Monday, 2 October 2017

om sri raam, sri maatrenama:

త్రిమూర్తుల అవతార మహత్యం తెలుసుకోవటం చాలా కష్టం, ఏది ఏమైనా మానవ జన్మ సార్ధకంగా ప్రతి ఒక్కరు భక్తి సాధనతో త్రిమూర్తులను నవ విధాలుగా ప్రార్ధించి విజయం సాధించ గలరు.

విధాత వేదాలను సృష్టించి, ప్రకృతిలో జన్మ జన్మ బంధాలను వివరించాడు. సరస్వతీ తెల్లనిది, బ్రహ్మ బంగారు ఛాయా కలిగి ఉన్నారు, సరస్వతి దేవి హంసకు వెండినైన (తెల్లని రంగును) బ్రహ్మ దాని రెక్కలకు బంగారాన్ని  (బంగారు రంగును) ప్రసాదించారు. అంటే వారి రంగులు హంసలో ప్రతి ఫలించిన వన్నమాట. సృష్టికి మూలకర్తలు వాహనమైన హంసకే సహాయము చేసిన వారు భక్తితో వేడుకున్న వాణికి వెండి బంగారు, కీర్తి , ప్రతాపం, శాశ్వతసుఖం మొదలైన వాటిని సరస్వతి బ్రహ్మలు ప్రసాదించి నట్లుగా మన కవులు వర్ణించారు.  సరస్వతి ఆమె లౌకిక పారలౌకిక సుఖాలను పొంద టానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక కీర్తిని హంసతో పోలుస్తారు. ప్రాకాశం, సుదూరం సంచరించటం, హంసకు కీర్తికి గల పోలికలు. భక్తులకు అన్ని శ్రేయస్సులను కలిగిస్తా రనన్నది కవుల భావం. లక్ష్మీ సరస్వతులు అత్తా కోడళ్ళుని, సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుందని కొందరి భావన. సరస్వతి దేవి అనుగ్రహం ఉన్నచోటా లక్ష్మీదేవి తక్కువ, లక్ష్మీ దేవి ఉన్నచోట సరస్వతి దేవి తక్కువ అనేది నాభావన మాత్రమే.           

No comments:

Post a Comment