జీవితంలో విజయం సాధించడం అంటే బాగా బాగా డబ్బు సంపాదించడం, ఎక్కువమందికి తెలియడం. ఇదే కాదు 80% ప్రజలు తమ పిల్లలకు తోటివాళ్లకు చెప్పేది మాట్లాడేది నమ్మేది. 90% ప్రజలు జీవితాంతం చేస్తున్న పని కూడా అదే కదా. ఇంకా ఇంకా ఇంకా సంపాదించాలి సంపాదించాలి ఫ్లాట్, ఇల్లు, నగలు, భూమి ఇలా కొంటూ పోతూనే ఉన్నారు కదా.
కావాలంటే మీ చుట్టూ ఉండే బంధువులను స్నేహితులను పరిశీలించండి మీకు తెలిసిపోతుంది. ఎంత సంపాదించాలి? ఎంత సంపాదించి ఇక సంపాదన గురించి ఆపవచ్చు అనే విషయం ఎవరికీ అయినా తెలుసా? ఎవరైనా అలా ఆపేశారా? నాకు తెలిసి మీకు ఎవరు కన్పించకపోవొచ్చు.
సరే అన్ని చేసి బాగా సంపాదించారు, ఇంకా సంపాదిస్తున్నారు, మరి మీ పిల్లలు ఎం చేయాలి? వాళ్ళు కూడా సంపాదించాలా? వాళ్ళు కూడా మీ లాగ బాగా కస్టపడి ఇష్టపడి సంపాదించాలా? మీకు అవును అనే అనిపించవచ్చు కాని పిల్లలకు అలా అనిపించదు కదా. మీ పిల్లలు పుట్టడమే పెద్ద పెద్ద బంగ్లాలో పుడతారు, ఎసి గదుల్లో నిదురపోతారు, ఎసి బస్సుల్లో స్కూలు కు పోతారు, విమాన ప్రయాణాలు చేస్తారు, ఖరీదు అయిన కార్లలో తిరుగుతారు, ఇవన్నీ చుసిన చేసిన తరువాత వాళ్లకు జీవితంలో ఇంకే చేయాలి అనుకుంటారు? ఎంజాయ్ చేయాలి అనుకుంటారు
ఇంకేముంది చేయటానికి? అప్పటికే ఆ పిల్లలు ఫలానా ఆయన పిల్లలు అనే పేరు ప్రఖ్యాతులు, సెలబ్రెటీ హోదా వచ్చి ఉంటుంది, అప్పటికే కావలసినంత సంపద ఉంటుంది, మరి వాళ్ళు జీవితంలో ఎం చేయాలి? ఎం చేయటానికి అయినా మోటివేషన్ ఏంటి? ఏమి లేదు, మరి సిగరెట్లు, మద్యం అనేది వాళ్లకు కిక్ ఇవ్వవు, మరి మిగిలింది డ్రగ్స్ మాములు మనుషులకు ప్రపంచంలో దొరకానిది ఖరారు అయినవి ఏంటి అంటే డ్రగ్స్, అందుకే బాగా రిచ్ కిడ్స్ డ్రగ్స్ కు అలవాటు అవుతారు.
ఎవరికైనా మోటివేషన్ అవసరం అది లేనప్పుడు మనిషి దారి తప్పుతాడు. కుటుంబం లేని వాళ్ళు పేదవాళ్ళు జీవితంలో ఎం చేసినా జీవితం మారదు అనుకునేవాళ్లు తొందరగా రక రకాల రుగ్మతలకు బానిసలు అవుతారు. సమాజంలోని అట్టడుగున ఉన్న ఆనాధలు, కుటుంబ పోషణ లేనివాళ్లు లేదా బాగా ధనవంతులు వీళ్లిద్దరి జీవితాలు దాదాపుగా ఒకేవిధంగా ఉంటాయి.
మనుషులం అందరం భూమి మీద బ్రతికి ఉండడమే మనుషులందరి గమ్యం కావలి అనే విషయాలను ఎవరూ ఎక్కడ చెప్పడం లేదు మాట్లాడడం లేదు, ఎంత సేపు లక్ష్యం, పోటీ, పోల్చుకోవడం, సాధించడం అనే నేర్పిస్తారు,మాట్లాడుతారు. సాటి మనుషులకు సహాయ పడడం, పంచుకోవడం, కలిసి జీవించడం అనే విషయాలు నేర్పిస్తే అలవాటు చేస్తే మనుషులు రుగ్మతలకు బలహీనతలకు లోను కారు కదా.
ఒక కుటుంబానికి సరిపోయినంత సంపద కలిగిన తరువాత అయినా సంపాదించడం అనే ఆలోచన విరమించుకోండి, లంచాలు, మోసాలు ఆపండి. సంపాదన అనేది పిల్లలకు మేలు చేయదు, పిల్లలకు మేలు చేశేది మంచి పెరిగే వాతావరణం, మంచి ఆహారం, మంచి విద్య, మంచి ఇరుగు పొరుగు, మంచి పాఠశాల ఇవి మేలు చేస్తాయి. సంపాదించడం సంపద అనేవి మనుషులను మూర్ఖులుగా ద్రోహులుగా లంచగొండ్లుగా మారుస్తుంది. సంపాదన అనేది మనిషి వర్తమానాన్ని హరిస్తుంది, మనిషికి ఎప్పుడు ప్రాణభీతిని కలిగిస్తుంది. తృప్తి అనేది మనిషికి ధైర్యాన్ని సంతోషాన్ని ఇస్తుంది. ఆలోచించండి.
ఇది చదివిన తరువాత వీడికేమి తెలుసు గొట్టం గాడు చెప్పేది అనుకోవొచ్చు. అవును మనకు మన చుట్టూ ఉన్నవాళ్లు చెబితే నచ్చదు, అందుకు మహర్షులు, ఋషులు , గురువులు, స్వాములు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ఎక్కువమందికి తెల్సిన వాళ్ళు చెబితే చప్పట్లు కడతాం, టికెట్ పెట్టి మరి వింటాం, ఆహా ఓహో అంటాం, ఎందుకంటే శంఖంలో పోస్తేనే కదా తీర్థం అని అనిపించుకునేది.
#కవీందర్reddy
పూర్వం ఒక దేశంలో కరువొచ్చింది. తినడానికి కూడా ఏమీ దొరకని రోజులు దాపురించాయి. ఆకలికి ప్రాణం పోయే పరిస్థితిలో ఒక పండితుడు దారివెంట నడుస్తున్నాడు. అదే దారిలో ఓ రాయిపై కూర్చొని శనగలు తింటున్న బాటసారిని గమనించాడు. ‘ఆకలితో ప్రాణాలు పోయేలా ఉన్నాయి. మీరు తినేదాంట్లో నాకు కొంత ఇస్తారా’ అని అడిగాడు.
‘ఇవి తప్ప నా దగ్గర వేరే ఏమీ లేవు. చూస్తే పండితుడిలా ఉన్నారు. ఎంగిలివి ఎలా పెట్టను?’ అన్నాడు బాటసారి.
‘ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంగిలివి తిన్నా తప్పులేదు’ అన్నాడు పండితుడు. బాటసారి తన దగ్గర ఉన్న శనగల్లోంచి కొన్ని అతనికి ఇచ్చాడు. పండితుడు అందులో కొన్ని మాత్రమే తిన్నాడు.
‘నా ఆకలి కాస్త తగ్గింది. ఇంట్లో నా భార్య ఆకలితో చనిపోయేలా ఉంది. ఇవి ఇస్తే తన ప్రాణం కూడా నిలబడుతుంది’ అన్నాడు పండితుడు.
‘ఎండిపోయిన శనగలు అంత తేలిగ్గా గొంతు దిగవు’ అని చెప్తూ తాగమని పండితుడికి నీళ్లు ఇచ్చాడు.
‘ఎంగిలి నీళ్లు కదా వద్దులే!’ అన్నాడు పండితుడు.
‘ఇందాక తిన్న శనగలు ఎంగిలివే కదా!’ ఆశ్చర్యంగా అడిగాడు.
‘శనగలు తినకముందున్న స్థితి ఇప్పుడు లేదు. ప్రాణం కాస్త కుదుటపడింది’ అని అతనికి కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు.
‘ఆత్మశుద్ధిలేని ఆచారమదియేల?’ అన్నారు వేమన. అది నిజమే అయినా దానికీ మినహాయింపు ఉంటుందని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఆకలితో ప్రాణం పోయే పరిస్థితి ఉన్నప్పుడు అంటు, ఎంగిలి అని చూడకుండా ఏది దొరికితే అది తిని ప్రాణం కాపాడుకోవాలని శాస్త్రం చెప్తున్నది. అభిమానంతో ఎవరైనా, ఏదైనా పెడితే ఎంగిలి అని నిరాకరించొద్దని కూడా శాస్త్ర వచనం. శబరి ఎంతో అభిమానంతో ఇచ్చిన ఎంగిలిపండ్లను రాముడు తిన్నాడు కదా! శబరికి మోక్షం ప్రసాదించాడు. ధర్మం కోసం ఏది చేసినా అది ధర్మమే. ధర్మాన్ని విస్మరిస్తే పాపమవుతుంది. పండితుడు శనగలను తీసుకువెళ్లి తన భార్యకు ఇచ్చాడు. అప్పటికే ఆమె ఊరంతా తిరిగి కొంత భిక్ష తెచ్చింది. ఉన్నదాంట్లో భర్తకు కొంచెం పెట్టి తాను కొంచెం తిన్నది. భర్త తెచ్చిన శనగలను దాచిపెట్టింది.
మరుసటి రోజు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు కరువు నుంచి బయటపడటానికి యజ్ఞం తలపెట్టాడు. అక్కడికి వెళ్లి తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తే ఎంతో కొంత గిట్టుబాటవుతుందని భావించాడు ఆ పండితుడు. కానీ, అక్కడిదాకా వెళ్లడానికి శక్తిలేదు. పండితుడి భార్య అంతకుముందురోజు దాచిన శనగలను ఇచ్చింది. దారిలో అవి తిని రాజు దగ్గరికి వెళ్లాడు. పండితుడి విద్వత్తును గుర్తించిన రాజు అతణ్ని సత్కరించి, కొంత ధనం ఇచ్చి పంపించాడు. ఆయన అన్ని సమస్యల నుంచి బయటపడ్డాడు. జీవితం గాడినపడింది. సంతోషంగా జీవించసాగాడు.
ఆచార వ్యవహారాలు జీవితాన్ని ఉన్నతమార్గం వైపు నడిపించాలి. అంతేకానీ, మూఢంగా పాటించడానికి కాదు. చేపలు, కప్పలు ఎంగిలి చేశాయని గంగాజలంతో అభిషేకం మానుకుంటామా? తుమ్మెదలు ఎంగిలి చేశాయని పూలను పరమాత్మకు సమర్పించకుండా ఉంటామా? విశ్వాసాలు జీవితాన్ని తీర్చిదిద్దాలే కానీ, పాతాళానికి కూలదోసేవిగా ఉండకూడదు. అందుకే, గుడ్డి ఆచారాలు పాటించొద్దని శాస్త్రమే సెలవిచ్చింది. భుక్తి లేకపోతే ముక్తి లేదు అన్నది శాస్త్రవచనమే. అలాగే ప్రాణావసరానికి ఎంత కావాలో అంతే తినాలి. ఆకలిగా ఉన్నప్పుడు ఆబగా తినకుండా మనపై ఆధారపడినవారి గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉండాలని ఈ కథ మనకు చెప్తున్న మరో నీతి. ధర్మంగా ఆలోచించాడు కాబట్టే ఆ పండితుడు ఎంగిలి గురించి పట్టించుకోలేదు. ఆ ఆహారం ఆసరాతోనే కష్టాల నుంచి బయటపడ్డాడు. ధర్మపరుడు చేయాల్సింది ఇదే కదా!
*వినయమే ఆభరణం*
విద్యకు పరమావధి వినయం, వినయం, వివేకం, విచక్షణ, మంచి ప్రవర్తన, ఉన్నత విలువలు, ఎదిగేకొద్దీ ఒదిగి ఉండే లక్షణం- మనిషిని ఉన్నతుణ్ని చేస్తాయి. తలవంచి నమస్కరించేవారే అందరి దీవెనలు పొందుతారు. సర్వజీవులకు విన యపూర్వకంగా చేసే సేవ సర్వేశ్వర సేవ. ప్రేమ, భక్తి కలబోసిన కార్యాచరణే సేవ ప్రేమలోని అనురాగభావం భక్తిగా మారి, సేవగా రూపొందుతుంది. సేవించే చేతులు వినయానికి, తద్వారా విజయానికి ప్రతీకలు, ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అంటారు ఆరవింద మహర్షి. ప్రవర్తనలో అణకువ, పెద్దల పట్ల గౌరవం, తోటివారిపై ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటాయి.
నూరు సంవత్సరాలు నీతో ఉన్నా నేను స్వయం నిర్ణయాలు తీసుకోలేనని లక్ష్మ ణుడు రాముడితో అంటాడు. గోదావరి తీరంలో అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసి నీకు ఇష్టమైన రీతిలో పర్ణశాలను నిర్మించమని కోరిన రాముడితో... 'అన్నా! నీ ఆజ్ఞను పాటించడం, నీ నిర్ణయాన్ని గౌరవించడం తప్ప నాకంటూ ఒక ఇష్టం లేదు అంటాడు. ఈ మాటల్లో లక్ష్మణుడి వినయశీలత గోచరి స్తుంది. నేటి సమాజంలో తల్లిదం డ్రులను ఎదిరించే స్వభావం, అన్న దమ్ముల మధ్య వైషమ్యాలు, పెద్దల పట్ల నిర్లక్ష్యం చెడు పరిణామాలకు దారితీస్తున్నాయి..
మహాభారతంలో అగ్రజుడు తన ధర్మరాజు బలహీనత జూదం, కౌరవులతో పాచికలు ఆడి సర్వాన్ని కోల్పోయాడు. తమ్ము ళ్లను, భార్యను పణంగా పెట్టి అవ మానం పాలయ్యాడు. అరణ్య వాసం ప్రాప్తించింది. ఇన్ని అనర్ధా లను అవమానాలను సహించి పరాక్రమవంతులైన సోదరులు ధర్మరాజును అనుసరించారు కానీ, అవమానించలేదు. వినయవం తులై తమ కష్టాలను భరించి చివరకు విజయాన్ని సాధించారు. _రామాయణంలో వినయానికి మారు పేరు అనదగ్గ పాత్ర సుమిత్ర, తాను ముగ్గురు మహారాణులలో ఒకరు. కైక, కౌసల్యతో సమానమైన స్థాయి కలిగినది. కౌసల్య మాతృప్రేమకు, కైక ఆహంకారపూరితంగా స్వార్థానికి లొంగారు. సుమిత్ర వినయానికి తలవంచింది. తన ఇద్దరు కుమారులకు వినయమనే విలువలను అందించింది. లక్ష్మణుడు రాముడి సేవకు జీవితాన్ని అంకితం చేశాడు. శత్రు ఘ్నుడు భరతుడికి సేవలందించాడు. భక్తుడు ఎప్పుడూ భగవంతుడిని తన స్వామిగా ఆరాధిస్తాడు. దానినే నారద భక్తి సూత్రాల్లో దాస్యభక్తిగా పేర్కొన్నారు. భగవంతుడికి దాస్యం చేయాలంటే వినయ
ప్రవర్తన ద్వారానే సాధ్యం. అహంకారం కోసం మనిషిని పశుత్వానికి చేరుస్తాయి. ప్రకృతి మనిషికి పాఠం నేర్పే ఉత్తమ గురువు చిన్న మొక్క భూమి నుండి ఆశతో అంకురిస్తుంది. రెండు రెమ్మలతో ప్రకృతిని వీక్షిస్తుంది. ఒదిగిపోయి క్రమంగా ఎదుగుతుంది. అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని మహావృక్షమై నిలుస్తుంది. బాల్యం నుంచి భవిష్యత్తుకు ఎదిగే పిల్లలకు వినయమనే పాదును చేసి, సద్గుణాలనే నీరు అందించి, మానవతా విలువలే కంచెగా చేసి, బలాన్ని అందించడమే మనోవికాస విద్య.
ఎంత ఎత్తు ఎదిగినా పుష్పించడం, ఫలించడం జీవరాశికి ఫలాలను అందిం చడం మానదు వృక్షం. ప్రాణవాయువుతో ఊపిరిపోసి, నీడలో సేదతీర్చి తాను కాలుతూ కూలిన శరీరాన్ని తనలో లీనం చేసుకుంటుంది. అదే వినయశీలతకు మహాదర్పణం. -
✍🏻రావులపాటి వెంకట రామారావు
ఈ ప్రపంచంలో అత్యంత దురుపయోగం అవుతున్న పదం ‘ఆధ్యాత్మికత’. కొన్నిసార్లు అజ్ఞానం కారణంగా, అనేకసార్లు కావాలనే ఈ పదాన్ని వాడుతున్నారు. సదుపయోగమో, దురుపయోగమో చేస్తున్నారు. అయితే, కొందరి వల్ల అనిశ్చిత స్థితి ఏర్పడుతున్నది. ఆ మార్గంలో అనేక సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా, చాలామందికి అందులో ఎంతో సందిగ్ధత, ఎంతో అపార్థం కలుగుతున్నాయి. ఈ కారణంగానే వారి మనసులో ఎన్నో సందేహాలు ఏర్పడుతున్నాయి.
మన మనసులో ఆలోచించేదంతా ఆధ్యాత్మికం కాదు. మీకు ఆధ్యాత్మిక ఆలోచనలు రావు. మీరు దేవుణ్ని గురించి, స్వర్గం గురించి, మోక్షం గురించి ఆలోచించేదంతా ఆధ్యాత్మికత అనిపించుకోదు. మానసికమైన ఆలోచనలన్నీ ఆధ్యాత్మికత కాదు. నాకు ఒక ఆధ్యాత్మికమైన చిటికెన వేలు ఉందని చెబితే ఎలా ఉంటుంది? వేలు ఎప్పుడూ భౌతికమైనదే. నేను నా శరీరాన్ని, నా చిటికెన వేలును, ఆధ్యాత్మిక ప్రక్రియకు అనుకూలమైన సాధనంగా మలచుకోవచ్చు. అంతమాత్రాన అది ఆధ్యాత్మికం కాదు. అది భౌతికం మాత్రమే.
భౌతికత ఆధ్యాత్మికతకు వ్యతిరేకం కాదు. ఆధ్యాత్మికతకు భౌతిక శరీరం ఒక ప్రాథమిక మార్గం మాత్రమే. అదేవిధంగా మానసిక, భావోద్వేగ సంబంధమైనవి కూడా ఆధ్యాత్మికం కాలేవు. అవి జీవితంలో భిన్న కోణాలు. వాటి విషయంలో తప్పూ లేదు, ఒప్పూ లేదు. వాటిని మనమెలా ఉపయోగిస్తామనే దానిపై, అది ఆధారపడి ఉంటుంది. మనం ఈ శరీరాన్ని ఒక నిరోధంగా, ఉచ్చుగా ఉపయోగించవచ్చు లేదా ఒక ద్వారంగా సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ బుద్ధిని దుఃఖాన్ని సృజించే యంత్రంగా, ఆధ్యాత్మికతకు సాధకంగా ఉపయోగించవచ్చు. కానీ, బుద్ధి, శరీరం, భావోద్వేగం ఆధ్యాత్మికం కాలేవు.
మనం ఆధ్యాత్మికత అన్నప్పుడు భౌతికం కాని మరో కోణం గురించి మాట్లాడుతున్నాం. అది ఈ పరిధికి చెందినది కాదు. మానసిక ప్రశాంతత కోసం చూస్తున్నట్లయితే అది ఆధ్యాత్మికత కాదు. జనం ఆధ్యాత్మిక ప్రశాంతత గురించి మాట్లాడుతుంటారు. అటువంటిదేమీ లేదు. శాంతి అన్నది భౌతికమైనది, మానసికమైనది. మీరు శారీరకమైన దాన్ని, మానసికమైనదాన్ని కలత పెట్టవచ్చు. ఈ రెండూ కాని ఆధ్యాత్మికతను కలత పెట్టలేరు. అది శాంతిని కోరదు, దానికి శాంతి అవసరం కూడా లేదు. వీటన్నిటికీ అతీతమైన, అద్భుతమైన సాధనా మార్గం ఆధ
......
సకల సౌకర్యాలున్న అద్దె ఇంటిని వదిలిపెట్టాల్సి వస్తే దానిపై పెంచుకున్న వ్యామోహం వల్ల ప్రాణం విలవిల్లాడుతుంది. శరీరం కూడా అలాంటిదే! కానీ, ఎప్పటికైనా దాన్ని వదిలిపెట్టక తప్పదు. అందుకే శరీరంపై ఉన్న మమకారాన్ని జయించాలి. ఎందుకంటే, అదే మానవునికి శోకదాయకం, బంధకారణం అవుతున్నది. ఏ శరీరమైనా ఎప్పటికైనా పడిపోవాల్సిందే! ఈ యుగంలో మానవుల జీవితకాలం సుమారు వందేండ్లు అంటున్నాం. కానీ, పూర్వయుగంలో ఆయుర్దాయం వేల ఏండ్లుగా ఉండేది.
శతాబ్దాలు జీవించేవాళ్లు. ఎన్నేండ్లు బతికినా చివరికి దేహం వదలాల్సిందే! అలాంటప్పుడు దానిపట్ల ఇంత అభిమానం ఎందుకు?
వేల ఏండ్లు రాజ్యపాలన చేసిన శ్రీరామచంద్రుడి వంటి అవతార పురుషులు కూడా, శరీరాలు వదిలిపెట్టిన వారే! దాంతో పోలిస్తే మనం శరీరాలు వదిలిపెట్టడం అసలు విషయమే కాదు. కానీ, మనిషి మాత్రం జరామరణాలు జయించాలని, కలకాలం సశరీరంగా ఉండాలని ఆశపడుతూ ఉండటం హాస్యాస్పదం. ఆప్తులు ఎవరైనా దూరమైనప్పుడు, మనసులో వారి స్మృతులు తిరుగుతూ తెగ హైరానా కలిగిస్తాయి. ఆ వ్యక్తులు కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, మాట్లాడినప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకువచ్చి బాధిస్తుంటాయి. నాలుగు రోజులు పోతే మనమూ పోతామన్న యథార్థం మరిచి వగస్తూనే ఉంటాం. ‘మనం ఉన్నది వీటన్నిటినీ గుర్తు చేసుకోవడానికేనా!’ అని ఎవరూ ప్రశ్నించుకోవడం లేదు.
నిజానికి పోయినవారు మనసును బాధించడం లేదు. వారి తాలూకు స్మృతులే మనల్ని బాధిస్తాయి. ఆ విషయాన్ని గుర్తించలేకున్నాం. స్మృతులే బాధిస్తున్నాయని రూఢీ అవుతున్నది కాబట్టి, వాటిని తొలగిస్తే శోకం దూరం అవుతుందని స్ఫురించడం లేదు. అసలు ఆప్తవియోగ స్మృతులు మనిషిని బాధించడానికి చాలా కారణాలుంటాయి. పోయిన వ్యక్తి రూపరేఖా విలాసాలు, వారితో మనకున్న అనుబంధం ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ, మనిషి రూపం అతని శరీరం పడిపోయాక కాలిబూడిదయిపోతుంది. వారితో ఉన్న అనుబంధాన్ని తలచుకునే క్రమంలోనూ ఆ పోయిన వ్యక్తుల శరీరాలు మనోఫలకంపై కదలాడుతుంటాయి. ఈ శరీరాల స్మరణ నిత్యం జరుగుతూ ఉండటం వల్ల మళ్లీ మళ్లీ శరీరాలు ధరించాల్సి వస్తున్నది. అంటే జన్మ పరంపరలు కొనసాగడానికి ఇదీ ఒక కారణం.
ఎప్పుడు రాలిపోతాయో తెలియని శరీరాల గురించి ఇంత వెర్రి అభిమానం ఎందుకు? దుఃఖం కలుగుతున్నప్పటికీ ఎందుకు తొలగించుకోవడం లేదు? అని ప్రశ్నించుకోవాలి. శరీరాలు పతనం చెందకుండా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా, అంటారా! అందుకోసం మనిషి శాశ్వతంగా జీవించే ఉపాయం కావాలి. భూమిపై శాశ్వతంగా ఉండిపోవాలన్న తపన అనాది నుంచి ఉన్నదే! అందుకే కదా, హిరణ్యకశిపుడు, రావణుడు తదితరులు ఘోర తపస్సులు చేసి వరాలు పొందింది. అయినా, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అన్నది సృష్టి నియమం. దాన్ని అనుసరించి ఎన్ని వరాలు పొందినా, ఇంకెన్ని మాయోపాయాలు చేసినా అంతిమంగా వారి శరీరాలు కూలిపోయాయి. ఏతావాతా శరీరాలను శాశ్వతంగా నిలబెట్టాలన్న అభిప్రాయం తప్పని తేలుతున్నది.
ఇక ఇప్పుడు మిగిలింది స్మృతులు. అవి విజృంభించే మనసు. వీటిని సరిదిద్దుకోవలసింది మనమే. అదెలాగంటే, మనసులోంచి మానవ శరీరాలను, తత్సంబంధ జ్ఞాపకాలను నిర్దాక్షిణ్యంగా తరిమికొట్టాలి. ఇది ఒకే పద్ధతి వల్ల మాత్రమే సాధ్యం. భగవద్రూపాలు బంధ కారణాలు కావు. విముక్తి హేతువులు. కాబట్టి, దివ్యమైన భగవంతుడి రూపాలతో, అమూల్యమైన స్మృతులతో, సత్యమైన అనుభూతులతో రేయింబవళ్లూ మనసును నింపగలగాలి. అప్పుడు నిరతిశయానందం మనిషికి సొంతం అవుతుందనడంలో సందేహం లేదు. భగవంతుడి రూపాన్ని, భావనను మనసులో సదా నిలుపుకోగలిగితే జీవితానికి సార్థకత కలుగుతుంది. ఈ శరీరం ఎప్పుడు పడిపోయినా, మళ్లీ శరీరాన్ని ధరించే జన్మ పరంపర చక్రం నుంచి విముక్తి లభిస్తుంది.
: మాటే మంత్రం.మాటే అనుబంధం,ఆత్మీయం!
నీళ్ళు ఇంటికి రాగానే మొట్టమొదట చేసే పని ఫిల్టర్ చేయడం. తరువాత ప్రస్తుత పరిస్తితులను బట్టి కాచి తాగాలి.. అలానే పాలు రాగానే మరగ కాచి , ఉపయో గిస్తాము.. లేకపోతే బాక్టీరియా ప్రభావం వలన పాలు విరిగి పోతాయి.. అలానే అసహ్యం , అసూయ , కోపం , బాధ , అభద్రతా భావ ప్రదేశాలలోంచి వచ్చే మాటలు పెదవి దాటక ముందే మూల్యాంకనం చేయాలి, వడబోయాలి.. ఇంకా చెప్పాలంటే ఇలాంటి సందర్భాలలో ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఎంతో మంచిది . ఎందుకంటే మాటలకు మనసులను విరిచే శక్తి ఉంటుంది.. పాలు విరిగితే నష్టమేమీ లేదు.. ఇంకొక పేకెట్ కొనుక్కోవచ్చు.. మనసు విరిగితే తిరిగి అతుక్కోదు , పైగా బంధం దూరమైపోతుంది.. మనం మాట్లాడే మాటలు నడి వేసవిలో చిరుజల్లులు కురిసినట్లు ఉండాలి.. కొందరు మాట్లాడితే కొట్టినట్లుంటుంది .. మరి కొంత మంది మాట్లాడితే ఎదుటివారి మనసును తట్టినట్లుంటుంది.. కొందరి మాటలు తేనెలొలికిస్తాయి.. మరి కొందరి మాటలు మనసులో ములుకులు దించుతాయి..*
ప్రియమైన మాటలు ఎదుటివారి మనసులో సరిగమలు పలికిస్తాయి.. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి.. మన నోటి నుండి వచ్చే మాట మన ఆధీనంలో ఉంటే , ప్రపంచమంతా మన ఆధీనంలో ఉంటుంది. ఏమంటారు ?
*******
లోకంలో సాధారణంగా తప్పు చేయనివాడు ఉండడు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. మనకు శత్రుత్వమనేది అనేక కారణాల వల్ల ఏర్పడుతుంది. ఒకరిని మనం స్నేహితుడిగాను, మరొకరిని శత్రువుగాను చూస్తున్నామంటే, చూసేవారి దృష్టిలో భేదం ఉందని చెప్పక తప్పదు. ఆ భేదానికి కారణం ఎదుటి వ్యక్తి చేసే పనులే కానీ, ఆ వ్యక్తి కాదు. కానీ, అందరూ సమానులే అయితే శత్రుత్వం ఉండకూడదు. లోకంలో మనకు కీడు చేసినవాడు శత్రువు అవుతాడు. మేలు చేసినవాడు మిత్రుడవుతాడు. కానీ, ఇద్దరినీ మిత్రులుగా చూసే అలవాటు సాధారణంగా అందరికీ ఉండదు. అది యోగుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.
మన శరీరంలో జీవుడనే వాడు ఒకడున్నాడు అనడానికి ఏమిటి కారణం? దీన్ని తెలుసుకుంటే ఎవరు శత్రువులో, ఎవరు మిత్రులో అవగతమవుతుంది. పరమాత్మ జీవుడికి కనీస జ్ఞానాన్ని (కామన్సెన్స్) ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ కనీస జ్ఞానం వికటిస్తుందో అప్పుడే మార్పు ఏర్పడుతుంది. సర్వజ్ఞుడైన పరబ్రహ్మలో మనం ఉన్నాం. ఇది కనీస జ్ఞానమే! అంతా పరమేశ్వరుడే అని చెప్పుకొంటాం. కానీ, మనం పరమేశ్వరుడితో ఉన్నామన్న విషయం మరచిపోతుంటాం. అయితే, మనం పరబ్రహ్మ స్వరూపులమని, పరబ్రహ్మను మాయ ఆవహించడం వల్ల జీవులమయ్యామని, మాయ తొలగిపోతే మళ్లీ పరబ్రహ్మలో కలిసిపోతామని, మనకూ, పరబ్రహ్మకూ తేడా లేదని భావించేవారు కూడా ఉన్నారు. కానీ, వేదజ్ఞానం కలిగినవారు పరబ్రహ్మకూ, జీవుడికి భేదం లేదని చెప్పరు. పరబ్రహ్మ స్వరూపం తెలిస్తే ఎవరూ ‘మేం పరబ్రహ్మలం’ అని అనరు. పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు. సత్ అంటే ఎప్పుడూ ఉండేవాడు. చిత్ అంటే పూర్ణజ్ఞానం కలిగినవాడు. ఆనంద స్వరూపుడు అంటే, ఏ మాత్రం దుఃఖం లేనివాడని అర్థం. అంతేకాదు పరబ్రహ్మ నిత్య శుద్ధబుద్ధముక్త స్వభావుడు. అంటే ఎల్లవేళలా అవిద్య అంటక పవిత్రంగా ఉండేవాడు.
మరి జీవుని విషయానికి వస్తే పరబ్రహ్మలా ఎల్లవేళలా ఉనికి కలవాడైనప్పటికీ పరబ్రహ్మ అంతటి జ్ఞానం అతనికి లేదు. పరబ్రహ్మ సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు. సర్వవ్యాపకుడు. జీవుడు అల్పజ్ఞుడు, అల్పశక్తిమంతుడు, ఎక్కడో ఒకచోట ఉంటాడు గానీ, పరబ్రహ్మలా బ్రహ్మాండమంతటా ఉండడు. జీవుడు అవిద్యచే శరీరధారి అవుతున్నాడు. అంటే జన్మలెత్తుతున్నాడు. బంధాల్లో చిక్కుకుంటున్నాడు. ముక్తికోసం పరితపిస్తున్నాడు.
జీవించి ఉండగానే ముక్తికి అర్హత గలవారు జీవన్ముక్తులు. మరణించిన తర్వాత ముక్తిని పొందినవారు ముక్తజీవులు. ముక్త జీవులుండే చోటునే ‘తృతీయ ధామం’ అంటారు. పాపం చేసినవారు భూలోకంలో పుడుతూ, చస్తూ ఉంటారు. పుణ్యం చేసినవారు పితృలోకాన్ని చేరి మళ్లీ మనుషులుగా జన్మిస్తారు. కానీ, భవబంధాల నుంచి బయటపడినవారు దేవలోకాన్ని చేరుకుంటారు. ఈ దేవలోకమే ‘తృతీయ ధామం’. అదే ‘బ్రహ్మలోకం’- పరబ్రహ్మ సన్నిధానం. పరబ్రహ్మ సాలోక్యాన్ని, సాయుజ్యాన్ని, సామీప్యాన్ని, సారూప్యాన్ని పొందేవాడు జీవుడే. పరబ్రహ్మలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తే అదే ‘సాలోక్యం’. పరబ్రహ్మతో కలిసి ఉండటం ‘సాయుజ్యం’. యోగంతో పరబ్రహ్మను సమీపించడం ‘సామీప్యం’. పరబ్రహ్మ సామ్యాన్ని పొందడమే ‘సారూప్యం’.
ఇష్టపడటం, ద్వేషించడం, ఏదైనా సాధించడానికి ప్రయత్నించడం, సుఖదుఃఖాలను అనుభవించడం, జ్ఞానం కలిగి ఉండటం శరీరధారి అయిన జీవుడి లక్షణాలు. కష్టాలను కలిగించే అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం పరబ్రహ్మలో లేవు. పరబ్రహ్మ ధర్మాధర్మ ప్రవృత్తులకు దూరంగా ఉంటాడు. వాటి ఫలాలు అతనికి అంటవు. అతను విశేష పురుషుడు (సామాన్యుడైన జీవుడి వంటి వాడు కాడు). శరీరధారులం కావడం వల్లనే మనం ఇచ్ఛాద్వేషాలకు లోనవుతున్నాం. అజ్ఞానంలో పడిపోతున్నాం. సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాం. మన ఇచ్ఛాద్వేషాల వల్ల ఒకరు మిత్రులు, ఒకరు శత్రువులవుతున్నారు. పరబ్రహ్మ స్వరూపం తెలిస్తే మనకు శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. అందరూ మిత్రులే!
******
తెలుగు1: రథసప్తమి
సూర్యుడికి దేశవివక్ష లేదు. జాతిభేదం తెలీదు. ఒకింత అలసట రాదు. ఒక్కక్షణం ఆగేది లేదు. విరామం, విశ్రాంతి లేకుండా కాంతి కాగడాతో నిరంతరం పయనిస్తాడు. ఊపిరినీ ఉత్తేజాన్నీ చేతననీ చిన్మయాన్నీ లోకమంతా పంచుతాడు. విశ్వామిత్రాది మహర్షులంతా సూర్యుని ఆరాధించారు. ఏ సాంకేతికతా లేకుండానే కోట్ల మైళ్ల దూరానున్న సూర్యుని ప్రస్థానాన్ని గమనించారు. ఆదిత్యుని హృదయ సందేశాలు తెలియజేశారు.
మనకు ముక్కోటి దేవతలున్నా సూర్యచంద్రులే కళ్లకు కనిపించే దైవాలు. తెల్లవారుతూనే తేజోవంతంగా ప్రత్యక్షమయ్యే సూర్యుడు మాఘ శుద్ధ సప్తమినాడు జన్మించాడు. అదే రథసప్తమి. ఆ విశిష్టదినాన ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానం చేస్తే ఏడురకాల వ్యాధులు నశిస్తాయట. కొండను అద్దంలో చూపిన చందంగా అఖండుడు, అనంతుడు అయిన సూర్యుడి గురించి ఏడు విశేషాలు...
సూర్యుడు సహస్ర కిరణుడు. ఇందులో ముఖ్యమైన కిరణాలు ఏడు. అవి సుషుమ్న, హరికేశం, విశ్వకర్మ,
విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాగ్వం, స్వరాడ్వసు.
సప్తరశ్ములంటే ఇవే ఇలా ఏడు రశ్ములున్న సూర్యుని సప్తమినాడు పూజించడం ఆనవాయితీ. ఇక రథసప్తమి నాడు సూర్యుడు వరుణుడి రూపంలో
సాయంసంధ్యాదేవితో కూడి ఉంటాడు. ఈమె సప్త ఛందస్సులకు తల్లి.
బ్రహ్మపురాణంలో ద్వాదశ ఆదిత్యుల ప్రస్తావన ఉంది. సూర్యుడి ఏడో రూపమైన భగుడు జీవుల శరీరంలో ఉష్ణరూపంగా (వేడి) కామాగ్నిగా నెలవై ఉన్నాడు. సూర్యుడు ఆరు ఋతువుల్లో ఏడు రంగుల్లో కనిపిస్తాడు. జన్మించిందీ సప్తమినాడే. కనుకనే సూర్యుడికి సప్త సంఖ్యతో అవినాభావ సంబంధం ఉంది.
సూర్యుడు ఒక్కో నెలలో ఏడు వర్ణాలకు (కులాలు) చెందినవారితో కలిసి పయనిస్తాడు. ఉదాహరణకు మాఘమాసంలో త్వష్ట అనే దేవత, జమదగ్ని అనే విప్రుడు, ధృతరాష్ట్ర అనే గంధర్వుడు, తిలోత్తమ అనే అప్సరస, రుతజిత్తు అనే యక్షుడు, కంబళుడు అనే నాగజాతి వ్యక్తి, బ్రహ్మోపేతుడనే రాక్షసుడు - వీరితో కలిసి నడుస్తాడు. అంటే కుల-మత-వర్గ- జాతి భేదాలు లేవు. ఆ కాంతి అందరిపైనా ఒకేలా ప్రసరిస్తుంది.
యజమాని బుద్ధిశాలి అయితే వికలాంగులతోనూ అద్భుత కార్యాలు చేయించగలడు. అందుకు నిదర్శనమే తొడలు లేని అనూరుడిని రథసారథిగా నియమించుకుని కూడా నిరంతరం కోట్ల మైళ్లు ప్రయాణిస్తున్నాడు. సృష్టిలో పనికిరానిదంటూ లేదని, దేన్నయినా ఉపయోగించుకునే సామర్థ్యాలను పెంచుకోవాలని పరోక్షంగా సందేశాన్ని ఇస్తున్నాడు.
భూలోక కాల విభజనకు సూర్యుడే ఆది బిందువు. ఋతువులను కల్పించేదీ, వాటిని నియంత్రించేదీ సూర్యుడే. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రాల పరోక్ష రూపాలే సృష్టి, స్థితి, లయ. ఈ మూడు కాలాలను సూర్య రథపు ఏక చక్రం అనుసంధానిస్తుందని విష్ణుపురాణ కథనం. భాగవతంలోనూ సూర్యుడి కాల కర్తృత్వం వర్ణితమైంది.
సూర్యుడు కాలకర్త మాత్రమే కాదు, విజ్ఞాన స్రష్ట కూడా. సూర్యుడి కిరణాలలో 'తన' అనే శక్తి ఉంటుంది. వీటిని అణుశాస్త్రం ఫోటానులు అంటుంది. ఒక త్రనలో ఆరో భాగం పరమాణువు. కనుక సూర్యుడు అణు శాస్త్ర కర్త కూడా. భూమికి రక్షణ కవచంగా ఉండే ఓజోన్ పొర మరేమిటో కాదు.. త్రనలోని అణువుల కలయికతో ఏర్పడేదే. అలాగే ప్రళయకాలంలో తన 12 రూపాలను ఒక్కసారిగా ఆకాశం మీదకు తెచ్చి యావత్ సృష్టిని లయంచేసే కాలహర్త, విధ్వంసకుడు కూడా సూర్యుడే.
అగస్త్యుడు వచ్చి చెప్పేదాకా శ్రీరామునికి తన కులదైవం సూర్యభగవానుడు చెబుతున్న సందేశాలు అర్థం కాలేదు. అగస్త్యముని చెప్పిన రహస్యాలే రామాయణం యుద్ధకాండలోని ఆదిత్య హృదయం. ఇందులో 31 శ్లోకాలున్నాయి. ఆఖరిది శాంతి పాఠం. మొదటి 9 శ్లోకాలు సూర్యుని తలపై భాగాన్ని, చివరి 9 శ్లోకాలు హృదయం నుంచి అరికాలి భాగాన్ని సూచిస్తాయి. మిగిలిన 12 శ్లోకాలు సూర్యుని హృదయభాగంలోకి వచ్చి తిష్ట వేసినందున అందుకు తగ్గట్టుగా వాల్మీకి ఆదిత్య హృదయంగా అక్షరీకరించాడు. కృష్ణుడి భగవద్గీతలాగే, అగస్త్య ఆదిత్య హృదయం సైతం యుద్ధరంగంలో ప్రబోధించడం గమనిస్తే జీవితమనే యుద్ధభూమిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలని సూచించడమే. ఆదిత్య హృదయం అందుకు తోడ్పడుతుంది. మనం సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు అనంతుడైన సూర్యుడు శక్తి-బుద్ధి అనే కిరణాలతో వాటిని దాటే శక్తి సామర్థ్యాలను అందజేస్తాడనేది సందేశం.
- డాక్టర్ జయదేవ్
********
రథసప్తమి విశిష్టత - ఆరోగ్య కారణాలు - ఆధ్యాత్మిక కారణాలు ౹౹
చాలావరకు మన పండుగలన్నీ వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా ఏర్పడుతాయి..
రథ సప్తమికి వాతావరణ పరంగా కూడా ప్రాధాన్యం ఉంది..
సూర్యుడు మకర రాశిలో అడుగు పెట్టిన అనంతరం వాతావరణంలో వేడి ప్రారంభమవుతుంది అనుకున్నాం కదా..
అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది...
శీతాకాలం నుండి వేసవి కాలపు సంధి స్థితిలో వచ్చే పండుగ ఇది..
అందుకే ఈ పండుగ వసంత, గ్రీష్మ ఋతువుల మధ్యలో వస్తుంది..
బ్రహ్మ సృష్టిని ప్రారంభించే టపుడు తూర్పు దిక్కునే ముందుగా సృష్టిస్తాడట..
సూర్యుడు ఏడు గుర్రాల మీద రథమెక్కి కర్మ సాక్షిగా బాధ్యతలు స్వీకరించాడట..
సూర్యునికి సంబంధించినంతవరకు ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది..
సూర్యుని రథంలో ఉన్న అశ్వాల సంఖ్య ఏడు...
వారంలో రోజులు ఏడు.. వర్ణంలో రంగులు ఏడు....
అలా తిథులలో ఏడవది అయిన సప్తమి రోజు అందునా మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఏడు రథాలతో తన గమనాన్ని మొదలెడతాడట...
దీనికి సూచనగా రథ సప్తమి నాడు రాత్రి నక్షత్ర మండల ఆకారం ఒక తేరు రూపాన్ని సంతరించుకుంటాయట..
ఈ రోజున ప్రాతః కాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన ఆర్క పత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని స్నానంచేస్తే చాలా మంచిదని చెప్తారు..
ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యమేమంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి..
ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి..
ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది..
అనేక చర్మ రోగాలను నివారిస్తుంది..
జననీ త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే,
సప్తమ్యా హ్యదితే దేవి సమస్తే సూర్యమాతృకే
అనే మంత్రంతో స్నానం చేయాలి..
శ్రీరాముల వారంతటి వారే ఆదిత్య హృదయాన్ని పఠించి రావణవథకు బయలుదేరారట..
సూర్యునికి ఇష్టమైన ఈ పండుగ రోజున పై మంత్రాన్ని పఠించి సూర్యుని పూజించి ఆర్ఘ్యం ఘటించి... మన భక్తి ప్రపత్తులు చాటుకుందాం!!!
షష్టి సప్తమి జంటతిథులు కలగలసిన వచ్చిన రథసప్తమి రోజు చాలా విశిష్టమైనది..
అలా ఈ సంవత్సరం వచ్చింది..
కావునా
ప్రతీ ఒక్కరూ సూర్యురథసప్తమి విశిష్టత - ఆరోగ్య కారణాలు - ఆధ్యాత్మిక కారణాలు ౹౹
చాలావరకు మన పండుగలన్నీ వాతావరణంలోని మార్పులకు అనుగుణంగా ఏర్పడుతాయి..
రథ సప్తమికి వాతావరణ పరంగా కూడా ప్రాధాన్యం ఉంది..
సూర్యుడు మకర రాశిలో అడుగు పెట్టిన అనంతరం వాతావరణంలో వేడి ప్రారంభమవుతుంది అనుకున్నాం కదా..
అది ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది...
శీతాకాలం నుండి వేసవి కాలపు సంధి స్థితిలో వచ్చే పండుగ ఇది..
అందుకే ఈ పండుగ వసంత, గ్రీష్మ ఋతువుల మధ్యలో వస్తుంది..
బ్రహ్మ సృష్టిని ప్రారంభించే టపుడు తూర్పు దిక్కునే ముందుగా సృష్టిస్తాడట..
సూర్యుడు ఏడు గుర్రాల మీద రథమెక్కి కర్మ సాక్షిగా బాధ్యతలు స్వీకరించాడట..
సూర్యునికి సంబంధించినంతవరకు ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది..
సూర్యుని రథంలో ఉన్న అశ్వాల సంఖ్య ఏడు...
వారంలో రోజులు ఏడు.. వర్ణంలో రంగులు ఏడు....
అలా తిథులలో ఏడవది అయిన సప్తమి రోజు అందునా మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు ఏడు రథాలతో తన గమనాన్ని మొదలెడతాడట...
దీనికి సూచనగా రథ సప్తమి నాడు రాత్రి నక్షత్ర మండల ఆకారం ఒక తేరు రూపాన్ని సంతరించుకుంటాయట..
ఈ రోజున ప్రాతః కాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన ఆర్క పత్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని స్నానంచేస్తే చాలా మంచిదని చెప్తారు..
ఇందులో నిమిడి ఉన్న ఆరోగ్య రహస్యమేమంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి..
ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి..
ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది..
అనేక చర్మ రోగాలను నివారిస్తుంది..
జననీ త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే,
సప్తమ్యా హ్యదితే దేవి సమస్తే సూర్యమాతృకే
అనే మంత్రంతో స్నానం చేయాలి..
శ్రీరాముల వారంతటి వారే ఆదిత్య హృదయాన్ని పఠించి రావణవథకు బయలుదేరారట..
సూర్యునికి ఇష్టమైన ఈ పండుగ రోజున పై మంత్రాన్ని పఠించి సూర్యుని పూజించి ఆర్ఘ్యం ఘటించి... మన భక్తి ప్రపత్తులు చాటుకుందాం!!!
షష్టి సప్తమి జంటతిథులు కలగలసిన వచ్చిన రథసప్తమి రోజు చాలా విశిష్టమైనది..
అలా ఈ సంవత్సరం వచ్చింది..
కావునా
ప్రతీ ఒక్కరూ సూర్యునికి అంజలి ఘటించి నమస్కరించండి!!
నికి అంజలి ఘటించి నమస్కరించండి!!
***************************************
🌹 నేటి నా పాట🌹 పాట సంఖ్య:-388🌹
****************************************
రచన;- మహేష్ వూటుకూరి ✍️
9640713717.
దోర్నాల.
08/09/2022.
**************
పాట సందర్భంపై నా విశ్లేషణ.
****************************
ఒక పేద రాలు సేవాగుణం గల గొప్ప యువతి
ఒక ఆదర్శ వంతమైన కోటీశ్వరుడు అందరు బాగుండాలనే ఆలోచించి తన వంతు బాధ్యత కలవాడిని కాలం ఇద్దరిని ప్రేమలో పడేసింది
సేవ ఆదర్శం కలిసి
పేదల గుడిసెల్లో వెలుగులు నింపుతు మనిషి కర్తవ్యం
ఏమిటో నిరూపిస్తు సాగిన ప్రేమలో
ఒదిగిన సేవ ఆదర్శపు బాటలో ఆనందం పొంగిన పాట.
*************************************************
పల్లవి:-
********
ఇష్టం ఇష్టం నువ్వంటే ఇష్టం
ఇష్టం ఇష్టం నీ చిరునవ్వంటే ఇష్టం
ఇష్టం ఇష్టం నువ్వంటే ఇష్టం
ఇష్టం ఇష్టం నీ పూల తోట లాంటి మాటంటే
ఇంకా ఇంకా ఇష్టం.ఇష్టం
నీ చిరునవ్వు
నీ చిరునామాను వెతికేలా చేసిందిలే
నీ చిరునామా
నా మనసున ప్రేమను పెంచిందిలే
నీ చిరునవ్వు
నీ చిరునామా వెతికేలా చేసిందిలే
నీ చిరునామా నా మనసున ప్రేమను పెంచిందిలే
మంచితనం మానవత్వం
నీ హృదయం నిండా వున్నాయనీ
ఇలా తెలిసిందిలే
నీవు పంచే ప్రేమా పెంచే మానవీయతా
నీపై ప్రేమ ఇంకా పెరిగేలా చేసాయిలే...
పల్లవి:-
******
ఇష్టం ఇష్టం నువ్వంటే ఇష్టం
ఇష్టం ఇష్టం నీ చిరునవ్వంటే ఇష్టం
చరణం:-
*******
సమయం అంతా సాయంతో గడిపే
నీ చెలిమికి తలవంచాను
నేస్తంగా నీకు తోడుగా వుంటాను
సమస్తం సేవగా భావించే కాలమే నీవై
కరుగుతున్న క్షణాలకు కరిగి పోయాను..
నీ సేవా గుణానికి దాసోహమయ్యాను...
నీ ప్రేమకు
పలకుతున్నా స్వాగతం సుస్వాగతం.
నీ చేయూతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
కాలం కలిపిన మన పరిచయం
కొత్త ఆలోచనకు శ్రీకారం
సరికొత్త అద్యాయానికి సంకేతం
రేపటి రోజు చీకటే రాదు
వెలుగులతో నింపుతాను ఈ పేదగుడిసెల్లో
ఈ ప్రేమ మనుషుల్లో..
పల్లవి:-
********
ఇష్టం ఇష్టం నీవంటే ఇష్టం.
ఇష్టం ఇష్టం నీ చిరునవ్వు అంటే ఇష్టం.
చరణం:-
***********
వెలుగు వచ్చింది
వెన్నెలా కురిసింది
చల్లని పల్లెలా బస్తీ కి కళ తెచ్చింది
ఆశయం ఒకటుంటే ఆచరణకు అడుగు పడుతుంది
అడుగుపడ్డా చోట సంతోషాలు పూలతోటలా
విరబూయాలి..
పంచిన ప్రేమా మానవతా మొగ్గ తొడగాలి
మనిషి మనిషి చేయి కలిపి
నీవు నేను వీడి మనం అంటు సమైక్యమై సాగాలి..
సమిష్టిగా సమృద్ధి వైపు సాగాలి.
పల్లవి:-
*********
ఇష్టం ఇష్టం నీ వంటే ఇష్టం
ఇష్టం ఇష్టం నీ చిరునవ్వులంటే ఇష్టం.
ఇష్టం ఇష్టం నీ పూలతోట లాంటి మాటలంటే ఇంకా ఇంకా ఇష్టం.
**********************************************
**************************************
🌹నేటి నా పాట 🌹పాట సంఖ్య:-384🌹
***************************************
రచన:- మహేష్ వూటుకూరి ✍️
9640713717.
దోర్నాల.
04/08/2022.
******************
పాట సందర్భంపై విశ్లేషణ:-
************************
ఇష్టముండగానే అన్ని దగ్గరకు రావు
చెప్పగలిగే రీతిలో చెప్పగలగాలి అలా చెప్పలేక తన ప్రేమను మనసులోనే ఎన్నో ఏళ్ళుగా దాచుకొని
ప్రేమను వ్యక్త పరచలేని ఓ మంచి వ్యక్తి మనసులోని ప్రేమను వ్యక్త పరిచే సమయం అనుకోకుండా వస్తే అలా అతని మనసులో ని ప్రేమను ఇలా పాటగా వ్యక్తపరిచిన తన ప్రేమలోని నిజాయితీ కి ప్రేమ ను పొందిన సంఘటనలో ఈ పాట.
*********************-**-***
పల్లవి:-
********
నిను చూస్తూ వుంటే
నాలో ఏదో కోరిక పుడుతోంది
నీతో మాటలాడుతుంటే
కాలమెట్లగానే కరిగే పోతోంది..
నీవే కావాలని
నీతో కలిసుండాలని
నిన్నే కోరుకుంటున్న నా మనసుకు
ఏమి సమాధానం చెబుతావో చెప్పవే చిరునవ్వా..
సూటిగ అడిగే నా ప్రశ్న చాలా స్వచ్ఛమైనదే
లోపల ఒకటి బయటకు ఒకటి
చెప్పే లోకంలో నేను మాత్రం లేనే
ఉన్నది అనుకున్నదే నీతో చెబుతున్నానే మల్లెపువ్వా.
నిను చూస్తూవుంటే
నాలో ఏదో కోరిక పుడుతోంది
నీతో మాటాలాడుతుంటే
కాలమెట్లగానో కరిగే పోతోంది.
చరణం:-1
*********--
నీ సమాధానమే నా భవిష్యత్తు
అవునో కాదో చెప్పవే
అవునంటే నీ నవ్వులా నేనుంటా
నీవు కాదంటే ఈ పువ్వులా రాలిపోతా
ప్రేమా ఓ ప్రేమా నా ప్రేమా
చెప్పమ్మా ఓ నా ప్రియ ప్రేమా..
ఎన్నాళ్ళ నుంచే నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ వున్నా
ఎన్నాళ్ళ నుంచో నిన్ను ఎంతెంతగానో ఆరాదిస్తున్నా
ఇన్నాళ్ళకు మనసు విప్పి చెబుతున్నా కరుణించవే
నీవంటే ఎంతో ఇష్టమే నీ వంటే నాకు ఎంతో ప్రాణమే నీవే నా సర్వస్వమే...
ఓ ప్రేమా నా ప్రేమా ప్రియమైన ప్రేమా
నా ప్రాణం కన్నా మిన్ననే నీవే ప్రేమా
పల్లవి:-
********
నిను చూస్తూవుంటే
నాలో ఏదో కోరిక పుడుతోందీ
నీతో మాటలాడుతుంటే
కాలమెట్లగానో కరిగేపోతోంది.
చరణం:-2
**********
వెన్నెల జలపాతం మల్లెల మధుమాసం
నీ సన్నిదిలో నాకు దొరికేను
వెన్నెల్లో ఆడపిల్లా ఎట్లా గుంటుందో
ఈ కన్యాకుమారిని చూసి వక్కాణించానే వయ్యారమా
సన్నజాజి గుభాళింపుకు సరిజోడి
నీ కురుల ఘుమఘుమల పరిమళాలే సౌందర్యమా
సిరుల రాశుల మద్య కురిసిన మరు మల్లెల పూల వర్షానివే.
నీ ఒప్పుకోలుతో నిప్పుల మారినా
నీ బిగికౌగిళింతలో జాబిల్లినై
వెన్నెలలా చల్లగా తేలిపోయానే..
ఎన్నాళ్ళ నిరీక్షణ ల పరీక్షల కు
ఆనంద కేరింతల హర్షాన్ని నేనై
ఆకాశాన్నే ముద్దాడి బంధంలో బంధీనైనా
అనుబంధంలో పరవశమౌతున్నానే
పల్లవి:
*********
నిను చూస్తూవుంటే నాలో ఏదో కోరిక పుడుతోంది
నీతో మాట్లాడుతుంటే కాలం ఇట్టే అయిపోతోంది.
*****-*********---***************-************
No comments:
Post a Comment