Tuesday, 2 August 2022

🙏🙏🙏🙏🙏🙏🙏🙏✅✅✅✅✅✅✅✅♣️♣️♣️♣️♣️♣️😄😄😄😄😄😄🔴🔴🔴🔴🈯🈯🈯🈯🈯🈯🈯🈯🈯
న్యస్తాక్షరి ....

కృ
ష్ణం 
రా
జు

పద్య పాడాదిన రావాలి.......

🈯🈯🈯🈯🈯🈯🔴🔴🔴🔴🔴🔴🔴😄😄😄😄😄😄😄♣️♣️♣️♣️♣️♣️♣️✅✅✅✅🙏🙏🙏🙏🙏😁😁😁😁

సుభాషితం
🌺ఏకేనా రాజహంసేన యా
     శోభా సరసోసభవత్ ౹
     న సా బకసహస్రేణ పరితః
     తిరవాసినా ౹౹🌺
   ఒకే ఒక రాజహంసవల్ల సరోవరానికి శోభ కలుగుతుందే కానీ తీరం చుట్టూ కూర్చున్న కొంగలు పక్షులవల్ల కాదు.
🌺✍🏽ప్రభ,మైసూరు.
           11-9-2022.

కృపయు కమనీయ పలుకుతో  కనికరం  కృ
ష్ణం జగతి మేటి నటుడు కృష్ణం రాజు
రాజకీయము పట్టుతో రాటు తేలి
జుర్రు తేన లాంటి మనసు  చురుకు లేదు

చిలక గోరింక నటుడుగా చిత్ర మగుటె
కృష్ణ వేణి గా ❤️ కన్నప్ప కృషి యె అమర
దీప మాయే కృష్ణంరాజు దివ్య వెలుగు
కటకటాల రుద్రయ్య యే కానరాడు

భుక్తి లేకున్న బతుకుము ముష్టి యెత్తి!
శక్తి లేకున్న పోరాడు శక్తి కొలది!
ముక్తి లేకున్న మరుజన్మ పుట్ట వచ్చు
యుక్తి యున్న నరులకు   కుయుక్తు లేల?

ప్రాంజలి ప్రభ దత్తపది.

ఆ.వె.యుక్తితోడ జీవి యుగములు పాలించె
        యువత భుక్తికోరి ఉడత భక్తి 
        శక్తి యుక్తి కలిగి శాతము పొందును
        ముక్తివల్ల మనిషి ముందు కురికె.
ప్రభాశాస్త్రి జోశ్యుల,మైసూరు.
11-9-2022.

నేటి సమస్యను పరిష్కరించడం.....
గుండ్రాతికి కాళ్లు వచ్చి గునగున నడిచెన్
ప్రాస కాఠిన్యము

* ఉండ్రాళ్లను గణనాధుని
చండ్రా చెలిమీ వలననె చంద్రుని కళలై
తాం డ్రా వలెనులె  కదిలే  
గుండ్రాతికి కాళ్లు వచ్చి గునగున నడిచెన్

*ఉండ్రాళ్ళ సామి గణపతి,
గుండ్రని ఉండ్రాళ్ళు ముదము గొని తిని బంటౌ
గుండ్రాయిని కరుణించన్
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
 
* ఉండ్రాలవలే నుండే   
గుండ్రాలవలేనువెన్న ముద్దలు దొర్లే   
గుండ్రంగా తిరిగే కళ
గుండ్రాతికి కాళ్లువచ్చి గునగున నడిచెన్
 
* ఎందుకయాసాంబశివా
పొందిక గా నెలవంక పోరే గంగా
అందముగా సర్పము యే
వందన దాసానుదాస వాక్కులు గనుమా
 
* ఆత్మ సమర్పణ దేవర
ఆత్మానుభూతి వలన నె ఆ ద్యంతము గా
ఆత్మ నిగ్రహం మ్ము కలిగే
ఆత్మీయత భావము గాను ఆదర్శముయే
" వనమయూరః -- భ జ స న గ గ ..14/9
--
శ్రీ గజ ముఖంసుభగశేవధిబుధేశం ,
నాగవిలసద్వసననాగధరపుత్రమ్..
శ్రీగిరిసుతార్ద్రసువిశేషకరుణాత్తం ,
శ్రీగణపతింవరదసిద్ధిమనునౌమి !!! "
-

ఇక చదవండి 💐💐💐💐💐 (4)

మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి..

1. మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు పొట్ట గాయపడుతుంది.

2. మీరు 24 గంటల్లో 10 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు  కిడ్నీలు  గాయపడతాయి.

3. మీరు 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా  గాల్ బ్లాడర్ గాయపడుతుంది.

4. మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగు గాయపడుతుంది.

5. మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు  పెద్ద ప్రేగులు గాయపడతాయి.

6. మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు మరియు సిగరెట్ల కలుషిత వాతావరణంలో ఉన్నప్పుడు
లంగ్స్ గాయపడతాయి.

7. మీరు భారీగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు లివర్ గాయపడుతుంది.

8. మీరు ఎక్కువ ఉప్పు మరియు కొలెస్ట్రాల్‌తో మీ భోజనం తిన్నప్పుడు గుండె గాయపడుతుంది.

9. మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు ప్యాంక్రియాస్ గాయపడుతుంది. ఎందుకంటే అవి రుచికరమైనవి.

10. మీరు చీకటిలో మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు కళ్ళు గాయపడతాయి.

11. మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు గాయపడుతుంది.

---- ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు.

కాబట్టి జాగ్రత్త వహించండి మరియు మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి.

నీ దేహం దేవుని ఆలయం..

ఒక్క రోజు లoగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు..

కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తే 10 వేలు..

హార్ట్ లుంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో..

ఇంకా బ్రెయిన్ కి సబ్టిట్యూట్ రాలేదు, వస్తే కోట్లల్లో..

అంటే మెడికల్ పరిభాషలో, రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది..

దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా???

సర్వేజనా సుఖినోభవంతు 💐

03/08/2022 (3)
ఇక మొదలు పెట్టండి :-

రామాయణం లో ని ఎక్కువ ప్రాచుర్యం లోకి రాని ఘట్టాలు..
రావణ వధ జరిగింది.రావణుడు అచేతన స్థితిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు.ఇంకా ప్రాణం పోలేదు.రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి
" లక్ష్మణా , రావణుడు సకల విద్యా సంపన్నుడు.గొప్ప శివ భక్తుడు.సంగీతం లో కూడా ప్రవేశం ఉన్నవాడు.చివరి నిమిషంలో ఆయన వద్ద కూడా జ్ఞానం పొంది రా " అని పంపాడు.
లక్ష్మణుడు రావణుని దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు.రావణుడు చూసాడు కానీ ఏమీ మాట్లాడలేదు.లక్ష్మణుడు కొద్దిసేపు వేచి చూసి వచ్చేశాడు.
రాముడు " లక్ష్మణా ఏదైనా విషయం గురువు దగ్గర నేర్చుకోవాలనుకుంటే వారి పాదాల దగ్గర నిలబడాలి.నువ్వు రావణుడి తల వైపుకు నిలబడ్డావు అందుకే రావణుడు మాట్లాడలేదు .ఇప్పుడు పాదాల వద్ద నిలబడి జ్ఞానం అర్ధించు " అని మళ్ళీ పంపాడు.
ఇప్పుడు లక్ష్మణుడు రావణుడి పాదాల దగ్గర ప్రణమిల్లాడు రావణుడు కళ్ళు తెరిచి ఏం కావాలని అడిగాడు. లక్ష్మణుడు
" చివరి నిమిషంలో చెప్పే వాక్యాల్లో జీవితానుభవమూ వేదాంతమూ ఉంటాయని అన్న గారు మీ వద్దకు పంపారు " అన్నాడు..
అప్పుడు రావణుడు..
" లక్ష్మణా..ఈ నాలుగు ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకో..
1..వాట్సాప్ లో వచ్చిన ప్రతీ కథకు అంతగా కనెక్ట్ అయిపోకు..అన్నీ ఉత్తివే..

2. 3.MB కన్నా ఎక్కువ మెమరీ ఉన్న వీడియోలు ఎవరికీ షేర్ చెయ్యకు.మెమరీ అందరికీ అవసరమే
.
3. ఫేస్బుక్ లో వాట్సాప్ లో మతపరమైన రాజకీయ చర్చల్లో ఆవేశపడిపోయి స్నేహితులను దూరం చేసుకోకు.

4. చివరిది నిర్మల సీతా రామన్ బడ్జెట్ గురించి ఏమీ మాట్లాడకు.అందులో నీకు నాకు ఎవరికీ సంబంధించి0ది ఏదీ లేదు..

రావణుడు...హరీ..
Mallaprgada Ramakrishna


 

chinna kadha - 2

ఒక ట్రక్ డ్రైవర్ ఒక పిచ్చాస్పత్రికి సరుకు రవాణా చేసి వస్తుండగా ట్రక్ టైర్ ఒకటి పంక్చర్ అయింది. రోడ్డు పక్కన ట్రక్కును ఆపుకొని కొత్త టైర్ బిగించడానికి సిద్ధం అయ్యాడు అంతలో చేతిలో ఉన్న నాలుగు బోల్టులు జారి కాలవలో పడిపోయాయి. అవి దొరికే పరిస్థితి లేదు.

 
ఏం తోచక తలపట్టుకు కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక రోగి అటు పోతూ డ్రైవర్ను ‘ఏమైంది’ అని అడిగాడు. ‘సమస్యను ఎవరికైనా చెప్పుకుంటే బాధ తీరుతుంది కదా’ అని రోగికి ”బోల్టులు టైరుకు బిగించేప్పుడు కాలవలో పడిపోయాయి అని నిస్సహాయంగా చెప్పాడు.

రోగి ఒక్కసారిగా ఫక్కున నవ్వి, “ఇంత చిన్న సమస్య పరిష్కరించుకోలేకపోతే ఎప్పటికీ ట్రక్ డ్రైవర్ గానే ఉండి పోతావ్. మిగిలిన మూడు టైర్లలోనుండి ఒక్కొక్క బోల్టు తీసి ఈ టైరుకు బిగించు.

ఆ తరవాత దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్కి వెళ్లి కొత్తవి బిగించుకోవచ్చు.” డ్రైవర్ ముగ్ధుడై, “ఇంత తెలివైన వాడివి పిచ్చాస్పత్రిలో ఎందుకున్నావ్” అన్నాడు. “నేను వెర్రివాడినేమో కానీ, తెలివితక్కువ వాడిని కాను.”

 
మన చుట్టూ ఉండేవాళ్ళను తెలివితక్కువవాళ్ళుగా భావించకూడదు. అన్నీ మనకే తెలుసు అనుకోకూడదు. మన తెలివికి అందని ప్రశ్నలకు చాలా మంది మంచి
పరిష్కారాలు చూపించగలుగుతారు. ఒక వ్యక్తి రూపురేఖలు, వస్త్రధారణ, స్థాయి, స్తోమత, విద్యార్హతలు చూసి తక్కువగా అంచనా వేయకూడదు.

సేకరణ – ప్రాంజలి ప్రభ

చిన్న కధలు ( 1)
మనస్సు నీటి మడుగు లాంటిది అని కూడా అన్నారు .
మడుగులో నీరు బురద బురదగా ఉంటే ఆ మడుగులో ఏమి ఉన్నాయో తెలియదు. ఎలాంటి మొక్కలున్నాయి, అడుగున ఏమైనా ముళ్ళూ రాళ్ళూ ఉన్నాయా, ఎలాంటి జలచరాలు ఉన్నాయి. ప్రాణాలు తీసే పాములు పట్టి మింగే మొసళ్ళు... ఏమి ఉన్నాయి, అసలు దాని లోతు ఎంత.. ఇవేవీ మనం తెలుసుకోలేం. అలాగే మన మనస్సు అకుశల (చెడ్డ) భావాలతో, ద్వేషం, మోసం, రాగం, మోహం, కామం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయల్లాంటి దుర్గుణాలతో నిండి ఉంటే, ఆ మనసు కూడా మురికిగా ఉన్న మడుగులాంటిదే. దానివల్ల నష్టాలు, కష్టాలు, దుఃఖాలు, ఆవేదనలు, భయాలూ, అశాంతి అలముకుంటాయి. అవి ఆ మురికిలో పడి కనిపించకుండా కష్టాలు తెచ్చిపెడతాయి. మనల్ని అథోగతి పాలు చేస్తాయి.

మరి, ఆ మడుగులోని నీరు తేటగా స్వచ్ఛంగా ఉంటే, అందులో ఏమేమి ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. మడుగు అడుగున ఉన్న ముళ్ళూ, రాళ్ళూ, మొక్కలూ తెలుస్తాయి. పాములూ, మొసళ్ళూ కనిపిస్తాయి. ఆ మడుగులోతు ఎంతో తెలుస్తుంది. కాబట్టి అలాంటి మడుగువల్ల ఎలాంటి ఆపదలు రావు. అలాగే మనస్సు కూడా నిర్మలంగా ఉంటే కామ, రాగ, మోహ, ఈర్ష్య పగలకు దూరంగా ఉంటాం. అప్పుడు మనస్సులో శాంతి ఉదయిస్తుంది. కుశల కర్మలు విప్పారుకుంటాయి. దుఃఖం లోతులు తెలుస్తాయి.


* సమస్య. పూరించింది మల్లాప్రగడ రామకృష్ణ :  03-08-2022
చతురాస్యున్ సృజియించె వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్
 

మత్తేభము.
మతిసాధ్యాసమయమ్ము గా కమల లక్ష్మీదేవి పొందే సుఖం
గతిసాధ్యా కళల న్నిఏ సుఖము ధైర్యమ్మేను పంచే సుఖం      
సతి సాధ్యాసహనమ్ముయే విజయ  మాధుర్యంను పొందే సుఖం
చతురాస్యున్ సృజియించె వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్
డా.పల్లేరు వీరాస్వామి పూరణ
 

సమస్య:
చతురాస్యున్ సృజియించె వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్
మత్తేభము.
హితమౌ రీతిగ సృష్టిజేయ హరి సాహిత్యానుశీలుండునౌ
చతురాస్యున్ సృజియించె; వాణి సకలైశ్వర్యప్రదున్ బ్రహ్మనున్
పతిగా పొందెను;విష్ణుమూర్తి పదమున్ బట్టెన్ మహాలక్ష్మియున్
సతియే వేడెను నీలకందరుని కోసం తాను సన్యాసియై

౦౩/౦8/౨౦౨౨

No comments:

Post a Comment