_*తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
శ్రీ
సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో ఆరవది
తిరుత్తణి. ఈ క్షేత్రం తమిళనాడు లోని తిరువళ్లూర్ జిల్లాలో అరక్కోణం
సమీపంలో పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం మన తిరుపతి కి కూడా
కేవలం అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.
ప్రఖ్యాత
సుబ్రహ్మణ్య క్షేత్రములైన *“ ఆరు పడై వీడు ”* లో మకుటాయమానమైన క్షేత్రం
తిరుత్తణి. ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే మనశ్శాంతి ,
సుఖములు చేకూరుతాయని ప్రసిద్ధి. సుబ్రహ్మణ్య స్వామి వారు అసురు సంహారం
చేసిన తర్వాత ఇక్కడే మొట్ట మొదట పూర్తి ప్రశాంతత పొందారు. ఇక్కడ స్వామి
వారిని *“తనికేశన్”* గా కొలుస్తారు. ఈ క్షేత్రములో ఏ భక్తులైతే ఏకాగ్ర
చిత్తము , ధృఢ విశ్వాసములతో స్వామి ని ప్రార్ధిస్తారో వారికి క్షణ కాలంలోనే
కోరికలు తీరుతాయి అని ప్రతీక. అందువలననే స్వామి వారు కొలువు ఉన్న కొండని
*“ క్షణికాచలం “ (తమిళం లో తనికాచలం)* అని పిలుస్తారు.
ఈ
క్షేత్రమునకు దగ్గరలో వల్లి మలై ఉంది. అక్కడి నుంచే వల్లి అమ్మని తెచ్చి ఈ
క్షేత్రములో వల్లి సుబ్రహ్మణ్య కళ్యాణము జరిపారు. సుబ్రహ్మణ్య స్వామి
వారిని ఈ క్షేత్రములో వీరమూర్తి , జ్ఞాన మూర్తి , ఆచార్య మూర్తి అనే
నామములతో కొలుస్తారు.
ఈ
క్షేత్రములో ఉన్న వినాయకుడిని *“ ఆపత్ సహాయ వినాయగర్ “* అని పిలుస్తారు.
ఎందుకంటే , సుబ్రహ్మణ్యుడి అగ్రజుడు కదా మన లంబోదరుడు , ఆయన తమ్ముడిని
వల్లి అమ్మకి ఇచ్చి వివాహం చేయడంలో కీలక పాత్ర వహించారు గణపతి.
ఇక్కడ
క్షేత్రములో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే , ఇక్కడ ఉత్సవ మూర్తులుగా ఉన్న వల్లీ
, దేవసేనా , సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమానము (ఛత్రము) రుద్రాక్షలతో
చేసినది. చాలా అందముగా ఉంటుంది. అంతేకాదు , స్వామి వారు ఒక ఆకు పచ్చని
రంగులో ఉండే షట్కోణ పతకము ధరించి మిల మిల మెరిసి పోతూ ఉంటారు. ఇక్కడ బంగారు
బిల్వ పత్రముల మాల తో కూడా స్వామి వారిని అలంకరిస్తారు.
ఈ
క్షేత్రమునకే అనేక పేర్లు కలవు. పూర్ణగిరి , క్షణికాచలం , మూలాద్రి ,
నీలోత్పల మొదలగు పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయం ఉన్న కొండ ఎక్కాలంటే మూడు వందల
అరవై ఐదు మెట్లు ఉంటాయి. ఇవి సంవత్సరములో ప్రతీ రోజుకు సంకేతము. ముందుగా
స్వామి వారి దగ్గరకి వెళ్ళేటప్పుడు , కొండ క్రింద భాగములో కుమార తీర్థము
ఉంటుంది. దీనినే శరవణ తటాకము ( తమిళం లో శరవణ పోఇగై ) అంటారు.
*తిరుత్తణి క్షేత్ర స్థల పురాణము:*
శ్రీ
సుబ్రహ్మణ్య స్వామి , వల్లి అమ్మ వారి కళ్యాణం తర్వాత , అమ్మ వారు స్వామి
వారిని ఈ తిరుత్తణి క్షేత్ర మాహాత్మ్యము గురించి తెలుపమని కోరగా , ఎవరైతే ఈ
తిరుత్తణి క్షేత్రములో త్రికరణశుద్ధిగా ఐదు రోజులు స్వామి వారిని
ఆరాధిస్తారో , వారికి ఇహలోకములో కావలసిన వన్నీ సమకూర్చి , పరలోకం లో
మోక్షప్రాప్తి కలుగజేస్తానని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి
అమ్మ వారితో సెలవిచ్చారు.
త్రేతా
యుగములో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరం లో
ఈశ్వరుడిని ఆరాధిస్తారు. అక్కడ , ఈశ్వరుడి ఆనతి మేరకు , శ్రీ రాముడు ఈ
తిరుత్తణి క్షేత్రము దర్శించినారు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి
మనశ్శాంతి కలిగింది.
ద్వాపర
యుగములో , మహా వీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ , ఇక్కడ
తనికేశన్ స్వామి వారిని కొలిచినారు. శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రములోనే
సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు , చక్రములను తిరిగి
పొందినారు. (అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహా విష్ణువు నుండి
చేజిక్కించుకుంటాడు).
చతుర్ముఖ
బ్రహ్మ గారు ప్రణవ అర్ధమును చెప్పలేక పోవడం వలన , మన ముద్దులొలికే
సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి , ఆయన సృష్టి చేసే సామర్ధ్యం కోల్పోతారు.
ఇక్కడ తిరుత్తణి లో ఉన్న బ్రహ్మ తీర్థము లో కార్తికేయుని పూజించి , ఆయన
తిరిగి ఆయన శక్తి సామర్ధ్యములను పొందారు.
దేవేంద్రుడు
ఈ క్షేత్రములోనే , ఇంద్ర తీర్థములో , “ కరున్ కువలై ” అనే అరుదైన పూల
మొక్కను నాటి , ప్రతీ రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో ఇక్కడ షణ్ముఖుని
పూజించాడు. ఆ తర్వాతనే , ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా
పోగొట్టుకున్న *“ సంఘనీతి , పద్మనీతి , చింతామణి ”* మొదలగు దేవలోక
ఐశ్వర్యమును తిరిగి పొందాడు.
అమృతం
కోసం దేవతలు , రాక్షసులు పాల సముద్రమును మథనం చేయడానికి వాసుకిని తాడుగా
చేసి మథనం చేస్తారు. దాని వలన , అక్కడ వాసుకి శరీరమునకు కలిగిన తీవ్రమైన
గాయములు ఈ క్షేత్ర దర్శనము తర్వాత పూర్తిగా నయమౌతాయి. ఈ తిరుత్తణి లోనే ,
అగస్త్య మహా ముని సుబ్రహ్మణ్యుని ఆరాధించిన తర్వాత తమిళ భాష
ఆవిర్భవించినది.
పురాణములలోనే
కాకుండా , సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహా భక్తుడు అరుణగిరినాథర్ ఈ
క్షేత్ర మాహాత్మ్యమును ఎంతగానో కీర్తించారు. ఈ కొండ మీదనే ఎంతో మంది ఋషులు
దేవతలు తపస్సు చేయడానికి ఇష్టపడతారని , ఇది భూలోకంలోని శివలోకముగా
పోల్చారు.
ప్రఖ్యాత
వాగ్గేయకారుడు , సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి అవతారముగా
కీర్తించబడినవారు , మహానుభావుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారికి ఈ
క్షేత్రములోనే స్వామి ఒక వృద్ధుడి రూపంలో వచ్చి వారికి తన యొక్క ప్రసాదం
ఇచ్చి వెళ్లారు. అప్పటి నుంచే ముత్తుస్వామి దీక్షితార్ కి అనర్గళమైన
కీర్తనలు వారి నోటి నుండి వచ్చాయి.
*ఈ క్షేత్రమును చేరే మార్గములు:*
తిరుత్తణి తమిళనాడు లోని కుంభకోణం నుంచి తంజావూర్ వెళ్ళే దారిలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.
రోడ్
ద్వారా: చెన్నై నుండి 84 Km, తిరుపతి నుండి 68 Km, అరక్కోణం ( కాణిపాకం
)నుండి 13 Km దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి బస్సు
సౌకర్యం ఉంది. మన APSRTC కూడా తిరుపతి నుంచి అనేక బస్సులు నడుపుతుంది.
*రైలు
ద్వారా:* దీనికి దగ్గరలోని రైల్వే స్టేషన్ అరక్కోణం. ఇది ఒక రైల్వే
జంక్షన్. అంతేకాక, చెన్నై నుండి తిరుత్తణి కి అనేక లోకల్ రైళ్ళు నడుస్తాయి.
*విమానము ద్వారా:* దగ్గరలో విమానాశ్రయములు చెన్నై ( 82 Km ), తిరుపతి ( 60 Km ) దూరంలో ఉన్నాయి.
*వసతి సదుపాయము:*
ఇక్కడ
స్వామి వారి కొండ క్రిందనే దేవస్థానము వసతి గృహాలు ఉన్నాయి. చాలా చక్కగా ,
తిరుమలలో లాగా ఉంటాయి. ఇక్కడకి వెళ్ళే ముందు ఆలయం వారికి డీడీ రూపములో
డబ్బు పంపవలెను. కాని , రద్దీ తక్కువగా ఉండే సమయములో అప్పటికప్పుడు కూడా
వసతి ఇక్కడ దొరుకుతుంది.
--(())--
బ్రాహ్మణుని తేజస్సు
బ్రాహ్మణుని జననము ---విష్ణు అంశం
బ్రాహ్మణుని బుద్ది -----సర్వసమస్యలకు సమాధానం.
బ్రాహ్మణుని వాక్చాతుర్యం---------వేద వైభవజ్ఞానం.
బ్రాహ్మణునిదృష్టి---సమభావం.
బ్రాహ్మణుని ఆశయం------సర్వలోకక్షేమం
బ్రాహ్మణుని లక్ష్యం------దేశహితం.
బ్రాహ్మణుని ముఖ్యఉద్దేశం--సర్వసంకటనాశనం.
బ్రాహ్మణుని అనుగ్రహం---భవసాగరసాధనం.
బ్రాహ్మణుని నిత్యానుష్టానం- సర్వలోకక్షేమం.
బ్రాహ్మణుని నిధి---భగవద్సన్నిది.
బ్రాహ్మణుని దర్శనం--సర్వమంగళకరం.
బ్రాహ్మణుని ఆశీర్వాదం---వైభవమునకు ఆలవాలము.
బ్రాహ్మణుని చల్లని చూపు -- చూపు
బ్రాహ్మణుని అస్త్రం-శాపం.
బ్రాహ్మణుని శస్త్రం -- నీ జీవితానికి మోక్షం.
బ్రాహ్మణుని శాస్త్రం---- మనుగడమార్గం.
బ్రాహ్మణునునికి దానం-సహస్రపాపముల సంహారం.
బ్రాహ్మణునునికి దక్షిణమ్-సర్వపాపక్షయం.
బ్రహ్మణునిఘర్జనమ్-సర్వభూతసంహారం.
బ్రహ్మణునికోపం--సర్వనాశనం.
బ్రాహ్మణుని తాపం--నీ జీవిత సంకటం.
బ్రహ్మణునికిసన్మానం --నీ అభివృద్ధికి సోపానం.
బ్రహ్మణునునికి అవమానం--నీ అభివృద్ధికి వినాశనం.
బ్రాహ్మణునునికి ద్రోహం --నరకానికి మార్గం.
బ్రాహ్మణ అభ్యుదయం --నీ జీవితానికి అభ్యుదయం.
బ్రాహ్మణుని అనుగ్రహ చూపు --నీ జీవితారోహణకు మార్పు.
బ్రాహ్మణుని ఆవాసం----సర్వతీర్థముల నివాసం.
బ్రాహ్మణుని సాన్నిహిత్యం - నీ జీవితo కాంతివంతం.
బ్రాహ్మణుని సాంగత్యం----త్రివేణిసంగమసదృశం.
బ్రాహ్మణక్షేమం--దేశక్షేమం.
బ్రహ్మణహితం-దేశహితం.
స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతామ్.
న్యాయేణ మార్గేణ మహీమ్ మహీశా:
గోబ్రాహ్మణేభ్య:శుభమస్తు నిత్యం
లోకాః సమస్తా: సుఖినోభవంతు.
--((***))--
No comments:
Post a Comment