుండబుద్ధి కావడం లేదు నాకు. అన్న ఎలాగూ అరణ్యాల్లోనే వున్నాడు. నేను కూడా వెళ్ళి అన్నతోపాటూ తపస్సు చేసుకుంటాను. ఇక అన్ని విషయాలూ మీరే సమర్థించుకోండి. రేపోమాపో అర్జునుడు వస్తాడు. మీ ఆజ్ఞలను పాటిస్తాడు" అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు కృష్ణుడు. ఆ వృద్ధమూర్తి మాటలు రాక, చేష్టలు దక్కి మొగబోయాడు.
యాదవస్త్రీలంతా గొల్లున ఏడ్చారు. కృష్ణుడు కరిగిపోయి, " ఇప్పుడే వస్తాడు అర్జునుడు, మీ కష్టాలన్నీ తీరుస్తాడు. ఊరుకోండి" అని వాళ్ళందర్నీ ఉరడించాడు. అందరికీ నచ్చచెప్పి తండ్రి దగ్గర సెలవు తీసుకుని బలరాముడి దగ్గరకు వచ్చాడు కృష్ణుడు.
"అన్నా! తపస్సు చేసుకోవడానికి తండ్రిగారి అనుమతి తీసుకుని వచ్చాను" అన్నాడు.
ఆ సమయంలో బలరాముని ముఖంలోంచి ఒక మహాసర్పం బయటకు వచ్చింది. ఎర్రటి తలలు వెయ్యి వున్నాయి దానికి. పడగలు మణులతో వెలిగిపోతున్నాయి. తెల్లని శరీర చాయ! పర్వతమంతటి దేహం! అలా బలరాముడు మోగబలంతో శరీరం విడిచి తన నిజరూపం ధరించి సముద్రమార్గాన సాగిపోతుండగా సర్పసమూహాలన్నీ వచ్చి భక్తితో సేవించాయి. గంగానది మొదలుగా గల మహానదులన్నీ ఆకారాలు ధరించి వచ్చి ఆయనను ఆరాధించాయి. అదంతా కృష్ణుడు దివ్యదృష్టితో చూస్తుండగానే అనంతుడు తన అంశ అయిన ఆ మహాసర్పాన్ని తనలో లీనం చేసుకున్నాడు.
చత్రమూర్తి తనను విడిచి వెళ్ళగానే కర్తవ్యచింత ఆవహించింది కృష్ణుణ్ణి. భూలోకంలో చెయ్యవలసిన పనులన్నీ అయిపోయాయి. శరీరం విడిచిపెట్టడానికి ఏ కారణం దొరుకుతుందా అని ఆలోచించసాగాడు అచ్యుతుడు. ఒకప్పుడు రుక్మిణీ సహితంగా దుర్వాసుని సేవించిన సందర్భంలో తను ఆయన అరికాలిలో పాయసం రాయకపోవడం, అందువల్ల "నీకు అరికాలి ద్వారా అపాయం కలుగుతుంది" అని ఆ మహర్షి అనడం గుర్తుకు వచ్చాయి. వెంటనే ఒక చెట్టునీడన పవళించి సమాధిగతుడయ్యాడు జలధిశయనుడు.
అప్పుడు జర భయపడుతూ మెల్లమెల్లగా అక్కడికి రాసాగింది. ఆ చుట్టుపక్కల తిరుగుతున్న వేటగాడొకడు కనిపించాడు దానికి. వాడికి కృష్ణుడి పాదం లేడిపిల్ల ముఖంలా భ్రమ గొలిపేటట్టు చేసింది జర. అల్లంతదూరం నుంచి చూసి ఆ వెటగాడు మా మంచి లేడి దొరికిందనుకుంటూ గురి చూసి బాణం విడిచాడు. అది వెళ్ళి హరి అరికాలిలో గుచ్చుకుని పాదం పైనుంచి దూసుకుపోయింది.
ఆ బోయవాడు దగ్గరకు వచ్చి పరమాత్ముణ్ణి చూసి, తన తప్పు తెలుసుకుని ఆయన పాదాల మీద పడి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. నిరాకరుడూ, నిర్గుణుడూ అయిన వేదమూర్తి వాణ్ణి ఓదార్చి పంపేసి ఆ వంకతో మానవదేహాన్ని విడిచిపెట్టాడు.
ఊర్ధ్వలోకాలకు వెళ్ళగానే అదివిష్ణువుకు ఇంద్రాది దేవతలంతా భక్తితో ప్రణమిల్లారు.
"ఆదిపురుషా! ధర్మరక్షణ కోసం లీలామానుషరూపుడవై పుట్టావు. శత్రువు లందర్నీ చంపావు. ప్రతీ యుగంలోనూ ఇలాగే అవతరించి ధర్మరక్షణ చేస్తూ వుండు" అంటూ ప్రార్థించాడు ఇంద్రుడు. మహావిష్ణువు మీద పుష్పవర్షం కురిసింది. బ్రహ్మదేవుడు హరి పాదాలకు నమస్కరించి వేదవాక్కులతో స్తుతించాడు. వాళ్ళ భక్తికి ప్రీతి పొంది "అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ భావాలు కలిగే సిద్ధిని పొందాను. నా స్థానాన్ని నేను చేరుకుంటాను. మీరు సుఖంగా వుండండి" అని అంతర్హితుడయ్యాడు మహావిష్ణువు.
ఇంద్రియాలకు కనిపించని ఆ పరమాత్ముణ్ణి బుద్ధితో చూస్తూ ఆయన అద్భుత కృత్యాలను వర్ణించుకుంటూ బ్రహ్మాది దేవతలంతా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు.
[
*గెలుపుకి ముందడుగు*
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
గంభీరంలో ఉండే గోపాలుడు పాతికేళ్ల యువకుడు. చదువుకున్నాడు కానీ ఆత్మన్యూనత వలన పనులేవైనా చెయ్యాలన్నా, బాధ్యతలు వేసుకోవాలన్నా భయపడేవాడు. పని పూర్తవ్వకపోతే అందరూ ఎగతాళి చేస్తారని భయపడుతూ, ఎవరో ఒకరి వెనుకే ఉండేవాడు తప్ప సాహసించేవాడు కాదు.
ఒకసారి నగరంలోని మేనమామ ఇంటికి వెళ్ళాడు గోపాలుడు. జమిందారు దగ్గర ఉన్నతోద్యోగి అతడు. పెద్ద వ్యాపారి దగ్గర చిట్టాలు రాస్తుంటాడు ఆయన కొడుకు. రెండు రోజులు వారింట్లో గడిపేసరికి చిరాకు పుట్టి మేనమామతో జమీకి వెళ్ళాడు గోపాలుడు.
మేనమామ నాయకత్వంలో చాలా మంది పనివాళ్ళు కనుసైగలతోనే పనులు చేయడాన్ని చూసి మామ నాయకత్వ లక్షణాలకు అబ్బురపడ్డాడు గోపాలుడు. అంతలో జమిందారుని కలవడానికి వచ్చిన ఒక వ్యక్తి తిరిగి వెళ్ళిపోతూ ప్రదర్శనకు ఉంచిన లోహపు విగ్రహాన్ని సంచిలో వేసుకున్నాడు. అది గమనించాడు గోపాలుడు. వెళ్లి మేనమామతో చెప్పాడు. మేనమామ సైగ చేయగానే ఒక అనుచరుడు వెళ్లి సంచిని తనిఖీ చేసి విగ్రహాన్ని బయటకు తీసాడు. గోపాలుడు చెప్పింది నిజమని తేలడంతో అక్కడి వారంతా గోపాలుడి పరిశీలనా శక్తిని మెచ్చుకున్నారు. వారి ప్రశంసలు వినగానే గోపాలుడికి తన మీద నమ్మకం పెరిగింది.
ఆ రాత్రి మేనమామతో ముచ్చటించి మరికొన్ని విషయాలు తెలుసుకున్న గోపాలుడు తరువాత రోజు మేనమామ కొడుకుతో కలసి పనిప్రదేశానికి వెళ్ళాడు.
అదొక ప్రముఖ వ్యాపారి తాలూకా విశాలమైన దుకాణం. అక్కడివారికి గోపాలుణ్ణి పరిచయం చేసాడు మేనమామ కొడుకు. గోపాలుడు అక్కడి పరిసరాలను చూస్తుండగా అతడి దృష్టి ఒక చోట నిలిచింది.
ఒక పల్లెటూరి వ్యాపారి పది మినుములు, అయిదు పెసల బస్తాలను తెచ్చి గుమాస్తాతో ధర మాట్లాడాడు. బేరం కుదరగానే సరకు ఇచ్చి డబ్బు తీసుకున్నాడు. ఆ వ్యాపారికి అధికంగా డబ్బును గుమాస్తా చెల్లించినట్టు గ్రహించాడు గోపాలుడు. గుమస్తా దగ్గరకు వెళ్లి ఆ విషయమే చెప్పాడు.
“ పాతికేళ్లుగా పని చేస్తున్నాను. ఎప్పుడూ తప్పు జరగలేదు. నీకేం తెలుసు నా తెలివి?” అని కోపంగా అన్నాడు గుమస్తా. అతణ్ణి శాంతింపజేసి ఒక కాగితం మీద పెసలు, మినుముల ధరలతో ఇవ్వాల్సిన డబ్బును లెక్క తేల్చాడు గోపాలుడు. అప్పటికిగానీ తన తప్పు ఒప్పుకోలేదు గుమస్తా. వ్యాపారికి అదనంగా ఇచ్చిన డబ్బు వెనక్కు తీసుకున్నాడు.
ఇదంతా దూరంగా కూర్చున్న వ్యాపారి చూసి గోపాలుడి దగ్గరకు వెళ్లి అభినందించాడు. “లెక్కల్లో చురుగ్గా వున్నావు. మా తమ్ముడు వ్యాపారం మొదలెడుతున్నాడు. వాడి దగ్గర చేరతావా?” అని అడిగాడు.
గోపాలుడు సున్నితంగా తిరస్కరించి “మా చుట్టుప్రక్కల పది ఊర్లలో పిల్లల చదువుకోడానికి బడి లేదు. నాకైతే సొంతంగా బడి పెట్టాలన్న కోరిక ఉంది. ధైర్యం సరిపోక ఆగిపోయాను” అన్నాడు చేతులు నులుముకుంటూ.
“చెయ్యాలనుకున్న పని వెంటనే చేసేయాలి. మంచి పనికి ఆలోచన, ఆలస్యం పనికి రాదు. ఇంతకీ నీకు భయం దేనికి?” అని అడిగాడు వ్యాపారి.
గోపాలుడు “ బడికి పిల్లల్ని పంపుతారో లేదోనని, గురువులు దొరుకుతారో లేదోనని, ఆదాయం సరిపోతుందో లేదోనని, నిర్వహణ కష్టమేమోనని ఇలా అనేక భయాలున్నాయి” అన్నాడు.
వ్యాపారి తేలిగ్గా నవ్వేసి “ ప్రతి పనికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారానికి కూడా భయాలు ఉన్నాయి. నీలా ఆలోచిస్తూ కూర్చోకుండా ధైర్యంగా చొరవ చేసి మొదలుపెట్టాను. సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించుకున్నాను. ఒక్కోమెట్టు ఎక్కుతూ ప్రముఖ వ్యాపారిని కాగలిగాను. ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి కల్పించగలిగాను. అందుకే రాబోయే కష్టాల గురించి ఆలోచించడం, భయపడడం మానెయ్యాలి” అన్నాడు గోపాలుడి భజం మీద చెయ్యి వేసి.
“మీరు విజేత అయ్యారు కాబట్టి సులువుగా చెప్పారు. కానీ అందరికీ అదంత సులభం కాదు” అన్నాడు గోపాలుడు.
“ఒక్క మాట విను. కష్టాన్ని తలచుకుని ఆగిపోతే జీవిత ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. ధైర్యంగా ముందడుగేస్తే దారి కనబడుతుంది. వెయ్యడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభించాలి. ఒక్కో అడుగు పడితేనే గమ్యం చిన్నదవుతుంది. ఒక్కొక్క చెట్టు నాటితే కొన్నాళ్ళకు మహారణ్యం తయారవుతుంది. నేను చెయ్యగలనా అనే అనుమానం వద్దు. నువ్వు మొదలుపెడితే నచ్చినవారు నీతో కలసి నడుస్తారు. ఒంటరి అనే భావన రాకూడదు. ఒక్క చిరునవ్వుతో గొప్ప స్నేహ సామ్రాజ్యం స్థాపించవచ్చు. ఒక చెయ్యి ఆసరా నిచ్చి నిండు జీవితాన్ని నిలబెట్టవచ్చు . ఒక కొవ్వొత్తి వెలుగుతో గదిలోని చీకటిని తరమవచ్చు. ఒక్క స్వార్ధం లేని నవ్వుతో ఎదుటివారి ముఖంలోని దిగులు పోగొట్టొచ్చు. ఒక హాయైన స్పర్శతో తియ్యని ప్రేమని తెలుపవచ్చు. అలా ఒక్కదానితోనే ఎన్నో సాధించవచ్చు. మొదలుపెట్టినప్పుడు ఆక్షేపించిన నోళ్లే విజేతవయిన రోజున పొగిడి, చప్పట్లతో సత్కరిస్తాయి. నువ్వు పెట్టబోయే బడికి పాతికశాతం పెట్టుబడిగా అందిస్తాను. లాభాన్ని విద్యా సేవకు కేటాయించానన్న తృప్తి కోసం అండగా నిలబడతాను. తొందరగా బడి ప్రారంభించు” అని వెన్నుతట్టాడు వ్యాపారి.
ఒక చక్కని మాట గొప్ప లక్ష్యానికి నాంది పలుకుతుందన్నట్టు వ్యాపారి చేసిన బోధ గోపాలుడిలో ఆత్మవిశ్వాసంతో ముందడుగేసేలా చేసింది. ఊరెళ్ళి పాఠశాల పనులు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు గోపాలుడు.
----***----
[
*సైంధవుడు లేదా జయధ్రదుడు*
మహాభారత ఇతిహాసంలో కౌరవులకు చెల్లెలైన దుస్సలకి పతి. జయధ్రదుడు సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. సింధు దేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి సైంధవుడు అయ్యాడు
సింధుదేశపు రాజు. దుర్యోధనుని చెల్లెలు అగు దుస్సల మగఁడు. ఇతని తండ్రి వృద్ధక్షత్రుఁడు.
ఇతఁడు పాండవులు వనవాసము చేయుకాలమున తాను ఒక రాచకూఁతురును వివాహము చేసికొని వారు ఉన్న వనముగుండ తన పట్టణమునకు పోవుచుండి ఆశ్రమమున ఏకాకియై ఉండిన వారిపత్ని అగు ద్రౌపదిని చూచి వారులేకుండుట తెలిసి బలాత్కారముగా పట్టి తన రథముమీఁద పెట్టుకొని పోవుచు ఉండెను. ఇంతలో ఈవర్తమానమును ఎఱిఁగి పాండవులు వచ్చి వీనిని చక్కఁగ మర్దించి అవమానించి పంపిరి. అంతట వీఁడు దానికి ప్రతికారము చేయ సమకట్టి ఉగ్రతపము సలిపి అర్జునుఁడు తక్క తక్కిన పాండవులను ఒక్కదినమున జయించునట్లు వరము పడసి భారతయుద్ధము జరుగునపుడు పాండవులను పద్మవ్యూహము భేదించిన అభిమన్యునికి తోడుపడకుండ అడ్డగించి గెలుపుకొనెను. కనుక పదుగురు యోధులు ఒక్కటిగాచేరి అభిమన్యుని చంపిరి. ఆవృత్తాంతము సంశప్తకులతో పోరాడపోయి ఉండిన అర్జునుఁడు విని ఆమఱునాడు సూర్యుఁడు అస్తమించునంతలో సైంధవుని తల నఱకుదును అని ప్రతిజ్ఞచేసి ఆప్రకారము నడపెను.
మఱియు ఇతఁడు అర్భకుఁడై ఉండు కాలమున ఒకనాడు అశరీరవాణి వీఁడు సంగ్రామమున ఏమఱి తల తునుమఁబడును అని ఆదేశింపఁగా అది అతని తండ్రి అగు వృద్ధక్షత్రుఁడు విని ఎవఁడు వీనిమస్తకమును మహిమీఁద పడవైచునో అట్టివాని శిరము సహస్రశకలములు అగుఁగాక అని సకలజనుల వీనులకు గోచరము అగునట్లు పలికెను. ఆహేతువునుబట్టి భారతయుద్ధమున అర్జునుఁడు సైంధవునితల శమంతపంచక సమీపమున తపము ఆచరించుచు ఉండిన వృద్ధక్షత్రుని గుండ మహీతలమున పడునట్లు పాశుపతాస్త్రప్రయోగమున చేసెను.
పరాభవించబడ్డ సైంధవుడుడి చాలా దుఃఖించి పాండవులమీద పగ తీర్చుకోవాలని కోరికతో శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్ష్యం అయి వరాన్ని కోరగా సైంధవుడు పాండవులని సంహరించే వరాన్ని కోరతాడు. దానికి శివుడి అంగీకరించక ఒక్కరోజు మాత్రం అర్జునుడు తప్ప మిగతా పాండవులని అడ్డగించే వరాన్ని పొందుతాడు.
సైంధవుడు
మహాభారతంసింధుదుస్సల
వికీపీడియా నుండి
సైంధవుడు లేదా జయధ్రదుడు (సంస్కృతం:जयद्रथ) మహాభారత ఇతిహాసంలో కౌరవులకు చెల్లెలైన దుస్సలకి పతి. జయధ్రదుడు సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. సింధు దేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి సైంధవుడు అయ్యాడు.
సైంధవుడు దుష్ప్రవర్తన-పరాభవం
పాండవులు జూదంలో ఓడి పోయి మాట ప్రకారం వనవాసం చేస్తుంటే సైంధవుడు పాండవులు వనవాసం చేసే చోటికి వెళ్ళి పాండవులు లేని సమయం లోద్రౌపదిని చేబట్ట ప్రయత్నిస్తాడు. అప్పుడు భీముడు వాడిని చూసి వాడితో యుద్ధం జరిపి ఓడించి చంపబోతాడు. కాని యుధిష్టరుడు మాట ప్రకారం భీముడు జయధ్రదుడుని చంపకుండా వదిలి వేసి పరాభవం క్రింద గుండు గొరిగిస్తాడు.
ప్రస్థావనము
సింధుదేశపు రాజు. దుర్యోధనుని చెల్లెలు అగు దుస్సల మగఁడు. ఇతని తండ్రి వృద్ధక్షత్రుఁడు.
ఇతఁడు పాండవులు వనవాసము చేయుకాలమున తాను ఒక రాచకూఁతురును వివాహము చేసికొని వారు ఉన్న వనముగుండ తన పట్టణమునకు పోవుచుండి ఆశ్రమమున ఏకాకియై ఉండిన వారిపత్ని అగు ద్రౌపదిని చూచి వారులేకుండుట తెలిసి బలాత్కారముగా పట్టి తన రథముమీఁద పెట్టుకొని పోవుచు ఉండెను. ఇంతలో ఈవర్తమానమును ఎఱిఁగి పాండవులు వచ్చి వీనిని చక్కఁగ మర్దించి అవమానించి పంపిరి. అంతట వీఁడు దానికి ప్రతికారము చేయ సమకట్టి ఉగ్రతపము సలిపి అర్జునుఁడు తక్క తక్కిన పాండవులను ఒక్కదినమున జయించునట్లు వరము పడసి భారతయుద్ధము జరుగునపుడు పాండవులను పద్మవ్యూహము భేదించిన అభిమన్యునికి తోడుపడకుండ అడ్డగించి గెలుపుకొనెను. కనుక పదుగురు యోధులు ఒక్కటిగాచేరి అభిమన్యుని చంపిరి. ఆవృత్తాంతము సంశప్తకులతో పోరాడపోయి ఉండిన అర్జునుఁడు విని ఆమఱునాడు సూర్యుఁడు అస్తమించునంతలో సైంధవుని తల నఱకుదును అని ప్రతిజ్ఞచేసి ఆప్రకారము నడపెను.
మఱియు ఇతఁడు అర్భకుఁడై ఉండు కాలమున ఒకనాడు అశరీరవాణి వీఁడు సంగ్రామమున ఏమఱి తల తునుమఁబడును అని ఆదేశింపఁగా అది అతని తండ్రి అగు వృద్ధక్షత్రుఁడు విని ఎవఁడు వీనిమస్తకమును మహిమీఁద పడవైచునో అట్టివాని శిరము సహస్రశకలములు అగుఁగాక అని సకలజనుల వీనులకు గోచరము అగునట్లు పలికెను. ఆహేతువునుబట్టి భారతయుద్ధమున అర్జునుఁడు సైంధవునితల శమంతపంచక సమీపమున తపము ఆచరించుచు ఉండిన వృద్ధక్షత్రుని గుండ మహీతలమున పడునట్లు పాశుపతాస్త్రప్రయోగమున చేసెను. నా|| జయద్రథుఁడు.
సైంధవుడు శివుని గురించి తపస్సు
పరాభవించబడ్డ సైంధవుడుడి చాలా దుఃఖించి పాండవులమీద పగ తీర్చుకోవాలని కోరికతో శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్ష్యం అయి వరాన్ని కోరగా సైంధవుడు పాండవులని సంహరించే వరాన్ని కోరతాడు. దానికి శివుడి అంగీకరించక ఒక్కరోజు మాత్రం అర్జునుడు తప్ప మిగతా పాండవులని అడ్డగించే వరాన్ని పొందుతాడు.
చక్రవ్యూహం పన్నడం సైంధవుడుఅడ్డగించడం
మహాభారత యుద్ధంలో భీష్ముడు పతనమై ద్రోణుడు సేనాపతిగా ఉండగా పాండవులు వీరవిహారం చేస్తుండగా దుర్యోధనుడి కోరిక మేరపు ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతాడు. పద్మవ్యూహ విద్య పాండవులలో అర్జునుడికి తప్ప మిగతా ఎవ్వరకి రాదని కౌరవులకు తెలుసు, అర్జునుడిని ప్రక్కకి తప్పించడానికి ఒక ప్రణాళిక వేసి ఇద్దరౌ రాజులను అర్జునుడిని పైకి పంపుతారు. అప్పుడు పాండవ సైన్యం సమాలోచన చేస్తే అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలుసని బయటకు రావడం తెలియదని అంటాడు. అప్పుడు మిగిలిన పాండవులు తాము వెంట ఉండి అభిమన్యుడిని కాపాడతామని అభిమన్యుడితో పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తారు. పద్మవ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సైంధవుడు (జయధ్రదుడు) శివుడు ఇచ్చిన వరం ప్రకారం పాండవులకు అడ్డం పడి వారిని వ్యూహంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు. ఎంతో వీరోచితంగా పోరాడినా అభిమన్యుడు ఏకాకి కావడం చేత, ఏకాకిగా రథం క్రింద ఉన్న అభిమన్యుడిని కౌరవలు సంహరిస్తారు. సైంధవుడు అడ్డం పడడం వల్లనే అభిమన్యుడు ఏకాకిగా అయి సంహరించబడ్డాడన్న వార్త పాండవ సేన శిబిరాలకు వచ్చినప్పుడు అర్జునుడుకి తెలిసి చాలా చింతించి తరువాతి రోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడిని సంహరించక పోతే తాను అగ్నికి ఆహుతి అయి పోతానని ప్రమాణం చేస్తాడు.
సైంధవ వధ
అర్జునుడు చేసిన ప్రతిన కౌరవసైన్యములో అందరికి తెలుస్తుంది. సైంధవుడిని రక్షించడం కోసం కౌరవ సైన్యం ఒక వలయం క్రింద ఏర్పడి అర్జునుడు సైంధవుడి వద్దకు చేరకుండా చేయాలని అందరూ వ్యూహం పన్నుతారు. అనుకొన్న ప్రణాళిక ప్రకారం కౌరవసైన్యం సైంధవుడి వద్దకు అర్జునుడిని చేరకుండా చేస్తుంది. అర్జునుడు చాలా చింతితుడయి సైంధవుడిని ఎలా సంహరించాలో ఆలోచిస్తుంటే జగన్నాటక సుత్రధారి శ్రీ కృష్ణుడు తన సుదర్శన చక్రంను సూర్యుడికి అడ్డుగా ఉంచి సూర్యాస్తమయం అయిపోయిందనే భావన కలిగిస్తాడు. అర్జునుడు కూడా ఆ విషయాన్ని గ్రహించలేక సూర్యాస్తమయం అయిపోయింది ప్రాణ త్యాగం చెయ్యాలని ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుడు అసలు విషయం తెలిపి తన చక్రాన్ని సూర్యుడి ముందు నుండి తొలగిస్తాడు. సూర్యాస్తమయం జరిగిందని కౌరవసైన్యం అంతా తాము పన్నిన వ్యూహం నుండి సడలుతారు. ఆ విధంగా సడలడం వల్ల సైంధవుడిని వద్దకు చేరడం చాలా తేలికవుతుంది. అర్జునుడు సైంధవుడితో యుద్ధం జరిపి సైంధవుడి మీదకు పాశుపతాశ్త్రం ప్రయోగిస్తాడు. పాశుపతాస్త్రం సైంధవుడి శిరఛ్చేధం చేస్తుంది. అప్పుడు ఆ శిరస్సు నేలపై పడిపోతుండగా శ్రీ కృష్ణుడు ఆ శిరస్సు నేలపై పడరాదని దానిని ఆ అస్త్ర సహాయంతోనే వనంలో తపస్సు చేసుకొంటున్న సైంధవుడి తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులలో పడేటట్లు చేయమని చెబుతాడు. సైంధవుడి శిరస్సు ఎవరి చేతులనుండి పడుతుందో వారి శిరస్సు నూరు చెక్కలు అవుతుంది. ఆ విధంగా తన తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులనుండి సైంధువుడి శిరస్సు పడగానే వృద్ధాక్షాత్రుడు తల నూరు చెక్కలై వృద్ధాక్షాత్రుడు మరణిస్తాడు. ఈ విధంగా సైంధవుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మరణిస్తాడు
[
*పాలవెల్లి ఎందుకు కడతారు?*
వినాయక చవితి రోజున *పాలవెల్లి* ఎందుకు కడతారో మనలో చాలా మందికి తెలియదు...మన పెద్దలు కట్టారని మనమూ కడుతున్నాం... వాళ్ళు ఎందుకు కట్టారో, వారిని మనం ఎందుకు అనుకరిస్తున్నామో తెలుసుకుందాం.....
వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేశుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది.
ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే...అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి....
*ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే! ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి. ఒక పాలసముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు.
గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా! ప్రకృతిలో సృష్టి, స్థితి, లయలనే మూడు స్థితులు కనిపిస్తాయి. గణేశుని పూజలో ఈ మూడు స్థితులకూ ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమిని (సృష్టి) సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని (స్థితి) సూచించేందుకు పత్రినీ, ఆకాశాన్ని (లయం) సూచించేందుకు పాలవెల్లినీ ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము.
*గణపతి'* అంటే గణాలకు అధిపతి, తొలిపూజలందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే కదా! ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు. అలా పాలవెల్లిని సమస్త దేవతలకూ ప్రతికగా భావించవచ్చు.
పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది. మరి అందులో నక్షత్రాలు ఏవి! అందుకే వెలగపండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, దానిమ్మలాంటి పండ్లనీ కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళవస్తువులకు సూచన అన్నమాట.
ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు కదా! పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది.
గణపతి పూజ ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్లు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం. ఏదీ లేకపోతే మట్టి ప్రతిమను చేసి, పైన పాలవెల్లిని వేలాడదీసి, గరికతో పూజిస్తే చాలు....పండగ అంగరంగవైభవంగా సాగిపోయినట్లే! పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది.
[
తెలుగు క్యాలెండర్ లో ఏడాది పొడవునా హిందువులు పండగలు వస్తూనే ఉంటాయి. అయితే ఆ పండగలు.. ఆయాకాలానికి అనుగుణంగా జరుపుకునే సంప్రదాయం పూర్వకాలం నుంచి వస్తుంది. ఇంకా చెప్పాలంటే.. సీజనల్ కి అనుగుణంగా పండగల పూజలను. నైవేద్యాలను పెడతాం.. అందుకనే హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో సైన్స్ దాగి ఉంది అని చెప్పవచ్చు. ఇక భాద్రపద మాసం లో జరుపుకునే పండగల్లో విశిష్టమైనది వినాయక చవితి.. ఈరోజున విఘ్నలను తొలగించి చక్కటి విజయాలను అందించామని లంబోదరుడిని పూజిస్తాం.. ఇక వినాయక చవితికి గణేషుడిని 21 రకాల పత్రితో పూజిస్తాం.. ప్రతి ఒక్క పత్రి ఎన్నో అనారోగ్య సమస్యలను తీరుస్తుందని ఆయువేద వైద్యం తెలుపుతుంది. పూజకు ఉపయోగించే 21 రకాల పత్రి .. దానిలోని ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం..
1. మాచీ పత్రం (మాచ పత్రి): ఈ ఆకు సువాసనలు వెదజల్లుతుంది. అందుకే దీని వాసన చూస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ఉల్లాసం కలుగుతుంది.
2. దూర్వా పత్రం (గరిక): మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు గరికలో ఉన్నాయి.
3. అపామార్గ పత్రం (ఉత్తరేణి): దగ్గు, ఆస్తమా సమస్యలను తగ్గించడంలో ఉత్తరేణి ఆకులు బాగా పనిచేస్తాయి.
4. బృహతీ పత్రం (ములక): ఈ ఆకు శ్వాస కోశ సమన్యలను నయం చేస్తుంది. ముఖ్యంగా ఉబ్బసం ఉన్నవారికి ఈ ఆకును వాడితే గుణం కనిపిస్తుంది.
5. దత్తూర పత్రం (ఉమ్మెత్త) : శ్వాసకోశ వ్యాధులను నయం చేయడంలో ఉమ్మెత్త బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా వ్యాధిని తగ్గిస్తుంది.
6. తులసీ పత్రం( తులసి): శరీరం వేడిగా ఉండేవారి శరీరం చల్లబడాలంటే తులసి ఆకులను నమలాలి. అలాగే శ్వాస కోశ సమస్యలకు కూడా తులసి దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
7. బిల్వ పత్రం (మారేడు): షుగర్ వ్యాధి ఉన్నవారు మారేడు మంచి ఔషధం. అలాగే విరేచనాలు కూడా తగ్గుతాయి.
8. బదరీ పత్రం (రేగు): చర్మ సమస్యలు ఉన్నవారికీ రేగు ఆకులు మంచి మెడిసిన్.
9. చూత పత్రం (మామిడి): నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు సమస్యలను మామిడి ఆకు తగ్గిస్తుంది. మామిడి పుల్లలతో దంతాలను తోముకుంటే నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.
10. కరవీర పత్రం (గన్నేరు): గడ్డలు, పుండ్లు, గాయాలు తగ్గేందుకు ఈ మొక్క వేరు, బెరడును ఉపయోగిస్తారు.
11. మరువక పత్రం (ధవనం, మరువం): ఈ ఆకులు సువాసనను వెదజల్లుతాయి. వీటి వాసన చూస్తే ఒత్తిడి వెంటనే తగ్గుతుంది.
12. శమీ పత్రం (జమ్మి): నోటి సంబంధ వ్యాధులను తగ్గించడానికి జమ్మిఆకులు మంచి సహాయకారి.
13. విష్ణుక్రాంత పత్రం: ఈ ఆకులతో చర్మ సౌందర్యం మరింత పెరుగుతుంది.
14. సింధువార పత్రం (వావిలాకు): కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు ఈ ఆకును వాడితే ఉపయోగం ఉంటుంది.
15. అశ్వత్థ పత్రం (రావి): చర్మ సమస్యలు వారికి రావి ఆకులు బెస్ట్ మెడిసిన్
16. దాడిమీ పత్రం (దానిమ్మ): వాంతులు, విరేచనాలను అరికట్టడంలో దానిమ్మ ఆకులు మంచి మెడిసిన్.
17. జాజి పత్రం (జాజిమల్లి): చర్మ సమస్యలున్నవారు, స్త్రీ సంబంధ వ్యాధులకు ఈ ఆకును ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.
18. అర్జున పత్రం (మద్ది): గుండె ఆరోగ్యానికి, రక్తం సరఫరా అయ్యేందుకు ఈ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
19.దేవదారు పత్రం: శరీరంలో బాగా వేడి ఉన్న వారు ఈ ఆకులను వాడితే ఫలితం ఉంటుంది.
20. గండలీ పత్రం (లతాదూర్వా): అతిమూత్ర సమస్య ఉన్నవారు ఈ ఆకును ఉపయోగిస్తారు
21. అర్క పత్రం (జిల్లేడు): నరాల బలహీనత, చర్మ సమస్యలు ఉన్న వారికి ఈ ఆకులు మంచి ఫలితాన్ని ఇస్తాయి.
*
-కృష్ణదేవరాయల దగ్గర తిమ్మడు అనే ద్వారపాలకుడు వుండేవాడు.ఒకరోజు సాయంత్రం రాయలు ఉద్యానవనానికి వాహ్యాళి కి వెళ్ళాడు. అక్కడ తిమ్మడు మొక్కలకు పాదులు చేస్తున్నాడు. అక్కడి సరస్సు ఒడ్డున నడుస్తూ రాయలు కాలు జారి పడబోయాడు. వెంటనే అక్కడ వున్న తిమ్మడు ఆయన పడకుండా పట్టుకున్నాడు. వెంటనే రాయలు వాడిని మెచ్చుకొని తాను కప్పుకున్న ఖరీదైన పచ్చడము (శాలువా) వాడికి బహుమానంగా యిచ్చాడు. వాడు పొంగి పోయాడు. మరుదినం తనకు రాయలు బహుమానంగా యిచ్చిన పచ్చడము కనపడిన వాళ్ళందరికీ చూపించి
గొప్పలు చెప్పుకోవడం మొదులు పెట్టాడు. కొంచె గర్వం కూడా వచ్చింది వాడికి. ఎవ్వరినీ లెక్క చేయకుండా ప్రవర్తిసుండేవాడు. ఒకనాడు రాయల వారి దగ్గరికి పెద్దన,ధూర్జటి, నంది తిమ్మన,తెనాలి రామకృష్ణుడు కలిసి వెళ్ళారు. ద్వారం దగ్గర తిమ్మడు వీళ్ళని లోనికి పోనీకుండా అడ్డుకున్నాడు. వాడు రాజుగారిచ్చిన పచ్చడము చూపించి మీరు కవిత్వము చెప్పి రాజుగారి దగ్గర బహుమానాలు అందుకుంటారు. నేను చూడండి రాజుగారిని కాపాడి బహుమానం అందుకున్నాను . మీరు ఇప్పుడు నాపై పద్యము చెప్తే గానీ మిమ్మల్ని లోనికి పోనివ్వను అని కాలు అడ్డంగా పెట్టాడు. రామకృష్ణుడికి మండిపోయింది. .. అప్పుడు పెద్దన పోనీలే పాపం అని
వాకిటి కావలి తిమ్మా! అని మొదటి పాదం చెప్పాడు.
ప్రాకటముగ సుకవి వరుల పాలిటి సొమ్మా అని తిమ్మన గారు రెండవ పాదం చెప్పారు.
నీకీ పద్యము గొమ్మా అని ధూర్జటి మూడవ పాదం చెప్పాడు.
నాకీ పచ్చడమే చాలు నయముగ నిమ్మా! అని రామకృష్ణుడు నాలుగవ పాదం చెప్పి వాడి మీద వున్న పచ్చడము తీసుకొని వాడిని ఒక్క తోపు తోసి ఇది మాకు
బహుమానం అని లోపలి వెళ్లి పోయారు. వాడు నోరు తెరుచుకొని చూస్తూ వుండి పోయాడు. ఈ విషయం తెలుసుకున్న రాయలవారు వాడిని మందలించి కవులను అవమానించరాదని చెప్పి వేరే ఒక పచ్చడము యిచ్చి పంపించారు.
[
ధృతరాష్ట్రుడి పుత్రప్రేమ
కృష్ణద్వైపాయనుడు తన మందిరానికి వస్తున్నాడని తెలిసి విదురుని సాయంతో ఆ మహామునికి ఎదురువెళ్ళి సముచిత మర్యాదలతో స్వాగతం చెప్పాడు ధృతరాష్ట్రుడు. సత్కారాలు అందుకున్న తరువాత, "నాయనా! నువ్వూ, నేను , విదురుడూ, భీష్ముడూ బతికుండగానే ఇంత అధర్మం జరుగుతుంటే ఉపేక్షించటం న్యాయం కాదు" అన్నాడు వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుడితో.
"స్వామీ! మళ్ళీ ఏం జరిగింది?" అని ధృతరాష్ట్రుడు భయపడుతూ అడిగాడు.
"పాండవులు వనవాసక్లేశాన్ని అనుభవిస్తున్న యీ సమయంలోనే దండెత్తి వెళ్ళి వాళ్ళను హతమార్చాలని కర్ణుడు నీ కొడుక్కి సలహా ఇస్తున్నాడు. పాపాత్ముడైన నీ కొడుకు అందుకు సంతోషించి సమరసన్నాహాలు చేస్తున్నాడు. వద్దని వారించాను కాని, వింటాడన్న నమ్మకం లేదు నాకు. నీకు చెబితే నువ్వయినా కొడుక్కి బుద్ధి చెబుతావేమోనని ఇలా వచ్చాను. రాజ్యం పోయి, అడవులలో కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న పాండవులను వధించడానికి పూనుకున్నాడు నీ పుత్రరత్నం. నువ్వు కూడా అతన్ని వారించకుండా వూరుకున్నావు. అయినా యుద్ధం కోసం మీరింతగా ముచ్చటపడటం దేనికి? అన్నమాట ప్రకారం పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం పూర్తయ్యాక వాళ్ళే యుద్ధానికి సిద్ధమవుతారు. అప్పుడు చూపించమను నీ కొడుకు ప్రతాపం! వనవాసులూ , తాపసులూ నిరాయుధులు కదా! వాళ్ళమీదకు దండెత్తి వెళ్తే అవమానం తప్ప మరేం మిగలదు. ఇది ఉచితం కాదని నీ కొడుకుతో చెప్పు" అని వ్యాసభగవానుడు ధృతరాష్ట్రుణ్ణి మందలించాడు.
"మహాత్మా! దుర్యోధనుడి దుర్మార్గ ప్రవర్తన వల్ల నేనూ, గాంధారీ, విదురుడూ, ద్రోణుడూ, కృపుడూ బాధపడని క్షణం లేదు. వాడు దుర్బుద్ధి అని తెలిసి కూడా పుత్రప్రేమ వల్ల వాణ్ణి విడిచిపెట్టలేకపోతున్నాను. ఏం చెయ్యమంటారు?" అని ధృతరాష్ట్రుడు దుఃఖిస్తూ అడిగాడు.
"నాయనా! సంతానం మీద విపరీత మమకారం నీ ఒక్కడికే కాదు వున్నది - అది లోక సహజం. మానవులు తమ బిడ్డలను ప్రేమించినట్లు మరెవ్వరినీ ప్రేమించలేరు. ఎంత డబ్బున్నా బిడ్డలు లేకపోతే సంతోషం లేదు. పూర్వం సకల గోవులకూ తల్లియైన సురభి సురేంద్రుడి దగ్గరకు వెళ్ళి ఒకసారి జాలిగా ఏడ్చింది.
'అమ్మా! ఎందుకింతగా ఏడుస్తున్నావు? అందరూ క్షేమమే కదా!' అని ఇంద్రుడు విస్మితుడై అడిగాడు.
'దేవేంద్రా! త్రిభువనాలూ నీ వజ్రాయుధ రక్షణలో సుఖంగా వున్నాయి. ఒక్క నా సంతానానికి మాత్రమే కష్టం మిగిలింది ' అంది సరభి గద్గద స్వరంతో.
'అదెలా సంభవం తల్లీ?' అని అమరేంద్రుడు మరింత ఆశ్చర్యంతో అడిగాడు.
'దేవరాజా! బలమైన పశువులతో బలహీనమైన పశువులను కట్టి మనుష్యులు నాగళ్ళు తోలుతున్నారు. అవి ఆ భారం మొయ్యలేకపోతే ములుకోలతో కొట్టి పొడిచి హింసిస్తున్నారు. అది చూడలేకుండా వున్నాను నేను ' అని వెక్కి వెక్కి ఏడ్చింది.
'అమ్మా! నీకు వేలకొలదీ సంతానం వుంది. అన్నిటికీ ఇలాంటి దుఃఖం సంభవించలేదు! ఎందుకు ఇంతగా బాధపడతావు?' అంటూ సురపతి ఆమెను ఓదార్చబోయాడు.
'అయ్యా! నీకు తెలియని ధర్మమేముంది? తల్లికి బిడ్డలందరూ ఒకటే. కొందరి మీద ఇష్టం, మరి కోందరి మీద అయిష్టం వుండవు ఏ తల్లికీ. ఎందరు బిడ్డలున్నా అందరూ సుఖంగా వుండాలనే కోరుకుంటుంది. నిజానికి దెబ్బతిన్న వాళ్ళనూ పడినవాళ్ళనే తల్లి మరింతగా ప్రేమిస్తుంది. బలహీనులై దీనవదనాలతో బాధపడుతున్న నా బిడ్డలను కనికరించు ' అని సురభి అర్థించింది.
ఆ మాటలు విని ఇంద్రుడు నవ్వుకున్నాడు. ఆమెను చూసి జాలిపడి వర్షం కురిపించాడు. అందువల్ల భూములన్నీ గుల్లబారి తృణసంపద పెరిగింది. పుష్కలంగా పశుగ్రాసం వుండటంతో పశువులు బలిష్టమయ్యాయి.
"మహారాజా! ఈ కథ వేదాలలో వుంది. పశువులలోనే సంతానంపై అంత ఆపేక్ష వున్నప్పుడు ఇంక మనుష్యుల సంగతి వేరే చెప్పడమెందుకు? నీకున్న విచారం నాకు తెలుసు. పుత్రమోహం సామాన్యమైనది కాదు. అయినా నీ నూరుగులు కొడుకుల మీద వున్నట్టే పాండవులపైన కూడా నీకు ప్రేమ వుండాలి. నీ కుమారులూ, పాండుకుమారులూ నీకు రెండు కళ్ళతో సమానం. ఏ కంటికి నొప్పి వచ్చినా బాధే! కాదంటావా?" అన్నాడు వేదవ్యాసుడు.
"నిజమే స్వామీ" అని చేతులు జోడించాడు ధృతరాష్ట్రుడు.
"సరే, కాసేపట్లో మైత్రేయ మహాముని వచ్చి నీ కొడుక్కి ధర్మోపదేశం చేస్తాడు.." అంటూ సాగిపోయాడు కృష్ణద్వైపాయనుడు.
తరువాత కొంచెం సేపటికి మైత్రేయుడు రానే వచ్చాడు. ధృతరాష్రుడు ఆ యతిని అతిభక్తితో పూజించాడు. ఇంతలో దుర్యోధనుడు తండ్రి దగ్గరకు వచ్చి మైత్రేయుణ్ణి నిర్లక్ష్యంగా చూస్తూ నిలబడ్డాడు. మైత్రేయుడికి కోపం వచ్చినా అణచుకుని "నాయనా! దుర్యోధనా! పాండవులతో వైరం మంచిదికాదు. మీరూ, వాళ్ళూ కలిసివుంటే కురువంశానికి శుభమౌతుంది. యుద్ధమంటూ వస్తే పాండవులను నువ్వు జయించలేవు. వాళ్ళు వజ్రకాయులు. మహా పరాక్రమవంతులు. భీముడొక్కడే వెయ్యి ఏనుగుల బలం కలవాడు. నువ్వు పాండవులతో స్నేహం చేసుకో. నా మాట విను" అని అనునయించాడు.
దుర్యోధనుడు ఆ మాటలకు సమాధానం ఇవ్వలేదు సరికదా, కాలి బొటనవేలితో నేలను తాటిస్తూ చేతులెత్తి తొడలు చరుచుకుంటూ వెకిలిగా నవ్వాడు. అది చూసేసరికి మైత్రేయుడికి కోపం పెచ్చుమీరింది.
వెంటనే లేచి, "నీచుడా! మునుల దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియని అవివేకివి. సంగ్రామరంగంలో భీమసేనుని గదాఘాతాలవల్ల నీ తొడలు తెగిపడును గాక" అని శపించాడు.
ధృతరాష్ట్రుడు భయపడిపోయి శాపం మరల్చమని మహర్షి పాదాలు పట్టుకున్నాడు. "వీడికి సమబుద్ధి కలిగితే నా శాపం తగలదు. లేకపోతే ఫలితం అనుభవించవలసిందే" అని పలికి మైత్రేయుడు వెళ్ళిపోయాడు.
ఆ తరువాత మైత్రేయుడు అన్నంత జరిగింది.
కురుపాండవ సంగ్రామంలో భీముడు చేసిన ఊరుభంగమే సుయోధనుడికి మృత్యుహేతువయింది.
కొడుకును మందలించి సరియైన తోవలో పెట్టుకునేందుకు గుడ్డిప్రేమ అడ్డువచ్చిన ధృతరాష్ట్రుడు అప్పుడు వగచీ ప్రయోజనం లేకపోయింది.
[
దైవంతో అనుబంధం
భగవంతుడితో మనలో చాలామందికి వ్యాపార బంధమే తప్ప ప్రేమానుబంధం లేదు. సాధారణంగా మన మొక్కులన్నీ ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలోనే సాగుతుంటాయి.
‘ ఈ కోరిక తీరిస్తే నీకు ఈ కానుకలిస్తాను.
ఈ పూజలు చేయిస్తాను...’ ఇలా ఉంటుంది మనలో చాలామంది దైవభక్తి.
దైవంతో అనుబంధం
నవవిధ భక్తులనే తొమ్మిదిరకాలుగా వుంటుంది. వాటిలో ఏఒక్క అనుబంధం దృఢంగా ఉన్నా ఆయన మనల్ని వదలడు. లేకపోతే..మనకు దొరకడు. భగవంతుడు సర్వేశ్వరుడనే విశ్వాసం ఉంటేనే చాలదు. మనం చేసే యాంత్రిక పూజలు
వాటంతటవే అక్కరకు రావు.
దైవాన్ని తండ్రిగా ఆరాధిస్తే మనం ఒక మంచిబిడ్డగా జీవించాలి. ఆయన్ను ఏ రూపంలో ఆరాధించినా ఈ పద్ధతి
పాటించాలి.
శ్రీరామ పాదసేవకుడిగా ఉన్న
ఆంజనేయుడు భక్తుడిగాను,
దేవుడిగాను పూజలందుకుంటున్నాడు.
సంకీర్తనలతో అన్నమయ్య, త్యాగయ్యలు దైవాన్ని మెప్పించి, తమ సన్నిధికి రప్పించుకొన్నారు .తులసీదాసు తన ‘రామచరితమానస్’ తో రాముడిమనసు దోచాడు. మూఢభక్తితో కన్నప్ప తనరెండు కళ్ళను శివుడికి సమర్పించి
దివ్యసాక్షాత్కారం పొందాడు. తన
శరీరంలోని భాగాలనే రుద్రవీణగా చేసి రావణుడు ముక్కంటిని మెప్పించాడు.
సుదీర్ఘమైన కాలవాహినిలో ఎందరో భక్తులు పూజాపుష్పాల్లా తేలియాడి, పరమాత్మలో లయించి పోయారు. వారు ఇప్పుడు లేరు. కానీ, వారి గాథలు శిలాక్షరాల్లా నిలిచి ఉన్నాయి.
ఈ గాథలన్నీ భగవంతుడితో మన అనుబంధం ఎలా ఉండాలో చెబుతాయి. నిత్యమూ లక్షల సంఖ్యలో ప్రజలు దేవాలయాలను దర్శించుకుంటూ ఉంటారు. భగవంతుడికి వారు ఏమిస్తున్నారు, ఏం తీసుకెళ్తున్నారు? కోరికల జాబితా ఇస్తున్నారు.ఆ కోరికలు తప్పక నెరవేరతాయనే గట్టి నమ్మకాన్ని
వెంట తీసుకువెళ్తున్నారు, అంతే!
దీన్ని దైవంతో అనుబంధమని ఎలా చెప్పగలం? ప్రాపంచిక బంధాలనే సంకెళ్లతో మనం భగవంతుడి ఎదుట నిలబడుతున్నాం. భక్తిపూర్వకంగానే అనుకుంటూ కనులు మూసి చేతులు జోడిస్తున్నాం. మనసు మెల్లిగా కోరికల జాబితా విప్పుతుంటుంది. దేవుడు మాటమాటకు, ప్రతి భక్తుడి బూటక భక్తికీ నవ్వలేక, శిలాదరహాసం వెలయిస్తాడు. ఆ మందహాస మర్మం మనకు అర్థంకాదు.
ఈ భ్రమాభరిత భక్తినాటకం నుంచి మనం బయటపడాలి. నిలువుదోపిడి ఇచ్చినట్లు, మనసునంతా ఖాళీ చేసి ఆయన పాదాలముందు గుమ్మరించాలి. కోరికలన్నీ శూన్యం చేసుకున్నట్లు, నీలాలు లేని తలతో నిలబడినట్లు ఆయన ఎదుట నిస్సహాయుడిగా, ‘నీవే దిక్కు’ అన్నట్లు చేతులు జోడించి నిలబడిపోవాలి. మనం దైవానుగ్రహం కోసం ఎంతగా నిరీక్షిస్తామో, భగవంతుడు మంచి భక్తుడి కోసం అలాగే ఎదురుచూస్తాడు.
పరిపక్వత చెందిన మనసే ఫలంగా,
కోరికలు లేని సమర్పణా భావాలు
సుగంధ పుష్పాలుగా, సర్వలోక క్షేమమే మహత్వాకాంక్షగా, నిర్మల నివేదనగా సమర్పించాలి.
అలా అతికొద్దిమంది మాత్రమే చేయగలరు.
ఆ కొద్దిమందిలో మనం ఎందుకుండ కూడదు?తిరుమలలో ఒక గదినుంచి మరో గదికి వెళ్తూ చివరికి స్వామి దివ్య సన్నిధికి చేరుకుంటాం. మన మనసు అనుక్షణమూ అన్నమయ్య ఆర్తిని అనుభవిస్తూ దైవంతో అనుబంధానికి తపించాలి.వెన్నతినే వేలుపు ఆయన. వెంటనే మన ఆర్తికి కరిగిపోతాడు. తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చినట్లు భావించి ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటాడు.
అదే అసలైన అనుబంధం
[
*శౌనకుడు*
సూర్యుని ప్రార్థించి అక్షయపాత్రను వరముగా పొదుతున్న ధర్మరాజు
అది విని శౌనకుడు ధర్మరాజా ! ఇందుకు ఇంత చింతించ తగునా. వివేకులు ఎందుకూ దు॰ఖించరు, వికలురు కారు. ఈ బంధాలు తాత్కాలికాలు కనుక కలత చెందవద్దు. బంధం వలన అభిమానం, అభిమానం వలన కోరిక, కోరిక వలన కోపం, దాని వలన ఆశ పుడతాయి. ఆశ సమస్త దోషాలకు మూలం కనుక ఆశను వదిలి పెట్టు. ధనం మీద కోరిక కలవాడు పతనమౌతాడు. ధనవంతుని చుట్టూ బంధువులు చేరి అతనిని పీడించి ధనాన్ని హరిస్తారు. ధనం వలన గర్వం, అహంకారం, భయం కలుగుతాయి. కనుక ధనార్జనకు పాల్పడ వద్దు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండు అని హితవు చెప్పాడు. అందుకు ధర్మరాజు అయ్యా! ధనం నా కోసం కాదు. ఈ బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కదా! వారు మా అతిధులు. గృహస్తుకు అతిధి పూజ పరమ ధర్మం కదా! ఆర్తునకు శయ్య, భయంతో ఉన్నవాడికి శరణు, అలసిన వాడికి ఆసనం కూర్చడం గృహస్తు ధర్మం. తనకోసం మాత్రం వండుకొని తినడం పాపం. కనుక అతిధి సత్కారం చేయడం నా ధర్మం అన్నాడు. అందుకు శౌనకుడు ధర్మరాజా! ఇంద్రియాలు సుఖాలను కోరతాయి. ఎంతటి జ్ఞానులకైనా ఇంద్రియాలు లొంగవు. ఇంద్రియ సుఖాలకు లోబడి దేహదారులు సంసార చక్రంలో పడి తిరుగుతుంటారు. కానీ మహనీయులు ప్రేమ, అసూయలను వదలడం, చక్కని చిత్తవృత్తిని అలవరచు కోవడం, ఇంద్రియాలను వశపరచు కోవడం, తనకు నచ్చిన దీక్షను స్వీకరించడం, గురువులను సేవించడం, నియమంగా ఆహారం తినడం, విద్యను అభ్యసించడం, ఫలితం మీద ఆశ లేకుండా పనులు చేయడం అనే నియమాలను ఆచరించే వారు సంసార బంధాలను అధిగమిస్తారు. కనుక ధర్మరాజా నీవు కూడా గురుసేవా, పెద్దలు చెప్పినది వినడం విన్నదానిని అర్ధం చేసుకోవడం . అర్ధం చేసుకున్నదానిని మనసులో నిలుపుకోవడం, అవసరమైన దానిని ఆచరించడం , అవసరం లేనిదానిని వదిలివేయడం వీటిని ఆచరించు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, తపస్సు చేసి ఐశ్వర్యాన్ని పొందారు. కనుక తపస్సు చేసి నీ కోరికలు తీర్చుకో అన్నాడు. ధర్మరాజు ధౌమ్యుడితో అయ్యా ! ఇదేమో అడవి. బ్రాహ్మణులు మా మాట వినరు. వీరికి మేము ఆహారం ఎలా సమకూర్చగలను అని అడిగాడు. ధౌమ్యుడు ధర్మరాజుతో ధర్మరాజా! జీవకోటికి ఆహారాన్ని నీటిని ప్రసాదించేది సూర్యుడు. కనుక నీవు సూర్యుని ప్రార్ధించి నీ కోరిక నెరవేర్చుకో అని చెప్పి ధర్మరాజుకు నూట ఎనిమిది ఆదిత్య నామాలు అర్ధంతో సహా ఉపదేశించాడు. ధర్మరాజు నిష్టతో సూర్యుని పూజించాడు. సూర్యుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి ధర్మరాజా ! ఈ పన్నెండేళ్ళు అరణ్యవాసంలో మీరు అడవిలో సేకరించిన కంద మూలాలు ఫలాలు మీ భార్య ద్రౌపదిచే వండించిన, అది నాలుగు విధములైన వంటకములుగా ఏర్పడతాయి. అవి ఎప్పటికీ అక్షయంగా ఉంటాయి అని వరం ఇచ్చి వెళ్ళి పోయాడు.
హస్థినా పురం:
హస్థినా పురంలో దృతరాష్ట్రుడు విదురునితో విదురా పాండవులు ఏమి చేస్తుంటారు అని అడిగాడు. దానికి విదురుడు పాండవులు దైవసంభూతులు. జూదం వలన అన్నదమ్ములకు వైరం వస్తుందని చెప్పాను. నీవు విన లేదు. ఇప్పటికైనా నా మాట విని పాండవులను పిలిపించి వారి రాజ్యం వారికి ఇచ్చి ధర్మం నిలబెట్టు. కర్ణుడు శకుని మాటలు విని చెడు పనులు చేసే నీ కొడుకుని సుయోధనుని విడిచి పెట్టు. ద్రౌపదికి, భీమునికి దుశ్శాశనునితో క్షమాణలు చెప్పించు అన్నాడు. ఆ మాటలకు దృతరాష్ట్రుడికి కోపం వచ్చి సుయోధనుడు నా కన్న కొడుకు వాడిని నేను ఎలా వదలను. నీకు నాకొడుకులంటే పడదు. వారు ఉన్నతులైతే సహించలేవు. నీ సాయం నాకు అక్కర లేదు. నీవు పాండవుల దగ్గరికే వెళతావో ఇంకెక్కడి వెళతావో నీ ఇష్టం అన్నాడు. వెంటనే విదురుడు కామ్యక వనంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు తన పెద నాన్న గురించి అడిగాడు. విదురుడు జరిగినది చెప్పాడు. దృతరాష్ట్రునికి విదురుడు పాండవుల వద్ద ఉన్నాడని తెలిసింది. విదురుని విడిచి ఉండ లేక విదురుని కొరకు సంజయుని పంపాడు. సంజయుడు కామ్యకవనం వెళ్ళి విదురునికి నచ్చచెప్పి తీసుకు వచ్చాడు. దృతరాష్ట్రుడు విదురా ! నీవు నీతి మంతుడవు. నాకు బుద్ది లేదు. అందుకే నిన్ను వెళ్ళగొట్టాను నన్ను క్షమించు అన్నాడు. విదురుడు దృతరాష్ట్రా! నీవు నీ కొడుకులు ధర్మం తప్పి నడుస్తున్నప్పుడు మీకు ధర్మం చెప్పడం నా ధర్మం. మహా పరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు అన్నాడు. విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడు నచ్చలేదు. కర్ణ, శకుని, దుశ్శాశనులతో చర్చిస్తూ పాండవుల దగ్గరకు వెళ్ళిన విదురుడు మరల వచ్చాడు. మనకు మంత్రి అయ్యాడు. ఒకవేళ విదురుడు, దృతరాష్ట్రుడు కలసి పాండవులను తిరిగి రమ్మంటే ఏమి చేయాలి? అన్నాడు. శకుని సత్య సంధులైన పాండవులు ఎట్టి పరిస్థితిలో తిరిగి రారు. ఆ భయం నీకు వద్దు అన్నాడు. కర్ణుడు ఈ అదను చూసుకుని వారి మీద యుద్ధం చేసి వారిని హతమారుస్తాము. శత్రుశేషం లేకుండా చేద్దాం అన్నాడు. కర్ణుని మాట విని దుర్యోధనుడు సేనలను సమీకరిస్తున్నాడు. పాండవులపై యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. ఇది తెలిసి వ్యాసుడు దృతరాష్ట్రుని వద్దకు వచ్చి నీ కుమారుడు పాండవుల మీదకు యుద్ధానికి వెళుతున్నాడు. పాండవుల అరణ్య, అజ్ఞాత వాసం తరువాత ఎలాగూ యుద్ధం తప్పదు తొందరెందుకు అన్నాడు. దృతరాష్ట్రుడు మహత్మా! నన్ను ఏమి చెయ్యమంటారు. జూదం వలన చెడు జరిగింది. నేను పుత్ర వాత్సల్యం వలన నా కొడుకుని విడువలేను అన్నాడు. వ్యాసుడు దృతరాష్ట్రా! పుత్ర వాత్సల్యం ఉండవలసిందే కానీ అడవిలో ఉండే పాండవుల మీద దయ చూపించు. నాకు ఇద్దరూ సమానులే. ధర్మరాజు స్నేహంతో నీ కొడుకు సుయోధనుడు మారవచ్చు అన్నాడు.దృతరాష్ట్రుడు అయ్యా! వాడు నా మాట వినడు. మీరే వాడికి నచ్చ చెప్పండి అన్నాడు. వ్యాసుడు మైత్రేయ మహర్షి వచ్చి నీ కొడుక్కు నచ్చ చెబుతాడు అని వెళ్ళి పోయాడు.
[
కుశల కర్మలు అంటే మంచి పనులు. అకుశల కర్మలు అంటే చెడ్డ పనులు. ప్రతి మనిషి మనస్సులో, ఆలోచనల్లో ఈ రెండూ ఉంటాయి. పుట్టుకతోనే ‘వీరు మంచివారు’ ‘వీరు చెడ్డవారు’ అని విభాగించుకుని పుట్టరు. వ్యక్తిగా, సామాజికంగా పెరిగిన కొద్దీ మనలో ఈ భావాలు పెరుగుతాయి. కుశల ధర్మాలు మనకి శాంతిని ఇస్తాయి. అకుశలాలు చివరికి దుఃఖాన్నే తెచ్చిపెడతాయి.
అయితే మనిషి దుఃఖంలేని కుశల మార్గంలోనే నడవడం ఏదోఒక క్షణంలోనో, రోజులోనో జరిగే పని కాదు. ఎంత సాధన చేసి మంచిగుణాలు అలవర్చుకున్నా ఏదో క్షణంలో బుద్ధుడు చెప్పినట్లు చిటికె వేసినంత కాలంలో– అకుశలం వచ్చి ఆవహించేస్తుంది. కాబట్టి మనిషి కుశల చిత్తంతో మెలగాలంటే నిరంతరం అదే ధ్యాసలో ఉండాలి. నడవాలి.
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఎందరో భిక్షువులు ఎంతెంతో సాధన చేసినవారు కూడా ఆ చిటికెల కాలంలోనే దారి తప్పేవారు. ఈ విషయంలో ఎందరో బుద్ధుని దగ్గరకు వచ్చి...
‘భగవాన్! మా చిత్తాన్ని నిలుపుకోలేకపోతున్నాం. ఏదో క్షణంలో చెడ్డ భావాలు వచ్చి పడుతున్నాయి.
వానినుండి ఎలా బైటపడగలం’’ అని అడిగేవారు. అప్పుడు బుద్ధుడు... ‘మీరు అందుకోసం నిరంతరం పది సాధనా మార్గాల్లో ఉండాలి’ అంటూ వాటి గురించి చెప్పాడు. అప్రమత్తంగా ఉండటం, సోమరితనంతో గడపడం, అతిగా కోరుకోవడం, ఎంత లభించినా ఇంకా, ఇంకా కావాలి అనే అసంతృప్తి నిరంతరం నిర్లక్ష్యంగా ఉంచే అజాగ్రత్త, ఏ విషయాన్నైనా లోతుగా గ్రహించకపోవడం వల్ల కూడా అవగాహనాలేమి, చెడ్డవారి స్నేహం, వీటితోపాటుగా జాగరూకతను నిరంతరం పెంచుకోకపోవడం చెడ్డవారిని అనుసరిస్తూ, అకుశల కర్మలే శిక్షపొందుతూ ఉంటే.. ఈ పది కార్యాల వల్ల మనిషితో అకుశల ఆలోచనలు పెరుగుతాయి. అకుశల ఆచరణలు జరుగుతాయి.
అలాంటి వానికి సంపద నష్టం, కీర్తి నష్టం, ప్రజ్ఞ నష్టం, సకలం నష్టం. దీనివల్ల దుఃఖం. అలాగే కుశల ధర్మాలు పెరగాలంటే ప్రమత్తతను వీడి అప్రమత్తతతో సోమరితనాన్ని వదిలి ఉండాలి. పట్టువదలని సాధనలో ఉండాలి. అధిక కోర్కెల్ని వదిలి, బతకడానికి సరిపడు మితమైన కోర్కెలు (అల్పేచ్ఛ) కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి, జాగరూకతతో మెలగాలి. ప్రతి విషయం పైనా మంచి అవగాహన పెంపొందించుకోవాలి.
మంచిని చేకూర్చే మంచి మిత్రులతోనే స్నేహం చేయాలి. మంచివారిని అనుసరించాలి. మంచి కర్మల శిక్షణ పొందాలి. ఈ పది కార్యాల వల్ల మనిషిలో కుశల ఆలోచనలు పెరుగుతాయి. కుశల ధర్మాలు ఉద్భవిస్తాయి. కుశలాచరణ కలుగుతుంది. అలాంటి వారికి సంపద నష్టం కాదు. కీర్తికి నష్టం రాదు. ప్రజ్ఞ దిగజారిపోదు. దుఃఖం దరికే రాదు. అని చెప్పాడు బుద్ధుడు. ఇలా ప్రతి వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకుంటే, అది వ్యక్తికి, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి మేలు అని బోధించిన తధాగత బుద్ధునికి జేజేలు!
[
*భోజన ప్రియులకు మాత్రమే!*
సాంబారులో చందమామలు
తెలుగువాడు మంచి భోజనప్రియుడని వేరే చెప్పవలసిన పనిలేదు. మన విస్తరిని ఉత్తరాది భోజనాలతో పోల్చి చూస్తే, ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుంది. అభిరుచుల్లో వైవిధ్యాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
*‘ఆవకాయ రుచుల ఠీవి తానెరుగును,*
*పూతరేకు తీపి కేతమెత్తు,* *ఉలవచారు త్రావ ఉత్సాహమును జూపు, పనసపొట్టు నొక్క పట్టుబట్టు!.*
..వాడెవడని అడిగితే జవాబు కోసం తడుముకునే అవసరం రాదు. కనుకనే దేశదేశాల్లో తెలుగు రుచులు నేడు రాజ్యం ఏలుతున్నాయి. వైద్యులు కాదంటున్నా, *‘వరితో చేసిన వంటకంబు రుచియై వార్ధక్యముం బాపదే’* అంటూ మధుమేహులు వాదనకు దిగుతారు.
భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయాలకు భోజనంలో భాగం కల్పించిన ఘనత తెలుగువాడిది. మామిడిపండుతోనో, మాగాయ టెంకతోనో *‘గడ్డపెరుగు నింత గారాబమును చేసి’* గర్రున తేన్చి, ఆ పూటకు భోజన పరాక్రమానికి స్వస్తి చెప్పడం వేరే వాళ్ళకు చేతకాదు.
*‘కడుపే కైలాసం’* వంటి నానుడిని పుట్టించడం తెలుగువాడికి మాత్రమే సాధ్యం. కాబట్టే పరభాషల్లో అలాంటి పదబంధాలు కనపడవు.
సరైన భోజన సదుపాయం దొరక్క....
*‘చల్లా నంబలి త్రావితిన్ రుచులు దోసంబంచు పోనాడితిన్ తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడన్’* అని అదేదో ఘనకార్యంలా ఫిర్యాదు చేశాడంటే శ్రీనాథుడు తెలుగువాడు కాబట్టే!
కొరవి గోపరాజు *‘సింహాసన ద్వాత్రింశక’ను గాని, పాలవేకరి కదిరీపతి ‘శుకసప్తతి’ని* గాని తిరగేస్తే తెలుగువారి భోజన పదార్థాల పట్టిక పట్టరాని విస్మయాన్ని కలిగిస్తుంది.
చేపలను జలపుష్పాలుగాను, గోంగూరను శాకంబరీమాత ప్రసాదంగాను చమత్కరించడం తెలుగు నాలిక్కి మాత్రమే పట్టుబడే విద్య.
ఏ గిరీశాన్నో నిలదీస్తే *‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’* అన్నవాడు ఆంధ్రుడే- అని ఠక్కున చెబుతాడు.
*‘చల్ది వణ్ణం’* తినడానికి అభ్యంతరం లేదని బుచ్చెమ్మకు అందుకే గట్టిగా చెప్పగలిగాడు.
మహాభారతంపై మమకారాన్ని ప్రకటిస్తూ *‘వింటే భారతమే వినాలి’* అని వూరుకుంటే- తెలుగువాడు ఎందుకవుతాడు? *‘తింటే గారెలే తినాలి’* అంటూ తన జిహ్వచాపల్యాన్ని జోడించడం తెలుగువాడికే చెల్లింది.
*‘గారెలు తిందు నేను వడగాచిన నేతిని ముంచుకొంచు’* అనడం ఒకరి అభిరుచి విశేషం. తేనె పానకంలో నానబెట్టి *‘పాకం గారెలు’*;గా తినడం మరొకరికి ఇష్టం.
*‘ఆ సుధారసంబునందు వూరిన గారెలు ఇచ్చు పరితుష్టికి పుష్టికి సాటిలేదిలన్’* అనేది వీరి అభిప్రాయం.
ఈ వేళంటే కంగాళీ తిళ్ళు(ఫాస్ట్ఫుడ్స్) వచ్చిపడి తెలుగువాడి తిండిపుష్టి ఇలా ధ్వంసం అయిందిగాని, మన పెద్దల తిళ్ళు గుర్తుచేసుకుంటే మనం ఎంత అర్భకులమో తెలిసొస్తుంది. అలా పెట్టీ, తినీ ఆస్తులు కరగదీసిన జాతి మనది! *తరవాణీల బలం-* కాఫీ, టీలకు రమ్మంటే ఎలా వస్తుంది?
‘అరుణ గభస్తి బింబము ఉదయాద్రి పయిం పొడతేర గిన్నెలో పెరుగును, వంటకంబు వడపిండియలతో’ చల్దులను పిల్లలకు ఎలా తినిపించేవారో కృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’లో వర్ణించాడు. ‘మాటిమాటికి వ్రేలు మడిచి వూరించుచు వూరుగాయలను’ గోపబాలకులు ఎలా ఇష్టంగా ఆరగించారో భాగవతంలో పోతన వర్ణించాడు.
ఈ చద్దన్నాలకు, ఆ పానీయాలకు పోలికే లేదు. కాఫీ, టీల మూలంగా మంటపుట్టిందే తప్ప *‘కడుపులో చల్ల కదలకుండా’* హాయిగా తిని కూర్చోవడం మనకు వీలుకావడం లేదు. ఆ రోజుల్లో వడ్డనలూ భారీగానే ఉండేవని కల్పవృక్షంలో విశ్వనాథ పేర్కొన్నారు.
దశరథుడి అశ్వమేధయాగ సంతర్పణలో ఎన్నో రకాల వంటకాలు సిద్ధంచేసి *‘హస్తములు అడ్డముంచినను ఆగక వడ్డన చేసిరన్నియున్’* అని వర్ణించారు. విస్తరిపై వంగి వద్దు వద్దంటే కడుపులో ఇంకాస్త చోటున్నట్లట! బొజ్జ వంగక కళ్ళతోనే నిస్సహాయంగా సైగలు చేస్తే ఇక చాలు అని ఆగేవారట. తెలుగువాడి భోజనప్రీతిని వెల్లడించే ఉదాహరణలివన్నీ.
వూరుగాని వూరు పోతే ముందస్తుగా *‘మంచి భోజనమ్ము మర్యాదగా పెట్టు పూటకూళ్ళ యిళ్ళ వేట’* లో నిమగ్నం కావడం గతంలో తెలుగువాడి ఆనవాయితీ.
వండటం వడ్డించడం తినడంలోనే కాదు- ఆరోగ్యం విషయంలోనూ తెలుగువాడి అభిరుచి ప్రత్యేకమైనదేనని మళ్ళీ కొత్తగా నిరూపణ అయింది. ఇడ్లీ తెలుగువాడికి చాలా ఇష్టమైన పదార్థం. *‘ఇడ్డెనల్’* అనేది అటు కవుల ప్రయోగాల్లోను, ఇటు నిఘంటువుల్లోను కనిపించే అచ్చతెనుగు పదం.
*‘చినచిన్న చందమామలు నునుమల్లెల మెత్తదనము నోటికి హితమౌ, జనప్రియములు రుచికరములు- ఇడ్డెనలకు ఎనయైన భక్ష్యమేది ధరిత్రిన్’* అని బులుసు వేంకటేశ్వర్లు కవి చెప్పినట్లు తెలుగువారు *‘తినుచున్న ఇడ్డెనలు తినుచుంద్రు నిత్యము’* అనిపిస్తుంది. పిండిని ఉడకబెట్టి ఆవిరిపై వండే పదార్థాన్ని ‘ఇడ్లి ’ అంటారు. దాన్నే పనస ఆకుల మధ్య ఒబ్బిడిగా ఉడికిస్తే- అది *పొట్టిక్కబుట్ట!* ఆషాఢ మాసపు చివరి రోజుల్లో కడుపులో పెరిగే క్రిముల నివారణకు పనసాకులతో సహా ఉడికే పొట్టిక్కబుట్టలోని ఆహారం దివ్య ఔషధం! సాధారణ ఇడ్లీకి సాంబారు చక్కని జత. *‘సాంబారులో స్నానం చేస్తున్న ఇడ్లీ సుందరి’* ఓ సందర్భంలో శ్రీశ్రీ కవితలో మెరిసింది. *‘ఉదయంపూట ఆహారంగా తినే ఇడ్లీ ప్రపంచంలోని ఆహార పదార్థాలన్నింటికన్నా ఆరోగ్యకరమైనది’* అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ మేరకు యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా సంతకంతో జారీ అయిన యోగ్యతాపత్రం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందింది. లక్షలమంది ఆ విశేషాన్ని ఒకరితో ఒకరు పంచు’కుంటున్నారు.
ఈ సంగతి తెలియగానే ‘ఇడ్డెనతో సాంబారును గడ్డపెరుగుతోడ ఆవకాయయు జతగా...హాయిగా లాగిస్తూ మన పూర్వీకులు *‘సొడ్డుసుమీ స్వర్గలోక సుఖముల కెల్లన్’* అనుకుంటూ ఆరోగ్యంగా జీవించారని కవులు కీర్తించడం మొదలెట్టారు. ఐక్యరాజ్య సమితి పుణ్యమా అని మన వంటకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆంధ్రులకు గర్వకారణమని వారి ఆనందం!
(
*జన్మ సార్ధక సాధన*
ఒకసారి "పాలు" ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అని అడిగాడు.
అప్పుడు పాలు..........
ఈశ్వరా !!
నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా, పరిశుద్ధముగా ఉంటాను.. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనము కోసం నాలో పులుపు వేసి నా మానసును విరిచేస్తున్నాడు. నన్ను రక్షించు అని చెప్పి భాదపడిందట.
అప్పుడు ఈశ్వరుడు ఓ చిరు నవ్వు నవ్వి...
ఓ క్షీరమా... ఇది విను, నీవు పాలు లా జీవించాలి అని ఆశ పడే ముందు నా మాట విను.. నీవు పాలు లాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు.
పాలకు పెరుగు తోడు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు.,
పెరుగుని చిలికి చల్ల ని చేస్తే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు.
అదే చల్ల లోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు, అ వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమ ఘుమలతో నెలలు తరబడి బ్రతుకుతావు.
ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణవు అవుతావు..
ఇప్పుడు చెప్పు... ఒక రోజు పాలు లాగా ఉండి పాలలాగానే చస్తావా లేక క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణవు అవుతావా... అని ఈశ్వరుడు ప్రశ్నించారు..
దేవుని మాటకి "పాలు" మూగబోయింది, ఈశ్వరునికి దాసోహం అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది...
మానవుడు కూడా అట్లాగే.. ఎవరో తమ మనస్సుని విరిచేసారు అని మనస్సుని పాడుచేసుకుని బాధపడేకంటే.. క్షీరము వలె మనస్సు లో ఆధ్యాత్మికత అనే తోడు వేసి, ప్రతి పరిస్థితులలోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామ స్మరణతో చిలికి , దానిని దైవ చింతనం తో కాచి, దానిలోంచి వచ్చిన జ్ఞానం తో ఎప్పుడు ఎప్పుడా అని ఆ ఈశ్వరుని లో ఏకమవటానికి ఎదురు చూస్తూ జన్మను సార్ధకం చేసుకోవాలి
[
*మైత్రేయుడు*
వ్యాసుడు చెప్పినట్లు కొన్ని రోజుల తరువాత మైత్రేయుడు ముందుగా పాండవులను చూచి హస్థినాపురం వచ్చాడు. దృతరాష్ట్రుడు మైత్రేయునికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. మైత్రేయుడు నేను కామ్యక వనంలో ఉన్న పాండవులను చూసి వచ్చాను. వారు అడవులలో కందమూలాలను తిని జీవిస్తున్నారు అన్నాడు. పాండవులు క్షేమంగా ఉన్నారా అని దృతరాష్ట్రుడు అడిగాడు. మైత్రేయుడు ఓ రాజా! పాండవులు ధర్మబుద్ధి కలవారు. వారికి మహర్షుల దీవెనలు ఉన్నాయి. అందు వలన క్షేమమే అన్నాడు. దుర్యోధనుని వైపు తిరిగి కుమారా! నీకు బుద్ధి ఉంటే పాండవులతో వైరం వదులుము. అలా చేస్తే నీవు కురువంశానికి మేలు చేసిన వాడివి ఔతావు. పాండవులు వజ్ర శరీరులు. భీముడు హిడింబుని, బకాసురుని, జరాసంధుని, కిమ్మీరుని వధించిన బలాడ్యుడు. అతనిని వధించగల యోధులు లేరు. శ్రీకృష్ణుడు, దుష్టద్యుమ్నుని బంధుత్వం పాండవులకు మరింత బలాన్నిచ్చింది. కనుక నీవు పాండవులతో స్నేహం చేయటం మంచిది అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు తన తొడలు చరిచి మహర్షిని అవమానించాడు. అందుకు మైత్రేయుడు ఆగ్రహించి సుయోధనా ! యుద్ధభూమిలో భీముని గదాఘాతం నీ తొడలను విరవకలదు అని మైత్రేయుడు అన్నాడు. దృతరాష్ట్రుడు భయపడి మహర్షిని శాపవిమోచనం ఇవ్వమని వేడుకున్నాడు. మైత్రేయుడు మహారాజా! నీ కొడుకు పశ్చాత్తాపం చెంది మంచి బుద్ది కలిగి ఉంటే ఈ శాపం వర్తించదు అన్నాడు.
కిమ్మీర వధ:
దుర్యోధనునికి శాపం ఇచ్చిన తరువాత దృతరాష్ట్రుడు మహాత్మా! కిమ్మీరుడనే రాక్షసుడు భీముని చేతిలో ఎలా చనిపోయాడో వవరిస్తారా? అని అడిగాడు. మైత్రేయుడు నా మాటను నీ కొడుకే వినలేదు. నేనెందుకు చెప్పాలి విదురుని అడిగి తెలుసుకో అని చెప్పి వెళ్ళి పోయాడు. విదురుడు కిమ్మీరుని వృత్తాంతం ఇలా వివరించ సాగాడు. పాండవులు ఒకరోజు అడవిలో విశ్రమించవలసి వచ్చింది. వికృతాకారుడైన రాక్షసుడు పాండవుల దారికి అడ్డంగా నిలిచాడు. ఆ రాక్షసుని చూసి ద్రౌపది భయంతో కళ్ళు మూసుకుంది. ఇంతలో ధౌమ్యుడు తన మంత్రశక్తితో ఆ రాక్షసుని మాయను భగ్నం చేసాడు. ఆ రాక్షసుని చూసి ధర్మరాజు నీ వెవరు ఈ అడవిలో ఎందుకు ఉన్నావు అని ఆడిగాడు. దానికి ఆ రాక్షసుడు నేను బకుడు అనే రాక్షసుని తమ్ముడిని. నా పేరు కిమ్మీరుడు. మనుష్యులను చంపి తింటూ ఉంటాను నాకు భయపడి ఎవెరూ ఈ అరణ్యానికి రారు. మీరు ఎవెరు? ఈ అరణ్యానికి ఎందుకు వచ్చారు? అని అడిగాడు. ధర్మరాజు నా పేరు ధర్మరాజు వీరు నా సోదరులు. మేము వనవాసం చేస్తూ ఇక్కడకు వచ్చాము అన్నాడు. ఇది విని ఆ కిమ్మీరుడు నా అన్న బకుని చంపిన భీముడు వీడేనా . వీడిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను. నేను వీడి కోసమే వెతుకుతున్నాను అని వికటాట్టహాసం చేసాడు. ఇది విని అర్జునుడు గాండీవం ఎక్కు పెట్టాడు కానీ ఈలోగా భీముడు కిమ్మీరుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఘోరంగా యుద్ధం చేసారు. చెట్లతోనూ రాళ్ళ్తోనూ కొట్టుకున్నారు. చివరకు భీముడు కిమ్మీరుని అతని అన్న బకుని చంపినట్లు అతని దేహాన్ని విరగదీసి చంపాడు. ఈ విధంగా భీముడు కామ్యక వనంలో రాక్షస భయం లేకుండా చేసాడు అని చెప్పాడు. ఇది విని దృతరాష్ట్రుడు కలత చెందాడు.
[
*మనిషిని చదవాలి!*
మనం ఎన్నో విధాలైన పుస్తకాలు చదువుతాం. ఎంతో నేర్చుకుంటాం. తెలిసిన జ్ఞానం పది మందికీ పంచుతాం. మనం మనిషిని సరిగ్గా చదవడం లేదు. మనిషిని చదవడం అంటే ఎదుటి మనిషి స్వభావాన్ని, మాట తీరును, ప్రవర్తనను, మంచి-చెడులను అర్థం చేసుకోవడం. మనిషి సంఘజీవి. అన్ని విషయాల్లోనూ సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి సాటివారి మీద ఆధారపడక తప్పదు. పంట ఒకడు పండిస్తున్నాడు. ఇల్లు వేరొకడు కడుతున్నాడు. గుడ్డ మరొకడు నేస్తున్నాడు. వేర్వేరు వస్తువులను వేర్వేరు వ్యక్తులు తయారు చేస్తున్నారు. మన దగ్గర డబ్బే ఉంది. ఆ డబ్బు ఖర్చుచేసి, అన్నీ కొని తెచ్చుకుంటున్నాం. అందుచేత చాలా మందితో మనకు అనుబంధం ఉంటుంది. సంబంధం ఉంటుంది. ఈ సంబంధాలను, అనుబంధాలను ఎంత వరకు కొనసాగించాలి? ఎంత వరకు పెంచుకోవాలి? ఎంతకాలం పటిష్ఠంగా ఉంచుకోవాలి? ఎవడు తన అవసరం కోసం మనల్ని పొగుడుతున్నాడు? ఎవడు చిత్తశుద్ధితో మనల్ని అభినందిస్తున్నాడు? ఇది గ్రహించడమే మనిషిని చదవడం అనిపించుకుంటుంది. మన జీవన యానానికి, భవిష్యసాధ నిర్మాణానికి ఇది చాలా అవసరం.
మనిషిని చదివే చదువు గ్రంథాలు, ప్రబంధాలు అధ్యయనం చేసినంత మాత్రాన వచ్చేది కాదు. అయితే వాటి అధ్యయనం కొంత వరకు తోడ్పడవచ్చు. కాని ఎదుటి మనిషి సంభాషణ, నడత, వృత్తి, ప్రవృత్తి, పరిశీలించి పరిచయాన్ని గాని, స్నేహాన్ని గాని పెంచుకోవడం మనిషికి శ్రేయోదాయకం. కొందరు పరిచయం కాగానే చనువు పెంచుకుని అతిగా స్నేహం చేస్తారు. అది మంచికి దారి తీయవచ్చు. కీడే కలిగించవచ్చు. ఏదయినా ‘అతి’ అనర్థదాయకమే! కొందరు ప్రతి మనిషిని, మాటను అనుమానిస్తారు. వాళ్ల మీద వాళ్లకే నమ్మకం ఉండదు. దీనివల్ల శత్రువులు పెరుగుతారు.
ఎదుటి మనిషిలోని నిజాయతీని గ్రహించగలగడానికి కూడా స్వతంత్రాలోచనశక్తి ఉండాలి. సానుకూల దృక్పథం అలవరచుకోవాలి. సహనశీలత పెంచుకోవాలి. నిందలను సహించేవారు వందనీయులే. శ్రీకృష్ణుడు నీలాపనిందకు గురైనా సత్యజిత్తును దూషించలేదు. ఆ నిందను తొలగించుకునేందుకు ఎంతో కష్టపడ్డాడు. సాత్వికగుణం సాటివాణ్ని అర్థం చేసుకునేందుకు సహకరిస్తుంది. రకరకాల విమర్శలకు గురవుతాం. అంతటితో కుంగిపోనక్కర్లేదు. అది సద్విమర్శయితే అంతర్ విశ్లేషణ చేసుకుంటాం. అసూయతో చేసిన కువిమర్శయితే నిర్లిప్తంగా వదిలేస్తాం.
రామాయణ, భారత, భాగవతాల్లో అనేక సందర్భాల్లో ఈ విషయానికి సంబంధించిన పాత్రలెన్నో కనిపిస్తాయి. ధర్మ పక్షపాతులైన పాండవుల శక్తిని గ్రహించక, అహంకరించి దుర్యోధనుడు అనుజులతో సహా పతనమైపోయాడు. ధర్మస్వరూపుడు శ్రీరాముడి శక్తిని గ్రహించలేని మూర్ఖుడు దశకంఠుడు నిహతుడైపోయాడు. గోపికల మనసులను చదివిన కృష్ణ పరమాత్మ వారికి తోడునీడై ఆదుకున్నాడు.
మనిషిని చూడ్డానికి కళ్లు చాలు, కనిపించనిదాన్ని చూడటానికి వివేకం కావాలి. ఇతరులను అర్థం చేసుకోలేనివాడు సమాజంలో జీవించలేడు. మనకు ఆపదలు వచ్చినప్పుడే అసలైన బంధువులు, మిత్రులు, హితైషులు ఎవరో తెలుస్తుంది. విశ్వసనీయుడని సాటి మనిషిని గ్రహించగలిగితే, ఆనందం మనకు నీడలా వెన్నంటే ఉంటుంది. మనతో కలిసి నవ్విన మనిషిని మరిచిపోవచ్చు, కానీ కష్టకాలంలో మనతో కలిసి దుఃఖించే మనిషిని మాత్రం మరచిపోకూడదు.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
[
*భీష్ముడి ఉపదేశం*
మహాభారత యుద్ధం సమాప్తమయ్యాక జ్ఞాతులందరూ చనిపోయి దుఃఖంతో కుమిలిపోతున్న ధర్మరాజును అంపశయ్యమీద ఉన్న భీష్ముడి వద్దకు శ్రీకృష్ణుడు తీసుకువెడతాడు. ధర్మశాస్త్రమంతా నిత్యం మనసులో నిలుపుకొనే భీష్ముణ్ని ధర్మరాజు మనసులోని శోకాన్ని తొలగించాల్సిందిగా శ్రీకృష్ణుడు కోరతాడు. భీష్ముడు ధర్మరాజుకు తెలియజెప్పిన శాంతిమార్గం కలియుగంలోని మానవులకు కర్తవ్యబోధ.
దుర్గమమైన బాధలనుంచి తరించగలిగే మార్గం చెప్పమని యుధిష్ఠిరుడు అడిగినప్పుడు నియమబద్ధమైన నడవడిక కలవారు కష్టాలనుంచి తరించగలరని భీష్ముడు వివరించాడు.
మనసా వాచా కర్మణా పాపం చేయని ధర్మవేత్తలను కష్టాలు బాధించవు. రజోగుణం పూర్తిగా శాంతించి, తమోగుణాన్ని తుడిచిపెట్టి సత్యగుణ స్థితులైనవారు దుర్గమమైన కష్టాలను సులభంగా దాటగలుగుతారు. సమస్త జీవులకు ఈశ్వరుడు, జగత్తునకు ఉత్పత్తి, ప్రళయ కారకుడైన భగవంతుడు నారాయణుడిని భక్తిభావంతో ఆశ్రయించేవారు కష్టాలనుంచి గట్టెక్కగలరని భీష్ముడు ఉపదేశించాడు.
ఇంద్రియ నిగ్రహం స్థిరంగా ఉన్నవారు, సుఖదుఃఖాలను సమంగా భావించేవారు, ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారు శిష్టులని భీష్ముడు ధర్మరాజుకు విశదీకరించాడు. సత్పురుషులు ఎల్లప్పుడూ సత్యం అనే సనాతన ధర్మాన్ని అనుష్ఠించాలని, సత్యమే గొప్ప యజ్ఞమని, ధర్మాన్ని కాపాడేది సత్యమే కనుక మానవుడు సత్యత త్పరుడు కావాలని భీష్ముడు బోధించాడు. వేయి అశ్వమేధ యజ్ఞాల ఫలాలను ఒకవైపు, సత్యవచన ఫలాన్ని మరొకవైపు ఉంచితే సత్యం వైపే త్రాసు మొగ్గు చూపుతుందన్న భీష్ముడి ప్రవచనం మహత్తరమైన సత్యధర్మాన్ని విశదీక రించింది. లోభం వల్లనే పాపం, అధర్మం, దుఃఖం కలుగుతాయని భీష్ముడు ఉపదేశించాడు. కపటానికి, మోసానికి, కోపానికి, అజ్ఞానానికి మూలకారణం లోభం కనుక దాన్ని వదిలినవారు సుఖపడతారని తెలియజేశాడు.
‘మంచి ఆలోచనలతో ధర్మాన్ని పొందాలి. క్రోధం క్షమాగుణంతో అంతమవుతుంది. కామం విరక్తితో నశిస్తుంది. విజ్ఞానవంతులను గౌరవిస్తే మోహం తొలగుతుంది. తత్వజ్ఞానం మంచి కార్యాలవైపు దృష్టి మళ్లిస్తుంది.
శోకించడం వ్యర్థం అన్న భావనతో శోకం నశిస్తుంది. సర్వ ప్రాణుల పట్ల దయాగుణం కలిగి ఉండటమే హింసా ప్రవృత్తికి నివారణోపాయం. ఉత్తమ పురుష సాంగత్యంతో మనసు మాత్సర్యరహితమవుతుంది.
వివేకశీలమైన బుద్ధి ఈర్ష్యను పారదోలుతుంది. దయాగుణం జాగృతమై అసూయ తొలగుతుంది. ధర్మాత్ముల మైత్రితో పిసినిగొట్టుతనం పోతుంది. భోగాలు అశాశ్వతమని గ్రహిస్తే లోభం నివృత్తమవుతుంది. సంయమనంతో ఆశను జయించాలి. సంతృప్తితో తృష్ణను జయించవచ్చు. ప్రయత్నంతో సోమరితనాన్ని శాస్త్ర నిర్ణయంతో విపరీత తర్కాన్ని, శౌర్యంతో భయాన్ని విడిచిపెట్టాలి. మనసును, వాక్కును బుద్ధితో వశపరచుకోవాలి’ అని బోధించి మానవుణ్ని పట్టి పీడించే దోషాలు, వాటి నివారణోపాయాలను భీష్ముడు విశదీకరించాడు.
భీష్ముడి హితబోధలు అర్థం చేసుకుని అనుసరించినవారు జీవించినంతకాలం సత్కర్మలను ఆచరిస్తూ జీవితాన్ని తీర్చిదిద్దుకుని భగవంతుడి కృపకు పాత్రులు కాగలుగుతారు.
- ఇంద్రగంటి నరసింహమూర్తి
[
*తన కోపమె తన శత్రువు*
మీరు పిల్లలు... మార్పు మీ దగ్గరే ప్రారంభం కావాలి. ప్రయత్న పూర్వకంగా కొన్ని మంచి లక్షణాలు పసి వయసులోనే అలవాటు చేసుకోవాలి. దీనికి ఉపకరించేవి పెద్దలు, గురువులు చెప్పే మాటలు.. అలాంటిదే శతక నీతి కూడా... ఇప్పడు మనం తెలుసుకుంటున్న ‘తన కోపమె తన శత్రువు...’ సూక్తి సుమతీ శతకం లోనిది. మన కోపం ఎక్కువగా మనల్నే నష్టపరుస్తుంది, మనం ప్రశాంతంగా ఉంటే మనం నేర్చుకునే విషయాలపట్ల మనకు ఏకాగ్రత కుదురుతుంది. ఎదుటివారు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి... అంటూ మన సంతోషమే మనకు స్వర్గం, మన దుఃఖమే మనకు నరకం అంటారు బద్దెన గారు.
పోతన గారు ఓ మాటంటారు... ‘‘వ్యాప్తిం బొందక వగవక /ప్రాప్తంబగు లేశమైన బదివే లనుచుం/దృప్తిం జెందని మనుజుడు/ సప్తద్వీపముల నయిన? జక్కంబడునే?’’ అంటే...లభించినది కొంచెం అయినా అదే పదివేలుగా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తి పడనివారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరదు....అంటారు. ‘నన్ను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులున్నారు, నాకు మంచి స్నేహితు లున్నారు.
నేను మంచి పాఠశాలలో చదువుతున్నా. నాకు మంచి గురువులున్నారు..అలా మనకు ఉన్నవేవో వాటిలోని మంచిని తలుచుకుంటూ మన ప్రయత్నం, మన అభ్యాసం మటుకు నిజాయితీగా చేయాలి. ఇది చేయకుండా అంటే ఉన్నవాటిలోని మంచిని చూడకుండా... లేనివి ఏవో పనిగట్టుకుని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఉన్న పుణ్యకాలం గడిచిపోతుంది.
అలా నిత్యం దిగాలుగా ఉండి చేతిలో ఉన్న సమయాన్ని కూడా వృథా చేసుకునేవాడిని ఆ దేముడు కూడా కాపాడలేడు. నిన్ను సంతోషంగా కానీ దుఃఖంతో కానీ ఉంచేది నీ మనసే. దానిని అదుపు చేసుకో, దానికి నచ్చ చెప్పు. దాని మాట నీవు వినడం కాదు, నీ మాట అది వినేటట్లు చేసుకో. అది నీ చేతిలో ఉంది. అది ఇతరుల వల్ల సాధ్యం కాదు. అలా ఆలోచించి నిత్యం తృప్తిగా, సంతోషంగా ఉంటూ పనులు చక్కబెట్టు కుంటుంటే అదే నీకు స్వర్గం. మీకొక రహస్యం చెబుతా. మనం అందరం చెప్పుకునే స్వర్గలోకం శాశ్వతం కాదు.. మనం చేసిన మంచి పనుల వల్ల మనం స్వర్గం చేరుకునేది నిజమే అయినా... అది మన ఖాతాలో పుణ్యం ఉన్నంతవరకే.
అది అయిపోగానే ... మనం పడిపోతాం. కానీ ఇక్కడ ఈ మనుష్య జన్మ నీకు దక్కింది... 84 లక్షల జీవరాశుల్లో దేనికీ దక్కని అదృష్టం వల్ల నీకు దక్కిన ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే ... నీవు దొరికిన దానితో తృప్తిపడి... నిత్యం సంతోషంగా ఉంటే... నీ జీవితాంతం అలా ఉండగలిగితే... ఇక్కడే నీకు స్వర్గ సుఖాలు లభించినట్లు. అలాకాక నా స్నేహితుడు మంచి మార్కులతో ఉత్తీర్ణుడవుతున్నాడు, నేను కాలేకపోతున్నా... అని తలుచుకుంటూ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే... నీ నరకాన్ని దేముడు కాకుండా నీవే సృష్టించు కున్నట్లయింది. జన్మజన్మలకూ నీవు కూడా సంతోషంగా ఉండాలంటే, నీకు కూడా నీ స్నేహితుడి లాగా సరస్వతీ కటాక్షం పొందాలంటే.. కష్టపడు, బాగా చదువు.
ఈ జన్మలో నీకు వచ్చిన విద్య పదిమందికి పంచు, కష్టంలో ఉన్నవాడికి నీకు చేతనయినంత సహాయం చెయ్యి. నిత్యోత్సాహంతో ఉండు. ఫెయిల్ అయ్యావు... అంత మాత్రానికే లోకం తల్లకిందులయిపోయినంతగా దిగాలు పడొద్దు... అబ్దుల్ కలాం గారు.. ఎఫ్.ఎ..ఐ.ఎల్..ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్... అన్నారు. అంటే నీవు నేర్చుకోవడానికి నీవు చేసిన మొదటి ప్రయత్నం అది అన్నారు.. ఇప్పుడు నీవేం చేయాలి.. రెండో ప్రయత్నం. పట్టుదలతో, ఏకాగ్రతతో సాధించు... అంతే తప్ప నీ అరచేతిలో నీవు సృష్టించుకోగలిగిన స్వర్గాన్ని నీవే కిందకు నెట్టేసి నరకాన్ని చేతులారా తెచ్చిపెట్టుకోవద్దు.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
[
*మధుర భాషణం.. నిజమైన భూషణం*
మాటే మంత్రము.. అవును.. మాట మంత్రమే కాదు.. మనకు, ఎదుటివారికి ఆనందాన్ని కలిగించే, కార్యసాధనకు ఉపకరించే అద్భుతమైన తంత్రం కూడా..!! పక్షులు కిలకిలా రావాలే చేయగలవు. కొన్ని జంతువులు భయంకరంగా గర్జించగలవు, కొన్ని జంతువులు జలదరించే తీరులో ఘీంకరించగలవు, కొన్ని జంతువులు కేవలం మొరగడం మాత్రమే చేయగలవు తప్ప మాట్లాడలేవు. ఏ జీవరాశికీ లేని వాక్కు అనే సంపద మానవులకు మాత్రమే ఉంది. వాక్కు అనేది మానవులకు భగవంతుడు ప్రసాదించిన అరుదైన వరం. అరుదుగా లభించినవాక్కు అనే వరాన్ని వివేచనతో, విచక్షణతో ఉపయోగిస్తూ, సందర్భోచితంగా సంభాషిస్తూ మన్నన పొందడం విజ్ఞత కలిగిన మానవుని లక్షణం.
ఒక మనిషిని సంఘంలో గౌరవించే విధానికి చాలావరకు మాటతీరు లేదా వాక్చాతురి కారణమౌతుంది. మృదువుగా సంభాషించే సౌజన్యశీలితో మాట్లాడడానికి సంఘంలో ఎవరైనా ఇష్టపడతారు. అహంకారాన్ని ప్రదర్శిస్తూ, ఎదుటివారిపై హుంకరిస్తున్న విధాన మాట్లాడితే, ఆ వ్యక్తి చెంత ఎవరూ చేరరు కదా..!! ‘‘మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది’’ అన్నది చిరకాలంగా మనకు తెలిసిన ఆర్యోక్తే కదా.. హితకరమైన మాటలు మాట్లాడే వ్యక్తి చాతుర్యం అన్ని సమయాల్లోనూ కార్యసాధకమై రాణిస్తుంది.
మృదుభాషణం కలిగినవారు తమ మాటలతో ఎదుటివారిని నొప్పించకుండానే తమకు కావలసింది సాధించుకుంటారని చరిత్ర ఘంటాపథంగా చెబుతోంది. అయితే, మాటతీరు అన్నివేళలా మృదువుగా ఉంటే సరిపోదు. సందర్భాన్ని బట్టి, ఒక్కొక్కసారి అవతలివారితో మనం సంభాషించే విధానంలో కొంత గట్టిగానూ మాట్లాడవలసి రావచ్చు. వాగ్గేయ శిరోమణి త్యాగరాజు చెప్పినట్లు ‘సమయానికి తగు మాటలాడి’ అన్నచందాన సంభాషించి, ఎదుటివారిని మెప్పించగలగాలి. అయితే, సంభాషణా వైఖరి వారిని గాయపరిచేది గానూ, నొచ్చుకునేదిగానూ ఉండ కూడదు. విషయం వారికి అర్థమై, మన మనోగతాన్ని వారు గుర్తెరగాలి. ఏది ఏమైనా తూటాలవంటి మాటలకంటే, తేనెలు నిండిన తేటలతో మాట్లాడే మాటలే మన గెలుపును శాసిస్తాయి. అందరితో మిత్రత్వాన్ని సాధిస్తాయి.
మనిషి మాటతీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది. నోటినుంచి వచ్చే మాట ద్వారానే మనిషికీ మనిషికీ మధ్య సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మాటలతో మనం సాధించ వలసిన కార్యాన్ని కూడా సులువుగా సాధించవచ్చు. మృదుభాషి, మితభాషి అందరికీ అనాదిగా అలవాటున్న పదాలే! మృదుభాషి అంటే మృదువుగా మాట్లాడేవాడనీ, మితభాషి అంటే అవసరమైతేనేగానీ నోరు విప్పడనీ అందరికీ అవగతమే. అయితే, చిరకాలంగా, ఎంతోమందిని గొప్పవారిగా, సంస్కారవంతులుగా నిలబెట్టిన అరుదైన సంభాషణా లక్షణం మరొకటి ఉంది. వాళ్ళంతా పూర్వభాషిగా భాసించడమే వారికున్న ప్రత్యేక గుణం.
పూర్వభాషి అంటే, తానే ఎదుటివారితో చొరవ తీసుకుని ఆహ్లాదకరమైన తీరులో భాషించడం. ఎదుటివ్యక్తి తనకు అంతగా తెలియకపోయినా, ఎంతో చక్కటి వాక్కులతో అతన్ని ముందుగా మర్యాదగా పలకరించి, తరువాత అతనితో విషయాన్ని మృదువుగా వివరించడమే పూర్వభాషి లక్షణం. ఈ రకమైన మాటతీరు ఉన్నవారు అత్యంత ప్రతిభా వంతులుగా తమను తాము నిరూపించు కున్నట్లు చరిత్ర తెలియజేస్తోంది. ఆనాటి శ్రీరాముని నుంచి నేటి తరంలో విజయవంతమైన నాయకుల్లో అధిక శాతం పూర్వభాషులే. ఎటువంటి భేషజాన్నీ తనతో మాట్లాడేవారితో ప్రదర్శించని వ్యక్తిగా పూర్వభాషి గుర్తించబడతాడు.
కొన్ని సందర్భాల్లో మాట్లాడే మాటే ఎదుటివారి హృదయాన్ని రంజింపజేసి, వారిని జయించే మంజులమైన వశీకరణ మంత్రమూ అవుతుంది. ఎందుకంటే, మాట అత్యంత శక్తిమంతమైనది. నాలుకపై నడయాడే ప్రతి పదానికీ ఒక ప్రత్యేకత ఉంది. పొరపాటున కాలు జారితే వెనుకకు తీసుకోవచ్చు, కానీ అధాటున నోరు జారితే, ఆ మాటను వెనుకకు తీసుకో లేమన్నది సత్యమైన విషయమే కదా..!! మాట్లాడే విధాన్ని బట్టి అది ఎదుటివారి మానసాన్ని గెలిచే విజయ సూచికగా పనిచేయగలదు. ఎందుకంటే మాట అనేది మనసుని తాకుతుంది. అది సుతారంగా, ఎదుటివారిని గౌరవించేలా ఉండాలి గానీ, వారి మనోభావాలను గాయపరిచేదిగా ఉండకూడదు. మాటే మనిషికి అనుకోకుండా ఎదురైన కష్టాన్నీ పోగొడుతుంది.
ఎవరినైనా తప్పనిసరి పరిస్థితుల్లో సహాయం అడుగవలసి వచ్చినప్పుడు, వారితో లలితమైన రీతిలో సంభాషిస్తే, తోచినంత సహాయాన్నీ, తోడ్పాటును అవతలి వ్యక్తి మనకు అందించే అవకాశం ఉంది. అదేవిధంగా, మాటే మనిషికి కష్టాన్నికూడా తీసుకురావచ్చు. అహంకారంతో కూడిన సంభాషణా శైలి ఎప్పుడైనా సరే మనకు కష్టాలనూ తెచ్చిపెడుతుంది, మనకు శత్రువులనూ పెంచుతుంది. గొడ్డలితో నరకబడ్డ వృక్షమైనా మళ్ళీ చిగురిస్తుంది, కానీ, మాటలచేత మనసు ముక్కలైతే, మళ్ళీ పూర్వస్థాయిలో అనుబంధం పెరగదనేది ఋజువైన విషయమే కదా..
మనం మాట్లాడే మాట కోమలంగా ఉంటే ఎదుటివారి ఎదను పువ్వులా తాకుతుందని, అదే కటువుగా ఉంటే, కత్తిమొనలా వారిని గాయపరచి, వారితో ఉన్న స్నేహాన్నీ, సాన్నిహిత్యాన్నీ కూడా దూరం చేస్తుందన్న గౌతమ బుద్ధుని వాక్కులు అక్షర సత్యం. పదునైన ఈటెల పోటు కన్నా, కరుకైన మాటల పోటు ఎదుటివారి హృదయాలకు లోతైన గాయాన్ని చేస్తుంది. భారతదేశ ప్రధానిగా ఎన్నో విజయాలను సాధించిన ఘనులు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ఎంతో ప్రతిభాశాలిగా ఎన్నో విజయాలను సాధించడంలో ఆయన సంభాషణాశైలి ఉపకరించిందని సన్నిహితులు చెబుతారు. అమెరికా అధ్యక్షుల్లోనే అగ్రగణ్యునిగా వినుతికెక్కి, అప్రతిహత విజయాలను సాధించిన అబ్రహం లింకన్ కూడా మృదుభాషేనన్న విషయం గమనార్హం. మనిషి ఉత్థాన పతనాలను వారు మాట్లాడే మాటలే శాసిస్తాయి. ఉత్తమరీతిలో జీవన ప్రస్థానం సాగడానికి మంచి ఉపకరణంగా భాసిస్తాయి. నాలుకపై మాట్లాడే ప్రియమైన మాటలు అందరికీ సంతోషాన్ని కలిగిస్తాయి. మనల్ని మెచ్చుకునేలా చేస్తాయి. మనిషికి నలుగురిలో గౌరవాన్ని సంతరించేది సమయోచిత భాషణం..!! అదే, అందరినీ సన్నిహితులను చేసి, అలరించే విలువైన భూషణం.
అన్నిటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాటి మండుటెండలో వెడుతూ ఎండకి ఓర్చుకోలేక, ఒక చెప్పులు కుట్టే వాడు దారిలో పెట్టిన చెప్పులపై కొంత సేపు నిలబడ్డాడు.
ఆ మాత్రం నిలబడినందున, ఆ ఋణం తీర్చు కోవడానికి మరుజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు - అనే దంపతులకు సునందుడు అను పేరుతో పుట్టాడు.
జాతకం చూపిస్తే, పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తారు.
ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. 'వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. అతడికి మీరే అన్నీ ఇస్తూండండి' అని చెప్తారు.
నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు.
పూర్వజన్మ గుర్తున్నందున ఆపిల్లవాడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.
ఒకరోజు రాత్రి రాజభటుడైన తన తండ్రికి బదులుగా
తాను రాజనగరుకు కాపలా కాయవలసి వచ్చింది.
అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు నగరప్రజలను హెచ్చరిస్తూ హితవు ఒకటి చెబుతుండే వాడు.
రాజుగారు మారువేషంలో తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు.
మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు.
పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు.
అతడు వెంటనేె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో, నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది.
వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు.
తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యువకుడు రాత్రి కావలి సమయంలో చెప్పిన ఈ క్రింది ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు :
1. మాతా నాస్తి, పితా నాస్తి,
నాస్తి బంధు సహోదరః|
అర్థం నాస్తి, గృహం నాస్తి,
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
2. జన్మ దుఃఖం, జరా దుఃఖం,
జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
3. కామః క్రోధశ్చ, లోభశ్చ
దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
4. ఆశయా బధ్యతే జంతుః
కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు
గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న
విషయాన్ని గమనించరు.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
5. సంపదః స్వప్న సంకాశాః
యౌవనం కుసుమోపమ్|
విద్యుచ్చంచల ఆయుషం
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు. యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.
కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
6. క్షణం విత్తం, క్షణం చిత్తం,
క్షణం జీవితమావయోః|
యమస్య కరుణా నాస్తి
తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
7. యావత్ కాలం భవేత్ కర్మ
తావత్ తిష్ఠతి జంతవః|
తస్మిన్ క్షీణే వినశ్యంతి
తత్ర కా పరివేదన||
తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు.
8. ఋణానుబంధ రూపేణ
పశుపత్నిసుతాలయః|
ఋణక్షయే క్షయం యాంతి
తత్ర కా పరివేదన||
తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు.
9. పక్వాని తరుపర్ణాని
పతంతి క్రమశో యథా|
తథైవ జంతవః కాలే
తత్ర కా పరివేదన||
తా:- పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?
10. ఏక వృక్ష సమారూఢ
నానాజాతి విహంగమాః|
ప్రభతే క్రమశో యాంతి
తత్ర కా పరివేదన||
తా:- చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం
ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు
అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు
వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన
మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని
ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ
నవసరములేదు.
11. ఇదం కాష్టం ఇదం కాష్టం
నధ్యం వహతి సంగతః|
సంయోగాశ్చ వియోగాశ్చ
కా తత్ర పరివేదన||
తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.
ఈచివరి శ్లోకం భార్యభర్తల గురించి సంకేతంగా చెప్పినదే! ఒక అమ్మాయి,ఒక అబ్బాయి వేరు వేరు కుటుంబాలలో జన్మిస్తారు. వీరిద్దరు జీవితమనే నదిలో కలుస్తారు. కొంతకాలం కలిసి బతుకుతారు. కాలం సమీపించడంతో ఒకరు కైవల్యం చెందుతారు, మరొకరు ఉండిపోతారు మరికొంతకాలం. ఇది సహజం మరియు సృష్టి క్రమం.
ఇందులో వేదన ఉండదని చెప్పలేదు. వేదన పడవద్దనీ చెప్పలేదు. సృష్టి సహజంగా వేదన తప్పదు. అందునా ఇద్దరు చాలా సంవత్సరాలు కలిసి జీవించిన వారిలో ఒకరు జారిపోతే మరొకరు వేదన పొందక ఎలా ఉండగలరు? సహజమైన వేదనను అడ్డుకోలేం. దానిని అనుభవించవలసినదే!
మరి పరివేదన పనికిరాదన్నారు. వేదనకి, పరివేదనకి తేడా ఉంది. వేదన సహజాతం. దానిని అను భవించాలి, పరివేదన అలాకాదు, మనం తలుచుకుని తలుచుకుని వేదన చెందడాన్నే పరివేదన అంటారు. ఈ పరివేదన పనికి రాదన్నారు.
యఇది సహజం, సృష్టి క్రమం సుమా! ఏడిస్తే పోయినవారు తిరిగొస్తారా? రాగలరా? సాధ్యమా? సృష్టి క్రమం ఇలాగే జరుతుంది, వేదన తప్పదు, పరివేదన పడకు అన్నారు.
మానవులలో చాలా రకాల బంధుత్వాలున్నాయి, కాని భార్యాభర్తలది ప్రత్యేక బంధం, ఇటువంటిది మరొకటి లేదు. అందుకే వీరిగురించి మాత్రమే ప్రత్యేకంగా ఉదహరించి చెప్పేరు. దంపతులిద్దరూ ఒకసారి పోరు, ఎవరి సమయమొస్తే వారు జారిపోతారు, రెండవవారు మిగిలిపోతారు,కొంతకాలం, ఒంటరిగా.
ఇది అందరు భార్యభర్తలకీ జరిగేదే!
ఇది సహజ పరిణామం,సృష్టి క్రమమమని చెప్పి ఓదార్చడమే లక్ష్యం.
*🌷#స్త్రీ #జన్మ !🌷*
ఒకరోజు ధర్మరాజుకొక ధర్మసందేహం వచ్చింది. ‘స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం వుంటుంది’ అని. ఇదే విషయం భీష్ముడిని అడిగాడు.
దానికి భీష్ముడు నవ్వి “నీకొక కథ చెబుతాను. అందులో నీకు సమాధానం దొరకవచ్చు” అని చెప్పడం ప్రారంభించాడు.
పూర్వము భంగస్వనుడు అనే రాజు వుండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్య సంధుడు. ప్రజలను కన్న బిడ్డల కన్న మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానము కలుగ లేదు.
*అపుత్రస్య గతిర్నాస్తి*
అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడయినా లేడే అనే బాధతో అగ్ని దేవుడిని ప్రార్ధించి అగ్నిస్తుత యజ్ఞం చేసాడు. అగ్ని దేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు.
ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజయిన తన అనుమతి లేకుండా భంగాస్వనుడు యజ్ఞము చేసి నూరుగురు కుమారు లను పొందడం ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలనుకున్నాడు. తగిన సమయం కోసం వేచివున్నాడు.
ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్లాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేసాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది.
వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. స్పటికంలా స్వచ్ఛమయిన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు.
మునిగి పైకి లేచే సరికి ఆ రాజు ఆశ్చర్య కరంగా స్త్రీ గా మారిపోయాడు. అయాచితం గా ప్రాప్తించిన స్త్రీత్వానికి చాలా చింతించాడు.
“ఈ రూపముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లలకు, పుర జనులకు ఎలా ముఖము చూపించగలను !? " అని విచారించి...
"అయినా ఇలా అడవిలో ఉండలేను కదా !" అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు.
మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుడిని రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి
అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించ సాగాడు.
కాలక్రమంలో, ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ మునివలన అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు.
వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో....
"కుమారులారా ! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను కనుక వీరు మీ
సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి" అంది.
స్త్రీ గా మారినా ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృ వాక్య పాలకులుగా తండ్రిమాట పాటించి వారు రాజ్యాన్ని
పంచుకుని పాలించసాగారు.
ఇది చూసిన ఇంద్రుడు ‘నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది
అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య బేధము కల్పించాలని’ సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి....
"రాజకుమారులారా ! ఏమిటీ వెర్రి ఎవరో ఎవరినో తీసుకు వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా!? అసలు వీరి తండ్రి ఎవరు ? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు? " అని వారిలో కలతలు రేపాడు.
అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నపుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేని పోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చని పోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో
ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగింది.
ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రహ్మణ రూపుడై...
“అమ్మా నీవు ఎవరవు ? ఎందుకిలా
రోదిస్తున్నావు ? " అని అడిగాడు.
అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడము కుమారులను కనడము అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము మునిద్వారా కుమారులను
కనడము పూసగ్రుచ్చినట్లు చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై
"రాజా ! నేను ఇంద్రుడను నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు
కలిగించాను" అని చెప్పాడు.
దానికి ఆమె "దేవా ! అజ్ఞానంతో
తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు అధిపతి వైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వ్యక్తినా ! కనుక నన్ను దయతో రక్షించు" అని వేడుకోగా....
ఆ మాటలకు కరిగి పోయిన ఇంద్రుడు "రాజా ! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రుల నైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను ఎవరు కావాలో నీవే
ఎంచుకో " అన్నాడు.
ఆమె (భంగస్వనుడు) సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది.
ఇంద్రుడు "అదేమిటి రాజా ! మిగిలిన వారు నీ కుమారులు కాదా !?" అని అడిగాడు.
భంగస్వనుడు " వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా !” అని చెప్పింది.
ఇంద్రుడు సంతోషంతో "రాజా ! నీ సత్యనిష్టకు సంతోషించాను. నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను" అని...
“రాజా ! నీకు ఇంకొక వరము ఇస్తాను నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి
ఇస్తాను" అన్నాడు.
దానికి ఆమె "మహేంద్రా ! నా కుమారులను బ్రతికించావు అదే చాలు.
స్త్రీగానే ఉంటాను" అంది.
ఇంద్రుడు ఆశ్చర్యంతో " అదేమిటి రాజా ! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి ? "
అని అడిగాడు.
స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గు పడి
"మహేంద్రా ! నేను స్త్రీగా ఉండడములో ఆనంద పడుతున్నాను. ఇందులో వున్న తృప్తి నాకు పుంసత్వములో కనబడలేదు కనుక ఇలాగే ఉండి పోతాను" అంది.
దేవేంద్రుడు నవ్వి “అలాగే అగుగాక”అని ఆశీర్వదించాడు.
అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు “యుధిష్టిరా ! ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం !” అని అడిగాడు.
స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమయిన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు.
ఒకతెకు జగములు వణకున్ అగడితమై
ఇద్దరు కూడిన అంబులు ఇగురున్ ।
ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా
పట్టపగలె చుక్కలు రాలున్ ॥
[ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతురాలని భావము]
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
"దయచేసి బ్రాహ్మణ బంధువులకు షేర్ చేయండి"
1.వశిష్ఠుడు బ్రాహ్మణుడు...
సేవ చేసింది సూర్య వంశానికి,
2.చాణక్యుడు బ్రాహ్మణుడు...
పట్టం కట్టింది శూద్రుడైన చంద్రగుప్తునికి,
3.విధ్యారణ్యుడు బ్రాహ్మణుడు
పట్టం కట్టింది కురుబుడైన హరిహర రాయలు,బుక్కరా యల సోదరులకు..
4.సమర్థ రామదాసు బ్రాహ్మణుడు..
పట్టం కట్టింది శూద్ర శివాజీకి..
5.గోవింద దీక్షితులు బ్రాహ్మణుడు..
పట్టం కట్టింది శూద్ర నాయకుడై న జనాంగనికి..
అంతిమంగా- బ్రాహ్మణులు అందరినీ కిందకు తొక్కుతారు అని పట్టం కడతారు.😡
మేము బ్రాహ్మణులమ్😇😇
మేము క్షత్రియుడైన శ్రీరాముని
ఆదర్శంగా తీసుకుని పూజిస్తాం
🙏🙏
గొల్ల గోపకుడైన శ్రీకృష్ణుని
పరమాత్ముడు అని ఆరాదిస్తాం🙏🙏
స్మశానం లో సంచరించే ఈశ్వరుని పరమేశ్వరుడు అని పూజిస్తాం.🙏🙏🙏
బ్రాహ్మణుడైన బ్రహ్మకు
నమస్కారం చేయము..🤬
బ్రహ్మణుడైన రావణుడి..
దుష్టుడు,దుర్మార్గుడు అంటాం.👹👺
ఇంతచేసినా కూడా పరుల
కళ్ళకు జాతీయవాదులం
ఎందుకంటే,....
మేము బ్రాహ్మణులం..😭😇
ప్రతిభావoతులను ప్రోత్సహిస్తాం.🏹💐💐
కళా, సాంసృతులను ఆరాదిస్తాం..🪐🪐
ఎవరైనా ఎదుగుతుంటే వారికి
నిచ్చెన వేస్తాం..🧗♂️
ఇంత చేసినా కూడా పరుల
కళ్ళకు తాలిబన్ల సంస్కృతి వాళ్ళం..😡😡😡
ఎందుకంటే..
మేము బ్రాహ్మణులం..!!😢
అన్నo పెట్టకున్నా గంజిని
పెట్టి ఆకలి తీరుస్తాం.🙏
అయినా కూడా పరాయి కళ్ళకు మేము బాధపెట్టె వాళ్ళం..👺
ఎందుకంటే...
మేము బ్రాహ్మణులం.😇
గవర్నమెంట్ పథకాలు లేకున్నా
దేవుడు ఇచ్చాడని అనుకుంటాo
😴😴
రిజర్వేషన్లు లేకున్నా మా
పిల్లలను అప్పుచేసి చదివించి
సర్కారు బళ్లకు,కంపినిలకు
పంపిస్తాం.👨🎓👷♂️
మేము దేశానికి సేవకులై,శ్రామి
కులమై ఈ మట్టికోసం పోరాడు
తాం..👩🦲🙏
ఎందుకంటే,...
మేము బ్రాహ్మణులo.!!
అందరితోను ఎన్నో తిట్లు,కష్టాలు,కన్నీళ్లు..
అందరితోనూ... "మెప్పు"పొందుతాం💪🤝🙏
👍Proud to be a Brahmin✌️✌️ :( (forwarded)