Thursday, 9 November 2023

*

 [ప్రాంజలి ప్రభ 


*జీవిత సూత్రం*ప్రాంజలి ప్రభ 

               

*మనిషి జీవితం కేవలం తాత్కాలికం. అటువంటి జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తూ, జీవిత ప్రయాణాన్ని సాగిస్తుంటారు.*


*ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పరిచయం చేసిన ఈ మహాభారతం మనిషి జీవితానికి ఎంతో అర్థాన్ని కూడా వివరించింది. అయితే ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన ఆ నాలుగు మంత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…*


*“సర్వే క్షయాంత నిచాయంః పతనంతఃసమ్రుశ్ఛాయః”* 

*“సంయోగ విప్రయోగంత మారాతంత చ జీవితమ్”*


*ఈ నాలుగు మంత్రాలు చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది.*


*వీటి అర్థం పరమార్థం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…*


*1. సర్వే క్షయాంత నిచాయంః*


*ఈ ప్రపంచంలో ఉద్భవించిన ప్రతి ఒక్క వస్తువు చివరికి నాశనం కావాల్సిందే. అటువంటి వాటి కోసం కొందరు జీవితాంతం కష్టపడి సంపాదిస్తూ ఉంటారు.*


*వారు ఎలాంటి పనిచేసినా చివరకు మిగిలేది వారు చేసిన మంచి, చెడు మాత్రమేనని మనకు మహాభారతం తెలియజేస్తుంది.*


*కాబట్టి దురాశతో ఎక్కువ సంపాదనలో మునిగిపోవడం కాకుండా అవసరమైనంత మేరకు డబ్బును సంపాదించుకోవాలని తెలియజేస్తుంది.*


*2. పతనంతః సమ్రుశ్ఛాయః*


*ఈ మంత్రం అర్థం మనం జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ, గొప్పలకు పోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక వ్యక్తి గొప్పగా ఎదిగితే తన కింద ఉన్న వ్యక్తులను ఆదరించేందుకు కృషి చేయాలి.*


*3. సంయోగ విప్రయోగంత:*


*ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో సంయోగం ఉంటే అందుకు తగ్గ వియోగం కూడా ఉంటుంది. అనుకోకుండా కొంత అదృష్టం మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎంతో సంబరపడతాము.*


*అలాగే దూరం అయినప్పుడు బాధపడతాము. మన జీవితంలో సంయోగం, వినియోగం ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.*


*4. మారాతంత జీవితమ్*


*దీని అర్థం   పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. వ్యక్తుల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలి కానీ, చనిపోయినప్పుడు పశ్చాత్తాపడకూడదు.*


*ఈ విశ్వంలో జననం, మరణం మాత్రమే వాస్తవమైనవి.*

*మిగిలినవన్నీ మన జీవితంలో ఏర్పడే తాత్కాలికమైన సంఘటనలు మాత్రమే.*


*మనిషి ఈ నాలుగు స్తోత్రాలను పఠించి, పాటించడం ద్వారా ఏ వ్యక్తి జీవితంలోనూ ఎటువంటి కష్ట,నష్టాలు ఉండవని మనకు మహాభారతం తెలియ చేస్తుంది*

*మార్పు మన నుండే మొదలవ్వాలి....!*

[16/07, 12:35 pm] . Mallapragada: *మోసం చేసే  మనిషి  ముందు.....   మాంసం  తినే   పులి.....  క్రూరత్వం .. చిన్నబోతుంది*

ప్రజల సొమ్మును దానం చేసే మనిషి ముందు... మృగరాజు సింహం చిన్నబోతుంది


       _* ఒక మంచి వాడు పతనం అయ్యాడు అంటే....._*

*_ఎంతోమంది చెడ్డ వాళ్ళు ఒక్కటై ఉండాలి....._*


* ఒక మంచి వాడు తాగుబోతు డయ్యాడంటే *

* ప్రభుత్వ ధనాన్ని పెంచే మనిషై ఉండాలి*


*_అవసరాన్ని బట్టి భజన,_*

*_అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారు,_*

*_మన చుట్టూ బోలెడు మంది ఉంటారు.._*


*ధనాన్ని బట్టి భజన* *అవకాశాన్ని బట్టి పార్టీ మార్చేవాడు*


 *పెత్తనం కోరుకునేవాడు* ,_*

*_బానిసత్వంను వృద్ధి చేస్తాడు.._*


*మాటల గారడీ చేసేవాడు నాయకుడౌతాడు*

*బలహీనులను బలవంతులు గా బానిసలుగా మారుస్తాడు*


*_అధికారంను కామించేవాడు,_*

 *భజనబృందంను బలోపేతం చేసుకుంటాడు..*


*మానవత్వం ఉన్న వాడు మనసు పంచి బ్రతుకు తాడు*


_****

[16/07, 12:57 pm] Prathyusha: #నేను నేను #నేను నేను #నేను - ఈ భావనను వదిలివేయండి. 


1) నేను చాలా మొత్తాన్ని ,చాలా సార్లు విరాళం ఇచ్చాను 

2) నేను చాలా దేవాలయాలను సందర్శించాను 

3) నేను చాలా మందికి సహాయం చేసాను 

4) నేను చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేశాను 

5) నేను అనాథ పిల్లలను దత్తత తీసుకున్నాను 

6) నేను రక్తదానం చేశాను 

7) నేను చాలా చెట్లను నాటాను

8) నేను అరుణాచలం, తిరుపతి, కాశీకి చాలాసార్లు వెళ్ళాను 

9) నేను చాలా దీక్షలను తీసుకున్నాను (అయ్యప్ప, హనుమాన్, భవానీ, శివ) 

10) నేను చాలా సార్లు అన్నదానం చేశాను 

11) నేను చాలా పక్షులను, జంతువులను పోషించాను

12) నేను సమాజానికి చాలా చేశాను 

13) నేను చాలా భక్తితో జీవిస్తున్నాను 

14) నేను అన్ని ధర్మాలను అనుసరిస్తున్నాను 

15) నేను గోషాలాలను నడుపుతున్నాను, గౌ సేవా కూడా చేస్తాను 

16) నేను రోజూ భజనలు చేస్తాను 

17) నేను చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాను

18) నేను చాలా మందికి ఆశ్రయం ఇచ్చాను

19) నా దగ్గర కోట్లు, కోట్లు ఆస్తి ఉన్నాయి


చివరగా, మీరు మీ స్వంత శక్తితో ఇవన్నీ చేశారని మీకు అనిపిస్తే, 

అది పూర్తిగా వ్యర్థం.


#నేను నేను #నేను నేను #నేను - ఈ భావనను వదిలివేయండి.


 మీరు చేసారు ఎందుకంటే, 

ఈశ్వరుడు ఈ పనులు చేయడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు.

ఇది మీ క్రెడిట్ కాదు, 

ఇది శివుడి క్రెడిట్.  

మీరు కేవలం ఆటగాడు మాత్రమే 

మరియు  

హీరో, స్క్రీన్ ప్లే, కథ రచయిత, నిర్మాత ,దర్శకుడు శివుడు మాత్రమే.


 మీ మనస్సులో ఈ భావన ఉంటే, 

అప్పుడు మీరు గొప్ప వ్యక్తిగా పరిగణించబడతారు. 


మీరు ఈ రోజు గొప్ప వ్యక్తి, 

మీరు ఏమి చేసినా, 

శివుడు మీ వెనుక ఉన్నాడు.

దీన్ని ఎప్పటికీ మరచిపోకండి.

 శివుడు సహాయం, మద్దతు లేకుండా మీరు ఒక్క పని కూడా చేయలేరు.🙏

[16/07, 1:01 pm] Prathyusha: 🌞🌞🌞 *ఉషోదయ ఉషస్సు*🌞🌞🌞 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమ్*

*"వేద .. యోగ" వ్యాఖ్యానం*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


🌻 *"విష్ణు సహస్రనామ స్తోత్రం" - "వేదార్థం - యోగార్థం"* 🌻


                   *పార్ట్ - 39*


*అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ౹*

*సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ౹౹*


🌼 *వేదార్ధం :* ఓ పరంధామా! అతుల్యుడవైన నీతో *(అతులః)* సమంగా తులతూగేవారు

సమస్త చరాచర సృష్టిలో ఎవ్వరూ లేరు. జీవుల శరీరాలలో *(శరభో)* నివసించే నీవు..

అధర్మ మార్గంలో పయనించే వారిలో భయాన్ని *(భీమ)* కలుగజేస్తావు. సృష్టి అనే

మహాయజ్ఞాన్ని (సృజన - పోషణ- విధ్వంసం) సమయానుకూలంగా నిర్వహించే

యజ్ఞకర్తా *(సమయజ్ఞా)!* నీవు వివిధ లోకాలలో జరిగే యజ్ఞ క్రతువులలో సమర్పించే

హవిస్సును ప్రీతితో స్వీకరించే హరివి *(హవిర్హరిః).*


సకల జ్ఞానసంపన్నుడవైన *(సర్వలక్షణ)* నీవు బ్రహ్మజ్ఞానాన్ని *(లక్షణ్య)*

బ్రహ్మజిజ్ఞాసువులకు అందజేస్తావు. భక్తులకు లక్ష్మీ కటాక్షాన్ని అనుగ్రహించే *లక్ష్మీపతివై*

ఆమెను నీ హృదయ పద్మంలో ధారణ చేసినవాడవు. యుద్ధాలలో సదా విజయుడిగా

నిలిచే ఓ *సమితింజయా!* నీకు నా నమస్సుమాంజలి.


🌼 *యోగార్థం :* ఓపరంధామా! దేహమే దేవాలయమని విశ్వసిస్తున్న యోగులు.. ఆత్మనే దైవంగా

కొలుస్తారు. *సాధన ద్వారా మృత్యు భయాన్ని జయించిన వీరు..* *ఆత్మోన్నతికై నిరంతరం*

*తపిస్తూ.. జీవన యజ్ఞాన్ని* *పూర్తి జాగరూకతతో* *కొనసాగిస్తూ.. సమయానుకూలంగా*

*స్పందిస్తారు. జీవుల దుఃఖానికి మూలమైన* *అవిద్యను రూపుమాపటానికై..*

*జ్ఞానయజ్ఞాన్ని*

*చేబట్టి.. ఆత్మజ్ఞానాన్ని పంచుతూ.. జీవులను కర్మపాశాల నుండి* *విముక్తులను చేస్తారు.*


     ఆత్మజ్ఞానం పొందిన సాధకుల నేత్రాల నుండి వెలువడే ఆనందపు వెలుగులకు

(శ్రీ) ప్రీతిచెంది.. ఆనందతరంగపు కెరటాలనే సృష్టిస్తారు. అతుల్యమైన అలాంటి

యోగులకు నా యోగసుమాంజలి.


                   *- శ్రీమతి గుత్తా లక్ష్మీ*


🧘‍♀🌏💦🔥💨🎇🌞🌛🌟🌈

🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

[16/07, 1:13 pm] Prathyusha: కందిపప్పు రేటు విని గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు.

డెత్ సర్టిఫికెట్లొ చావు కారణం ఇలా వ్రాసారు " పల్స్ రేటు ఎక్కువయి "

😊😊😊😊😊😊

ఒక గుడిలో ఒక గాడిద ఉండేది ... జనాలు దేవుడికి పూజలు చేయడం చూసి ఇది కూడా మొదలెట్టింది ....

దీని పుజలకి మెచ్చి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు ..

దేవుడు : ఎమ్ కావాలో కోరుకో ?

గాడిద : తర్వాత జన్మలో కూడా నన్ను గాడిద లానే పుట్టించు సామీ .....

దేవుడు : రెండు జన్మల్లో ఒకేలా పుట్టించడమ్ కుదరదు ..ఇంకేదైనా కోరుకో ...

గాడిద : సరే నన్ను ' భర్త ' గా పుట్టించు....

దేవుడు : ఎదవ తెలివితేటలు చూపించమాకు నా దగ్గర ... ఒకేలా రెండు సార్లు పుట్టించడమ్ కుదరదని చెప్పానా........

😊😊😊😊😊😊😊😊😊

నెలరోజుల కోసం పుట్టింటికెళ్లిన రమ్య మూడ్రోజుల్లోనే తిరిగొచ్చి తలుపు తట్టింది..

తలుపు తీసిన భర్త సుబ్బారావు..పకపకా నవ్వుతుండడం చూసి ఆశ్చర్యంగా అడిగింది.

"దేనికలా నవ్వుతున్నావ్..?"

"ఏం లేదు..మన పెద్దలు చెబుతుంటారుగా..భయంకరమైన సమస్య వచ్చినప్పుడు నవ్వుతూ ఎదురెళ్ళాలని..అందుకే."

వైఫ్ షాక్..హస్బెండ్ రాక్..

😊😊😊😊😊😊😊😊

ఓ వ్యక్తి ఓ రోజు భార్యతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ అమ్మాయి అతన్ని చూసి హల్లో చెప్పింది.

అప్పుడు భార్యాభర్తల మధ్య సంభాషణ ఇలా సాగింది.

భార్య: ఆమె ఎవరు...

భర్త: మాట్లాడకు.. వింటే ఇబ్బంది.. ఆమె కూడా అదే ప్రశ్న వేస్తుంది..

😊😊😊😊😊😊😊😊

అత్త "శివగామి" Vs కొత్త కోడలు"దేవ సేన"

అత్త "శివగామి".... ఇంట్లో వాళ్ల అలవాట్లూ .. జాగ్రత్తలు కొత్తకోడలుకి .... చెబుతోంది

"ఇదిగో చూడు కోడలా.... పకోడీలు వేసేటప్పుడు.... ఒక్కొక్క పకోడీ వేసి వేయించాలి .... అప్పుడే మీ మావ గారికి ఇష్టం!!!

" బెండకాయలు తరిగే ముందు.... ఒక్కొక్క బెండకాయా బాగా కడగాలి.... అప్పుడే కూర బాగుంటుంది !!! "

" కొత్తిమీర ... ఒక్కొక్క ఆకూ కోసాక ... బాగా కడిగి ... వెయ్యాలి ... అప్పుడు కూర రుచిగా వుంటుంది "

అలా రెండు మోడు రోజులు కోడలు ... ఈ అత్త నసని‌ ఓపికగా విన్నది .... ఓపిక పట్టింది!!!

నాలుగో రోజు...

"అత్తా....కొంచెం కూర చూస్తూ వుండండి ... తలస్నానం చేసి వస్తాను" అని బాత్రూమ్ లోకి దూరింది !!

కూర తయారయ్యింది ......

సాంబార్ తయారయ్యింది .....

చట్నీ చెయ్యడం తయారయ్యింది .....

కానీ కోడలు "దేవసేన" మటుకు ఇంకా బాత్ రూమ్ నుండి బయటకు రాలేదు!!!

అత్త "శివగామి" లో సహనం చచ్చిపోయింది!!!

బాత్రూమ్ దగ్గరకు వెళ్లి....

"ఎం!? ఇంకా స్నానం చేస్తున్నావా .... లేక నిద్ద్రోతున్నావా? " అంటూ గట్టిగా ఓ అరుపు అరిచింది!!

కోడలు దేవసేన అమాయకంగానూ వినయంగానూ "అయ్యో రామా ... స్నానం చేస్తున్నాను అత్తయ్యా ... తలమీద ... ప్రతి వెంట్రుకా జాగర్తగా విడదీసి తీసి .... షాంపూ పెడుతున్నాను ... ఇలా స్నానం చేస్తే మంచిదని .... మీ అబ్బాయి చెప్పారు మరి"!!

అత్త షాక్‌ ...కోడలు రాక్‌...

😊😊😊😊😊😊😊😊

బ్యాంక్ లో గోడకి ఒక సూచన తగిలించారు ...

" వేలిముద్ర వేసేవాళ్లు , ముద్ర వేసిన తరువాత ఆ సిరా ను తుడుచుకోవడానికి గోడను ఉపయోగించరాదు " అని ...

అక్కడ నాలాంటి తింగరోడు ప్రతిస్పందన ...

" ఓరి సన్నాసుల్లారా ‌..! అది చదవడమే వస్తే , వేలిముద్రలు ఎందుకు వేస్తార్రా ..!? " అని ...

" Point to be noted " కదా ...

😊😊😊😊😊😊😊😊😊

పేషంట్ః ‘’ డాక్టరు గారూ,నేనుఎప్పుడూ అతి సంతోషంతో ఉంటాను.నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది.అన్ని పనులూ చాలా శ్రధ్ధగా మనసు పెట్టి చేస్తుంటాను. మిగతా వాళ్ళను చూస్తుంటాను.అందరూ ఏ పని చెయ్యాలన్నా ఎంతో ఆదుర్దా పడిపోతుంటారు.అనవసర భయాలు పడుతుంటారు.

నేను మాత్రం ఎటువంటి ఆందోళనా పడను. ఎంతో ఉత్సాహంగా ఉంటాను. నేనే ఎందుకలా ఉంటాను?ఇదేమీ జబ్బు కాదు కదా? ‘’

డాక్టరుః’’మీ పరిస్థితి అర్ధం చేసుకున్నాను.మీకు జీవితంలో విటమిన్ ‘’SHE’’ తక్కువైంది. అది పడితే మీరూ మిగతావాళ్లలాగే నార్మల్ అయిపోతారు.

😊😊😊😊😊😊😊😊😊

ప్రతీది వాట్సాప్ లో పోస్ట్ చేయడం కామెంట్స్ కోసం ఎదురు చూడడం ఫ్యాషన్ అయిపోయింది........

ఆ మధ్య ఒకాయన ఓ పోస్టుపెట్టి కాసేపటితర్వాత ''డిలీట్''చేసాడు.కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆయన పెట్టిన పోస్టు ఏమిటో తెలుసా?

''గత నెలలో వారింట్లో జరిగిన రెండు తద్దినాల తాలూకు ఫోటోలు''

ఓ గంట తర్వాత వచ్చిన కామెంట్స్ చూసి చిర్రెత్తు కొచ్చి పోస్టు తొలగించేశాడు. ఏం కామెంట్స్ వచ్చాయో ఓ సారి చూద్దాం.

1.హేపీ తద్దినం.

2.తద్దినం శుభాకాంక్షలు.

3.నిత్యం మీ ఇల్లు తద్దినాల తో కళకళలాడాలనిఆకాంక్షిస్తున్నా.

4.మీ ఇంట్లో తద్దినం మా కెంతో ఆనందం.

ఇవన్నీ చూసి చిరాకుతో పోస్టు తొలగించేశాడు.

😊😊😊😊😊😊😊😊😊



ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి ప్రముక సైకియాట్రిస్ట్ విచ్చేసారు ఓక వార్డ్ లోకి వెళ్ళారు.

అక్తడ ఓక పేషేంట్ చిరిగిన బట్టలు, చింపిరిజుట్టుతో ''ప్రియా!! ప్రియా!! అని అరుస్తున్నాడు..

డాక్టర్ తన అసిస్టెంట్ తో అడిగారు

ఇతని ప్రాబ్లం ఏంటి అని

అసిస్టెంట్ > సార్ ఇతను ప్రియా అనే అమ్మాయి ప్రేమించుకున్నారు.

కాని ప్రియ కి వేరేవాడితో పెళ్ళయ్యింది అందుకే పిచ్చోడై ఇలా అరుస్తున్నాడు..

మల్లీ డాక్టర్ ఇంకో వార్డ్ లోకి వెళ్ళారు

అక్కడ ఇంకో పేషేంట్ చిరిగిన బట్టలు చింపిరిజుట్టుతో

''ప్రియా!! ప్రియా!! అని అరుస్తున్నాడు..

.

డాక్టర్ > ఇదేంటి తనూ ప్రియా అనే అరుస్తున్నాడు.

.

అసిస్టెంట్> ప్రియని పెళ్ళి చేసుకుంది ఇతనే సార్..

😊😊😊😊😊😊😊😊

ఒక చోట ఆడవాళ్లంతా లైన్లో నుంచుని ఓ ముష్టివాడికి అన్నం, డబ్బులు వేస్తూ అతనికి ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు.

అటుగా వెళ్తున్న సోము.. ఆ లైన్లో తన భార్య కూడా ఉండటం చూసి, ఏం జరుగుతుందే అక్కడ అని భార్య వాసవిని అడిగాడు.

వాసవి : అబ్బే, ఏం లేదండి.. ఈ రోజు దానం చేసేవాడికి మన ముష్టేషు కొత్త పథకం పెట్టాడు.

సోము : ముష్టివాడు కొత్త పథకం ఏమిటే, మతి పోయిందా?

వాసవి : అవునండి, మనం ముష్టి వేసి.. ఫోన్ నెంబరు ఇస్తే,

రేపు లక్కీ డ్రా తీస్తాడట. అందులో ఎవరు ఫోన్ నెంబరు వస్తుందో వారికి రైస్

కుక్కర్ బహుమతిగా ఇస్తాడట.

సోము : అ!!!

😊😊😊😊😊😊మాధ్యాహ్నిక శుభాకాంక్షలతో...💐🥱🤣😜🤔

 *నిక్కర్ చిన్నదయ్యిందని స్కూలుకు వెళ్ళడానికి సిగ్గుపడ్డ మనం.*

ఇప్పుడవే నిక్కర్లు వేసుకుని వీధుల్లో ఊరేగుతున్నాం


 *అమ్మ అరగంట కనబడ కుంటేనే అల్లాడిపోయిన మనం..* 

అమ్మకు ఏడు సముద్రాల దూరంలో ఎక్కడో విదేశాల్లో బ్రతుకుతున్నాం..


 *నాన్నలోనే మన హీరోని చూసుకున్న మనం...* 

నేనే హీరో”...  నా ముందు నాన్నెంత అనుకునే స్థాయికి చేరుకున్నాం..


 *నాన్న ఇచ్చిన చిల్లరతో కొన్న చిరుతిండ్లు స్నేహితులతో పంచుకున్న మనం...* 

చిల్లరబుద్ధులతో,సంపాదనలో, అవే చిల్లర కూడా, .....తల్లిదండ్రుల అవసరాలు తీర్చని బ్యాంకుల్లో దాచు కుంటున్నాం..


 *చుట్టాలు వెళ్లిపోతుంటే ఎంతో బాధపడ్డ మనం..* 

ఇప్పుడు వస్తుంటే భయపడుతున్నాం...


 *బంధుమిత్రులతో కలిసి ఆత్మీయతల కోసం పోటిపడుతూ ఒకే కుటుంబంగా పెరిగిన మనం..* 

ఇప్పుడు తోబుట్టువుల సహచర్యంలో సైతం ఇమడలేక కుటుంబాన్ని చిన్నదిగా మల్చు కుంటున్నాం..


 *చిన్నప్పుడంతా మనకు నచ్చినట్టు బ్రతికిన మనం...* 

ఇప్పుడు చచ్చినట్టు బ్రతుకుతున్నాం..!


*మనిషికే పుట్టి... మనిషిలా పుట్టి.., కొన్నాళ్ళు మనిషిలానే పెరుగు తున్నాం.*..

కానీ, మెల్లిగా మంచి అనే కంచెను తెంచుకుని... మరమనిషిలా మారిపోతున్నాం...


 *మనలోని మనిషి నుండి వేగంగా పారిపోతున్నాం..!* 

మంచి నుంచి దూరంగా జారిపోతున్నాం.!!


*నలుగురికి వెలుగు నివ్వకుండానే ఆరిపోతున్నాం.!!!*

ఎందుకంటే... 

మనం ఎదుగుతున్నాం..!


మనం మనకే అందనంతగా...

మనం ఎదుగుతున్నాం..!


మనం,మన కుటుంబం కాకుండా సమాజములో మనం ఒక భాగం అని కూడా తెలియనంతగా...


నిజంగా మనం ఎదుగుతున్నామా?...


........ ఆలోచన చేయండి.....

*మనం తీసుకునే ఆహారంలో ఐదు* *విధాలైన దోషాలు యిమిడివున్నాయి*

*1.  *అర్ధ దోషం*

2.  *నిమిత్త దోషం*         

3.  *స్ధాన దోషం*

4.  *గుణ దోషం*   

5.  *సంస్కార దోషం*.


*ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు* 


🔸 *అర్ధ దోషం*


*ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు*


*భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే  శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది*. 


*హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు*.


*తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు*  


*తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు*


*వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు*. 


*శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి!  యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు*.


*ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం.  మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం* 


🔸 *నిమిత్త దోషం*

 

*మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి*


*వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు*.


*అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి*


*భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో  కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే  వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు*


*అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు?  అని అనుకొన్నది*


*ఆమె ఆలోచనలు *గ్రహించిన భీష్ముడు*

*'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను*. 


*నా స్వీయ బుధ్ధిని ఆ *ఆహారం తుడిచి పెట్టింది. *శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను*

*ఇప్పుడు* *పవిత్రుడినైనాను*


*నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు*


*చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది  తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి* *'నిమిత్త దోషం '* *ఏర్పడుతోంది*


🔸 *స్ధాన దోషం*


*ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటకూడా పాడైపోతుంది*


*యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు*.


*దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు*


*మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి*


🔸 *గుణ దోషం*


*మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది*


*సంస్కారదోషం*


*ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది*


              🍃🙏 *సర్వేజనా సుఖినో భవంతు* 🙏🍃

పితృ యజ్ఞ మహిమ.


  దీనిని పూర్తిగా చదవగలిగితే మీకు పితృదేవతల అనుగ్రహం ఉన్నట్టే. *


 *మాసికాల_రహస్యం_ఇదే*!

 *మాసికాలు_ఎందుకు_పెట్టాలి?*

*అన్ని_మాసికాలు_పెట్టాలా?*

*కొన్నిమానేయవచ్చా?*


 వేదవేదాంతాలలో ఉన్న మహాసాధనా రహస్యాలు చెపుతుంటే చొప్పదండు ప్రశ్నలు వేసేవారు కొందరైతే, మరికొందరు తమ సున్నతమైన వేదబోధ గమనించకుండా కుతర్కాలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ పితృయజ్ఞాలలోనే ఉంది. 


*అతి తేలిగ్గా సకల పుణ్యాలు, సకల సంపదలూ ఇచ్చే ఈ పుణ్యకార్యాలు ఆచరించకుండా పిశాచగ్రస్తులు అడ్డుపడుతుంటారు. కనుకనే ఈ మంచి మాటలు వారి చెవులకు సోకవు.*


*కేవలం పితృదేవతల అనుగ్రహం ప్రాప్తం ఉన్నవారిని మాత్రమే ఇవి చేరుకుంటాయి.* 


చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? పిండాల వల్ల ప్రయోజనం ఏమిటి? అనేవి అందులోని ముఖ్యప్రశ్నలు.


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుని దేవతలు, మహర్షులు ఈ విధంగా ప్రశ్నించారు.


*మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు? అనే ప్రశ్నలు వేశారు.*


దానికి సమాధానంగా బ్రహ్మ దేహం దేహి గురించి వివరాలు చెప్పాడు.


*మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.* 


*ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది*.


*ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి. ఇది ఆధునిక వైద్యశాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే.*


*ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.*


*నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.* 


*కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.*


*యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.*


*ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.*


*దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.*


*అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ   ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.*


*సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.*


*దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.*


*వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నాడు.*


*దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.*


*మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు).* 


*నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.*


*ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.* 


*ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.*


*ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.* 


*ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.*


*తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.* 


*పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.*


*ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది.* 


*ప్రపంచంలో భోగాలు అనుభవించడానికి శరీరం ఇచ్చిన తల్లి తండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి శరీరం ఏర్పడడానికి అవసరమైన పిండాలు సమర్పించి వారి ఋణం తీర్చుకోవాలి.*

 

*నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు.*


*వీటిలో 10 పిండాల గురించి  మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.*


*అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.*


*ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది.*


*కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.*


*ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.* 


*మనకు కోట్లు ఖరీదు చేసినా దొరకని భోగశరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవడం వలన అతనికి వైకల్యం కలిగించినవారమవుతాము. మహాఘోరమయ్యే తప్పు చేయకూడదు.*


*మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది. సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.* 


*తండ్రికి ప్రేతత్త్వం విడుదల చేయకపోతే తరువాత తరాలు అన్నీ ప్రేతత్త్త్వంలోనే ఉండిపోతాయి.*


*కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.*


ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న పితృయజ్ఞరహస్యాలు.   


ఇవన్నీ సామాన్యంగా తప్పనిసరిగా చేయవలసినవి.


*ఇవే మరింత ప్రేమగా చేయాలనుకుంటే పుణ్యక్షేత్రాలైన కురుక్షేత్రం, ప్రయాగ, కాశీ, గయా వంటి వాటిలో చేయాలి.*


*ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారమవుతాము. దాని వల్ల మనకే ప్రయోజం ఉంటుంది. వారికి కలిగే ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు ఇస్తారు.*


పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 


*నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.* 


అవి కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం ఫలానా పిండదానాలు ఫలానా చోట చేయండి అనిమాత్రమే చెబుతారు. 


గయలో ఎందుకు చేయాలి? ప్రయాగలో ఎందుకు చేయాలి అంటే వాటికి అనేక రకాలైన కారణాలు కూడా చెబుతారు. పుణ్యక్షేత్రాలుగా చెబుతున్న ప్రాంతాలు అన్నీ పరమాత్మ శరీరాంగాలు. ఒకటి శిరస్సు, మరొకటి హృదయం, కాళ్ళు, చేతులు.... వంటివి. 


ఇలా ఆ ప్రాంతాలలో చేయలేని వారు కనీసం తాను ఉన్న చోటునైనా చేయాలి.


 వెళ్ళగలిగిన వారు ప్రయాగ కుంభమేళాల వంటి వాటికి వెళ్ళి చేయడం వలన దివ్యమైన ఫలితాలు పితృదేవతానందం వలన కలుగుతాయి.  


వెళ్ళలేని వారు మానసికంగా అయినా వాటిని కీర్తించడం వలన పుణ్యం పొందుతారు. 


ఉదాహరణకు మాఘపౌర్ణమి చాలా మంచిది. దాన్ని మాఘపౌర్ణమి, మహామాఘి అని అంటారు. ఆ రోజున పితరలకు ప్రయాగలో పిండప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు, సంపదలు కలుగుతాయి. ప్రయాగలో చివరిగా రాబోతున్న మహాశివరాత్రి స్నానానికి ముందు రానున్న పుణ్యదినం.  ఆ సమయానికి వెళ్ళలేని వారు మానసికంగా అయినా తమపెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.


ఇవే మాసికాలు పిండప్రదానాల రహస్యాలు. 


మాఘమాసం పితృదేవతా అర్చనలకు మహాదివ్యమైన కాలం.

శ్రీగురు పరదేవతాయై నమ:

🌹🌹🌹🙏🙏🙏

10/11, 5:36 am] . Mallapragada: విష్ణు సహస్ర నామ మహిమ : 


పూర్వం పూరీ నగరం లో జగన్నాధపురం లో ఒక మహాపండితుడు భార్య తో సహా ఒక పూరి గుడిసె లో నివాసముండెడివాడు . ఇతను శ్రీ మహావిష్ణువు నకు పరమ భక్తుడు . పూట గడవని దారిద్ర్యస్థితి అతనిది , ప్రతి నిత్యమూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ చేసి ఈతడు ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటన కు వెళ్లేవాడు , ఆ వచ్చినదానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు .భార్య మాత్రం పరమ గయ్యాళి , దైవం పట్ల నమ్మకం లేనిది , ఎటువంటి నియమాలనూ పాటించనిది . ఇంటి లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఈతడు హరి నామ స్మరణ ను  విడువలేదు . ప్రతినిత్యమూ చేయుచున్న విధముగా ఆరోజు కూడా విష్ణుసహస్ర పారాయణము చేయుచుండగా భార్య వచ్చి భర్త తో " ఏమిటి చేస్తున్నావు ? " అని గద్దించి అడిగింది .దానికి ఆ భర్త "విష్ణుసహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నాన"న్నాడు .  అందుకు ఆ భార్య " ప్రతీ రోజూ స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ! ఏమిచ్చేడు ఆ శ్రీ మహావిష్ణువు ? అడుక్కోవడానికి భిక్షాపాత్ర తప్ప " అంది . అక్కడితో ఆగక " ఏదీ ! నువ్వు చదువుతున్నదేమిటో చెప్పు " అన్నది . అందుకు ఆ భర్త " వెయ్యి నామాలే ! ఏమిటి చెప్పేది ? నీకేమిటి అర్ధమౌతుంది ? ఎప్పుడూ పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణుసహస్ర నామాలేమి అర్ధమౌతాయి ? " అన్నాడు . ఆ భార్య మాట్లాడుతూ " వెయ్యి నామాలక్కరలేదు , మొట్టమొదటిది చెప్పు చాలు " అన్నది . అందుకు ఆ భర్త " విశ్వం విష్ణుః " అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య " ఆపు అక్కడ ! దీనర్ధమేమిటో చెప్పు " అన్నది .అందుకు ఆ భర్త " విశ్వమే విష్ణువు , ఈ ప్రపంచమంతా విష్ణుమయమే " అని వివరించగా " ప్రపంచమంతా విష్ణువే అంటున్నావు , అందులో నువ్వూ , నేనూ ఉన్నామా ? ఉంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని  అనుభవిస్తూ  , పూరిగుడిసె లో జీవితాంతం దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉండి కూడా ప్రతీ రోజూ నువ్వు ఆ శ్రీమహావిష్ణువు ని గానంచేస్తున్నావే ? అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా ? కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్ధంలేదయ్యా ! " అంది . భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు " నా భార్య మాటలు కూడా నిజమేనేమో ? విశ్వమంతా విష్ణువే ఐతే మా పరిస్థితి ఇలాగ ఎందుకు ఉండాలి ? కనుక " ఈ మంత్రంలో విశ్వం" అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకుని ఒక బొగ్గు ముక్క తో ఆ " విశ్వం" అనే పదాన్ని కనబడకుండా మసి పూసి ( తాటాకు ప్రతి ఉండేది ట ఈ భక్తుడి ఇంట్లో ) ఎప్పటిలాగే యాచన కై బయలుదేరి వెళ్లిపోయేడుట .


ఆ తరువాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది . ప్రతినిత్యమూ పాల సముద్రంలో శ్రీమహావిష్ణువు ను శ్రీమహాలక్ష్మి సేవిస్తున్నట్లుగనే ఆరోజు కూడా స్వామి ని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు ఫక్కున నవ్విందిట ! అందుకు శ్రీమహావిష్ణువు " ఏమిటి దేవీ ? ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ? " అని అడిగితే అమ్మవారు " నాధా ! మిమ్ములను నల్లని వాడని , నీలమేఘశ్యాముడని అందరూ స్తుతించడం విన్నాను కానీ అంతమాత్రంచేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా " అని పరిహాసమాడగా శ్రీమహావిష్ణువు తన ముఖాన్ని పాల సముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్లరంగు కనబడిందిట . వెంటనే శ్రీమహావిష్ణువు జరిగినదంతా దివ్యదృష్టి తో గమనించాడుట . లక్ష్మీదేవి " ఏమిటి స్వామీ ఆలోచిస్తున్నారు ? మీ ముఖము పై ఆ నల్లరంగు కు గల కారణమేటో తెలిసినదా ?" యని అడుగగా స్వామి " దేవీ ! ఇది నా పరమ భక్తుడు చేసిన పని " యని పలికాడుట . లక్ష్మీదేవి " అదేమిటి స్వామీ ! పరమభక్తుడంటున్నారు ? అతడెందుకిలా చేస్తాడ" ని యడుగగా స్వామి తన భక్తుని జీవితదీన స్థితి ని వివరించగా లక్ష్మీదేవి " అంతటి పరమ భక్తుని దీనస్థితి  కి కారణమేమి ? మీరాతనిని ఉద్ధరింపలేరా ? స్వామీ ! " అని యడుగగా " దేవీ ! గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడే ఐనప్పటికీ ఎన్నడూ ఎవరికీ దానమిచ్చి యెరుగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైననూ దరిద్రమనుభవించుట తప్పలేదు . అయిననూ నీవు కోరితివి కనుక నేటితో ఈతనికి కష్టములు తొలగించెదన" ని పలికి మానవ రూప ధారియై ముఖానికి వస్త్రము చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పటికే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి పోయాడు . ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషము లోనున్న శ్రీమహావిష్ణువు ఆ ఇల్లాలి తో " అమ్మా ! నీ భర్త వద్ద నేను అప్పు గా తీసుకున్న సొమ్ము ను తిరిగి తీర్చుటకు వచ్చితిని , సొమ్మును తీసికొనవలసినద"ని చెప్పగా ఆ ఇల్లాలు " నీవెవరవో నాకు తెలియదు కానీ మేమే కటిక దారిద్ర్యంలో ఉన్నాము , నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు , ఎవరనుకుని మాఇంటికి వచ్చేరో , వెళ్లిపొ "మ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి " లేదమ్మా ! నేను పొరబాటు పడలేదు , అసత్యమసలే కాదు , నీ భర్త వద్ద అప్పు గా తీసుకున్న సొమ్ము ఇదిగో ! నువ్వు స్వీకరించు , నీ భర్త కు నేను తరువాత వివరిస్తాన" ని ఆమెకు అశేష ధన , కనక , వస్తు వాహనాలు , మణిమాణిక్యాలు , సేవక జనం, తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలూ కానుకలు గా ఇచ్చి వెళ్లిపోబోతూ ఉండగా ఆ ఇల్లాలు " ఓయీ ! నీ ముఖం మీద కప్పియున్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒకసారి చూపించు ! నా భర్త కు చెప్పాలికదా ! నువ్వు ఎలా ఉంటావో ? " అని పలుకగా స్వామి " అమ్మా ! నా ముఖాన్ని నీకు చూపలేను , నా ముఖం మీద ఎవరో నల్లరంగు పూసేరమ్మా ! నేనెవరో నీ భర్తకు తెలుసులే !" అని పలికి విష్ణుమూర్తి వెనుదిరిగి వెళ్లి కొంతదూరం పోయాక అంతర్ధానమైనాడు . ఇంతలో ఊరిలో యాచన కు వెళ్లిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి చూడగా అతని పూరిగుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది , అనేకమంది సేవకులూ , ఉద్యానవనాలతో కళకళలాడిపోతోంది ఆ భవనం. ఇంతలో ఈతని భార్య లోపలినుండి వచ్చి " లోపలికి రమ్మని భర్త ని ఆహ్వానించగా , ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు , "అసలు ఆ సంపద ని ఎందుకు స్వీకరించావు ? మనము ఎవరికో అప్పివ్వడమేమిటి ? అది తిరిగి వారు తీర్చడమేమిటి ? మన దీన స్థితి నీకు తెలియనిదా ? "అంటూ భార్య పై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగినదంతా భార్య నోటివెంట విన్న తరువాత తన కళ్లను , చెవులను తానే నమ్మలేకపోయాడు . అయితే ఆ వచ్చినవాడు ఎలా వున్నాడు ? అతడి ముఖము ఎలాగ ఉన్నది ? అని భార్యని ప్రశ్నించగా  " నేను అతడి ముఖాన్ని చూడ లేదు , అతడి ముఖం పై ఎవరో నల్లని రంగు పులిమారుట , ముఖము చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు , అయినా అతడు వెళుతూ వెళుతూ నాగురించి నీ భర్త కు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్లిపోయాడ"న్నది . అది వినిన భక్తుడు హతాశుడై భార్యతో " వచ్చినవాడు మరెవరో కాదు , మారువేషంలో వచ్చిన సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ! ప్రతి నిత్యమూ నేను విష్ణువు ను స్తుతిస్తున్నా ఆ స్వామి ని నేను దర్శించలేకపోయాను ,  ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శనభాగ్యం కలిగింది" అని పలికి ఇంటి లోపలికి వెళ్లి ఉదయము విష్ణు సహస్రనామాలలో  మొట్టమొదటి " విశ్వం " అనే నామంపై పులిమిన  నల్లరంగు ను తొలగించాడు

 . తరువాత భార్య తో " నీతో మాట్లాడిన తరువాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయినాడ " నగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరి పోవగా సముద్రము ఒడ్డు కు చేరుకున్నాడు . అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వదిక్కుగా చేతులు జోడించి శ్రీమహావిష్ణువు నుద్దేశించి స్తోత్రగానంచేశాడు . అప్పుడు అశరీరవాణి " భక్తా ! పూర్వ జన్మ కర్మఫలముల కారణంగా ఈ జన్మ లో నీకు భగవద్దర్శనము కలుగదు , మరణానంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదవు " అని పలికినది .

విష్ణుసహస్త్రనామ నిత్యపారాయణ వలన కలుగు ఫలితమిదియని అందరూ గ్రహించండి , ప్రతి నిత్యమూ పఠించండి , అవసరార్ధులకు సహాయం చెయ్యండి .


....................శుభోదయం🙏💐

చక్కని వివరణ

ऊँ!"ధన్యోऽస్మి!!!"

[10/11, 5:48 am] . Mallapragada: Mallapragada Sridevi: ప్రాంజలి ప్రభ..

మీకు చిన్నప్పుడు నడకరాని వయసులో... నడవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. ఎన్నోసార్లు పడిపోయి ఉంటారు. కానీ నడవాలనే ఉద్దేశం మీకు ఉండేది కాబట్టి... ఎన్ని సార్లు ఓడిపోయినా, ఆ ఓటమిని ఎన్నడూ అంగీకరించకుండా... మళ్ళీ లేచి, నడవడం మొదలుపెట్టారు. అలా ప్రయత్నం చేస్తూ, చేస్తూ... ఒక రోజు సఫలం అయ్యారు. కానీ ఇప్పుడు మీరు ఏ విషయంలోనైనా ప్రయత్నం చెయ్యడానికి ముందు... దాన్ని సాధించలేమేమో అనే ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ ఆలోచన కారణంగానే అనుకున్నది సాధించడంలో చాలాసార్లు విఫలమవుతారు. కాబట్టి జీవితంలో ఏదైనా ముఖ్యమైనది సాధించాలనుకున్నప్పుడు... సాధించగలమనే ఆలోచనతో మొదలుపెట్టండి. అప్పుడే మీరు విజయపథంలో సాగిపోగలరు.


 మనం జీవించి ఉన్నామంటే... ఆ భగవంతుడి కృప మన మీద ఉన్నట్టే. మనం ఏం చేయాలనుకుంటే అది చేయగలిగే అవకాశం మన ముందు ఉంది. కానీ అన్నిటికన్నా మనం జీవించి ఉండడం ప్రధానం. ఏదైనా చేయాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మన లోపలి నుంచే వస్తుంది. శ్వాస మీ లోపలికి వస్తూ, పోతున్నంతకాలం... మీరు ఓటమి పాలైనట్టు కాకుండా, విజయం సాధించినట్టుగా జీవించండి.


నేను మీకు ఒక కథ చెబుతాను. ఒక చిన్న కుక్కపిల్ల దారి తప్పి... దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ కారడవిలో అటూ ఇటూ తిరుగుతూ... తనకు దగ్గరలో ఒక సింహం ఉన్నట్టు పసిగట్టింది. అటూ ఇటూ చూస్తే... ఒక పెద్ద సింహం తనవైపు వస్తూ కనిపించింది. వెనక్కి తిరిగి పారిపోదామనుకుంటూ ఉండగా... పక్కనే ఒక పెద్ద ఎముకల గుట్ట కనిపించింది. కుక్కపిల్ల ఆ గుట్ట దగ్గరకు వెళ్ళి, తనను ఏదో విధంగా కాపాడుకోవడానికి ఉపాయం ఆలోచించడం మొదలెట్టింది.


ఇంతలో సింహం గర్జిస్తూ... ఆ కుక్క పిల్ల దగ్గరకు వచ్చింది. కుక్కపిల్ల ఆ ఎముకల గుట్ట మీద... సింహానికి వ్యతిరేక దిశలో కూర్చొని, ఓ ఎముకను కొరుకుతూ... ‘‘ఆహా! సింహం రుచే వేరు. ఇన్ని సింహాలను తిన్నా ఇంకా నా తనివి తీరలేదు. చివరిగా ఇంకో సింహం దొరికితే చాలు, నా ఆకలి తీరుతుంది’’ అంది.


ఆ మాటలను విన్న సింహం ‘‘ఇది సింహాలని తినేస్తుందా! దొరికితే నన్ను కూడా తినేస్తుందేమో’’ అనుకుంటూ, భయంతో వెనక్కి తిరిగి పారిపోయింది.


ఆ పక్కనే ఉన్న చెట్టు మీద ఉన్న కోతి ఇదంతా చూసింది. సింహం దగ్గరకు వెళ్ళి ‘‘ఆ కుక్క చాలా తెలివైనది. అది ఏ సింహాన్నీ తినలేదు. ఈ అడవికి మీరే రాజు. అది మిమ్మల్ని భయపెట్టింది’’ అని చెప్పింది.


కోతి మాటలు విన్న సింహం కోపంతో రగిలిపోయింది. కోతిని తన మీద కూర్చోబెట్టుకొని ఆ కుక్క వైపు పరుగులు తీసింది.ఇంకా ఆ ఎముకల కుప్ప దగ్గరే ఉన్న కుక్క పిల్ల... ఆ రెండూ తన వైపు శరవేగంతో వస్తూ ఉండడం చూసింది. ‘‘ఇప్పుడేం చెయ్యాలి? ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి’’ అనుకొని, ‘‘ఈ కోతి ఎక్కడికి పోయిందో! ఒక్క సింహాన్నైనా తీసుకురమ్మని చెప్పి అరగంట అవుతోంది. ఇంకా రాలేదేమిటి?’’ అని అరవడం మొదలుపెట్టింది.


ఆ మాటలు విన్న సింహం వెంటనే కోతిని కింద పడేసి... అక్కడి నుంచి పారిపోయింది. అలా తన తెలివితేటలతో... సింహం బారి నుంచి ఆ కుక్కపిల్ల చాకచక్యంగా తప్పించుకొని, అడవి నుంచి బయటపడింది.


అదే విధంగా మనం కూడా మన జీవితంలో ఏ ఇబ్బంది ఎదురైనా ఓటమిని అంగీకరించకుండా సంయమనం పాటించాలి. చాకచక్యంగా వ్యవహరించాలి అప్పుడే సఫలీకృతులం కాగలం. ఎప్పుడైతే మనం ఓటమిని అంగీకరిస్తామో... అప్పుడు విజయం సాధించడం అసాధ్యమనిపిస్తుంది. ఓటమిని ఒప్పుకోకుండా, ధైర్యంగా ముందుకు సాగితే... విజయం తప్పకుండా వరిస్తుంది.


.......




ఈ రోజు ప్రాంజలి ప్రభ పత్రికలోనివి ( సేకరణ )


సుభాషితం - 437

----------------

🌺ఉత్తమోsష్యధమస్యస్యా

     ధ్యాజ్ఞానమ్రకరః క్వచిత్ ౹

     కౌస్తుభాదీని రత్నాని

     యయాచే హరిరంభుధిం ౹౹🌺

         కొన్నిసారులు ఉత్తమమైన వాడు కూడా అధముడు ముందు చేతులు కట్టుకొని నించుంటాడు.అలాగే,శ్రీహరి కూడా కౌసభం మొదలైన రత్నాల కోసం సముద్రాన్ని యాచించాడు కదా!?

🌺✍🏼ప్రభ,

           13-3-2023.

🕉️🙏शुभोदयः।🙏🕉️


माता शत्रुः पिता वैरी 

येन बालो न पाठितः ।

न शोभते सभामध्ये 

हंसमध्ये बको यथा ।।


మాతా శత్రుః పితా వైరీ 

యేన బాలో న పాఠితః ।

న శోభతే సభామధ్యే హంసమధ్యే బకో యథా ।।


ఆచార్య  చాణక్యుడు ఈ సుభాషితంలో విద్యయొక్క ప్రాముఖ్యాన్ని విద్యలేని వారి  పరిస్థితి ద్వారా ఇలా తెలియజేసేరు  --

ఏ బాలుడైతే చదివింపబడడో, వానికి వాని తల్లియే శత్రువు. తండ్రి కూడా శత్రువు. అట్టి బాలుడు సభా మధ్యములో  హంసల మధ్య కొంగ వలె శోభించడు.



-|¦¦|సుభాషితమ్|¦¦|-_


 𝕝𝕝 *శ్లో* 𝕝𝕝  

*జకారో జన్మవిచ్చేదః* 

    *పకారః పాపనాశకః |*

    *తస్మాజ్జప ఇతి ప్రోక్తో*

    *జన్మ పాపవినాశకః ||*


*తా𝕝𝕝“జ”*కారము జన్మ కలుగకుండ జేయును....*ప” కారము పాపమును నశింప జేయును*.... *జన్మము, పాపము రెంటిని నాశము చేయునది కావున “జప” మందురు*.... *పరమాత్ముని నామము లన్నింటిలో మూగవాడు కూడ పలుకదగిన నామము "ఓమ్" అనునది శ్రేష్ఠమైనది*.....

***

[10/11, 5:55 am] . Mallapragada: నారద భక్తి సూత్రాలు -  🌹 

ప్రథమాధ్యాయం - సూత్రము - 


🌻. పరాభక్తి యొక్క లక్షణం - 1 🌻


1. అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః ||


        అధికారి అయిన వానికి అనుభవ జ్ఞానంతో భగవదనుభవ ప్రాప్తిని బోధించుట అని అర్థం. అనగా ఇప్పుడు భక్తి గురించి వ్యాఖ్యానిస్తున్నారు.


            అంటే ఇంతకుముందు ముక్తి కొరకు తెలుసుకోవలసిన అనేక శాస్త్రాలను పరిశీలించారన్నమాట. ఇప్పుడు భక్తి విషయం తెలుసుకోవాలి. 


              అంతేకాదు. భక్తి సాధనకు ఉపక్రమించే ముందు అతడికి యోగ్యత ఉండాలి. యోగ్యత, ఆసక్తి, శ్రద్ధ ఉన్న వారికే ఈ భక్తి విషయం తెలియజేయాలి. 


         ఇప్పుడు అంటే అట్టి యోగ్యతను సంపాదించడం కోసం చేసిన ఇతర క్రియలు, సాధనలు పూర్తి అయిన తరువాత అని అర్థం. యోగ్యత లేక అధికారం అంటే ఏమిటి ? 


            కర్మ నిత్యం, నైమిత్తికం, విశేషం అని మూడు విధాలు. ఈ మూడింటిలోనూ కర్త యొక్క ఆచరణలో భగవదనుభూతి కొరకు ఉద్దేశించబడినట్లైతే అతడు యోగ్యుడు, అధికారి..


         భక్తుడు అని పిలిపించు కోవాలంటే ముందుగా అతడికి భగవంతుని మీద విశ్వాసం, ప్రేమ ఉండాలి. మనసా, వాచా కర్మణా భక్తి సాధనలను ఆచరించాలనే దృఢ నిశ్చయం ఉండాలి. సానుకూల దృక్పథం, ఏకాగ్రత ఉండాలి.


            ముందుగా భక్తుడు తన లక్ష్యం ఏమిటో తెలుసుకున్న తరువాత క్రమ సాధన గురించి ఆలోచించాలి. ఎందుకనగా ఇప్పుడు మనం చూచే చాలామంది భక్తులలో ముక్తి లక్ష్యం లేదు. కోరికలను తీర్చుకోవడానికో, బాధల నివారణకో భక్తి చేస్తున్నారు. ఎప్పుడు అవసరమో, అప్పుడు మాత్రం చేసి, మానివేస్తున్నారు. 


            భగవంతుని సరిగా అర్థం చేసుకోకుండా ఆయన మన కోరికలను తీర్చేవాడిగానే విశ్వసించి భక్తి చేస్తున్నారు. ప్రతిఫలం లభిస్తే మ్రొక్కులు తీరుస్తున్నారు. లేకపోతే ఇష్ట దైవాన్నే మార్చివేసుకుంటున్నారు. 


         సాధారణ మానవులను ప్రసన్నం చేసుకోవడానికి ఏమి చేస్తామో దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి కూడా అవే ఉపాయాలు ఆచరిస్తున్నారు. ఇట్టి క్రియలకు, మానసిక స్థితులకు భగవంతుడు ఉలకడు, పలకడని వారికి తెలియదు.


            అయితే లోకంలో చేసే భక్తి క్రియలలో దోషమున్నదా అని అంటే అవన్నీ భక్తి సాధనకు ముందస్తుగా చిత్తశుద్ధితో అవలంబించవలసినవే. అంత మాత్రానికే భగవదనుగ్రహం లభించదు. ఇంకను చేయవలసింది చాలానే ఉన్నది. మొదట్లో తెలియకనో, శక్తి చాలకనో చేసే భక్తి క్రియలు అలాగే ఉంటాయి. 


          అదే భక్తి యోగంగా, సాధనగా భావించి చేయడం కొనసాగిస్తే కాయికంగానూ తరువాత వాచికంగా కూడా చేస్తారు. అక్కడితో ఆగక మానసిక


భక్తిగా మార్చుకుంటారు. మానసిక భక్తి చేస్తూనే పూర్వపు కాయిక వాచిక సాధనలను కూడా కొనసాగిస్తారు. 


          ఇదే విధమైన భక్తి క్రియలలో తామసిక భక్తి, రాజసిక భక్తి, సాత్విక భక్తి అని మూడు విధాలు. ఈ మాదిరి గుణాలతో జరిపే భక్తిని గౌణభక్తి అంటారు. 


          గుణాలతో కూడిన భక్తికి సత్‌ఫలితముండదు. సాధన క్రమంలో భక్తుడు గుణాలను అధిగమించినప్పుడు అది గౌణభక్తి నుండి నిజమైన భక్తిగా పరిణమిస్తుంది. కొందరు భక్తి అనగా అప్పటివరకు వారు చేస్తున్నదే అని అనుకుంటారు.

No comments:

Post a Comment