Thursday, 18 July 2019

☘ *మంచి కధ* ☘

తప్పక చదవండి

👌 *నిజమైన గుర్తింపు సాధనం*👌



👉ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు.



రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు.



👉కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు.

అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు.

రాజు చాలా ఆశ్చర్యపోయాడు.



👉అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు - “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది.

దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.



👉రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు.



👉రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది.

అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు.

అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు.



👉కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు... అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..

రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు.

అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము.



👉రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది.

ఒక రాణి స్తాయి  వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు....



👉రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు



👉కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు.

ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు.

రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.

రాజుకు చాలా కోపం వచ్చింది.

కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు.

తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు.

మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని.



👉రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు.



👉అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు.

ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు...



☘మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే!



🌺 *మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే.*🌺



నక్కజిత్తులు

‘ఎవరది’ అంటూ గట్టిగా అరిచిన గద్ద దగ్గరకు గజాగజా వణుకుతూ చేరింది పిల్లి. ఎవరో వచ్చి తన ఎదురుగా నిలుచున్నారని గ్రహించింది గద్ద.‘‘ఎవరు నువ్వు’’ అడిగింది.

‘‘అయ్యా నా పేరు దీర్ఘకర్ణం. పిల్లిని’’‘‘పిల్లివా? నీకిక్కడేం పని? వెళ్ళిక్కణ్ణుంచి. లేదంటే చంపేస్తాను’’ బెదిరించింది గద్ద.

నేరకపోయి చెట్టెక్కేను. దీనిపాలబడ్డాననుకుంటూ ఇలా అంది పిల్లి.‘‘నాకిక్కడ చాలా పని ఉంది. పని మీదే వచ్చానిక్కడికి. మీరు వెళ్ళిపొమ్మంటున్నారు. వె ళ్ళకపోతేచంపుతానంటున్నారు. ఎలా ఇప్పుడు’’ అంది పిల్లి.

‘‘పనేంటసలు? ఎవరితో పని’’ అడిగింది గద్ద.‘‘మీతోనే పని’’‘‘నాతో నీకేం పని’’‘‘అయ్యా! నేను అన్ని పిల్లుల్లా కాదు. సాధుజంతువుని. శాఖాహారిని. మాంసం తినడం ఎప్పుడో మానేశాను. పుణ్యం కోసం రోజూ అదిగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను. బ్రహ్మచారిని. చాంద్రాయణ వ్రతంలో ఉన్నాను.’

’‘‘ఉంటే’’ అడిగింది గద్ద.‘‘ఇంకేం లేదు. మీరు పెద్దలని, మంచివారని, నీతిశాస్త్రాన్ని పుక్కిటపట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను. అప్పట్నుంచీ మిమ్మల్ని కలవాలని, కలిసి మీతో మాట్లాడాలని నాదో చిన్న కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చాను.’’ అంది పిల్లి.

తనని పిల్లి గౌరవించడం, తనని కలిసేందుకు రావడం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి.‘‘మీలాంటి పెద్దలతో మాట్లాడితే నాలుగు మంచి ముక్కలు చెవిన పడతాయి. నీతులూ, ధర్మాలూ తెలుసుకోవచ్చని ఆశగా వచ్చాను. వచ్చినందుకు బాగానే ఉంది.

చంపుతానంటున్నారు.’’ బాధగా అంది పిల్లి.‘‘బాధపడకు! అసలు సంగతి ఏమిటంటే...ఈ చెట్టు మీద అనేక పక్షిగూళ్ళు ఉన్నాయి. ఆ గూళ్ళలో పిల్లలు ఉన్నాయి. పక్షిపిల్లలంటే పిల్లులకి ఇష్టం కదా! అందుకు వచ్చావేమోనని అనుమానించాను.’’‘

‘రామ రామ! ఎంతమాట ఎంతమాట! పిల్లిగా పుట్టడమే మహాపాపం అనుకుంటుంటే అందులో మళ్ళీ అన్నెం పున్నెం ఎరుగని పక్షి పిల్లల్ని తినటం ఒకటా!! ఛఛ! ‘అహింస పరమో ధర్మః’ అన్నారు. అంటే జీవహింస చేయకపోవడమే అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం. జీవహింస చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట! భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను, పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షి పిల్లల్ని తింటానా? అది ఊహించడానికే అసహ్యంగా లేదూ’’ అంది పిల్లి.

‘‘అది కాదు దీర్ఘకర్ణా’’ అని గద్ద ఏదో నచ్చజెప్పబోయేంతలో గద్ద మాటను పట్టించుకోకుండా మళ్ళీ ఇలా అంది పిల్లి.‘‘ఈ పాడుపొట్టను నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒకటి దొరక్కుండా పోదు. ఆఖరికి నాలుగాకులు తిన్నాకడుపు నిండిపోతుంది. అంతేగాని, చెట్టు మీది పిల్లలను చంపి తింటానా? చేజేతులా నరకాన్ని కోరుకుంటానా? ఎంతమాట ఎంతమాట’’పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది గద్ద. ‘అయ్యయ్యో, పొరబడ్డానే’ అనుకుంది. పిల్లిని ఇలా ఓదార్చింది.



--((***)))--



నేనో రైల్వే స్టేషన్ని . ఇదేంటి ఓ రైల్వే స్టేషన్ మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? నాకు జీవం లేకపోయినా ఎన్నో జీవితాలని దగ్గరి నుండి చూసిన అనుభవం ఉంది. నాకు ప్రాణం లేకపోయినా ఓ మనసుంది ఆ మనసుని కదిలించే మనుషులూ ఉన్నారు . ఆ మనుషుల కథలు చెప్పడానికే ఈ రోజు మీ ముందుకి వచ్చాను. రోజూ కొన్ని వేలమంది మనుషులని చూస్తుంటాను నేను,ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళు ఎక్కడినుండో వచ్చేవాళ్ళు. కలిసిపోయే మనుషులు విడిపోయే మనసులు. ఇలా ఎన్నో భావోద్యేగాలకి నేను సజీవ సాక్షిని . ఎన్నో కథలు రోజూ నా ఎదురుగా జరుగుతుంటాయి . కానీ ఒకే రోజు నా మనసుకి ఆనందం,భాద,హాయి, సంతోషం ,దుఃఖం ఇలా ఎన్నో రకాల భావాలు కలిగించిన ఐదుగురి జీవితాలను,వాళ్ళ కథలను మీకు చెప్పాలని ఈరోజు ఇలా వచ్చాను .

1.గూటికి చేరిన పక్షి

సమయం ఉదయం 9. 30

నాలుగేళ్ల వయసులో అమాయకంగా అయోమయంగా ఆకలితో అటు ఇటు తిరుగుతూ నా ఒడిలో వచ్చి చేరాడు , రెండు శరీరాలు కలిస్తే పుట్టాడు , ఇద్దరు మనుషులు విడిపోతే వాడు వీధినపడ్డాడు . అందరిలా చదువుకోవాలని వాడికోరిక కానీ వాడి రాత మరోలా ఉంది . కడుపు నింపుకోడానికి రోజంతా మొదటి ప్లాటుఫారంలో కాఫీ టీ లు అమ్ముతుండేవాడు ,రాత్రి చివరి ప్లాటుఫారంలో పడుకునేవాడు, ఐదేళ్లుగా వాడు నా దగ్గరే ఉంటున్నాడు . చదువంటే పిచ్చివాడికి,బాబుగాడికి ఒకటే కోరిక,వాడిలా ఎవరూ లేని పిల్లలకి చదువు చెప్పించాలని ,వాళ్లందరికీ తోడుగా ఉండాలని . ఆరోజు కూడా ఎప్పటిలానే కాఫీ టీ అమ్ముతూ తిరుగుతున్నాడు.ఎవరో ఒకాయన సుమారు 45ఏళ్ల వయసు, బాబుగాడి కోసం వెతుకుతున్నాడు. నిన్న రాత్రి చివరి రైలు కి దిగాడు అతను , ప్లాటుఫారంలో బాబు గాడ్ని వాడి పక్కన ఉన్న పాత పుస్తకాలని చూస్తూ నిలబడ్డాడు చాలాసేపు , తరువాత వెళ్ళిపోయాడు కాసేపటికి, మళ్ళి ఇప్పుడు బాబుకోసం వచ్చాడు. దూరంగా రైలు పెట్టె పక్కన నిల్చున్న బాబుగాడు కనిపించాడు ఆయనకి. ఆయన నిన్నే ఈ ఊరికొచ్చిన కొత్త కలెక్టరు గారంట . వీధిబాలలందరిని హాస్టల్ లో చేర్చి చదువు చెప్పించడం తన మొదటి పనిగాపెట్టుకున్నారట. బాబు గాడి దగ్గరికెళ్లి ఎం బాబు నీకు చదువంటే ఇష్టమా??? బాగా చదూకుంటావా?? నేను చదివిస్తా మరి,నాతో వస్తావా నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అక్కడ. వస్తావా అని అడిగాడు. బాబు గాడి మొహంలోఎప్పుడూ లేని ఆనందం , ఎగిరిగంతేసి మరీ ఒప్పుకున్నాడు,ఆ కలెక్టరు చేయి పట్టుకొని నాకు టాటా చెబుతూ ముందుకి కదిలాడు.

ఆశ కంటే ఆశయం గొప్పది,స్వచ్ఛమైన మనసు ,బలమైన సంకల్పం ఉంటె ప్రపంచమంతా తోడ్పాటునిస్తుంది అని బాబు గాడు రుజువు చేసాడు

గెలిచి నిలిచిన కేశవ్

సమయం ఉదయం 11. 30

కేశవ్ . దాదాపు నాలుగేళ్ల క్రితం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా గొడవపడి మరీ వచ్చేసాడు సినిమా కోసం. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని కేశవ్ కోరిక,మళ్ళీ ఇన్నాళ్ళకి చూసాను,కానీ ఇలా చూస్తానని అసలనుకోలేదు .దూరంగా అయిదో నెంబర్ ప్లాట్ఫారం మీద , బక్కపలచని శరీరం,పీక్కుపోయిన కళ్ళు , చిరిగిపోయిన బట్టలు . ఎవరి దగ్గరినుండో డబ్బులు కాజేసి పరిగెడుతున్నాడు, కేశవ్ ని తరుముతూ ఓ నలుగురు పరిగెడుతున్నారు, పరిగెత్తేఓపిక లేక ఆగిపోయాడు, ఎదురు తిరిగే శక్తి లేక దెబ్బలు తింటున్నాడు . దెబ్బలకి తాళలేక అరుస్తూ ఏడుస్తూ అలాగే సొమ్మసిల్లి పడిపోయాడు , చలనం లేదు ఒంట్లో, ఏమైందో అని కంగారు పడుతుంటే దూరం నుంచి cut .... shot ok .......అంటూ అరిచాడు డైరెక్టరు . చుట్టూ అందరూ చప్పట్లతో అభినందించారు కేశవ్ ని . టక్కున లేచి మానిటర్ దగ్గరికి వెళ్లి షాట్ చూసుకొని తన కల నిజం కాబోతున్నందుకు, త్వరలోనే తన పేరు వెండితెరపైచూడబోతున్నందుకు ఆనందంతో ఉద్వేగంతో చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకుంటూ తరువాతి షాట్ కోసం సిద్ధం అయ్యాడు .

పట్టుదల , ఆత్మ స్థైర్యం , నమ్మకం ఉంటె ఎవరైనా ఎంత గొప్ప లక్ష్యాన్ని అయినా చేరుకోవొచ్చు అని కేశవ్ నిరూపించాడు

మాస్టారి సంపాదన

సమయం సాయంత్రం 6. 00

రామనారాయణ మాస్టారు .. నడి వయసు యువకుడిగా ఉన్నప్పుడు జరిగింది ఆయనతో నా పరిచయం , ఇప్పుడు ఆయనకి ఓ మనవరాలు కూడా ఉంది . ముప్పై ఏళ్లుగా రోజూ ఉదయం ఎక్సప్రెస్ రైలులో ఉద్యోగానికివెళ్లడం,సాయంత్రం ప్యాసింజర్ రైలుకి రావడం .నాకు ఆయనకీ ఎంతో అనుబందం ఉంది . ఎప్పుడు హుషారుగా నవ్వుతూ ఉండేవారు మాస్టారు. కానీ ఈ మధ్య ఆ చలాకీతనం లేదు. ఇవాళ ఎందుకో ఎన్నడూ లేనంత దిగాలుగాఉన్నారు,రోజాటికంటె ఒక అరగంట ముందే వచ్చి మొదటి ప్లాటుఫారం లో నా ఒడిలో కూర్చున్నారు.కళ్ళ నిండా నీళ్లు , ఎదో చెప్పాలని ఉన్నా చెప్పలేక భాదపడుతూ ఉండిపోయారు . కారణం ఏమిటో తెలీదు . రైలు వచ్చిందివెళ్ళిపోయారు. సాయంత్రం ప్యాసింజర్ ఎప్పుడు వొస్తుందా అని ఎదురుచూడసాగాను . సాయంత్రం రైలు వచ్చింది,మాస్టారు దిగి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు. చాలా దిగాలుగా ఉన్నారు . కళ్ల నిండా నీళ్లు,ఎదోపోగొట్టుకున్నాననే భాద మోహంలో తెలుస్తోంది,ఎందుకో తెలీని ఆందోళన , వణుకు ఆయన నడకలో తెలుస్తుంది. వేరే పెట్టె లోనుంచి కొంత మంది దిగారు,ఇంకో పెట్టె నుంచి ఇంకొంతమంది పిల్లలు పెద్దలూ కలుపుకొని దాదాపు 70,80మంది దిగి మాస్టారి దగ్గరికి కదిలారు. వాళ్ళని చూడగానే మాస్టారు ఎందుకో మరింత కంగారు పడ్డారు . వాళ్లంతా మాస్టారి దగ్గరికి వచ్చి ఆయన చుట్టూ చేరి మాస్టార్ని ఓదారుస్తున్నారు . వాళ్ళుకూడా ఒకింత ఉద్వేగానికిలోనవుతున్నారు . వాళ్లంతా రామనారాయణ మాస్టారి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు. ఈ రోజు మాస్టారి రిటైర్మెంట్ . ముప్పై ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మందికి పుస్తకంలోని పాఠాలు, జీవిత పాఠాలు చెప్పారు. మాస్టారుచదువు చెప్పిన మొదటి బ్యాచ్ విద్యార్థులు నుండి ఇప్పుడు చదువుతున్న పిల్లల వరకు అందరూ ఆయనకి ఘనంగా సన్మానం చేసి ఇంట్లో దిగబెట్టడానికి వచ్చారు. అందరూ ఎక్కడెక్కడి నుండో వచ్చారు మాస్టారు కోసం . ఆయనఇన్నేళ్ళలో సంపాదించుకుంది వీళ్లందరి ప్రేమ అభిమానాలే .

నిబద్దత , అంకిత భావం తో పని చేస్తే అమూల్యమైన ఎన్నో జ్ఞాపకాలను . ఎప్పటికి తరగని గౌరవం ప్రేమ,ఆప్యాయతలను పొందవచ్చు అని రామనారాయణ మాస్టారు రుజువు చేసారు

4.రాధామాధవీయం

సమయం సాయంత్రం 8. 15

మూడో నెంబర్ ప్లాట్ఫారం దగ్గర మాధవ్ కోసం ఎదురుచూస్తుంది రాధ . ఆరింటికల్లా మాధవ్ రావాలి కానీ ఇంకా రాలేదు,నిముషాలు యుగాల్లా గడుస్తున్నాయి తనకి,చీకటి పడుతుంది కంగారు పెరిగిపోతుంది.ఇప్పటికే రెండు గంటలుఆలస్యం అయింది . వచ్చిన ప్రతీ లోకల్ రైల్లో వెతుకుతుంది మాధవ్ ఎక్కడా లేడు .సమయం గడిచే కొద్దీ రాధ లో భయం పెరిగిపోతుంది . ఎనమిది గంటలైంది .ప్లాట్ఫారం దగ్గరే బెంచి మీద దిగాలుగా ఏడుస్తూ కూర్చుంది రాధ . వెనకనుంచి ఎవరో మెల్లిగా నడుస్తూ రాధ భుజం మీద చేయి వేశారు . ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది రాధ . చేతిలో ఉన్న తన హ్యాండ్బ్యాగ్ తో అతన్ని దబదబా నాలుగు దెబ్బలు వేసింది . అతను బిగ్గరగా నవ్వుతూ అడ్డుకోబోయాడు. రాధకోపంతో తన చేత్తో కొట్టేసింది . అతని కళ్ళజోడు పడిపోయింది,చేతిలో ఉన్న కర్ర దూరంగా పడింది ,అతను కూడా కింద పడబోతుంటే టక్కున పట్టుకుంది రాధ .. వచ్చింది మాధవ్ . ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత ఆలస్యంచేసినందుకు కోపం తో ఇదంతా చేసింది రాధ

ప్రేమంటే ఏమిటో నాకు రాధ మాధవ్ లని చూసే దాకా తెలీదు .ఇద్దరు మనుషులు ,మనస్తత్వాలు కలిస్తేనే ప్రేమ అనుకునే మనుషులున్న ఈ కాలంలో , ఒకరినొకరు గౌరవిస్తూ, ఒకరికొకరు తోడు నడుస్తూ . ప్రేమంటే శాశ్వతమైనబంధం . అనిర్వచనీయమైన ఆనందం అని తమ ప్రేమకథతో నాకు తెలిసేలా చేసారు . మాధవ్ కి కళ్ళు కనిపించవు. ఓ ప్రమాదం లో తన కంటి చూపు పోయింది. మాధవ్ అద్భుతమైన రచయిత . మాటల్తో మనసుని కదిలించేలాకరిగించేలా రాయగలడు . మాధవ్ కవితలంటే రాధకి పిచ్చి . ఆలా ఒకరికొకరు పరిచయం అయ్యారు . ఆ పరిచయం ప్రణయం ,పరిణయం దాకా వెళ్ళింది. రాధ ఓ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్. మాధవ్ ప్రస్తుతం ఓ సినిమాకి మాటలు ,పాటలు రాస్తున్నాడు,రోజూ రైల్లో సినిమా ఆఫీసుకి వెళ్లి వస్తుంటాడు.సాయంత్రం రాధ మాధవ్ లు కలిసి ఇంటికి వెళ్తుంటారు. ఆలస్యం అయ్యేసరికి భయం తో కంగారుతో మాధవ్ ని ఆలా కొట్టేసింది రాధ .

ఈ ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టిన మనుషులు . రాధకి మాధవే బలం బాధ్యత . మాధవ్ కి రాధే ధైర్యం .

మాధవ్ రాసే కవితలకు కలం తానైతే కాగితం రాధ . ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు . ఒకరులేకపోతే ఇంకొకరు లేరు . అందుకే వాళ్లిద్దరూ 1+1 = 1

పడిలేచిన కెరటం ఫర్జానా

సమయం రాత్రి 9. 00

ఫర్జానా .ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీద మరో అరగంటలో రావాల్సిన రైలు కోసం ఎదురుచూస్తుంది. ఇపుడు నేను చూస్తున్న ఫర్జానా ,మూడు నెలల క్రితం నేను చూసిన ఫర్జానా వేరు . అప్పుడు తనో చలాకి అల్లరి పిల్ల . తన తండ్రి కలనే తన లక్ష్యంగా మార్చుకుంది . ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ ఫర్జానాకి తన తండ్రి అంటే. డాక్టర్ గా తన తండ్రి ముందు నిల్చోవాలని తన పట్టాని తండ్రికి అందివ్వాలని ఎన్నో కలలు కంది .కానీ అనుకున్నవి అన్నీ జరిగితే అని జీవితంఅవ్వదు . సరిగ్గా ఫర్జానా డాక్టర్ పట్టా అందుకున్న రోజునే పూంచ్ సెక్టార్ దగ్గర జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ఫర్జానా తండ్రి మొహమ్మద్ నవాజుద్దీన్ వీర మరణం పొందాడు . నవాజ్ పార్థివదేహాన్ని తోటి సైనికులు జమ్మూ నుండితీసుకువచ్చారు . ఇదే మొదటి నెంబర్ ప్లాట్ఫారం మీదే గుండె పగిలేలా ఏడ్చిన ఫర్జానాని చూసి రాయినైన నాకే మనసు చెలించింది . ఏ తండ్రి కోరిక మీద డాక్టర్ అయ్యిందో ఆ తండ్రి నిర్జీవంగా పడి ఉండడం చూసి ఫర్జానా ప్రాణంతల్లడిల్లిపోయింది . తనకి ఇది ఎవరూ తీర్చలేని నష్టం.తను మళ్ళీ మాములు మనిషిగా మారడానికి చాలా సమయం పడుతుందనుకున్నా . కానీ మూడునెలలు కూడా గడవకముందే తనని చూసి ఆశ్చర్యపోవడం నా వంతైంది .ఇప్పుడు తను వెళ్తుంది జమ్మూ కి , అక్కడ ఆర్మీ హాస్పిటల్ లో డాక్టర్ గా తనకి ఉద్యోగం వచ్చింది . ప్రాణాలని లెక్కచేయక పోరాడే సైనికులకు వైద్యం చేయడానికి ఇప్పుడు తను బయల్దేరుతుంది . తండ్రి కోరిక మేరకు డాక్టర్ అయ్యింది. తండ్రి ఆశయం కోసం ఆర్మీ లో చేరింది . నవాజ్ ఎక్కడున్నా ఈరోజు ఫర్జానాని చూసి ఎంతో గర్వపడుతూ ఉంది ఉంటాడు .

తనిప్పుడు డాక్టర్ . ఫర్జానా ఫాతిమా D /o మేజర్. మహమ్మద్ నవాజుద్దీన్

ఇలాంటి మరికొందరి జీవితాలని మీకు పరిచయం చేయడానికి మళ్ళీ వస్తాను అప్పటివరకు సెలవు

– మీ రైల్వే స్టేషన్



Image may contain: outdoor and text



--((***))--

‘‘బాగున్నావా మిత్రమా’’ అడిగింది.ఒక్క గెంతు గెంతి నక్కకు దూరంగా జరిగింది జింక.

‘‘మిత్రమా! ఇదెక్కడి పిలుపు’’ అడిగింది.‘‘నువ్వెవరో నాకు తెలియదు. నా జోలికి రాకు’’ అంటూ పరుగెత్తబోయింది.‘

‘ఆగాగు’’ అంది నక్క.

ఆగింది జింక.‘

‘నా పేరు సుబుద్ధి. ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. ‘నా’ అన్నవారు నాకెవరూ లేరు. నక్కలన్నీ నన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాయో వెళ్ళిపోయాయి. దాంతో దిక్కులేని దాన్నయిపోయాను.’’ అన్నది నక్క. కన్నీళ్ళు పెట్టుకుంది.

‘అయ్యో పాపం’ అనిపించింది జింకకి.‘‘తోడు లేకుండా అడవిలో బతకడం ఎంత కష్టమో తెలిసొస్తూంది. చావలేక బతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో నా వాళ్ళను చూసినట్టనిపించి ఎక్కడ లేనిఆనందం కలిగింది. దేవుడిలా కనిపించావు.’’ అంది నక్క.

జింక పొంగిపోయింది.‘‘నీకే హానీ చెయ్యను. నన్ను నమ్ము. నా ఒంటరి తనాన్ని పోగొట్టు. దయచేసి నాతో జట్టు కట్టు. ఇద్దరం కబుర్లాడుకుంటూ కలిసి తిరుగుదాం’’ అంది నక్క.

దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడవి అంతా తిరిగి తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు.‘‘సరదాగా మా ఇంటికి రావచ్చుగా’’ అడిగింది జింక.

‘‘రమ్మంటే ఎందుకు రాను? పద’’ అంది నక్క. జింకతో పాటుగా ఇంటికి చేరింది. చెట్టుకొమ్మ మీద కూర్చుని జింకతో పాటుగా వస్తూన్న నక్కని చూసింది కాకి.‘‘ఎ..ఎయ్‌...ఎవరది’’ అరిచింది.‘‘నక్క మిత్రమా! సుబుద్ధి అని మంచి నక్కే! పాపం దిక్కూ మొక్కూ లేదంటేనూ, ఒంటరి దాన్నంటేనూ, జాలిపడి తీసుకొచ్చాను. మన స్నేహాన్ని కోరుకుంటోంది.’’ అంది జింక.

నక్కతో స్నేహమా? ఎక్కడయినా విన్నామా! అనుకుంది కాకి.‘‘కొత్తవాళ్ళను నమ్మకూడదు. నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ చూస్తూ నక్కతో స్నేహం ఏమిటి? దాని గుణగుణాలన్నీ అందరికీ తెలిసినవే కదా! జాగ్రత్త! పిల్లిని ఆదరించి ముసలి గద్ద ముగిసిపోయిందని కథ ఒకటి ఉందిలే! ఆ కథ గుర్తొస్తూంది’’ అంది కాకి.

‘‘ఆ కథేంటో చెప్పవూ’’ అడిగింది జింక.‘‘చెబుతాను, విను’’ అంటూ కథ చెప్పసాగింది కాకి.గుడ్డిగద్ద కథవెనకటికి గంగానదీ తీరాన ఓ జువ్విచెట్టు ఉండేది.

దాని తొర్రలో ఓ గుడ్డిగద్ద ఉండేది. దాని పేరు జరద్గవం. గద్ద గుడ్డిదే కాదు, ముసలిది కూడా. దాంతో అది ఎగరలేక, చెట్టుని అంటిపెట్టుకుని ఉండేది. చెట్టు మీది మిగిలిన పక్షులు దాని దుస్థితికి జాలిపడ్డాయి.

జాలిపడి, రోజూ సంపాదించుకుని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాకుండా, ఈ గుడ్డిగద్దకు కూడా కొంచెం పెట్టేవి. పెట్టి-‘‘తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని వదిలి వెళ్ళాల్సి వస్తూంది. చీకటి పడితేనే కాని, గూటికి చేరుకోలేం. నీకిదంతా తెలిసిందే! అయితే మేమంతా తిండి సంపాదించుకుని, గూటికి చేరే వరకూ పిల్లలకి నువ్వే దిక్కూ మొక్కూ కావాలి. నీకు కళ్ళు కనిపించవు.

నీ కాళ్ళు కదలవు. అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు. గట్టిగా ఉండు. మా పిల్లలకు కాపలాగా ఉండు.’’ అనేవి. అలాగేనంటూ గుడ్డిగద్ద కాపలా కాసేది.



Image may contain: 13 people


260260

3 comments








🌳రెండు కాంతుల మధ్య🌳

🍁నీడ🍁

చంద్ర:-అమ్మోయ్ ఆ గయ్యాళి వచ్చేసిందే

సూ:-ఎవర్రా అది

చంద్ర:-ఇంకెవరు పక్కింటి ఛాయమ్మ 
సూ:-ఆయ్ బాబోయ్ ఈ దొంగ మొహంది ఎందుకు వస్తోంది డబ్బులకా ఇంకేమయినానా
ఛాయ:-అయ్యో అయ్యో అక్కో అక్కా ఎంత ఘోరం జరిగిపోతుంటే అక్కడ ఎక్కడున్నావే అక్కో అక్క..
సూ:-ఛ నోరు ముయ్ ఏమిటా ఏడుపు నువ్వు పాచి మొహందానా
చంద్ర:-అదంతా దొంగ ఏడుపేలే ఆకళ్ళు చూడు ఎక్కడ తడిలేదాయే
అదికాదక్కా నే చెప్పేది వింటే నువ్వు కూడా ఏడుస్తావ్
సూ:-ఏం జరిగిందో చెప్పిచావ్వే ముందు
ఛాయ:-మరి చెప్పాక తిట్టమాకు
చంద్ర:-తిడితే మాత్రం నీకేమైనా సిగ్గా శరమా త్వరగా పోవే బాబూ
సూ:-అబ్బబ్బా ముందు చెప్పవే
ఛాయ:-మరే అక్కా బావ నీకోసవతిని తెస్తున్నాడంట తెలుసా నీకు
సూ:-ఏంటే ఏంకూశావే
ఛాయ:-అవునంటక్కా అందరూ ఇదే మాట అనుకొంటున్నా రు
చంద్ర:-ఇవన్నీ అబద్ధాలు చెబుతోంది నాన్న మార్కెట్ కి వెళ్ళాడు
పంక:-ఒదినా ఓ ఒదినా ఎక్కుడున్నావ్ ఒదినా ఓరి నామతి మండ ఇక్కడే వున్నావా సరలే
సూ:-దీంతోనే ఛస్తుంటే మళ్లీ మధ్యలో ఇదెందుకు వచ్చిందో
పంక:-ఇది ఇక్కడ వుందేమిటి ఒదినా
సూ:-ఆ దాని మొహం అదంతేలే
సూ:-ఆ రావే పంకజం ఏమిటే ఆ హడావిడి
పంక:-ఏంలేదొదినా ఇందాక అన్నయ్య మార్కెట్లో కనిపించిఈ పూల గంప నీకిమ్మని మా పాలేరుకి ఇచ్చాడు అదిద్దామని ఇదిగో నీగంప మిగతా పని చేసుకొని వస్తా అన్నారు
సూ:-అయ్యయ్యో అన్ని పూలు ఎందుకే
పంక:-నాకేంతెలుసొదినా
చంద్ర:-అమ్మా చూడు పూలు ఎంత బాగున్నాయో
ఛాయ:-అంతా అయిపోయిందక్కా ఈ పూలతో వచ్చే దానికి శోభనం జరిపించు వస్తానక్కా
సూ భ:-ఎక్కడికి పోయేది వచ్చిన పని అయిందా బాగా మండలేదుగా అందరూ వచ్చి భోజనం చేసివెళ్ళండి ఈ రోజు మాపెళ్ళిరోజ కదా అందుకు కాంతం ఇదిగో నీపట్టు చీర వడ్డాణం
సూ:-నా మతి మండ ఆరోజు ఈజేనా ఒసే ఛాయా పంకజం రండర్రా త్వరగా కాస్త అన్నీ చక్కపెట్టండే ఏమండీ మీరు కూడా స్నానం చేసి వస్తే వడ్డన మొదలు అవుతుంది మీరంతా త్వరితగతిన రండర్రా అలా నీరసంగా ఉంటే ఎలా సరే పిల్లలు వుంటా మరి...ఈ కాంతం అక్కని మర్చిపోకండిరా నాయనా..



ఏమిటాలోచిస్తున్నావు మిత్రమా’’ అడిగాడు.

‘‘ఏం లేదు మిత్రమా! నా పళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. నొప్పెడుతున్నాయి. మొత్తం వలంతా కొరకడం అంటే కష్టమనిపిస్తోంది. ముందు నిన్ను విడిపించనీ! తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం.’’ అన్నాడు హిరణ్యకుడు.

చిత్రగ్రీవుడుకి హిరణ్యకుడి మాటలు నచ్చినట్టు లేదు. అదోలా చూశాడతన్ని.‘‘మిగిలిన పావురాలను కూడా విడిపిస్తాను. అనుమానం లేదు. కాకపోతే చెప్పానుగా! పళ్ళు ఇబ్బంది పెడుతున్నాయని. నొప్పి అని. ముందు నిన్ను విడిపించనీ’’ అని చిత్రగ్రీవుడి దగ్గరి వల తాళ్ళను కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు.

చిత్రగ్రీవుడు అతనికి అందక వెనక్కి జరిగాడు. ఆశ్చర్యంగా చూశాడు హిరణ్యకుడు.‘‘నీకు నొప్పి కలగనంత వరకూ నన్ను తప్పించి ఎంత మందిని నువ్వు విడిపించగలిగితే అంత మందినీ ముందు విడిపించు. అందరూ విడుద లయిన తర్వాతే నా గురించి నువ్వు ఆలోచించు. అంతేకాని, నన్ను ముందు విడుదల చేసి, మిగిలిన పావురాల సంగతి తర్వాతంటే భావ్యం కాదు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.

నవ్వాడు హిరణ్యకుడు.‘‘నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా! తనకు మాలిన ధర్మం అంటారే అలా ఉంది నువ్వు మాట్లాడేది. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో! తర్వాత మిగిలిన వారి సంగతి ఆలోచించవచ్చు.

అలా కాదు, వారి సంగతే ముందు ఆలోచించాలి, తర్వాతే నా సంగతి అంటావా, అప్పుడు నీ అంతటి మూర్ఖుడు ఇంకొకడు లేడనుకుంటాను. రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా, ఇతరుల క్షేమాన్ని పట్టించుకునేది. నువ్వే క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరు? నువ్వెవరు?’’ ప్రశ్నించాడు హిరణ్యకుడు.

‘‘నిజమే! కాని, నా వాళ్ళంతా కష్టంలో ఉండడాన్ని నేను భరించలేను. సాటి వారు కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలి. అందుకు ప్రాణత్యాగం చేసినా తప్పు లేదు. నేనూ వాళ్ళూ ఒకటే! వాళ్ళు లేకుండా నేను లేను. నేను లేకుండా వాళ్ళు లేరు.

ఆపదలో ఉన్న నా వాళ్ళను నేను రక్షించుకోలేనప్పుడు నాకీ రాచరికం ఎందుకు? ఎవర్ని ఉద్ధరించడానికి?’’ అన్నాడు చిత్రగ్రీవుడు. పావురాలన్నీ గొప్పగా చూశాయి, తమ రాజుని. రాజంటే చిత్రగ్రీవుడనుకున్నాయి.‘‘ఏదో రోజు అందరం పోయే వాళ్ళమే! ఈ శరీరం అశాశ్వితం. అది తెలుసుకోవాలి ముందు. తెలుసుకునిఉన్న నాలుగు రోజులూ నాలుగు కాలాల పాటు నిలిచే పనులు చెయ్యాలి. తోటివారికి సాయం చెయ్యాలి. అందుకని చెబుతున్నాను. మరోలా అనుకోకు. ముందు నా వాళ్ళను కాపాడు. తర్వాత నీకు వీలయితేనే నన్ను కాపాడు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.అతని మంచితనానికి ముచ్చటపడ్డాడు హిరణ్యకుడు. మనసులో జేజేలర్పించాడు.



No photo description available.



56












ఒక రోజు ఆ చెట్టు కిందికి పిల్లి ఒకటి వచ్చింది. చెట్టు మీది గూళ్ళలో పక్షి పిల్లల గోల వినవస్తే, నోరూరుతూంటే, నాలికను పెదాలకు రాసుకుని, ‘లేలేత మాంసం దొరికింది’ అనుకుంటూ చెట్టెక్కింది.

మెల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతోన్న పిల్లిని చూసి పక్షి పిల్లలు ‘అమ్మో! అయ్యో’ అంటూ గోలగోల చేశాయి. ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద ‘‘ఎవరదీ’’ అంటూ గట్టిగా అరిచింది.

ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది. వణికిపోయింది. శరీరం వణకడంతో కాలు జారి కింద పడాల్సిందే! కాని నిలదొక్కుకుంది. చెట్టెక్కినప్పుడు పక్షిపిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్దను గమనించలేదు పిల్లి. ఇప్పుడు గమనించింది. దగ్గరగానే ఉంది గద్ద.

తప్పించుకునే అవకాశం లేదు. ఏం చెయ్యను, ఏం చెయ్యననుకుంటూ పరిపరి విధాల ఆలోచించింది పిల్లి. ఏ ఆలోచనా రూపు కట్టలేదు దానికి. ఆఖరికి ఇలా అనుకుంది.

పొరపాటు చేశాను. పక్షిపిల్లలకు ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి. అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించాను. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే! కాని, తప్పించుకోవాలి. ఎలా? ఎలా అంటే...ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి. దీన్ని నమ్మించాలి. నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి. లేదంటే చావు తప్పదు.గజగజా వణుకుతూనే గద్ద దగ్గరకు చేరింది పిల్లి.





విశ్వ



రూపుని కథ

ధర్మనందనుడు శల్యునుద్దేశించి, ‘‘మహాత్మా! మీరు తీసుకున్న నిర్ణయం ఎంతో సముచితమైంది. చేసిన మంచిపనిని అభినందించి, వారి కోరిక నెరవేర్చడం మహనీయుల సహజ లక్షణం. మీ వాగ్దానానికి భంగం రాకుండా నేను ఒక కోరిక కోరుకుంటాను. తమరు అనుగ్రహించాలి’’ అన్నాడు వినయంగా.

‘‘దానికేమి భాగ్యం నువ్వు అడుగనూ వచ్చు. నాచేతిలో ఉన్నది నేను చెయ్యనూ వచ్చు’’ అన్నాడు శల్యుడు మందహాసంతో.

‘‘శల్యధరణీ నాథా! మా అన్నదమ్ముల మధ్య యుద్ధం అనివార్యమైతే, మాశ్రేయోభిలాషి శ్రీకృష్ణుడు, అర్జునుని రథసారథిగా వ్యవహరిస్తానని మాట యిచ్చాడు. కర్ణుడు సదా కిరీటి పట్ల బద్ధవైరంతో రగులుతూ వుంటాడు. కదనరంగంలో వాసుదేవునికెదురొడ్డి, పగ్గాలు ఝళిపించగల దక్షులు మీరొక్కరే. కనుక మీకు సారథి పదవి రాకమానదు. ఆ సమయంలో మీరు చేయగల సాయం వొకటుంది. కర్ణునికి సార థ్యం వహిస్తూనే శాత్రవుని కీర్తించడం, కర్ణుని ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడం ద్వారా నిరుత్సాహ వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఇది అనుచితమని భావించక, మా కోరిక తీర్చాలని కోరుకుంటున్నాము’’ అన్నాడు ధర్మజుడు.

శల్యుడు వెంటనే, ‘‘ధర్మజా! మీరూహించినట్టు నేను కర్ణుని రథసారథినైతే తప్పక నీ కోరిక తీరుస్తాను. యథాశక్తిగా సవ్యసాచికి సాయపడతాను. కర్ణుని గురి నిలువకుండా మాటలతో అస్తవ్యస్తం చేస్తాను’’ అని మాట యిచ్చాడు.

ధర్మజుడు నమస్కరించి కృతజ్ఞతలు తెల్పాడు. ఒక పెద్ద గండం గట్టెక్కినట్టు హాయిగా నిట్టూర్చాడు.మద్రేశ్వరుడు మరల అందుకుని, ఇదేకాదు మీరు ఏది కోరినా నేను చేస్తాను. నాడు నిండుసభలో ఆ సూత పుత్రుడు ద్రౌపదీ సాధ్విని అవమానపరిచినపడు నేను ఎంతగానో నొచ్చుకున్నాను. అదీగాక, మీరు పడ్డ పాటులెవ్వరి మనసులనైనా నొప్పించక మానవు. మీపట్ల నాకు చెప్పలేని ప్రేమాభిమానాలున్నాయి. ధర్మరాజా, ఇక్కట్లు పడ్డామని బాధపడకు. త్వరలోనే మబ్బులు వీడి, మనోరథాలు ఫలిస్తాయి. అమరేశ్వరుడంత వారికే ఘోరదుర్దశ ఒక్కొక్కపడు తప్పదు. దేవేంద్రుడు శచీదేవితో బాటు అష్టకష్టాలనుభవించలేదా. అమరాధిపతితో పోల్చుకున్నపడు మీ శక్తిసంపన్నతలు ఏపాటి? సాక్షాత్తూ ఆ పరమేశ్వరునికైనా కర్మఫలితం అనుభవించక తప్పదు కదా’’ అన్నాడు గంభీరంగా.

ధర్మపుత్రుడది విని ‘‘శల్యరాజా! ఇంద్రదేవుడు సతీసహితంగా అటువంటి క్లేశాలు అనుభవించడానికి కారణమేమిటి? మీ ముఖతా వినాలని ఉంది’’ అన్నాడు. మద్రపతి స్థిమితంగా కూర్చుని, ‘‘తప్పక చెబుతాను.ఆ పురాతన గాథను మీరు తెలుసుకోవడం చాలా అవసరం’’ అంటూ ఆ వృత్తాంతాన్ని సాకల్యంగా వివరించాడు.

అమరులందరిలోనూ అగ్రగణ్యుడు, పూజనీయుడు అయిన త్వష్ట, ఒకానొకపడు దేవేంద్రునికి అపకారం తలపెట్టాడు. అందుకోసం మూడు శిరస్సులు గల భీకరమూర్తినొకనిని సృష్టించి, వానికి విశ్వరూపుడని పేరు పెట్టాడు. విశ్వరూపుడు ఇంద్రపదవి కోసం, అహోరాత్రులు తీవ్రనిష్ఠతో తపస్సు ప్రారంభించాడు. ఇంద్రునికా సంగతి తెలిసి, తపోభంగానికి ప్రయత్నాలు సాగించాడు. అప్సరసలు అరణ్యానికి దిగి వచ్చారు. విశ్వరూపుడు తపస్సాచరించే పరిసరాలలో వారు వయ్యారాలు వొలకబోస్తూ సంచరించారు. నూపురాల ఘలంఘలలు, మధురగీతికలు, మనోహర నృత్యాలు అడవికాచిన వెన్నెలలైనాయి. పయ్యెదల పలకరింపులు, అచ్చరల క్రీగంటిచూపులు బూడిదలో పోసిన పన్నీరైన వి. దేవేంద్రుడది గమనించి విశ్వరూపుడు తన పదవిని ఆక్రమించగలడని భయపడ్డాడు. భయంతో విచక్షణాజ్ఞానం నశించింది. ఇంద్రుడు తన చేతనున్న వజ్రాయుధాన్ని తపోదీక్షలో వున్న విశ్వరూపునిపై ప్రయోగించాడు. ఆ దెబ్బకు తపస్విశిరస్సులు మూడు తుత్తునియాలైనాయి. తను చేసిన ఘోరహత్య లోకానికి తెలియనీయక, ఇంద్రుడు ఒక రహస్య ప్రదేశంలో మారువేషంలో దాక్కొన్నాడు. అయినా, ఇంద్రుని ఘాతుక కృత్యాన్ని లోకం కోడై కూసింది. ప్రపంచంలోని సమస్త ప్రాణికోటి పలువిధాల దూషించింది. ఇంద్రుడు తన దుశ్చర్యలోకానికి తెలిసిపోయినందుకు విచారించాడు. నింద బాపుకోడానికి దుష్కర వ్రతమొకటి సంకల్పించి, ఆచరించాడు. తనకు చుట్టుకున్న భీకరబ్రహ్మ హత్యాపాతకాన్ని యీ సృష్టిలో గల వృక్షజాతికి, సాగరాలకు, భూమికి, మహిళలకు విభజించి పంచి తను విముక్తుడైనాడు. తిరిగి ఇంద్రుడు మునుపటి వలెనే మచ్చలేని మహానాయకునిగా వెలిగిపోతున్నాడు. దిక్పాలకులు, మునీశ్వరులు ఎప్పటిలాగే ఇంద్రుని పట్ల భయభక్తులతో మెలగసాగారు. త్వష్టకు తన కుమారుడైన విశ్వరూపుని దారుణహత్య గురించి తెలిసింది.



Image may contain: 1 person






☘ *మంచి కధ* ☘

తప్పక చదవండి

👌 *నిజమైన గుర్తింపు సాధనం*👌



👉ఒక రాజసభకు ఒక అపరిచితుడు ఉద్యోగం అడగటానికి వచ్చాడు. “నీ విశేషం ఏంటి?” అని అడిగితే, “మనిషి అయినా, జంతువైనా నేను ముఖం చూసి వారి గురించి చెప్పగలుగుతాను.” అని చెప్పాడు.



రాజు అతడిని తన అశ్వశాలకు అధిపతిని చేశాడు.



👉కొన్ని రోజుల తర్వాత రాజు అతడిని తనకు అన్నిటికంటే ప్రియమైన, ఖరీదైన గుర్రాన్ని చూపించి, అడిగాడు.

అప్పుడు అతను, “ఇది జాతిగుఱ్ఱం కాదు.” అని అన్నాడు.

రాజు చాలా ఆశ్చర్యపోయాడు.



👉అడవి నుంచి గుర్రపువాడిని పిలిపించి అడిగితే అతడు - “గుర్రం జాతిదే కానీ ఇది పుట్టంగానే దాని తల్లి చనిపోయింది.

దీనిని ఆవు పాలు పోసి పెంచామ”ని చెప్పాడు.



👉రాజు తన ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ సంగతి ఎట్లా తెలుసు?” అని అడిగాడు. అప్పుడు అతడు- “ఇది గడ్డి తినేటప్పుడు ఆవులాగా తలకాయ కిందకని తింటుంది. జాతి గుర్రం అయ్యుంటే దాణా నోట్లోకి తీసుకుని తలెత్తి తినేది.” అని చెప్పాడు.



👉రాజుకు అతడి కౌశలం చూసి చాలా సంతోషం వేసింది.

అతడికి బోలెడు ధాన్యం, నెయ్యి, కోడ్లు, కోడిగుడ్లు, ఉదారంగా పంపించాడు.

అతడిని రాణి భవంతికి ఉద్యోగిగా పెట్టాడు.



👉కొన్ని రోజుల తర్వాత అతడు రాణీ గురించి అడిగాడు... అప్పుడు ఉద్యోగి చెప్పాడు- “ఆమె తీరుతెన్నులు, వ్యవహారం రాణి లాగానే ఉన్నాయి. కానీ ఆమె పుట్టుకతో రాణి కాదు.” అని..

రాజు కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టయింది. అతడు తన అత్తగారిని పిలిచి విషయం చెప్పాడు.

అప్పుడు అత్తగారు అన్నది- “నిజం ఏంటంటే మీ నాన్నగారు మా వారిని మా అమ్మాయి పుట్టినప్పుడే సంబంధం అడిగాడు. కానీ మా కూతురు పుట్టిన ఆరు నెలలకే చనిపోయింది. అప్పుడు మేము రాచసంబంధం కోసం ఒక వేరే పిల్లను తెచ్చి కూతురుగా పెంచుకున్నాము.



👉రాజు మళ్లీ తన ఉద్యోగిని అడిగాడు, “నీకు ఎట్లా తెలిసింది?” అని. అతను చెప్పాడు- “రాణి నౌకర్లతో వ్యవహరించే విధానం చాలా సౌమ్యంగా ఉంది.

ఒక రాణి స్తాయి  వ్యక్తి ఇతరులతో వ్యవహరించే పద్ధతి ఒకటి ఉంటుంది. అది రాణిగారిలో ఎక్కడా లేదు....



👉రాజు మరొకసారి ఇతడి దృష్టిలోని నైపుణ్యానికి సంతోషపడి చాలా గొర్రెలు, మేకలు కానుకగా ఇచ్చి తన దర్బారులో నియమించుకున్నాడు



👉కొంతకాలం గడిచాక రాజు ఆ ఉద్యోగిని పిలిచి తన గురించి అడిగాడు.

ఉద్యోగి, “నా ప్రాణాలకు అభయం ఇస్తే చెప్తాను.” అని అన్నాడు.

రాజు మాట ఇచ్చాడు. అతడు, “మీరు రాజూ కాదు, రాజు కొడుకూ కాదు. మీ వ్యవహారం రాజు లాగా లేదు.” అని అన్నాడు.

రాజుకు చాలా కోపం వచ్చింది.

కానీ అభయం ఇచ్చేశాడు కదా. అందువల్ల నేరుగా తన తల్లిని పిలిచాడు.

తల్లి అన్నది- “ఇది నిజమే నాయనా. నువ్వు ఒక రైతు కొడుకువు.

మాకు పిల్లలు లేనందువల్ల నిన్ను దత్తత తీసుకుని పెంచుకున్నాము.” అని.



👉రాజా ఉద్యోగిని పిలిచి, “నీకు ఈ విషయం ఎట్లా తెలుసు?” అని అడిగాడు.



👉అప్పుడు ఉద్యోగి- “రాజు ఎవరికైనా కానుకలు ఇస్తే వజ్రాలు, ముత్యాలు, నగలు, నట్రా ఇస్తారు. కానీ మీరు గొర్రెలు, మేకలు, తిని తాగే వస్తువులు కానుకిస్తున్నారు.

ఈ పద్ధతి రాజులది కాదు, రైతువారిదే అవుతుంది.” అన్నాడు...



☘మనిషి దగ్గర ఎంత ధనము, సంపదలు, సుఖము, సమృద్ధి, వైభవం, శక్తీ ఉన్నా ఇదంతా బయటికి కనిపించడానికే!



🌺 *మనిషి నిజమైన గుర్తింపు సాధనం అతడి వ్యవహారమే.*🌺



నక్కజిత్తులు

‘ఎవరది’ అంటూ గట్టిగా అరిచిన గద్ద దగ్గరకు గజాగజా వణుకుతూ చేరింది పిల్లి. ఎవరో వచ్చి తన ఎదురుగా నిలుచున్నారని గ్రహించింది గద్ద.‘‘ఎవరు నువ్వు’’ అడిగింది.

‘‘అయ్యా నా పేరు దీర్ఘకర్ణం. పిల్లిని’’‘‘పిల్లివా? నీకిక్కడేం పని? వెళ్ళిక్కణ్ణుంచి. లేదంటే చంపేస్తాను’’ బెదిరించింది గద్ద.

నేరకపోయి చెట్టెక్కేను. దీనిపాలబడ్డాననుకుంటూ ఇలా అంది పిల్లి.‘‘నాకిక్కడ చాలా పని ఉంది. పని మీదే వచ్చానిక్కడికి. మీరు వెళ్ళిపొమ్మంటున్నారు. వె ళ్ళకపోతేచంపుతానంటున్నారు. ఎలా ఇప్పుడు’’ అంది పిల్లి.

‘‘పనేంటసలు? ఎవరితో పని’’ అడిగింది గద్ద.‘‘మీతోనే పని’’‘‘నాతో నీకేం పని’’‘‘అయ్యా! నేను అన్ని పిల్లుల్లా కాదు. సాధుజంతువుని. శాఖాహారిని. మాంసం తినడం ఎప్పుడో మానేశాను. పుణ్యం కోసం రోజూ అదిగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను. బ్రహ్మచారిని. చాంద్రాయణ వ్రతంలో ఉన్నాను.’

’‘‘ఉంటే’’ అడిగింది గద్ద.‘‘ఇంకేం లేదు. మీరు పెద్దలని, మంచివారని, నీతిశాస్త్రాన్ని పుక్కిటపట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను. అప్పట్నుంచీ మిమ్మల్ని కలవాలని, కలిసి మీతో మాట్లాడాలని నాదో చిన్న కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చాను.’’ అంది పిల్లి.

తనని పిల్లి గౌరవించడం, తనని కలిసేందుకు రావడం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి.‘‘మీలాంటి పెద్దలతో మాట్లాడితే నాలుగు మంచి ముక్కలు చెవిన పడతాయి. నీతులూ, ధర్మాలూ తెలుసుకోవచ్చని ఆశగా వచ్చాను. వచ్చినందుకు బాగానే ఉంది.

చంపుతానంటున్నారు.’’ బాధగా అంది పిల్లి.‘‘బాధపడకు! అసలు సంగతి ఏమిటంటే...ఈ చెట్టు మీద అనేక పక్షిగూళ్ళు ఉన్నాయి. ఆ గూళ్ళలో పిల్లలు ఉన్నాయి. పక్షిపిల్లలంటే పిల్లులకి ఇష్టం కదా! అందుకు వచ్చావేమోనని అనుమానించాను.’’‘

‘రామ రామ! ఎంతమాట ఎంతమాట! పిల్లిగా పుట్టడమే మహాపాపం అనుకుంటుంటే అందులో మళ్ళీ అన్నెం పున్నెం ఎరుగని పక్షి పిల్లల్ని తినటం ఒకటా!! ఛఛ! ‘అహింస పరమో ధర్మః’ అన్నారు. అంటే జీవహింస చేయకపోవడమే అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం. జీవహింస చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట! భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను, పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షి పిల్లల్ని తింటానా? అది ఊహించడానికే అసహ్యంగా లేదూ’’ అంది పిల్లి.

‘‘అది కాదు దీర్ఘకర్ణా’’ అని గద్ద ఏదో నచ్చజెప్పబోయేంతలో గద్ద మాటను పట్టించుకోకుండా మళ్ళీ ఇలా అంది పిల్లి.‘‘ఈ పాడుపొట్టను నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒకటి దొరక్కుండా పోదు. ఆఖరికి నాలుగాకులు తిన్నాకడుపు నిండిపోతుంది. అంతేగాని, చెట్టు మీది పిల్లలను చంపి తింటానా? చేజేతులా నరకాన్ని కోరుకుంటానా? ఎంతమాట ఎంతమాట’’పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది గద్ద. ‘అయ్యయ్యో, పొరబడ్డానే’ అనుకుంది. పిల్లిని ఇలా ఓదార్చింది.



--((***)))--



నేనో రైల్వే స్టేషన్ని . ఇదేంటి ఓ రైల్వే స్టేషన్ మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? నాకు జీవం లేకపోయినా ఎన్నో జీవితాలని దగ్గరి నుండి చూసిన అనుభవం ఉంది. నాకు ప్రాణం లేకపోయినా ఓ మనసుంది ఆ మనసుని కదిలించే మనుషులూ ఉన్నారు . ఆ మనుషుల కథలు చెప్పడానికే ఈ రోజు మీ ముందుకి వచ్చాను. రోజూ కొన్ని వేలమంది మనుషులని చూస్తుంటాను నేను,ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళు ఎక్కడినుండో వచ్చేవాళ్ళు. కలిసిపోయే మనుషులు విడిపోయే మనసులు. ఇలా ఎన్నో భావోద్యేగాలకి నేను సజీవ సాక్షిని . ఎన్నో కథలు రోజూ నా ఎదురుగా జరుగుతుంటాయి . కానీ ఒకే రోజు నా మనసుకి ఆనందం,భాద,హాయి, సంతోషం ,దుఃఖం ఇలా ఎన్నో రకాల భావాలు కలిగించిన ఐదుగురి జీవితాలను,వాళ్ళ కథలను మీకు చెప్పాలని ఈరోజు ఇలా వచ్చాను .

1.గూటికి చేరిన పక్షి

సమయం ఉదయం 9. 30

నాలుగేళ్ల వయసులో అమాయకంగా అయోమయంగా ఆకలితో అటు ఇటు తిరుగుతూ నా ఒడిలో వచ్చి చేరాడు , రెండు శరీరాలు కలిస్తే పుట్టాడు , ఇద్దరు మనుషులు విడిపోతే వాడు వీధినపడ్డాడు . అందరిలా చదువుకోవాలని వాడికోరిక కానీ వాడి రాత మరోలా ఉంది . కడుపు నింపుకోడానికి రోజంతా మొదటి ప్లాటుఫారంలో కాఫీ టీ లు అమ్ముతుండేవాడు ,రాత్రి చివరి ప్లాటుఫారంలో పడుకునేవాడు, ఐదేళ్లుగా వాడు నా దగ్గరే ఉంటున్నాడు . చదువంటే పిచ్చివాడికి,బాబుగాడికి ఒకటే కోరిక,వాడిలా ఎవరూ లేని పిల్లలకి చదువు చెప్పించాలని ,వాళ్లందరికీ తోడుగా ఉండాలని . ఆరోజు కూడా ఎప్పటిలానే కాఫీ టీ అమ్ముతూ తిరుగుతున్నాడు.ఎవరో ఒకాయన సుమారు 45ఏళ్ల వయసు, బాబుగాడి కోసం వెతుకుతున్నాడు. నిన్న రాత్రి చివరి రైలు కి దిగాడు అతను , ప్లాటుఫారంలో బాబు గాడ్ని వాడి పక్కన ఉన్న పాత పుస్తకాలని చూస్తూ నిలబడ్డాడు చాలాసేపు , తరువాత వెళ్ళిపోయాడు కాసేపటికి, మళ్ళి ఇప్పుడు బాబుకోసం వచ్చాడు. దూరంగా రైలు పెట్టె పక్కన నిల్చున్న బాబుగాడు కనిపించాడు ఆయనకి. ఆయన నిన్నే ఈ ఊరికొచ్చిన కొత్త కలెక్టరు గారంట . వీధిబాలలందరిని హాస్టల్ లో చేర్చి చదువు చెప్పించడం తన మొదటి పనిగాపెట్టుకున్నారట. బాబు గాడి దగ్గరికెళ్లి ఎం బాబు నీకు చదువంటే ఇష్టమా??? బాగా చదూకుంటావా?? నేను చదివిస్తా మరి,నాతో వస్తావా నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు అక్కడ. వస్తావా అని అడిగాడు. బాబు గాడి మొహంలోఎప్పుడూ లేని ఆనందం , ఎగిరిగంతేసి మరీ ఒప్పుకున్నాడు,ఆ కలెక్టరు చేయి పట్టుకొని నాకు టాటా చెబుతూ ముందుకి కదిలాడు.

ఆశ కంటే ఆశయం గొప్పది,స్వచ్ఛమైన మనసు ,బలమైన సంకల్పం ఉంటె ప్రపంచమంతా తోడ్పాటునిస్తుంది అని బాబు గాడు రుజువు చేసాడు

గెలిచి నిలిచిన కేశవ్

సమయం ఉదయం 11. 30

కేశవ్ . దాదాపు నాలుగేళ్ల క్రితం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా గొడవపడి మరీ వచ్చేసాడు సినిమా కోసం. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని కేశవ్ కోరిక,మళ్ళీ ఇన్నాళ్ళకి చూసాను,కానీ ఇలా చూస్తానని అసలనుకోలేదు .దూరంగా అయిదో నెంబర్ ప్లాట్ఫారం మీద , బక్కపలచని శరీరం,పీక్కుపోయిన కళ్ళు , చిరిగిపోయిన బట్టలు . ఎవరి దగ్గరినుండో డబ్బులు కాజేసి పరిగెడుతున్నాడు, కేశవ్ ని తరుముతూ ఓ నలుగురు పరిగెడుతున్నారు, పరిగెత్తేఓపిక లేక ఆగిపోయాడు, ఎదురు తిరిగే శక్తి లేక దెబ్బలు తింటున్నాడు . దెబ్బలకి తాళలేక అరుస్తూ ఏడుస్తూ అలాగే సొమ్మసిల్లి పడిపోయాడు , చలనం లేదు ఒంట్లో, ఏమైందో అని కంగారు పడుతుంటే దూరం నుంచి cut .... shot ok .......అంటూ అరిచాడు డైరెక్టరు . చుట్టూ అందరూ చప్పట్లతో అభినందించారు కేశవ్ ని . టక్కున లేచి మానిటర్ దగ్గరికి వెళ్లి షాట్ చూసుకొని తన కల నిజం కాబోతున్నందుకు, త్వరలోనే తన పేరు వెండితెరపైచూడబోతున్నందుకు ఆనందంతో ఉద్వేగంతో చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకుంటూ తరువాతి షాట్ కోసం సిద్ధం అయ్యాడు .

పట్టుదల , ఆత్మ స్థైర్యం , నమ్మకం ఉంటె ఎవరైనా ఎంత గొప్ప లక్ష్యాన్ని అయినా చేరుకోవొచ్చు అని కేశవ్ నిరూపించాడు

మాస్టారి సంపాదన

సమయం సాయంత్రం 6. 00

రామనారాయణ మాస్టారు .. నడి వయసు యువకుడిగా ఉన్నప్పుడు జరిగింది ఆయనతో నా పరిచయం , ఇప్పుడు ఆయనకి ఓ మనవరాలు కూడా ఉంది . ముప్పై ఏళ్లుగా రోజూ ఉదయం ఎక్సప్రెస్ రైలులో ఉద్యోగానికివెళ్లడం,సాయంత్రం ప్యాసింజర్ రైలుకి రావడం .నాకు ఆయనకీ ఎంతో అనుబందం ఉంది . ఎప్పుడు హుషారుగా నవ్వుతూ ఉండేవారు మాస్టారు. కానీ ఈ మధ్య ఆ చలాకీతనం లేదు. ఇవాళ ఎందుకో ఎన్నడూ లేనంత దిగాలుగాఉన్నారు,రోజాటికంటె ఒక అరగంట ముందే వచ్చి మొదటి ప్లాటుఫారం లో నా ఒడిలో కూర్చున్నారు.కళ్ళ నిండా నీళ్లు , ఎదో చెప్పాలని ఉన్నా చెప్పలేక భాదపడుతూ ఉండిపోయారు . కారణం ఏమిటో తెలీదు . రైలు వచ్చిందివెళ్ళిపోయారు. సాయంత్రం ప్యాసింజర్ ఎప్పుడు వొస్తుందా అని ఎదురుచూడసాగాను . సాయంత్రం రైలు వచ్చింది,మాస్టారు దిగి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు. చాలా దిగాలుగా ఉన్నారు . కళ్ల నిండా నీళ్లు,ఎదోపోగొట్టుకున్నాననే భాద మోహంలో తెలుస్తోంది,ఎందుకో తెలీని ఆందోళన , వణుకు ఆయన నడకలో తెలుస్తుంది. వేరే పెట్టె లోనుంచి కొంత మంది దిగారు,ఇంకో పెట్టె నుంచి ఇంకొంతమంది పిల్లలు పెద్దలూ కలుపుకొని దాదాపు 70,80మంది దిగి మాస్టారి దగ్గరికి కదిలారు. వాళ్ళని చూడగానే మాస్టారు ఎందుకో మరింత కంగారు పడ్డారు . వాళ్లంతా మాస్టారి దగ్గరికి వచ్చి ఆయన చుట్టూ చేరి మాస్టార్ని ఓదారుస్తున్నారు . వాళ్ళుకూడా ఒకింత ఉద్వేగానికిలోనవుతున్నారు . వాళ్లంతా రామనారాయణ మాస్టారి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు. ఈ రోజు మాస్టారి రిటైర్మెంట్ . ముప్పై ఏళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మందికి పుస్తకంలోని పాఠాలు, జీవిత పాఠాలు చెప్పారు. మాస్టారుచదువు చెప్పిన మొదటి బ్యాచ్ విద్యార్థులు నుండి ఇప్పుడు చదువుతున్న పిల్లల వరకు అందరూ ఆయనకి ఘనంగా సన్మానం చేసి ఇంట్లో దిగబెట్టడానికి వచ్చారు. అందరూ ఎక్కడెక్కడి నుండో వచ్చారు మాస్టారు కోసం . ఆయనఇన్నేళ్ళలో సంపాదించుకుంది వీళ్లందరి ప్రేమ అభిమానాలే .

నిబద్దత , అంకిత భావం తో పని చేస్తే అమూల్యమైన ఎన్నో జ్ఞాపకాలను . ఎప్పటికి తరగని గౌరవం ప్రేమ,ఆప్యాయతలను పొందవచ్చు అని రామనారాయణ మాస్టారు రుజువు చేసారు

4.రాధామాధవీయం

సమయం సాయంత్రం 8. 15

మూడో నెంబర్ ప్లాట్ఫారం దగ్గర మాధవ్ కోసం ఎదురుచూస్తుంది రాధ . ఆరింటికల్లా మాధవ్ రావాలి కానీ ఇంకా రాలేదు,నిముషాలు యుగాల్లా గడుస్తున్నాయి తనకి,చీకటి పడుతుంది కంగారు పెరిగిపోతుంది.ఇప్పటికే రెండు గంటలుఆలస్యం అయింది . వచ్చిన ప్రతీ లోకల్ రైల్లో వెతుకుతుంది మాధవ్ ఎక్కడా లేడు .సమయం గడిచే కొద్దీ రాధ లో భయం పెరిగిపోతుంది . ఎనమిది గంటలైంది .ప్లాట్ఫారం దగ్గరే బెంచి మీద దిగాలుగా ఏడుస్తూ కూర్చుంది రాధ . వెనకనుంచి ఎవరో మెల్లిగా నడుస్తూ రాధ భుజం మీద చేయి వేశారు . ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది రాధ . చేతిలో ఉన్న తన హ్యాండ్బ్యాగ్ తో అతన్ని దబదబా నాలుగు దెబ్బలు వేసింది . అతను బిగ్గరగా నవ్వుతూ అడ్డుకోబోయాడు. రాధకోపంతో తన చేత్తో కొట్టేసింది . అతని కళ్ళజోడు పడిపోయింది,చేతిలో ఉన్న కర్ర దూరంగా పడింది ,అతను కూడా కింద పడబోతుంటే టక్కున పట్టుకుంది రాధ .. వచ్చింది మాధవ్ . ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత ఆలస్యంచేసినందుకు కోపం తో ఇదంతా చేసింది రాధ

ప్రేమంటే ఏమిటో నాకు రాధ మాధవ్ లని చూసే దాకా తెలీదు .ఇద్దరు మనుషులు ,మనస్తత్వాలు కలిస్తేనే ప్రేమ అనుకునే మనుషులున్న ఈ కాలంలో , ఒకరినొకరు గౌరవిస్తూ, ఒకరికొకరు తోడు నడుస్తూ . ప్రేమంటే శాశ్వతమైనబంధం . అనిర్వచనీయమైన ఆనందం అని తమ ప్రేమకథతో నాకు తెలిసేలా చేసారు . మాధవ్ కి కళ్ళు కనిపించవు. ఓ ప్రమాదం లో తన కంటి చూపు పోయింది. మాధవ్ అద్భుతమైన రచయిత . మాటల్తో మనసుని కదిలించేలాకరిగించేలా రాయగలడు . మాధవ్ కవితలంటే రాధకి పిచ్చి . ఆలా ఒకరికొకరు పరిచయం అయ్యారు . ఆ పరిచయం ప్రణయం ,పరిణయం దాకా వెళ్ళింది. రాధ ఓ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్. మాధవ్ ప్రస్తుతం ఓ సినిమాకి మాటలు ,పాటలు రాస్తున్నాడు,రోజూ రైల్లో సినిమా ఆఫీసుకి వెళ్లి వస్తుంటాడు.సాయంత్రం రాధ మాధవ్ లు కలిసి ఇంటికి వెళ్తుంటారు. ఆలస్యం అయ్యేసరికి భయం తో కంగారుతో మాధవ్ ని ఆలా కొట్టేసింది రాధ .

ఈ ఇద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టిన మనుషులు . రాధకి మాధవే బలం బాధ్యత . మాధవ్ కి రాధే ధైర్యం .

మాధవ్ రాసే కవితలకు కలం తానైతే కాగితం రాధ . ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు . ఒకరులేకపోతే ఇంకొకరు లేరు . అందుకే వాళ్లిద్దరూ 1+1 = 1

పడిలేచిన కెరటం ఫర్జానా

సమయం రాత్రి 9. 00

ఫర్జానా .ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీద మరో అరగంటలో రావాల్సిన రైలు కోసం ఎదురుచూస్తుంది. ఇపుడు నేను చూస్తున్న ఫర్జానా ,మూడు నెలల క్రితం నేను చూసిన ఫర్జానా వేరు . అప్పుడు తనో చలాకి అల్లరి పిల్ల . తన తండ్రి కలనే తన లక్ష్యంగా మార్చుకుంది . ప్రాణం కంటే ఎక్కువ ప్రేమ ఫర్జానాకి తన తండ్రి అంటే. డాక్టర్ గా తన తండ్రి ముందు నిల్చోవాలని తన పట్టాని తండ్రికి అందివ్వాలని ఎన్నో కలలు కంది .కానీ అనుకున్నవి అన్నీ జరిగితే అని జీవితంఅవ్వదు . సరిగ్గా ఫర్జానా డాక్టర్ పట్టా అందుకున్న రోజునే పూంచ్ సెక్టార్ దగ్గర జరిగిన ఉగ్రవాద కాల్పుల్లో ఫర్జానా తండ్రి మొహమ్మద్ నవాజుద్దీన్ వీర మరణం పొందాడు . నవాజ్ పార్థివదేహాన్ని తోటి సైనికులు జమ్మూ నుండితీసుకువచ్చారు . ఇదే మొదటి నెంబర్ ప్లాట్ఫారం మీదే గుండె పగిలేలా ఏడ్చిన ఫర్జానాని చూసి రాయినైన నాకే మనసు చెలించింది . ఏ తండ్రి కోరిక మీద డాక్టర్ అయ్యిందో ఆ తండ్రి నిర్జీవంగా పడి ఉండడం చూసి ఫర్జానా ప్రాణంతల్లడిల్లిపోయింది . తనకి ఇది ఎవరూ తీర్చలేని నష్టం.తను మళ్ళీ మాములు మనిషిగా మారడానికి చాలా సమయం పడుతుందనుకున్నా . కానీ మూడునెలలు కూడా గడవకముందే తనని చూసి ఆశ్చర్యపోవడం నా వంతైంది .ఇప్పుడు తను వెళ్తుంది జమ్మూ కి , అక్కడ ఆర్మీ హాస్పిటల్ లో డాక్టర్ గా తనకి ఉద్యోగం వచ్చింది . ప్రాణాలని లెక్కచేయక పోరాడే సైనికులకు వైద్యం చేయడానికి ఇప్పుడు తను బయల్దేరుతుంది . తండ్రి కోరిక మేరకు డాక్టర్ అయ్యింది. తండ్రి ఆశయం కోసం ఆర్మీ లో చేరింది . నవాజ్ ఎక్కడున్నా ఈరోజు ఫర్జానాని చూసి ఎంతో గర్వపడుతూ ఉంది ఉంటాడు .

తనిప్పుడు డాక్టర్ . ఫర్జానా ఫాతిమా D /o మేజర్. మహమ్మద్ నవాజుద్దీన్

ఇలాంటి మరికొందరి జీవితాలని మీకు పరిచయం చేయడానికి మళ్ళీ వస్తాను అప్పటివరకు సెలవు

– మీ రైల్వే స్టేషన్



Image may contain: outdoor and text



--((***))--

‘‘బాగున్నావా మిత్రమా’’ అడిగింది.ఒక్క గెంతు గెంతి నక్కకు దూరంగా జరిగింది జింక.

‘‘మిత్రమా! ఇదెక్కడి పిలుపు’’ అడిగింది.‘‘నువ్వెవరో నాకు తెలియదు. నా జోలికి రాకు’’ అంటూ పరుగెత్తబోయింది.‘

‘ఆగాగు’’ అంది నక్క.

ఆగింది జింక.‘

‘నా పేరు సుబుద్ధి. ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. ‘నా’ అన్నవారు నాకెవరూ లేరు. నక్కలన్నీ నన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాయో వెళ్ళిపోయాయి. దాంతో దిక్కులేని దాన్నయిపోయాను.’’ అన్నది నక్క. కన్నీళ్ళు పెట్టుకుంది.

‘అయ్యో పాపం’ అనిపించింది జింకకి.‘‘తోడు లేకుండా అడవిలో బతకడం ఎంత కష్టమో తెలిసొస్తూంది. చావలేక బతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో నా వాళ్ళను చూసినట్టనిపించి ఎక్కడ లేనిఆనందం కలిగింది. దేవుడిలా కనిపించావు.’’ అంది నక్క.

జింక పొంగిపోయింది.‘‘నీకే హానీ చెయ్యను. నన్ను నమ్ము. నా ఒంటరి తనాన్ని పోగొట్టు. దయచేసి నాతో జట్టు కట్టు. ఇద్దరం కబుర్లాడుకుంటూ కలిసి తిరుగుదాం’’ అంది నక్క.

దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడవి అంతా తిరిగి తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు.‘‘సరదాగా మా ఇంటికి రావచ్చుగా’’ అడిగింది జింక.

‘‘రమ్మంటే ఎందుకు రాను? పద’’ అంది నక్క. జింకతో పాటుగా ఇంటికి చేరింది. చెట్టుకొమ్మ మీద కూర్చుని జింకతో పాటుగా వస్తూన్న నక్కని చూసింది కాకి.‘‘ఎ..ఎయ్‌...ఎవరది’’ అరిచింది.‘‘నక్క మిత్రమా! సుబుద్ధి అని మంచి నక్కే! పాపం దిక్కూ మొక్కూ లేదంటేనూ, ఒంటరి దాన్నంటేనూ, జాలిపడి తీసుకొచ్చాను. మన స్నేహాన్ని కోరుకుంటోంది.’’ అంది జింక.

నక్కతో స్నేహమా? ఎక్కడయినా విన్నామా! అనుకుంది కాకి.‘‘కొత్తవాళ్ళను నమ్మకూడదు. నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ చూస్తూ నక్కతో స్నేహం ఏమిటి? దాని గుణగుణాలన్నీ అందరికీ తెలిసినవే కదా! జాగ్రత్త! పిల్లిని ఆదరించి ముసలి గద్ద ముగిసిపోయిందని కథ ఒకటి ఉందిలే! ఆ కథ గుర్తొస్తూంది’’ అంది కాకి.

‘‘ఆ కథేంటో చెప్పవూ’’ అడిగింది జింక.‘‘చెబుతాను, విను’’ అంటూ కథ చెప్పసాగింది కాకి.గుడ్డిగద్ద కథవెనకటికి గంగానదీ తీరాన ఓ జువ్విచెట్టు ఉండేది.

దాని తొర్రలో ఓ గుడ్డిగద్ద ఉండేది. దాని పేరు జరద్గవం. గద్ద గుడ్డిదే కాదు, ముసలిది కూడా. దాంతో అది ఎగరలేక, చెట్టుని అంటిపెట్టుకుని ఉండేది. చెట్టు మీది మిగిలిన పక్షులు దాని దుస్థితికి జాలిపడ్డాయి.

జాలిపడి, రోజూ సంపాదించుకుని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాకుండా, ఈ గుడ్డిగద్దకు కూడా కొంచెం పెట్టేవి. పెట్టి-‘‘తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని వదిలి వెళ్ళాల్సి వస్తూంది. చీకటి పడితేనే కాని, గూటికి చేరుకోలేం. నీకిదంతా తెలిసిందే! అయితే మేమంతా తిండి సంపాదించుకుని, గూటికి చేరే వరకూ పిల్లలకి నువ్వే దిక్కూ మొక్కూ కావాలి. నీకు కళ్ళు కనిపించవు.

నీ కాళ్ళు కదలవు. అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు. గట్టిగా ఉండు. మా పిల్లలకు కాపలాగా ఉండు.’’ అనేవి. అలాగేనంటూ గుడ్డిగద్ద కాపలా కాసేది.



Image may contain: 13 people


260260

3 comments








🌳రెండు కాంతుల మధ్య🌳

🍁నీడ🍁

చంద్ర:-అమ్మోయ్ ఆ గయ్యాళి వచ్చేసిందే

సూ:-ఎవర్రా అది

చంద్ర:-ఇంకెవరు పక్కింటి ఛాయమ్మ 
సూ:-ఆయ్ బాబోయ్ ఈ దొంగ మొహంది ఎందుకు వస్తోంది డబ్బులకా ఇంకేమయినానా
ఛాయ:-అయ్యో అయ్యో అక్కో అక్కా ఎంత ఘోరం జరిగిపోతుంటే అక్కడ ఎక్కడున్నావే అక్కో అక్క..
సూ:-ఛ నోరు ముయ్ ఏమిటా ఏడుపు నువ్వు పాచి మొహందానా
చంద్ర:-అదంతా దొంగ ఏడుపేలే ఆకళ్ళు చూడు ఎక్కడ తడిలేదాయే
అదికాదక్కా నే చెప్పేది వింటే నువ్వు కూడా ఏడుస్తావ్
సూ:-ఏం జరిగిందో చెప్పిచావ్వే ముందు
ఛాయ:-మరి చెప్పాక తిట్టమాకు
చంద్ర:-తిడితే మాత్రం నీకేమైనా సిగ్గా శరమా త్వరగా పోవే బాబూ
సూ:-అబ్బబ్బా ముందు చెప్పవే
ఛాయ:-మరే అక్కా బావ నీకోసవతిని తెస్తున్నాడంట తెలుసా నీకు
సూ:-ఏంటే ఏంకూశావే
ఛాయ:-అవునంటక్కా అందరూ ఇదే మాట అనుకొంటున్నా రు
చంద్ర:-ఇవన్నీ అబద్ధాలు చెబుతోంది నాన్న మార్కెట్ కి వెళ్ళాడు
పంక:-ఒదినా ఓ ఒదినా ఎక్కుడున్నావ్ ఒదినా ఓరి నామతి మండ ఇక్కడే వున్నావా సరలే
సూ:-దీంతోనే ఛస్తుంటే మళ్లీ మధ్యలో ఇదెందుకు వచ్చిందో
పంక:-ఇది ఇక్కడ వుందేమిటి ఒదినా
సూ:-ఆ దాని మొహం అదంతేలే
సూ:-ఆ రావే పంకజం ఏమిటే ఆ హడావిడి
పంక:-ఏంలేదొదినా ఇందాక అన్నయ్య మార్కెట్లో కనిపించిఈ పూల గంప నీకిమ్మని మా పాలేరుకి ఇచ్చాడు అదిద్దామని ఇదిగో నీగంప మిగతా పని చేసుకొని వస్తా అన్నారు
సూ:-అయ్యయ్యో అన్ని పూలు ఎందుకే
పంక:-నాకేంతెలుసొదినా
చంద్ర:-అమ్మా చూడు పూలు ఎంత బాగున్నాయో
ఛాయ:-అంతా అయిపోయిందక్కా ఈ పూలతో వచ్చే దానికి శోభనం జరిపించు వస్తానక్కా
సూ భ:-ఎక్కడికి పోయేది వచ్చిన పని అయిందా బాగా మండలేదుగా అందరూ వచ్చి భోజనం చేసివెళ్ళండి ఈ రోజు మాపెళ్ళిరోజ కదా అందుకు కాంతం ఇదిగో నీపట్టు చీర వడ్డాణం
సూ:-నా మతి మండ ఆరోజు ఈజేనా ఒసే ఛాయా పంకజం రండర్రా త్వరగా కాస్త అన్నీ చక్కపెట్టండే ఏమండీ మీరు కూడా స్నానం చేసి వస్తే వడ్డన మొదలు అవుతుంది మీరంతా త్వరితగతిన రండర్రా అలా నీరసంగా ఉంటే ఎలా సరే పిల్లలు వుంటా మరి...ఈ కాంతం అక్కని మర్చిపోకండిరా నాయనా..



ఏమిటాలోచిస్తున్నావు మిత్రమా’’ అడిగాడు.

‘‘ఏం లేదు మిత్రమా! నా పళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. నొప్పెడుతున్నాయి. మొత్తం వలంతా కొరకడం అంటే కష్టమనిపిస్తోంది. ముందు నిన్ను విడిపించనీ! తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం.’’ అన్నాడు హిరణ్యకుడు.

చిత్రగ్రీవుడుకి హిరణ్యకుడి మాటలు నచ్చినట్టు లేదు. అదోలా చూశాడతన్ని.‘‘మిగిలిన పావురాలను కూడా విడిపిస్తాను. అనుమానం లేదు. కాకపోతే చెప్పానుగా! పళ్ళు ఇబ్బంది పెడుతున్నాయని. నొప్పి అని. ముందు నిన్ను విడిపించనీ’’ అని చిత్రగ్రీవుడి దగ్గరి వల తాళ్ళను కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు.

చిత్రగ్రీవుడు అతనికి అందక వెనక్కి జరిగాడు. ఆశ్చర్యంగా చూశాడు హిరణ్యకుడు.‘‘నీకు నొప్పి కలగనంత వరకూ నన్ను తప్పించి ఎంత మందిని నువ్వు విడిపించగలిగితే అంత మందినీ ముందు విడిపించు. అందరూ విడుద లయిన తర్వాతే నా గురించి నువ్వు ఆలోచించు. అంతేకాని, నన్ను ముందు విడుదల చేసి, మిగిలిన పావురాల సంగతి తర్వాతంటే భావ్యం కాదు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.

నవ్వాడు హిరణ్యకుడు.‘‘నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా! తనకు మాలిన ధర్మం అంటారే అలా ఉంది నువ్వు మాట్లాడేది. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో! తర్వాత మిగిలిన వారి సంగతి ఆలోచించవచ్చు.

అలా కాదు, వారి సంగతే ముందు ఆలోచించాలి, తర్వాతే నా సంగతి అంటావా, అప్పుడు నీ అంతటి మూర్ఖుడు ఇంకొకడు లేడనుకుంటాను. రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా, ఇతరుల క్షేమాన్ని పట్టించుకునేది. నువ్వే క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరు? నువ్వెవరు?’’ ప్రశ్నించాడు హిరణ్యకుడు.

‘‘నిజమే! కాని, నా వాళ్ళంతా కష్టంలో ఉండడాన్ని నేను భరించలేను. సాటి వారు కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలి. అందుకు ప్రాణత్యాగం చేసినా తప్పు లేదు. నేనూ వాళ్ళూ ఒకటే! వాళ్ళు లేకుండా నేను లేను. నేను లేకుండా వాళ్ళు లేరు.

ఆపదలో ఉన్న నా వాళ్ళను నేను రక్షించుకోలేనప్పుడు నాకీ రాచరికం ఎందుకు? ఎవర్ని ఉద్ధరించడానికి?’’ అన్నాడు చిత్రగ్రీవుడు. పావురాలన్నీ గొప్పగా చూశాయి, తమ రాజుని. రాజంటే చిత్రగ్రీవుడనుకున్నాయి.‘‘ఏదో రోజు అందరం పోయే వాళ్ళమే! ఈ శరీరం అశాశ్వితం. అది తెలుసుకోవాలి ముందు. తెలుసుకునిఉన్న నాలుగు రోజులూ నాలుగు కాలాల పాటు నిలిచే పనులు చెయ్యాలి. తోటివారికి సాయం చెయ్యాలి. అందుకని చెబుతున్నాను. మరోలా అనుకోకు. ముందు నా వాళ్ళను కాపాడు. తర్వాత నీకు వీలయితేనే నన్ను కాపాడు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.అతని మంచితనానికి ముచ్చటపడ్డాడు హిరణ్యకుడు. మనసులో జేజేలర్పించాడు.



No photo description available.



56












ఒక రోజు ఆ చెట్టు కిందికి పిల్లి ఒకటి వచ్చింది. చెట్టు మీది గూళ్ళలో పక్షి పిల్లల గోల వినవస్తే, నోరూరుతూంటే, నాలికను పెదాలకు రాసుకుని, ‘లేలేత మాంసం దొరికింది’ అనుకుంటూ చెట్టెక్కింది.

మెల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతోన్న పిల్లిని చూసి పక్షి పిల్లలు ‘అమ్మో! అయ్యో’ అంటూ గోలగోల చేశాయి. ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద ‘‘ఎవరదీ’’ అంటూ గట్టిగా అరిచింది.

ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది. వణికిపోయింది. శరీరం వణకడంతో కాలు జారి కింద పడాల్సిందే! కాని నిలదొక్కుకుంది. చెట్టెక్కినప్పుడు పక్షిపిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్దను గమనించలేదు పిల్లి. ఇప్పుడు గమనించింది. దగ్గరగానే ఉంది గద్ద.

తప్పించుకునే అవకాశం లేదు. ఏం చెయ్యను, ఏం చెయ్యననుకుంటూ పరిపరి విధాల ఆలోచించింది పిల్లి. ఏ ఆలోచనా రూపు కట్టలేదు దానికి. ఆఖరికి ఇలా అనుకుంది.

పొరపాటు చేశాను. పక్షిపిల్లలకు ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి. అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించాను. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే! కాని, తప్పించుకోవాలి. ఎలా? ఎలా అంటే...ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి. దీన్ని నమ్మించాలి. నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి. లేదంటే చావు తప్పదు.గజగజా వణుకుతూనే గద్ద దగ్గరకు చేరింది పిల్లి.





విశ్వ



రూపుని కథ

ధర్మనందనుడు శల్యునుద్దేశించి, ‘‘మహాత్మా! మీరు తీసుకున్న నిర్ణయం ఎంతో సముచితమైంది. చేసిన మంచిపనిని అభినందించి, వారి కోరిక నెరవేర్చడం మహనీయుల సహజ లక్షణం. మీ వాగ్దానానికి భంగం రాకుండా నేను ఒక కోరిక కోరుకుంటాను. తమరు అనుగ్రహించాలి’’ అన్నాడు వినయంగా.

‘‘దానికేమి భాగ్యం నువ్వు అడుగనూ వచ్చు. నాచేతిలో ఉన్నది నేను చెయ్యనూ వచ్చు’’ అన్నాడు శల్యుడు మందహాసంతో.

‘‘శల్యధరణీ నాథా! మా అన్నదమ్ముల మధ్య యుద్ధం అనివార్యమైతే, మాశ్రేయోభిలాషి శ్రీకృష్ణుడు, అర్జునుని రథసారథిగా వ్యవహరిస్తానని మాట యిచ్చాడు. కర్ణుడు సదా కిరీటి పట్ల బద్ధవైరంతో రగులుతూ వుంటాడు. కదనరంగంలో వాసుదేవునికెదురొడ్డి, పగ్గాలు ఝళిపించగల దక్షులు మీరొక్కరే. కనుక మీకు సారథి పదవి రాకమానదు. ఆ సమయంలో మీరు చేయగల సాయం వొకటుంది. కర్ణునికి సార థ్యం వహిస్తూనే శాత్రవుని కీర్తించడం, కర్ణుని ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయడం ద్వారా నిరుత్సాహ వాతావరణాన్ని సృష్టించవచ్చు. ఇది అనుచితమని భావించక, మా కోరిక తీర్చాలని కోరుకుంటున్నాము’’ అన్నాడు ధర్మజుడు.

శల్యుడు వెంటనే, ‘‘ధర్మజా! మీరూహించినట్టు నేను కర్ణుని రథసారథినైతే తప్పక నీ కోరిక తీరుస్తాను. యథాశక్తిగా సవ్యసాచికి సాయపడతాను. కర్ణుని గురి నిలువకుండా మాటలతో అస్తవ్యస్తం చేస్తాను’’ అని మాట యిచ్చాడు.

ధర్మజుడు నమస్కరించి కృతజ్ఞతలు తెల్పాడు. ఒక పెద్ద గండం గట్టెక్కినట్టు హాయిగా నిట్టూర్చాడు.మద్రేశ్వరుడు మరల అందుకుని, ఇదేకాదు మీరు ఏది కోరినా నేను చేస్తాను. నాడు నిండుసభలో ఆ సూత పుత్రుడు ద్రౌపదీ సాధ్విని అవమానపరిచినపడు నేను ఎంతగానో నొచ్చుకున్నాను. అదీగాక, మీరు పడ్డ పాటులెవ్వరి మనసులనైనా నొప్పించక మానవు. మీపట్ల నాకు చెప్పలేని ప్రేమాభిమానాలున్నాయి. ధర్మరాజా, ఇక్కట్లు పడ్డామని బాధపడకు. త్వరలోనే మబ్బులు వీడి, మనోరథాలు ఫలిస్తాయి. అమరేశ్వరుడంత వారికే ఘోరదుర్దశ ఒక్కొక్కపడు తప్పదు. దేవేంద్రుడు శచీదేవితో బాటు అష్టకష్టాలనుభవించలేదా. అమరాధిపతితో పోల్చుకున్నపడు మీ శక్తిసంపన్నతలు ఏపాటి? సాక్షాత్తూ ఆ పరమేశ్వరునికైనా కర్మఫలితం అనుభవించక తప్పదు కదా’’ అన్నాడు గంభీరంగా.

ధర్మపుత్రుడది విని ‘‘శల్యరాజా! ఇంద్రదేవుడు సతీసహితంగా అటువంటి క్లేశాలు అనుభవించడానికి కారణమేమిటి? మీ ముఖతా వినాలని ఉంది’’ అన్నాడు. మద్రపతి స్థిమితంగా కూర్చుని, ‘‘తప్పక చెబుతాను.ఆ పురాతన గాథను మీరు తెలుసుకోవడం చాలా అవసరం’’ అంటూ ఆ వృత్తాంతాన్ని సాకల్యంగా వివరించాడు.

అమరులందరిలోనూ అగ్రగణ్యుడు, పూజనీయుడు అయిన త్వష్ట, ఒకానొకపడు దేవేంద్రునికి అపకారం తలపెట్టాడు. అందుకోసం మూడు శిరస్సులు గల భీకరమూర్తినొకనిని సృష్టించి, వానికి విశ్వరూపుడని పేరు పెట్టాడు. విశ్వరూపుడు ఇంద్రపదవి కోసం, అహోరాత్రులు తీవ్రనిష్ఠతో తపస్సు ప్రారంభించాడు. ఇంద్రునికా సంగతి తెలిసి, తపోభంగానికి ప్రయత్నాలు సాగించాడు. అప్సరసలు అరణ్యానికి దిగి వచ్చారు. విశ్వరూపుడు తపస్సాచరించే పరిసరాలలో వారు వయ్యారాలు వొలకబోస్తూ సంచరించారు. నూపురాల ఘలంఘలలు, మధురగీతికలు, మనోహర నృత్యాలు అడవికాచిన వెన్నెలలైనాయి. పయ్యెదల పలకరింపులు, అచ్చరల క్రీగంటిచూపులు బూడిదలో పోసిన పన్నీరైన వి. దేవేంద్రుడది గమనించి విశ్వరూపుడు తన పదవిని ఆక్రమించగలడని భయపడ్డాడు. భయంతో విచక్షణాజ్ఞానం నశించింది. ఇంద్రుడు తన చేతనున్న వజ్రాయుధాన్ని తపోదీక్షలో వున్న విశ్వరూపునిపై ప్రయోగించాడు. ఆ దెబ్బకు తపస్విశిరస్సులు మూడు తుత్తునియాలైనాయి. తను చేసిన ఘోరహత్య లోకానికి తెలియనీయక, ఇంద్రుడు ఒక రహస్య ప్రదేశంలో మారువేషంలో దాక్కొన్నాడు. అయినా, ఇంద్రుని ఘాతుక కృత్యాన్ని లోకం కోడై కూసింది. ప్రపంచంలోని సమస్త ప్రాణికోటి పలువిధాల దూషించింది. ఇంద్రుడు తన దుశ్చర్యలోకానికి తెలిసిపోయినందుకు విచారించాడు. నింద బాపుకోడానికి దుష్కర వ్రతమొకటి సంకల్పించి, ఆచరించాడు. తనకు చుట్టుకున్న భీకరబ్రహ్మ హత్యాపాతకాన్ని యీ సృష్టిలో గల వృక్షజాతికి, సాగరాలకు, భూమికి, మహిళలకు విభజించి పంచి తను విముక్తుడైనాడు. తిరిగి ఇంద్రుడు మునుపటి వలెనే మచ్చలేని మహానాయకునిగా వెలిగిపోతున్నాడు. దిక్పాలకులు, మునీశ్వరులు ఎప్పటిలాగే ఇంద్రుని పట్ల భయభక్తులతో మెలగసాగారు. త్వష్టకు తన కుమారుడైన విశ్వరూపుని దారుణహత్య గురించి తెలిసింది.



Image may contain: 1 person

No comments:

Post a Comment