నేటి కవిత - నిరంతరం
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి
చీకటి భయపడుతుంది
నిరంతరం శ్రమించే వాన్ని చూసి
ఓటమి భయపడుతుంది
నిరంతరం మోసం చేసే వాడ్ని చూసి
చెలిమి భయపడుతుంది
నిరంతరం మాట్లాడేవాడిని చూసి
గొంతు భయపడుతుంది
నిరంతరం ప్రేమించాననే వాడ్ని చూసి
ప్రేమే భయపడుతుంది
నిరంతరం ద్వేషించే వాడ్ని చూసి
ధైర్యం భయపడుతుంది
నిరంతరం కామించే వాడ్ని చూసి
సిగ్గే భయపడుతుంది
నిరంతరం కోపించే వాడ్ని చూసి
మోనం భయపడుతుంది
నిరంతరం రోగిని చూసి
వైద్యం భయపడుతుంది
నిరంతరం వాదన చూసి
న్యాయం భయపడుతుంది
నిరంతరం బోధను చూసి
మనసే భయపడుతుంది
నిరంతరం వర్షాన్ని చూసి
తరువే భయపడుతుంది
మనిషిలో మృగాన్ని చూసి
శీలం భయపడుతుంది
మమతలోని ప్రేమ చూసి
కోపం భయపడుతుంది
మనసులోని మాట చూసి
మనుగడే భయపడుతుంది
బిడ్డల పల్కులు చూసి
తల్లే భయపడుతుంది

ఆనందలహరీ (తాత్పర్యంతో సహా) పారాయణం చేస్తే కుటుంబ కలహాలు తగ్గుతాయి.
1) భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్న వదనైః
ప్రజానామీశాన స్త్రిపురమథన పంచభిరపి
నషడ్బి స్సేనానీ ర్దశశతముఖై రప్యహి పతిః
తదా న్యేషాం కేషాం కథయ కథ మస్మిన్నవసరః
ఓ జగదేకమాత భవానీ సృష్టికర్త బ్రహ్మ తన నాలుగు ముఖాలతోను, త్రిపురహరుడు శంకరుడు తన అయిదు ముఖాలతోను, దేవసేనానికుమారస్వామి తన ఆరు ముఖాలతోను, నాగరాజైన ఆదిశేషుడు తనవేయిముఖాల తోను నీ మహిమా పాఠావాలను వర్ణింపలేకున్నారు. ఇక మానవమాత్రుడను నేనెంతటివాడను.
2)ఘతక్షీర - ద్రాక్షా మధుమధురిమా కై రపి పదై
ర్విశిష్యా నాఖ్యేయో భవతి రసనా మాత్రవిషయః
తథాతే సౌందర్యం పరమశివ దృజ్మత్ర విషయః
కథంకారం బ్రూమ సకల నిగమా గోచరపదే.
నెయ్యి,పాలు,ద్రాక్షా - తేనెలలోని మాధుర్యాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు.వాటి రుచి నాలుకకు మాత్రమే తెలుసు. అమ్మానీ సౌందర్యం వర్ణించాలంటే సకల వేదాలకే శక్తి చాలదే.ఆ సౌందర్యాతిశయం మహేశ్వరునికి ఎరుకగానీ - మా బోటి సామాన్యుల తరమా తల్లీ!
3)ముఖతే తాంబూలం నయనయుగళే కజ్జలకలా
లలాటే కాశ్మీరం విలసతి గలే మౌక్తిక లతా
స్ఫురత్కాంచీశాటీ పృథుకటితటే హాటకమయీ
భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీ మవిరతమ్.
నోట్లో తాంబూలం, కళ్లకు కాటుక,నొసట సిందూర తిలకం, మెడలో మంచి ముత్యాలహారం, బంగారు జలతారుతో నేయబడిన చీరె,నడుమున రత్నాలు తాపిన వడ్యాణాన్ని ధరించి; ధగధగ మెరిసే వేష భూషలతో విరాజిల్లే గిరిరాజ నందినీ! గౌరవర్ణినీ! సదా మనసా నిన్నే
ఆరాధిస్తాను తల్లీ!
4)విరాజన్మందార ద్రుమ కుసుమహార స్తనతటి
నదద్వీణానాద శ్రవణ విలసత్ కుండల గుణా
నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ భగవతీ
సతీ శంభో రంభోరుహ చటుల చక్షుర్విజయతే.
మందారకుసుమమాల ధరించి హృదయసీమను మధుర వీణానాదాన్ని ఆలకిస్తూ - చెవుల తళతళ మెరిసే కుండల కాంతుల శోభతో ....వయ్యారంగా వంగిన తనువుతో, ఆడయేనుగు అందమైన నడకతో ....మనోహరమైన మందగమనంతో, కలువ కన్నుల మంగళస్వరూపినీ! హే
భగవతీ శంకరసతీ .... సర్వత్రా నీ రూపమే నాకు కనులముందు
కదులాడుతోంది తల్లీ!
5)నవీనార్క భ్రాజన్మణి కనక భూషా పరికరైః
వృతాంగీ సారంగీ రుచిర నయనాం గీకృత శివా,
తటిత్పీతా పీతాంబర లలిత మంజీర సుభగా
మమా పర్ణాపూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ!
హే జగన్మాతా! అప్పుడే! ఉదయించిన భాలభానునిలా దేదీప్యమానంగా ప్రకాశించే సువర్ణ మణిమయాది భూషణాలతో సర్వాంగ భూషితవు.ఆడులేడి కళ్ళవంటి అత్యంత సుందరమైన కన్నులు గలదానావు,
పరమశివుని పతిగా స్వీకరించిన దానవు, మెరుపు లాంటి పచ్చనిమేని కాంతికల దానవు, పసిడి పీతాంబరం, పాదమంజీరాలతో కలకల్లాడే అయిదవరాలా ఆనంద స్వరూపిణీ! అపర్ణా .... నిరంతరం నాకు నిండుగా ఆనందాన్ని యిమ్ము తల్లీ!
6)హిమాద్రే స్సంభూతా సులలితకరైః పల్లవయుతా
సుపుష్పా ముక్తాభి ర్ర్బమరకలితా చాలకభరైః,
కృతస్థాణు స్థానా కుచఫలనతా సూక్తిసరసా
రుజాం హస్త్రీ విలసతి చిదానందలతికా.
ఆ మాత జ్ఞానలత, ఆనందలత, మంచుకొనలో పుట్టినది. అందమైన అరచేతులనే పల్లవాలు కలది. ముత్యాల సరాలనే పూలు పూసింది. నల్లని తుమ్మెద దలనే ముంగురులతో ముచ్చటగొలిపేది. స్తన ఫలభారంతో వంగినటువంటిది. సరసవాక్కుల తేనె లొలికించు నట్టి దా లత ...
సర్వరోగ నివారిణి, కలుషహారిణి ... అది జ్ఞానానంద లతిక -- శివ మనోవల్లరి.
7)సపర్ణా మాకీర్ణాంకతిపగుణై స్సాదర మిహ
శ్రయం త్యన్యే వల్లీం మమతు మతిరేవం విలసతి,
అపర్ణైకా సేవ్యా జగతి సకలై ర్యత్పరివృతః
పురాణోపి స్థాణుః ఫలతికిల కైవల్యపదవీమ్.
ఇహం లొ తరించాలంటే అపర్ణనే కొలవాలి కాని సపర్ణను కాదు. ఆ అపర్ణను పరిణయమాడిన పరమశివుడు మోక్షఫలప్రదాత అయ్యాడు కదా!
8)విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయ జననీ!
త్వమర్థానాం మూలం ధనద, నమనీయాంఘ్రికమలే!
త్వమాదిః కామానాం జనని! కృత కందర్ప విజయే!
సతాం ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మ మహిషీ!
ఓ జగదేకమాత! వేదాలన్నీ నేలోనే జనించాయి. సకల వేదవిధులను విధించుదానవు. ధనాధిపతి కుబేరుడు కూడా నీ పాదాక్రాంతుడే. నీవుకామేశ్వరివి. కోరికలు తీర్చే దానవు. కాముని జయించిన దానవు. పరబ్రహ్మస్వరూపుని పట్టపురాణివి గదమ్మా! సజ్జనుల ముక్తికి కారణభూతురాలవు...ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధపురుషార్థ ఇచ్చేదానివి నీవే తల్లీ!
9)ప్రభుతా భక్తిస్తే యదపి న మయా లోలమనసః
త్వయాతు శ్రీమత్యా సదయమవలోక్యో హమధునా
పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే,
భృశం శంకే కైర్వా విధిభి రనునీతా మమ మతిః
చపలచిత్తుడనైన నాకు నిజం చెప్పాలంటే నీయందంతగా భక్తి కుదరడం లేదు. కానీ నీవు పెద్ద మనస్సున్న దానవు...శ్రీ మతివి. నీవే నన్నిపుడు దయచూడాలి తల్లీ!. చాతక పక్షి ఇష్టాయిష్టాలకు అతీతంగా మేఘుడు చాతకపక్షినోట తీయటి జలాలను కురిపించటం లేదా! అలాగే
దయావర్షం నాపై కురిపించు తల్లీ! ఎందువల్ల నా మనస్సు నీ యందు నిలకడ కోల్పోతోందో అని సతతము మథనపడుతున్నాను తల్లీ!
10)కృపా పాంగాలోకం వితర తరసా సాధుచరితే
నతే యుక్తో పేక్షామయి శరణదీక్షా ముపగతే
నచే దిష్టం దద్యా దనుపద మహో! కల్పలతికా
విశేషస్సామాన్యైః కథ మితర వల్లీపరకరైః
అమ్మా నీవు కపట మెరుగని సచ్చరిత్రవు గదమ్మా! నీ కృపాదృష్టిని నాపై త్వరగా ప్రసరింపజేయుము తల్లీ! నిన్ను శరణు కోరినవారిని కరుణించే కల్పవల్లివి గదమ్మా...నన్ను ఉపేక్షించకమ్మా! అడిగిందే తడవుగా వరాలిచ్చే కల్పవల్లీ! ఈ యకుంటే సామాన్యతలకు కల్పలతకు తేడా ఏముంటుంది తల్లీ!
11)మహాంతం విశ్వాసం తవ చరణ పంకేరుహయుగే
నిధాయా న్యన్నైవా శ్రిత మహ మయా దైవతముమే!
తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం
నిరాలంబో లంబోదర జనని కం యామి శరణమ్.
అమ్మా...ఉమాదేవీ! నీ పాదపద్మాలనే నమ్ముకున్నా నమ్మా! ఇతర దేవతల నాశ్రయించాలను కోలేదు. అయినా నాపై నీకు దయరాకపోతే, నే నిరాశ్రయుడనై పోతానమ్మా! హే లంబోదర జననీ ఏ యాధారమూ లేని నన్ను ఎవరిని శరణు వేడుకోమంటావు తల్లీ!
12)అయి స్పర్శే లగ్నం సపది లభతే హేమపదవీం
యథా రథ్యాపాద శ్శుచి భవతి గంగౌఘమిలితం
తథా తత్త త్పాపై రతిమలిన మంతర్మమ యది
త్వయి ప్రేమ్ణాస్తం కథమివ న జాయేత విమలమ్.
అమ్మా! స్పర్శవేది సోకగానే ఇనుము బంగార మవుతుంది. వీధి కాల్వల్లో పారే మురికినీరు గంగతో కలసి పునీతం అవుతుంది. అదేవిధంగా మాయను జిక్కి పాపాలతో మలినమైపోయిన నా మనస్సు - భక్తిభావనలో ముణిగినపుడు అదిమాత్రం నిర్మలం కాకపోతుందా ...తల్లీ!
13)త్వదన్యస్మా దిచ్చావిషయ ఫలలాభే న నియమః
త్వమర్థనా మిచ్చాధికమపి సమర్థా వితరణే
ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మన
స్త్వదాసక్తం నక్తం దివ ముచిత మీశాని! కురతత్
ఓ ఈశ్వరీ నిన్ను కాదని అన్యదేవతలను వేడను. వేడినంత మాత్రాన కోరిన కోర్కెలన్నీ తీరతాయని నమ్మకము లేదు. అదే నీవైతే - తెలియని మూర్ఖులు తమ శక్తి మించి కోరిన కోరికలు కూడ నిండు మనసుతో తీరుస్తావు - ఇది బ్రహ్మాదులు చెప్పిన సత్యం. హే జగన్మాతా నా మనస్సు
రేయింబవళ్ళు నీ పైనే లగ్నమైంది తల్లీ... ఇప్పుడు నాకేది ఉచితమని భావిస్తావో దాని ననుగ్రహించు తల్లీ!
14)స్ఫురన్నానారత్న సఫటికమయ భిత్తి ప్రతిఫల
త్త్వదాకారం చంచచ్చ శధరకలా సౌధశిఖరం,
ముకుంద బ్రహ్మేంద్ర ప్రభృతి పరివారం విజయతే,
తవా గారం రమ్యం తిభువన మహారాజగృహిణి!
త్రిభువన నాయకుడైన పరమేశ్వరుని పట్టాపురాణివైన జగజ్జననీ! నీ భవనమేంతో రమ్యమైంది! రత్నప్రాకారాలతో - స్పటిక మణిమయ గోడలతో, అన్నిటా నీ రూపమే ప్రతిబింబిస్తూ కనులకింపుగా వుంది. నీ సౌధశిఖరం చంద్రుని కాంతులతో మిలమిల మెరిసిపోతున్నది! విష్ణువు బ్రహ్మ, ఇంద్రాది దేవతా పరివారంతో నీ భవనం ఎంత మహోజ్జ్వలంగాఉన్నదితల్లీ!
15)నివాసః కైలాసే విధి శతమఖాద్యా స్స్తుతికరాః
కుటుంబం త్రైలోక్యం కృతకరపుట స్సిద్ధినికరః,
మహేశ ప్రాణేశ స్తదవనిధరా ధీశ తనయే
న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తితులనా.
మాతా! పర్వతరాజకుమారి..మాతా భవానీ! నీ నివాసం కైలాసం. రజతగిరి అనబడే వెండి కొండ...బ్రహ్మేంద్రాదులు నీ గుణగానం చేసేవైతాళికులు. ముల్లోకాలు నీ కుటుంబమే. అణిమాది అష్టసిద్ధులుఅంజలి ఘటించి నీ యెదుట నిలబడి ఉన్నాయి. మహేశ్వరుడు - నీ
ప్రాణనాధుడు. నీ సౌభాగ్యానికి సాటి ఎక్కడుంది తల్లీ!
16)వృషో వృద్ధో యానం విషమశన మాశా నివాసనం
స్మశానం క్రీడాభూ ర్భుజగనివహో భూషణ విధిః
సమగ్రాసామగ్రీ జగతి విదితైవ స్మరరిపో
ర్యదేత స్యైశ్యర్యం తవ జనని సౌభాగ్యమహిమా!
అమ్మా!మన్మధుని బూడిదచేసిన ఆ శంకరుని వాహనమా ముసలి ఎద్దు ...ఆహారమా విషము...కట్టుపుట్టములా దిక్కులు..విహార భూమి -స్మశానవాటిక, సొమ్ములా పాముల తుట్టెలు...ఆయనకున్న భాగ్యమేపాటిదో ఎల్లలోకాలు ఎగిరినదే గదా! అయినప్పటికి ఆయన
మహా ఐశ్వర్యవంతుడు .. తాను బూడిద పూసుకున్నా ఇతరులకు భూతి
నివ్వగల సంపన్నుడు. దీనికి నీ సౌభాగ్యమహిమే కారణం తల్లీ!
17)అశేష బ్రహ్మాండ ప్రలయ విధి నైసర్గిక మతిః
స్మశానేష్వాసీనః కృత భసితలేపః పశుపతిః,
దధౌ కంఠే, హాలాహల మఖిలభూగోల కృపయా
భవత్యా స్సంగత్యాః ఫల మితిచ కల్యాణీ! కలయే.
హే మంగళప్రదాయినీ - కల్యాణీ! దేహమంతా విబూది పూసుకుని స్మశానంలో తిష్టవేసికూర్చునే శివుడు సర్వలోకాలను సంహారకర్త అని ప్రళయం కలిగిస్తాడని పేరు..కానీ, ఆ శివుడే సకల జీవరాసులను కాపాడాలని కాలకుటాన్ని మ్రింగి కంఠాన బెట్టుకుని, సమస్త భూగోళాన్ని దయామయుడై కాపాడాడంటే - అదంతా నీ చలవే -సర్వమంగళదాయినీ .. నీతోడి సాంగత్యమే అందుకు కారణమనిభావిస్తున్నాను తల్లీ!
18)విశాల శ్రీఖండ ద్రవ మృగమదా కీర్ణఘుసృణ
ప్రసూన వ్యమిశ్రం భగవతి! తవాభ్యంగ సలిలం
సమాదాయ స్రష్టా చలితపదపాంసూ న్నిజకరైః
సమాధత్తే సృష్టిం విబుధపుర పంకేరుహ దృశామ్.
హే భగవతీ! మంచిగంధపు రసం, కస్తూరి, కుంకుమ పూవుతో కూడిన నీ తలంటి స్నానజలాన్ని, నీ పాదరజాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా తనచేతులతో గ్రహించి ఆ స్నానజలంలోని నీ పాదధూళిని కలిపి పదునుచేసిదేవలోకంలో కలువరేకులవంటి కన్నులు గల కాంతామణులను సృష్టిస్తున్నాడు - తల్లీ!
19)వసంతే సానందే కుసుమిత లతాభిః పరివృతే
స్ఫురన్నానాపద్మే సరసి కలహంసాలి సుభగే,
సఖీభిః ఖేలంతీం మలయపవనాందోలిత జలే
స్మరేద్యస్త్వాం తస్య జ్వరజనిత పీడా పరపతి.
తల్లీ జ్వరబాధ శాంతించాలంటే, ఆనందదాయకమైన వసంత ఋతువులో - విరబూసిన లతతో - వికసించిన పద్మాలతో కలహంసల బూరులతో కలకల్లాడే సరోవరంలో - మలయపవన వీచికలతో
మెల్లిమెల్లిగా కదులుతున్న జలాల్లో చెలులతో జలక్రీడలు చేస్తున్న జగన్మాతను ధ్యానించిన వారికి జ్వరపీడ తొలగిపోతుంది ఇతి శ్రీ శంకరాచార్య కృత - ఆనందలహరీ స్తోత్రం సంపూర్ణమ్
--((***))--
[ శ్లో: 22. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా
మితి స్తోతుం వాంఛ న్కథయతి భవాని త్వమితి యః
తదైవత్వం తస్మై దిశసి నిజసాయుజ్య పదవీం
ముకుంద బ్రహ్మేంద్రస్ఫుట మకుట నీరాజితపదామ్ll
🌻. తాత్పర్యము :
అమ్మా ! భవానీ నీ యొక్క దాసుడు అయిన నా మీద నీ యొక్క దయతో కూడిన చూపులు ప్రసరించుమని వేడుటకు సిద్ధపడి అమ్మా భవానీ అని రెండు పలుకులు నోటి వెంట రాగానే బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు మొదలగువారి కిరీటములచే నీరాజనము చేయుచున్న పాదపద్మములు గల నీ సాయుజ్యమును ఇచ్చుచున్నావు కదా !
శ్లో: 23. త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా శరీరార్ధం శంభో రమరమపి శంకే హృతమభూత్ః యదేతత్వ ద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యా మానమ్రం కుటిల శశిచూడాల మకుటమ్ll
అమ్మా! నీవు శివుని ఎడమభాగమును పొందిన మాత్రముతో తృప్తి పొందక కుడి భాగమును కూడా హరించినావని శంకపొడముచున్నది. ఎందుచేత ననగా 'నా హృదయములో నీ రూపమంతయూ (ఎడమ కుడి భాగములు రెండూ) ఎఱ్ఱటి ప్రకాశము కలది, మూడు నేత్రములు కలది, స్తనభారముచేత కొంచెము వంగినది, చంద్రవంక తోడి చూడా కిరీటము కలదిగా అనబడుచున్నది).
శ్లో: 24. జగత్సూతే ధాతా హరిరవతి రుద్రఃక్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశ స్తిరయతిl సదా పూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ స్తవాజ్ఞా మాలంబ్య క్షణచలితయో ర్ర్భూలతికయోఃll
అమ్మా! నీ లతలవంటి కనుబొమల కదలికనుండి ఆజ్ఞను స్వీకరించి బ్రహ్మ ప్రపంచమును సృష్టించును. విష్ణువు పాలించును. రుద్రుడు సంహరించును. ఈశ్వరుడు వారిని తనలో లయము చేసుకొనుచూ తాను కూడా లయమవుచున్నాడు. సదా అన్న శబ్దము మొదలుగా కలిగిన శివుడు సర్వమును మరల అనుగ్రహించుచున్నాడు.
[28/12/2023, 7:31 pm] Malapragadasridevi: శ్లో: 25. త్రయాణాం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్పూజా పూజా తవ చరణయో ర్యా విరచితాl తథాహి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితాహ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తంసమకుటాఃll
(తల్లీ! నీవైన సత్త్వరజస్తమోగుణములచేత జనించిన బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురూ, నీవు పాదములుంచెడి మణిపీఠమునకు దగ్గరగా చేతులు జోడించి శిరస్సున దాల్చి ఎల్లప్పుడు నిలిచి ఉండెదరు. అందువలన నీ పదము లకు చేసెడి పూజ త్రిమూర్తులకును పూజ అగుచున్నది)
శ్లో: 26. విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతినిధనమ్ l
వితంద్రీ మాహేంద్రీవితతిరపి సమ్మీలిత దృశా
మహా సంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌll
🌻. తాత్పర్యము :
అమ్మా ! మహా ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ, విష్ణువు కూడా అంతమును పొందెదరు. అందరికీ మృత్యు పాశములు వేయు యముడు కూడా మృత్యువును పొందుచున్నాడు. ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణము చెందు చున్నాడు. ఇంద్రుడు మున్నగు దేవతలు, మునులు కూడా అంతము చెందుచున్నారు. అటువంటి మహా ప్రళయమునందుv కూడా నీ పతి యగు సదాశివుడు నిన్ను చేరి స్వేచ్చగా నీతో విహారము చేయుచున్నాడు కదా !
శ్లో: 27. జపోజల్పశ్శిల్పం సకలమపి ముద్రా విరచనా గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతివిధిః l ప్రణామః సంవేశ స్సుఖ మఖిలమాత్మార్పణ దృశా సపర్యా పర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్ ll
తల్లీ! నా మాటలన్నీ నీ జపమగు గాక! నా కార్యకలాపమంతయూ నీకు అర్పించే ముద్ర , లగుగాక! నా గమనము అంతయూ నీ ప్రదక్షిణమవుగాక! నేను తినెడి దంతయూ నీకు ఆహుతి అగుగాక! పరుండుట నీకు నమస్కారమగుగాక! శబ్ద స్పర్శ రూప రస గంధాది సుఖములు ఏవైతే ఉన్నాయో అవి ! ఆత్మార్పణ బుద్దితో చేసే నీ పూజలగుగాక! నే చేసే ప్రతిపని నీ యందు సపర్యగా పర్య వసించుగాక!)
శ్లో: 94. కళజ్కః కస్తూరీ రజనికరబిమ్బం జలమయం కళాభిః కర్పూరై ర్మరకతకరణ్డం నిబిడితమ్ అతస్త్వద్భోగేన ప్రతిదిన మిదం రిక్త కుహరం విధిర్భూయోభూయో నిబిడయతి నూనం తవ కృతే.ll
🌷. తాత్పర్యం :
అమ్మా చంద్రబింబము అనగా మరకతమణులచే నిర్మించబడిన పెట్టె. అందు నీవు రోజూ ఉపయోగించు పన్నీరు, కస్తూరి, కర్పూరము పలుకులు ఉంచి రోజూ ఉపయోగించుట వలన ఖాళీ అయిన వాటిని బ్రహ్మ దేవుడు మాటిమాటికి నింపును. కదా ఇది సత్యము.
శ్లో: 93. అరాళా కేశేషు ప్రకృతిసరళా మన్ద హసితే శిరీషాభా చిత్తే దృష దుపల శోభా కుచతటే
భృశం తన్వీ మధ్యే పృథు రురసిజారోహ విషయే
జగత్త్రాతుం శమ్భోర్జయతి కరుణా కాచిదరుణా.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! జగన్మాతా! కురులయందు మాత్రమె వంకర కలిగి చిరునవ్వు నందు సహజముగానే చక్కదనము కలిగి మనస్సునందు దిరిసెన పూవు వలె మెత్త దనము కలిగి అందమయిన శరీరము కలిగి అనిర్వచనీయ మయినదియు పరమ శివుని కరుణా స్వరూపమయిన అరుణ అను శక్తి లోకములను రక్షించు మహిమ కలదిగా ప్రకాశించు చున్నది. కదా !
శ్లో: 92. గతాస్తే మఞ్చత్వం ద్రుహిణహరి రుద్రేశ్వరభృతః
శివస్స్వచ్ఛచ్చాయా కపటఘటిత ప్రచ్ఛదపటః
త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా
శరీరీ శృజ్గారో రస ఇవ దృశాం దోగ్ధికుతుకమ్.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! దేవీ ! బ్రహ్మ విష్ణువురుద్ర ఈశ్వరులుఅను వేల్పులు నీకు మంచత్వమును పొంది యుండగా కప్పుకొను దుప్పటి లాగున ఉన్న సదాశివ తత్వము తెల్లని కాంతులు కలిగి నీకు ఆనందము కలుగ జేయుచున్నది .కదా!
శ్లో: 91. పదన్యాస క్రీడా పరిచయ మివారబ్ధు మనసః స్ఖలన్త స్తే ఖేలం భవన కలహంసా న జహతి అత స్తేషాం శిక్షాం సుభగమణి మఞ్జీర రణిత చ్ఛలాదాచక్షాణం చరణ కమలం చారుచరితే ll
🌷. తాత్పర్యం :
అమ్మా! మనోహరమయిన చరిత్ర కలిగిన ఓ తల్లీ ! నీవు నడుచునప్పుడు నీ పాదముల మనోహరములయిన లయను నేర్చుకొనవలెనని నీ పెంపుడు హంసలు తొట్రుపాటు విడువకున్నవి. నీ పాద పద్మముల యొక్క అందెల శబ్దములు వాటికి పాఠము చెప్పుచున్నట్లుగా ఉన్నది. కదా !
శ్లో: 91. పదన్యాస క్రీడా పరిచయ మివారబ్ధు మనసః స్ఖలన్త స్తే ఖేలం భవన కలహంసా న జహతి అత స్తేషాం శిక్షాం సుభగమణి మఞ్జీర రణిత చ్ఛలాదాచక్షాణం చరణ కమలం చారుచరితే ll
🌷. తాత్పర్యం :
అమ్మా! మనోహరమయిన చరిత్ర కలిగిన ఓ తల్లీ ! నీవు నడుచునప్పుడు నీ పాదముల మనోహరములయిన లయను నేర్చుకొనవలెనని నీ పెంపుడు హంసలు తొట్రుపాటు విడువకున్నవి. నీ పాద పద్మముల యొక్క అందెల శబ్దములు వాటికి పాఠము చెప్పుచున్నట్లుగా ఉన్నది. కదా !
శ్లో: 95. పురారాతేరన్తః పురమసి తాత స్త్వచ్చరణయో స్సపర్యామర్యాదా తరళకరణానా మసులభా తథా హ్యేతే నీతాశ్శత మఖముఖాస్సిద్ధి మతులాం తవ ద్వారోపాన్తస్ధితిభి రణిమాద్యాభిరమరాః.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! నీవు పురారి అయిన పరమ శివుని పట్టపు రాణివి కావున, నీ పాదపద్మములను పూజించు భాగ్యము చపల చిత్తులకు లభించదు. అందువలన ఇంద్రాది దేవతలు ద్వారము వద్ద ఉన్న అణిమాది సిద్ధుల వలననే అభీష్టములు పొందిన వారైరి కదా.
శ్లో: 96. కళత్రం వైధాత్రం కతికతి భజన్తేన కవయః శ్రియో దేవ్యాః కోవా న భవతి పతిః కైరపి ధనైః
మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే
కుచాభ్యా మాసజ్గః కురువక తరోరప్యసులభః.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! ఓ పతివ్రతా శిరోమణి! ఎందరెందరో కవులు సరస్వతీ దేవిని సేవింతురు? ఎందరో సంపదల వలన లక్ష్మీ దేవికి అధిపతులు అగును కదా. అమ్మా నీ ఉద్యానవనమున ఉన్న గోరింట చెట్టునకు కూడా నీవు పతితో కలసియే ఆలింగనము చేయుదువు కదా.
శ్లో: 97. గిరామాహుర్ దేవీం ద్రుహిణగృహిణీ మాగమ విదో హరేః పత్నీం పద్మాం హర సహచరీ మద్రి తనయామ్
తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! పరమాత్మ యగు పరమ శివుని రాణి వగు ఓ తల్లీ, ఆగమవేత్తలు నిన్ను బ్రహ్మదేవుని ఇల్లాలు అగు సరస్వతీ దేవిగాను , విష్ణువు సతియగు లక్ష్మీదేవి గాను శివుని సహచరి అయిన పార్వతి గాను చెప్పుచున్నారు. కాని నీవు యీ ముగ్గురు కంటే అపార మహిమ కలిగి సకల ప్రపంచమును మోహింప చేయు చున్నావు కదా.
శ్లో: 98. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్ధీ తవ చరణ నిర్జేజనజలమ్
ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా
కదాథత్తే వాణీముఖ కమల తామ్బూల రసతామ్.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! బ్రహ్మ విద్యను అర్ధించు నేను లత్తుక రసము కలుపబడిన నీ పాదోదకము ఎప్పుడు త్రాగుదునో కదా ! ఆ నీరు చెవిటి వారికి విను శక్తిని, మూగ వారికి మాట్లాడు శక్తిని ఇచ్చును కదా !
శ్లో: 99. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరిసపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరం జీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికరః పరానన్దా భిఖ్యం రసయతి రసం త్వద్భజనవాన్.ll
🌷. తాత్పర్యం :
అమ్మా! నిన్ను సేవించు నీ భక్తుడు సరస్వతీ దేవి, లక్ష్మి దేవి లకు ఇష్టుడయి వారితో విహరించుట వలన బ్రహ్మకు, విష్ణు మూర్తికి అసూయ కలిగించు చున్నాడు. మంచి అందముతో రతీదేవి పాతివ్రత్య భంగము కలిగించుచున్నాడు. అతడు చిరకాలము బ్రహ్మానందము అను సుఖమును పొందుచున్నాడు. కదా !
ఓం శ్రీమాత్రేనమః
శుభోదయనమస్సులు
శ్లో:100. ప్రదీపజ్వాలాభి ర్ధివసకరనీరాజనవిధి స్సుధాసూతే శ్చంద్రో పలజలలవై రర్ఘ్యరచనా
స్వకీయై రంభోభి స్సలిలనిధి సాహిత్య కరణం త్వదీయాభి ర్వాగ్భి స్తవ జనని వాచాం స్తుతి రియమ్ll
🌷. తాత్పర్యం :
అమ్మా! నీవు ఇచ్చిన వాక్కుల చేత నిన్ను స్తుతించుచూ చేయు వాక్కులు సూర్యునికి దివిటీల చేత నీరాజనము ఇచ్చుట వంటిది.
( అహంకారము త్యజించి సర్వమూ శ్రీ దేవి కరుణ అని శంకర భగవత్పాదులు ఈ స్తోత్రములను ముగించెను.)
No comments:
Post a Comment