కలియుగ జ్ఞానం..
మల్లాప్రగడ రామకృష్ణ
1 *మీరు నియంత్రిస్తే మీ మనస్సు మీకు గొప్ప స్నేహితుడు.*
*కానీ అది మిమ్మల్ని నియంత్రిస్తే మీ మనస్సే మీకు అత్యంత శత్రువు.*
2 *ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువెక్కువ.*
*మనిషి ఎంత శ్రీమంతుడైన గుణానికి, వ్యక్తిత్వానికే విలువెక్కువ.*
3*ఎంత ఒంటరిగా ఉంటే అంత వెలుగుతావు*
*సూర్యుడు కూడా ఒంటరివాడే ప్రపంచానికి వెలుగు ఇవ్వడం లేదా.*
4 *స్నేహం,ప్రేమ అనేవి దీపం లాంటివి.*
*వెలిగించడం సులభమే కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం.*
5*నలుగురిలో ఉన్నప్పుడు మాటని*
*ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు.*
6*ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో*
*ఆ క్షణం నుండి మన మనసుకు సంతోషం ప్రారంభం అవుతుంది.*
7 *జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం "నిన్న" కలిగిన బాధను తలుచుకుంటూ కృంగి పోకుండా*
*"నేడు" కనిపిస్తున్న వాస్తవాన్ని గమనిస్తూ "రేపటి" ఆనందం కోసం దారులు వెతకాలి.*
8.జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా*
*నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు అప్పుడే మనిషి జన్మకు ఒక అర్థం ఉంటుంది.*
9 *జీవితంలో డబ్బు కన్నా విలువైంది మనశ్శాంతి.*
*ఎందుకంటే దాన్ని ఎవ్వరూ కొనలేరు, అమ్మలేరు.*
10*తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా గొప్పగా పూర్తిచేయగలడు.*
*కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు.*
11 *వేయి అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే*
*ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం ఉత్తమం.*
12 *ఎప్పుడూ మంచి రోజు అనేది ఉండదు.*
*కానీ ఎప్పుడైనా గాని మంచి ఆలోచనలతో మనం ఏ రోజునైనా మంచిరోజుగా మార్చుకోవచ్చు.*
13*ఆకలిగా ఉన్నవారికి గుప్పెడు అన్నం,ఆపదలో ఉన్న వారికి కొంచెం సాయం*
*బాధలో ఉన్న వారికి కొంచెం ఓదార్చు అందించ డమే నిజమైన మానవత్వం*
14*గుణానికి మనకంటే ఎక్కువ ఉన్నవారితోనూ*
*ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి.*
15*స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకూడదు*
*మర్యాద ఇవ్వని వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు.*
16*నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకూడదు.*
*అహంకారం చూపే వారితో కూడా కలవకూడదు.*
17 *మనకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి.*
*కానీ మంచి అనిపించుకోవడం కోసం చేయకూడదు.*
18 *మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడినప్పుడు భుజం తట్టేవాళ్ళు*
*నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉండదు.*
19*తప్పు చేసానని చింతించి , తిరిగి అదే తప్పు మనం చేస్తూ ఉంటే*
*ఆ ప్రశ్చాత్తపానికి విలువేముంది.*
20 *ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు*
*ఏదో ఒక రోజు మనల్ని ఒంటరిని చేస్తారు.*
21 *దూరంగా ఉన్నవారిని దగ్గరగా చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటిమాటకే ఉంది.*
*అది కత్తి కంటే పదునైనది అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచి దవుతుందని*
22*గెలుపు ఎన్నో ఓటములను మరిచేలా చేస్తుంది, ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది.*
*ప్రయత్నించి చూస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు.*
23 *మనిషి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటాడో*
*అంత ప్రతిభావంతుడుగా తయారు అవుతాడు.*
24 *మంచి కోసం మనిషి మారాలి కానీ*
*అవకాశం కోసం రంగులు మార్చుకోకూడదు.*
25*జీవితంలో అన్ని కష్టాలకు రెండే మందులు, ఒకటి శ్రమ చేయడం, రెండు సహనంగా ఉండడం.*
*శ్రమ చేయడం వల్ల నీవు ఏంటి అనేది నలుగురికి తెలిసేలా చేసుకుంటావు, సహనంగా ఉండడం వల్ల బంధాలను కాపాడుకోవడం ఎలా అని తెలుసుకుంటావు.*
26*తెలివైన వారు తమ మాటలతో విలువైన కాలాన్ని హరించరు.*
*వాళ్లెప్పుడూ కాలాన్ని కాపాడటానికి మాటల పొదుపు పాటిస్తారు*
27*మీరు నియంత్రించ గలిగితెే మీ మనస్సు మీకు గొప్ప స్నేహితుడు.*
*కానీ అది మిమ్మల్ని నియంత్రిస్తే, మీ మనస్సే మీకు అత్యంత శత్రువు.*
28*ఇంత నేర్చుకున్నానన్న గర్వం "విద్య" కుంటుంది.*
*ఇంతకు మించి నేర్చుకోలేదన్న "వినయం" వివేకానికుంటుంది.*
29*నిన్నటి న్యూస్ పేపరు నేడు వేస్ట్ పేపరుగా మారవచ్చు కానీ రేపటికి చరిత్రను చూపించే సాక్ష్యం కూడా ఆ వేస్ట్ పేపరే అవుతుంది.*
*అవసరం లేదని దేనినీ వదిలేయకండి ఆపదలో ఉన్నప్పుడు అదే నీకు అస్త్రంలా ఉపయోగపడవచ్చు.*
30 *జీవితంలో మనం నేర్చుకున్న ప్రతిదీ*
*ఏదో ఒకరోజు మన జీవితంలో ఉపయోగపడుతుంది.*
31 *వాక్కు అదుపులో ఉన్న మనిషికి సర్వగుణాలు చేతిలో ఉంటాయి.*
*కోరికల గుర్రాల్ని అదుపు చేయగల శక్తి అలాంటి వారికి లభిస్తుంది.*
32*విమర్శలను కూడా మీరు వినయంతో స్వీకరించినపుడే*
*విజయం కూడా మీ సొంతం అవుతుంది.*
33*నీటిలో విసిరిన రాయి హృదయంలో గుచ్చుకున్న మాట మాయమై పోవు*
*రాయి కరిగిపోదు, మాట మారిపోదు*
34 *నీటితో స్నానం చేసినవాడు బట్టలు మాత్రమే మారుస్తాడు.*
*చెమటతో స్నానం చేసినవాడు చరిత్రనే మారుస్తాడు.*
35*జీవితంలో మనల్ని అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు, అసూయపడేవారు ఆత్మ గౌరవాన్ని నేర్పిస్తారు.*
*తప్పు పట్టేవారు మనలో కొత్త ఆలోచనలకు పునాది వేస్తారు.*
36*ఒక వయస్సు వరకూ ఆర్థిక భద్రత కోసం ఆస్తులు సంపాదించడం కోసం కష్టపడాలి.*
*ఆ తర్వాత ఆత్మీయులను, అనుభూతుల్ని సంపాదించడo కోసం కష్టపడాలి.*
37 *ఎంత కాలం నుంచి పరిచయం అయ్యారు అన్నది కాదు స్నేహానికి కావలసింది*
*ఎంత బాగా అర్ధం చేసుకున్నారు అన్నదే స్నేహానికి ముఖ్యం.!*
38 *నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని*
*కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు.*
39 *మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు.*
*దానిని ఎవరి వద్ద నిరూపించుకోవాలని ప్రయత్నించ వలసిన అవసరంలేదు.*
40 *చలనం లేని రాయిని కూడా చెక్కడం మొదలుపెడితే శిల్పమవుతుంది.కదల్లేని రాయిలోనే శిల్పం దాగుంటే*
*పరుగులు పెట్టగల నీలో గొప్పగా బతకడానికి ఏదో ఒకటి వుండే వుంటుంది ఒక్కసారి ఆలోచన చేసి చూడు.*
41*సముద్రంలో రాయి విసిరితే సముద్రానికి ఏమీ కాదు, రాయే సముద్రంలో కనపడకుండా పోతుంది.*
*ధైర్యంగా మనముంటే విమర్శించే వారే కనపడకుండా పోతారు.*
42*భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేము.*
*తెగించడం తెలియక పోతే బాధల నుండి బయట పడలేము.*
43*ఎదగాలి అనే లక్ష్యంతో బలహీనమైన మొక్క కూడ బలమైన బండరాయిని సైతం చీల్చి పెనువృక్షంగా మారుతుంది.*
*అలాగే గెలవాలి అనే లక్ష్యం ఎంతటి కష్టాన్నైనా సునాయాసంగా జయిస్తుంది.*
44 *జీవితంలో ఎవరినీ తక్కువగా అంచనా వెయ్యకండి.*
*టమాటో ఆపిల్ తో సమానంగా అవుతుందని ఎవరైనా ఊహించారా.*
45 *మంచి అయినా చెడు అయినా మన చేతుల్లోనే ఉంటుంది వాటిని సరిదిద్దుకునే సామర్థ్యం కూడా మనలో దాగి ఉంటుంది.*
*తప్పును గ్రహించి సరిదిద్దుకున్న రోజే పతనానికి దూరంగా విజయానికి దగ్గరగా అడుగులు వేయగలుగుతాం*
46 *ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్ప గుణం ఉంటుంది.*
*మనకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణముండాలి.*
47 *సహనం నీకుంటే సర్వం నీదే.*
*వినయం నీకుంటే విజయం నీదే.*
48 *మనల్ని మోసం చేశారని తోటివారిని, మనకోసం ఆగలేదని కాలాన్ని, ఎప్పుడూ నిందించకు.*
*ఎందుకంటే మోసపోవడంలో , కాలాన్ని వృధా చేయడంలో మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది.*
49 *నిప్పు అప్పు పగ తమంతట తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి అందుకే*
*నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి.*
50 *జీవితంలో అన్ని కష్టాలకు రెండే మందులు, ఒకటి శ్రమ చేయడం, రెండు సహనంగా ఉండడం.*
*శ్రమ చేయడం వల్ల నీవు ఏంటి అనేది నలుగురికి తెలిసేలా చేసుకుంటావు, సహనంగా ఉండడం వల్ల బంధాలను కాపాడుకోవడం ఎలా అని తెలుసుకుంటావు.*
51 *తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు సరిదిద్దు కుంటారు.*
*మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడూ నీ జీవితంలో చోటివ్వకు.*
52 *వయస్సు పెరుగుతుంది అంటే జ్ఞానం పెరగాలి కాని*
*ఎదుటివారిని చులకన చేసి మాట్లాడే రోగం పెరగకూడదు.*
53 *జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా*
*నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు.*
54 *విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు, ధనం వచ్చిందని స్నేహం మర్చిపోకు.*
*కాలం నీదని మిడిసిపడకు,
*గౌరవం వచ్చిందని గతం మర్చిపోకు, అవసరం తీరిందని సాయపడిన వారిని మర్చిపోకు.*
55*లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలివ్వడం ఒక్కటడిగితే వెయ్యి చెబుతారు*.
*అన్నింటికంటే కష్టమైనది సహాయం చెయ్యడం వెయ్యిమందిని అడిగితె ఒక్కరు మాత్రమే చేస్తార
అసమానతలు అమానుషాలు'
ఒకానొకప్పుడు ఒక కీకారణ్యంలో అనేక జంతువులు, పక్షులు జీవిస్తూ ఉండేవి. అదే అరణ్యంలో కొన్ని చిలుకల కుటుంబాలు జీవిస్తూ ఉండేవి. అందులో రెండు చిలుకలు చాలా నేస్తంగా ఉండేవి. ఒకదానికోసం మరొకటి ప్రాణం ఇచ్చుకోగలిగినంత గాఢమైన స్నేహం వాటిది. అవి ఆ అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తూ వాగులలో స్నానం చేస్తూ, ఆ అడవిలో దొరికే ఫలాలు తింటూ ఉండేవి.
ఆ అడవి వాతావరణంలో అవి ప్రకృతినియమాలు మినహా మరే నిబంధనలుగాని, నియంత్రణలుగాని లేకుండా స్వేచ్ఛగా పెరిగాయి. అంతే కాకుండా వాటికి తోచినమేరకు, వాటి సామర్ధ్యం మేరకు అవి ఇతర జంతువులకు, పక్షులకు, సాయం చేసేవి.
ఆ అరణ్యానికి సమీపంలోనే మునీశ్వరుల కుటీరాలు కొన్ని ఉండేవి. ఆ చిలుకలు రెండూ అక్కడక్కడ తిరుగుతూ ఆశ్రమవాసుల దినచర్యల్ని గమనించనారంభించాయి. ఆ మునీశ్వరులు జీవిస్తున్న పద్ధతి, పిల్లలకు విద్యనేర్పే విధానం వాటికి బాగా నచ్చింది. అవి తమలో తాము "అరే, ఈ మానవులు ఎంత అదృష్టవంతులు! వాళ్ళకు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు భగవంతుడు. దానితోబాటు విద్యనేర్చుకునే అవకాశాన్నిచ్చాడు.
చూడు ఆ పిల్లలు గురువుగారి వద్ద ఎంత చక్కగా విద్యలు నేర్చు కుంటున్నారో!" అని ముచ్చటించుకునేవి. అలా కాలం గడిచి పోతున్నది; రెండు చిలుకలకూ వయస్సు మీద పడుతున్నది. వాటి స్నేహం మరింత బలపడి కొనసాగింది. వాటిలో ఒక చిలుకకు తానూ చదువుకోవాలనే కోరిక మరింత బలంగా కలిగింది. కాలం గడచి పోయింది; రెండు చిలుకలూ చనిపోయాయి.
మరణానంతరం వాటి మంచి హృదయాలకు అనుగుణంగా వాటికి స్వర్గ ప్రాప్తి కలిగింది. అలా స్వర్గంలోకూడా వాటి మైత్రి కొనసాగింది. ఆ చిలుకల మైత్రికి సంతోషపడిన భగవంతుడు కొంతకాలం తరువాత వాటిని పిలిచి, "చిలుకల్లారా, మీ స్నేహం కారణంగా మీరు నాకెంతో ప్రియమైనవారైనారు. మీరు స్వర్గలోకాన్ని విడచి వెళ్తున్న సందర్భంగా కోరిన జన్మనొందేలా మీకు వరం ఇవ్వదలచాను. ఏజన్మ కావాలో కోరుకోండి" అన్నాడు.
ఒక చిలుక "మహానుభావా! నీ దర్శనంతో నా జన్మ పావనమైంది. నాకు ఇదివరకటిలాగానే చిలుక జన్మను ప్రసాదించు. అదే అరణ్యంలో నేను మళ్ళీ జన్మించేలా వరమివ్వు" అని అడిగింది. రెండవ చిలుక తనకు మనుష్యజన్మ ప్రసాదించమని వేడుకున్నది. భగవంతుడు "తథాస్తు" అని దీవించాడు. మరుక్షణం ఒకటి చిలుకలాగాను, ఒకటి మనిషిలాగాను భూమిమీద జన్మించాయి.
మొదటి చిలుక అరణ్యంలో జన్మించే సరికి అరణ్యం తగలబడుతున్నది. అక్కడ ఉండవలసిన ముని కుటీరాలు ఏనాడో శిధిలమైనాయి. అరణ్యంలోని చెట్లన్నీ ఏనాడో మనిషివాతనబడి గతించాయి. ఆ అరణ్యంలోంచి బయటపడి ఎంతో శ్రమతో తప్పించుకున్నాయి కొన్ని చిలుకలు. అలా ప్రాణాలతో మిగిలిన చిలుకలకు ఇక ఆహారం కరువైంది.
తినేందుకు మధుర ఫలాలు లేవు; గూడు కట్టుకునేందుకు అనువైన చెట్లు కానరావటం లేదు. ఎక్కడ చూసినా కాలుష్యం. ’సుసంపన్నమై, తనను ఊరించి ’రా, రమ్మ’ని పిలిచిన గత జీవితం ఎక్కడున్నది? ’గతం గత:’ గతించిన కాలం మళ్ళీ రాదు. సర్వ సంపదలతో తులతూగే అలాంటి జీవితాన్ని తిరిగి సృజించుకోగలిగే సామర్ధ్యం ఈ చిలుక జన్మకు లేదు. ఇలాంటి జన్మనా, తను కోరుకున్నది?’ అని వగస్తూ చిలుక తన జీవితాన్ని అతి భారంగా నెట్టుకొచ్చింది.
రెండవ చిలుక మానవజన్మనెత్తింది కదా, దాని తల్లిదండ్రులు పల్లెలో జీవితాలు గడపలేక, పట్టణానికి వలస పోయారు. అక్కడ అది అనేకమంది పిల్లలలాగే మురికిగుంటల్లో, రోడ్ల మాటున, అర్ధాకలితో పెరగవలసి వచ్చింది. తనను ఊరించిన అద్భుత విద్యావిధానం కొందరికి మాత్రమే అందుతుందని దానికి ఆలస్యంగానైనా, అర్ధమైంది. భగవంతుడు మనిషికి ఇచ్చిన చింతనా శక్తితో అది ’ఎందుకిలా?’ అని ప్రశ్నించుకున్నది.
’భగవంతుని సృష్టిలో అందరూ ఒకటికాదూ? మానవులు సృష్టించుకున్న ఈ తారతమ్యాల్ని మనిషిగా తను రూపుమాపలేకపోతే తన జన్మ ఎందుకు?’ ఆ చిలుక స్వశక్తితో ఇక గొప్ప నాయకునిగా ఎదిగింది. మానవలోకంలో సత్యానికి, ప్రేమకు ఇంకా స్థానం ఉన్నదని, వాటిని మిగుల్చుకోకపోతే మనందరి జీవితాలూ శిలా సదృశాలే అవుతాయని ప్రవచించింది. దాని మాటలు మెల్లమెల్లగా దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. 'అసమానతలు అమానుషాలు' అన్న భావన పెరిగింది. మానవసమాజం మెల్లగా వెలుగువైపు పయనించింది. తన జీవితం సార్ధకమైందన్న సంతృప్తి దానికి కలిగింది.
--(())--
ప్రతిఒక్కరు చదవండి.. గమ్యానికి వెలుగు తెలుగు
ReplyDelete