Tuesday, 26 February 2019

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్




_*తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో ఆరవది తిరుత్తణి. ఈ క్షేత్రం తమిళనాడు లోని తిరువళ్లూర్ జిల్లాలో అరక్కోణం సమీపంలో పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం మన తిరుపతి కి కూడా కేవలం అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రములైన *“ ఆరు పడై వీడు ”* లో మకుటాయమానమైన క్షేత్రం తిరుత్తణి. ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే మనశ్శాంతి , సుఖములు చేకూరుతాయని ప్రసిద్ధి. సుబ్రహ్మణ్య స్వామి వారు అసురు సంహారం చేసిన తర్వాత ఇక్కడే మొట్ట మొదట పూర్తి ప్రశాంతత పొందారు. ఇక్కడ స్వామి వారిని *“తనికేశన్”* గా కొలుస్తారు. ఈ క్షేత్రములో ఏ భక్తులైతే ఏకాగ్ర చిత్తము , ధృఢ విశ్వాసములతో స్వామి ని ప్రార్ధిస్తారో వారికి క్షణ కాలంలోనే కోరికలు తీరుతాయి అని ప్రతీక. అందువలననే స్వామి వారు కొలువు ఉన్న కొండని *“ క్షణికాచలం “ (తమిళం లో తనికాచలం)* అని పిలుస్తారు.

ఈ క్షేత్రమునకు దగ్గరలో వల్లి మలై ఉంది. అక్కడి నుంచే వల్లి అమ్మని తెచ్చి ఈ క్షేత్రములో వల్లి సుబ్రహ్మణ్య కళ్యాణము జరిపారు. సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ క్షేత్రములో వీరమూర్తి , జ్ఞాన మూర్తి , ఆచార్య మూర్తి అనే నామములతో కొలుస్తారు.

ఈ క్షేత్రములో ఉన్న వినాయకుడిని *“ ఆపత్ సహాయ వినాయగర్ “* అని పిలుస్తారు. ఎందుకంటే , సుబ్రహ్మణ్యుడి అగ్రజుడు కదా మన లంబోదరుడు , ఆయన తమ్ముడిని వల్లి అమ్మకి ఇచ్చి వివాహం చేయడంలో కీలక పాత్ర వహించారు గణపతి. 


ఇక్కడ క్షేత్రములో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే , ఇక్కడ ఉత్సవ మూర్తులుగా ఉన్న వల్లీ , దేవసేనా , సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమానము (ఛత్రము) రుద్రాక్షలతో చేసినది. చాలా అందముగా ఉంటుంది. అంతేకాదు , స్వామి వారు ఒక ఆకు పచ్చని రంగులో ఉండే షట్కోణ పతకము ధరించి మిల మిల మెరిసి పోతూ ఉంటారు. ఇక్కడ బంగారు బిల్వ పత్రముల మాల తో కూడా స్వామి వారిని అలంకరిస్తారు. 


ఈ క్షేత్రమునకే అనేక పేర్లు కలవు. పూర్ణగిరి , క్షణికాచలం , మూలాద్రి , నీలోత్పల మొదలగు పేర్లతో పిలుస్తారు. ఈ ఆలయం ఉన్న కొండ ఎక్కాలంటే మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి. ఇవి సంవత్సరములో ప్రతీ రోజుకు సంకేతము. ముందుగా స్వామి వారి దగ్గరకి వెళ్ళేటప్పుడు , కొండ క్రింద భాగములో కుమార తీర్థము ఉంటుంది. దీనినే శరవణ తటాకము ( తమిళం లో శరవణ పోఇగై ) అంటారు. 

*తిరుత్తణి క్షేత్ర స్థల పురాణము:*

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి , వల్లి అమ్మ వారి కళ్యాణం తర్వాత , అమ్మ వారు స్వామి వారిని ఈ తిరుత్తణి క్షేత్ర మాహాత్మ్యము గురించి తెలుపమని కోరగా , ఎవరైతే ఈ తిరుత్తణి క్షేత్రములో త్రికరణశుద్ధిగా ఐదు రోజులు స్వామి వారిని ఆరాధిస్తారో , వారికి ఇహలోకములో కావలసిన వన్నీ సమకూర్చి , పరలోకం లో మోక్షప్రాప్తి కలుగజేస్తానని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి అమ్మ వారితో సెలవిచ్చారు.

త్రేతా యుగములో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరం లో ఈశ్వరుడిని ఆరాధిస్తారు. అక్కడ , ఈశ్వరుడి ఆనతి మేరకు , శ్రీ రాముడు ఈ తిరుత్తణి క్షేత్రము దర్శించినారు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది.

ద్వాపర యుగములో , మహా వీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ , ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచినారు. శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రములోనే సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు , చక్రములను తిరిగి పొందినారు. (అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహా విష్ణువు నుండి చేజిక్కించుకుంటాడు).

చతుర్ముఖ బ్రహ్మ గారు ప్రణవ అర్ధమును చెప్పలేక పోవడం వలన , మన ముద్దులొలికే సుబ్రహ్మణ్యుడి చేత బంధింపబడి , ఆయన సృష్టి చేసే సామర్ధ్యం కోల్పోతారు. ఇక్కడ తిరుత్తణి లో ఉన్న బ్రహ్మ తీర్థము లో కార్తికేయుని పూజించి , ఆయన తిరిగి ఆయన శక్తి సామర్ధ్యములను పొందారు.

దేవేంద్రుడు ఈ క్షేత్రములోనే , ఇంద్ర తీర్థములో , “ కరున్ కువలై ” అనే అరుదైన పూల మొక్కను నాటి , ప్రతీ రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో ఇక్కడ షణ్ముఖుని పూజించాడు. ఆ తర్వాతనే , ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న *“ సంఘనీతి , పద్మనీతి , చింతామణి ”* మొదలగు దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడు.


అమృతం కోసం దేవతలు , రాక్షసులు పాల సముద్రమును మథనం చేయడానికి వాసుకిని తాడుగా చేసి మథనం చేస్తారు. దాని వలన , అక్కడ వాసుకి శరీరమునకు కలిగిన తీవ్రమైన గాయములు ఈ క్షేత్ర దర్శనము తర్వాత పూర్తిగా నయమౌతాయి. ఈ తిరుత్తణి లోనే , అగస్త్య మహా ముని సుబ్రహ్మణ్యుని ఆరాధించిన తర్వాత తమిళ భాష ఆవిర్భవించినది.
పురాణములలోనే కాకుండా , సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మహా భక్తుడు అరుణగిరినాథర్ ఈ క్షేత్ర మాహాత్మ్యమును ఎంతగానో కీర్తించారు. ఈ కొండ మీదనే ఎంతో మంది ఋషులు దేవతలు తపస్సు చేయడానికి ఇష్టపడతారని , ఇది భూలోకంలోని శివలోకముగా పోల్చారు.

ప్రఖ్యాత వాగ్గేయకారుడు , సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి అవతారముగా కీర్తించబడినవారు , మహానుభావుడు శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారికి ఈ క్షేత్రములోనే స్వామి ఒక వృద్ధుడి రూపంలో వచ్చి వారికి తన యొక్క ప్రసాదం ఇచ్చి వెళ్లారు. అప్పటి నుంచే ముత్తుస్వామి దీక్షితార్ కి అనర్గళమైన కీర్తనలు వారి నోటి నుండి వచ్చాయి. 

*ఈ క్షేత్రమును చేరే మార్గములు:*

తిరుత్తణి తమిళనాడు లోని కుంభకోణం నుంచి తంజావూర్ వెళ్ళే దారిలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.

రోడ్ ద్వారా: చెన్నై నుండి 84 Km, తిరుపతి నుండి 68 Km, అరక్కోణం ( కాణిపాకం )నుండి 13 Km దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి బస్సు సౌకర్యం ఉంది. మన APSRTC కూడా తిరుపతి నుంచి అనేక బస్సులు నడుపుతుంది.

*రైలు ద్వారా:* దీనికి దగ్గరలోని రైల్వే స్టేషన్ అరక్కోణం. ఇది ఒక రైల్వే జంక్షన్. అంతేకాక, చెన్నై నుండి తిరుత్తణి కి అనేక లోకల్ రైళ్ళు నడుస్తాయి.

*విమానము ద్వారా:* దగ్గరలో విమానాశ్రయములు చెన్నై  ( 82 Km ), తిరుపతి ( 60 Km ) దూరంలో ఉన్నాయి.

*వసతి సదుపాయము:*

ఇక్కడ స్వామి వారి కొండ క్రిందనే దేవస్థానము వసతి గృహాలు ఉన్నాయి. చాలా చక్కగా , తిరుమలలో లాగా ఉంటాయి. ఇక్కడకి వెళ్ళే ముందు ఆలయం వారికి డీడీ రూపములో డబ్బు పంపవలెను. కాని , రద్దీ తక్కువగా ఉండే సమయములో అప్పటికప్పుడు కూడా వసతి ఇక్కడ దొరుకుతుంది.

--(())--


బ్రాహ్మణుని   తేజస్సు

బ్రాహ్మణుని జననము ---విష్ణు అంశం
బ్రాహ్మణుని బుద్ది -----సర్వసమస్యలకు సమాధానం.     
బ్రాహ్మణుని వాక్చాతుర్యం---------వేద వైభవజ్ఞానం.
బ్రాహ్మణునిదృష్టి---సమభావం.                         

బ్రాహ్మణుని ఆశయం------సర్వలోకక్షేమం
బ్రాహ్మణుని లక్ష్యం------దేశహితం.       
బ్రాహ్మణుని ముఖ్యఉద్దేశం--సర్వసంకటనాశనం.
బ్రాహ్మణుని అనుగ్రహం---భవసాగరసాధనం.

బ్రాహ్మణుని నిత్యానుష్టానం- సర్వలోకక్షేమం.
బ్రాహ్మణుని నిధి---భగవద్సన్నిది.             
బ్రాహ్మణుని దర్శనం--సర్వమంగళకరం. 
బ్రాహ్మణుని ఆశీర్వాదం---వైభవమునకు ఆలవాలము.

బ్రాహ్మణుని  చల్లని చూపు --  చూపు   
బ్రాహ్మణుని అస్త్రం-శాపం.       
బ్రాహ్మణుని శస్త్రం --  నీ జీవితానికి మోక్షం.             
బ్రాహ్మణుని శాస్త్రం---- మనుగడమార్గం.               

బ్రాహ్మణునునికి దానం-సహస్రపాపముల సంహారం.       
బ్రాహ్మణునునికి దక్షిణమ్-సర్వపాపక్షయం.     
బ్రహ్మణునిఘర్జనమ్-సర్వభూతసంహారం.       
బ్రహ్మణునికోపం--సర్వనాశనం.                   

బ్రాహ్మణుని తాపం--నీ జీవిత సంకటం.           
బ్రహ్మణునికిసన్మానం --నీ అభివృద్ధికి సోపానం.           
బ్రహ్మణునునికి అవమానం--నీ అభివృద్ధికి వినాశనం.
బ్రాహ్మణునునికి ద్రోహం --నరకానికి మార్గం.                 

బ్రాహ్మణ అభ్యుదయం --నీ జీవితానికి అభ్యుదయం.     
బ్రాహ్మణుని అనుగ్రహ చూపు --నీ జీవితారోహణకు మార్పు.   
బ్రాహ్మణుని ఆవాసం----సర్వతీర్థముల నివాసం.                           
బ్రాహ్మణుని సాన్నిహిత్యం - నీ జీవితo కాంతివంతం.       

బ్రాహ్మణుని సాంగత్యం----త్రివేణిసంగమసదృశం.       
బ్రాహ్మణక్షేమం--దేశక్షేమం.
బ్రహ్మణహితం-దేశహితం.           

స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతామ్.                   
న్యాయేణ మార్గేణ మహీమ్ మహీశా:               
గోబ్రాహ్మణేభ్య:శుభమస్తు నిత్యం                             
లోకాః సమస్తా: సుఖినోభవంతు.

--((***))--

No comments:

Post a Comment