O1*శ్రీగురుభ్యోనమః🙏*
*🙏ఓం శ్రీమాత్రేనమః🙏*
*జయ పద్మపలాశాక్షి జయ త్వం శ్రీపతిప్రియే*
*జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవ తారిణి*
*మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి*
*హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే🙏*
*పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే*
*సర్వభూత హితార్థాయ వసువృష్ఠిం సదా కురు🙏*
*జగన్మాతర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే*
*దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోಽస్తుతే🙏*
*శుభోదయం శుభంభూయాత్ శుభమస్తు*🙏
****
02.. దుర్లభం త్రయం ఏవై తత్ దైవానుగ్రహ హేతుకం.
మనుష్యత్వం,ముముక్షత్వం,మహాపురుష సంశ్రయః.
మనిషిగా పుట్టటం, ముక్తి కలగాలనే కోరిక వుండటం, సమర్ధుడైన గురువు లభించడం.
ఈ పైవాటి అన్నింటిలో మనకు రెండు శ్రమ పడకుండానే లభించాయి.
ఇక మనకు కావాల్సింది ముక్తి పొందాలనే కోరికను అలవర్చుకోవడం.
ఇదే మన సహజమార్గ సాధన లక్ష్యం.
****
03..సుజనాః పరోపకారం శూరాః శస్త్రం ధనం కృపణాః |
కులవత్తో మందాక్షం ప్రాణాత్యయ ఏవ ముంచతి |
(రసగంగాధరం)
*సత్పురుషులు పరోపకారాన్నీ, శూరులు శస్త్రాన్నీ, పిసినారులు ధనాన్నీ, కులస్త్రీలు సిగ్గునూ ప్రాణం పోయినప్పుడు మాత్రమే వదిలిపెడతారు.
****
04.శ్లో. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞా శాస్త్రం తస్య కరోతి కిం
లోచనాభ్యాం విహీనస్య దర్పణః కిం కరిష్యతి
భావము. ఎవనికైతే స్వయం ప్రజ్ఞ ఉండదో వానికి శాస్త్రం ఏమి చేయగలదు? కనులు లేనివానికి దర్పణము ఏమి చేయగలదు?
కనుక మనం తెలిసికున్నదానిని లోతుగా పరిశీలించుకోనపుడు అర్థం చేసికోనపుడు తెలిసికున్నదానివలన ప్రయోజనము ఉండదు.
****
05.శ్లో.మృత్యోర్బిభేషి కిం బాలన స భీతం విముంచతి |
అద్య వాబ్దశతాంతే వా మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః
(పంచతంత్రం-మిత్రభేదం)
*ఓ మూఢుడా, మరణానికి ఎందుకు భయపడుతున్నావు? భయపడిన వారిని అది విడిచిపెట్టదు. ఈ రోజైనా లేదా వందేళ్ల చివరలోనైనా ప్రాణులకు మరణం అనివార్యమైనది.
****
06.శ్లో.మానస శమయేత్తస్మాత్జ్ఞా నేనాగ్నిమివాంబునా౹
ప్రశాంతే మానసే హ్యాస్యశారీర ముపశామ్యాతి.౹౹
(సంగ్రహము)
*నిప్పుని నీటితో ఆర్పినట్టుగా మనస్సులోని దుఃఖాన్ని జ్ఞానంతో దహింపజేయాలి,మానసిక చింతలు పోగొట్టుకుంటే ప్రశాంతమై శరీరం కూడా ఆరోగ్యంతో చక్కగా ఉంటుంది.
*****
07..జ్ఞానం ప్రధానం న తు కర్మహీనమ్l
కర్మ ప్రధానం న తు బుద్ధి హీనంl
తస్మాదుభాభ్యాం తు భవేత్ప్రసిద్ధి:
న హ్యేక పక్షో విహగ: ప్రయాతిll
భావం: జ్ఞానం ప్రధానమే కానీ, కర్మ హీనమైన జ్ఞానం నిరుపయోగం. కర్మ ప్రధానమే కానీ, జ్ఞానం లేని కర్మ కూడా నిష్ప్రయోజనమే. జ్ఞాన,కర్మ సముచ్చయము వలననే మానవుడు తరిస్తున్నాడు. ఒక్కరెక్కతోనే పక్షి ఎగురలేదు కదా!
*****
08..ఉచ్ఛైర్గతిర్జగతి సిధ్యతి ధర్మతశ్చేత్
తస్య ప్రమా చ వచనైః కృతకేతరైశ్చేత్ |
తేషాం ప్రకాశనదశా చ మహీసురైశ్చేత్
తానంతరేణ నిపతేత్ క్వ ను మత్ప్రణామః ||
(చంపూరామాయణం)
ధర్మం ద్వారా ఉత్తమమైన గతి లభిస్తే, వేదవాక్యాల ద్వారా ఆ ధర్మం యొక్క నిజమైన అవగాహన కలిగితే, ఆ వాక్యాల వివరణను భూసురులు (బ్రాహ్మణులు) అందిస్తే, నా ప్రణామాలు వారికి కాకుండా ఇంకెవరికి సమర్పించబడాలి?
******
09..యౌవనం ధనసంపత్తి:
ప్రభుత్వ మవివేకితాl
ఏకైక మప్యనర్ధాయ
కిము యత్ర చతుష్టయమ్
భావం: యౌవనము, ఐశ్వర్యము, అధికారము మరియు అవివేకము.. ఇవి ఒక్కొక్కటీ అనర్ధాన్ని తెచ్చిపెడతాయి. ఈ నాలుగూ ఒకేచోట ఉన్నట్లయితే ఇక చెప్పవలసిందేముంది?
*****
010.వలీభిర్ముఖమాక్రాంతం
పలితైరంకితం శిరః |
గాత్రాణి శిథిలాయంతే0
తృష్ణైకా తరుణాయతే ||🌺
(వైరాగ్యశతకం)
ముఖము ముడతలు పడి ఉంది. తల పండిన తెల్ల జుట్టుతో నిండిపోయింది. శరీరంలోని అవయవాలు శిథిలమయ్యాయి. కానీ ఆకాంక్ష మాత్రం యౌవనంతో చెలరేగుతూ ఉంది.
*****
011.ఓం ఆధత్త పితరో గర్భం
కుమారం పుష్కరస్రజం |
యథేహ పురుషోఽసత్ ||
(యజుర్వేదం)
_ఓ పితృవులారా! ఉత్తముడైన పుత్రుణ్ణి కరుణించండి._
_ఇతడు సత్పురుషుడుగా ఉండుగాక!
🙏యత్పితృభ్యో నిపృణాతియత్
ప్రజామిచ్ఛతే తేన పితృణాం |
(బృహదారణ్యకోపనిషత్)
పితృవులను తృప్తిపరచడంవలన సత్పుత్రులను పొంది పితృవుల కృపకు పాత్రుడౌతాడు._
****
012..సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వంl
నిర్మోహత్వే నిశ్చలతత్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తం!!
భావం: సత్సంగము అనగా మంచి వారితో కలియుట ద్వారా విషయవాంఛలలో విరక్తి భావన కలుగుతుంది. తద్వారా నేను, నాది అనే స్వార్ధాలు లేక నిర్మోహత్వం కలుగుతుంది. దానివలన మనసు చంచలం నుండి స్థిరత్వం పొందుతుంది. అట్టి స్థిరత్వమే జీవన్ముక్తికి మార్గమవుతుంది.
****
013.దుఃఖ సాగరే చరణీయం
కష్ట పర్వతే తరణీయంl
విపత్తి విపినే భ్రమణీయం
లోక హితం మమ కరణీయంll
భావం: దుఃఖాల కడలిని దాటుము. కష్టాల పర్వతాన్ని అధిరోహించుము. ఆపదల అరణ్యాన్ని అధిరోహించుము. లోక హితానికై కృషి చేయుము.
*****
014.నారాయణో నామ నరో నరాణాం
ప్రసిద్ధ చౌరః కథితః పృథివ్యామ్ |
అనేక జన్మార్జితపాపసంచయం
హరత్యశేషం స్మరతాం సదైవ ||
(పాండవగీత)
నారాయణ అనే ఒక మనిషి అత్యంత ప్రసిద్ధి చెందిన దొంగగా లోకంలో చెప్పబడుతున్నాడు. ఎవరైనా అతన్ని ఒకసారి స్మరిస్తే చాలు, వారి అనేక జన్మల పాపఫలాలను అతను ఆ క్షణంలోనే పూర్తిగా అపహరిస్తాడని అంటారు.
*****
015.గహనారణ్యే ఘనాంధకారే
బంధు జనా: యే స్థితా గహ్వరే
తత్రమయా సంచరణీయం
లోక హితం మమ కరణీయంll
భావం: ఘోరారణ్యమునందు, చిమ్మ చీకటుల యందు బంధుజను లెందు ఉందురో అచ్చటనే సంచరించవలెను. లోక హితానికై కృషి చేయవలెను.
****
016.న జాతు దుఃఖం గణనీయం
న చ నిజసౌఖ్యం మననీయంl
కార్యక్షేత్రే త్వరణీయం
లోకహితం మమ కరణీయంll
భావం: స్వంత కష్టాలను ఏకరువు పెట్టకు. నీ సుఖాల గొప్పలు చెప్పుకోకు. కార్యాచరణకై కదులు ముందుకు. లోక హితానికై కృషి చేయుము.
***
017.ప్రియ ఇతి గోపవధూభిః
శిశురితి వృద్ధైరధీశ ఇతి దేవైః |
నారాయణేతి భక్తైః
బ్రహ్మేత్యగ్రాహి యోగిభిర్దేవః ||
గోపాంగనల చేత ప్రియుడిగా, వృద్ధుల చేత శిశువుగా, దేవతల చేత లోకనాథుడిగా, భక్తుల చేత నారాయణుడిగా, యోగుల చేత బ్రహ్మగా దేవుడు భావించబడుతున్నాడు.
****
018.దుఃఖ సాగరే చరణీయం
కష్ట పర్వతే తరణీయంl
విపత్తి విపినే భ్రమణీయం
లోక హితం మమ కరణీయం
భావం: దుఃఖాల కడలిని దాటుము. కష్టాల పర్వతాన్ని అధిరోహించుము. ఆపదల అరణ్యాన్ని అధిరోహించుము. లోక హితానికై కృషి చేయుము
*****.
019..సర్వ పాపాని వేం ప్రాహు:
కటస్తద్దాహ ఉచ్యతేl
తస్మాత్ వేంకటశైలోయం
లోకే ఖ్యాతిం గమిష్యతిll
భావం: సకల పాపాలూ కలిపి 'వేం' అవుతుంది. వాటిని కాల్చివేయటమే 'కట'. అలా పాపాలను కాల్చివేసే పర్వతమే 'వేంకటాచలం'. ఆ విధంగానే ఈ పేరు లోకంలో ప్రసిద్ధి చెందింది.
*******
020..సుఖం వా యది వా దుఃఖం
ద్వేషం వా యది వా ప్రియమ్ |
ప్రాప్తం ప్రాప్తముపాసీత
హృదయేనావిదూయతా ||
(సుభాషిత సుధానిధి)
సుఖముగానీ, దుఃఖముగానీ, శత్రుత్వముగానీ, ప్రేమగానీ వచ్చినదాని గురించి హృదయంలో వ్యథచెందకుండా, ఇవి భవిష్యత్తులో మంచిది జరుగడానికే వచ్చాయని తెలుసుకొని, వచ్చినట్లుగానే స్వీకరించి అనుభవించాలి.
*****
021.న కార్తీక సమో మాస:
న దేవం కేశవాత్పరంl
న చ వేదం సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్ll
భావం: కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహా విష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు.
*****
022..స్త్రీయోఽక్షా మృగయా పానం
ఏతత్ కామసముత్థితమ్ |
దుఃఖం చతుష్టయం ప్రోక్తం
యైర్నరో భ్రశ్యతే శ్రియా ||
(మహాభారతం)
ఆడుది, జూదం, వేట, త్రాగుడు - ఇవి కామాతిశయంవలన కలిగే నాలుగు దుఃఖములని చెప్పబడినాయి. వీటితోనే మనిషి సంపదను పొగొట్టుకుంటాడు.
****
o23.జటా భారార్జి నైర్యుక్తా
దాంభికా వేషధారిణి:l
భ్రమంతి జ్ఞానివల్లోకే
భ్రామయంతి జనానపిll
భావం: జటలు, కృష్ణాజినమును అనగా జింక చర్మమును ధరించి, సన్యాసి వేషం ధరించి, డంబాచారముతో లోకంలో జ్ఞానులుగా సంచరిస్తూ ప్రజలను మోసగిస్తారు.
****
024...దేశే కాలే చ పాత్రే చశ్రద్ధయా విధినా చ యత్ |
పితౄనుద్దిశ్య విప్రేభ్యోదానం శ్రాద్ధముదాహృతం |
(బ్రహ్మపురాణమ)
శ్రద్ధతో విధిపూర్వకంగా దేశ కాల పాత్రత్వమునకు తగినట్టు పితృవర్గాన్ని ఉద్దేశించి విప్రులకు దానం చేయడమే శ్రాద్ధమనుబడుతుంది.
" తంతుం తన్వన్ పితౄన్ యజేత్ || "
(భాగవతం)
తనయొక్క వంశం అభివృద్ధి కావాలని కోరుకొనేవాడు పితృయజ్ఞం చేయవలెను.
దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం |
శ్రద్ధయా దేయం అశ్రద్ధయాఽదేయం ||
(తైత్తరీయ ఉపనిషత్)
దేవపితృకార్యములను తప్పకుండా చేయవలయును. శ్రద్దతో దానం చేయి. అశ్రద్ధతో దానం చేయవద్దు._
ఎవరు ఆస్తికభావనతోనూ, శ్రద్ధతోనూ ఉండి, మద మాత్సర్యరహితుడై శాస్త్రరీత్యా శ్రాద్ధం చేస్తాడో అతనికి స్వర్గమూ, సంతాన లాభమూ, సామర్థ్యమూ, శౌర్యమూ, గుణవాన్ పుత్రలాభమూ, శుభమూ కలుగుతాయి. అతడు లోకప్రియుడౌతాడు. ఆరోగ్యవంతుడూ, శోకరహితుడూ, ఐశ్వర్యవంతుడూ అయి బ్రహ్మలోకాన్ని పొందుతాడు - ఇట్లు యాజ్ఞవల్క్యస్మృతియందు చెప్పబడింది.
*****
025..*శ్రాద్ధాత్పరతరం నాన్యత్శ్రేయస్కరముదాహృతం |
ఇతి ఘోషం ఘోషమాహుః అశ్రాంతం నిగమాగమాః ||
(ధర్మప్రవృత్తి)
శ్రాద్ధ కర్మకంటే శ్రేష్ఠమైనది మరియు శ్రేయస్కరమైనది మరొకటి లేదని నిగమాగమాలు నిరంతరం ఘోషిస్తున్నాయి. తల్లిదండ్రులకు వసు-రుద్ర-ఆదిత్య రూపాలను చెప్పిన తత్త్వం ఏమిటంటే, తల్లిదండ్రులు వసువులు అంటే అష్ట ప్రకృతి రూపాల్లోని స్థూల శరీరం (ఆ శరీరం ధరించిన మన తల్లిదండ్రులు అష్ట వసువులు).
పితామహులు, పితామహిలు రుద్రులు, అంటే పంచేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు మరియు మనసుతో కూడిన పదకొండు ఇంద్రియాలతో కూడిన స్థూల శరీరానికి కారణమైన సూక్ష్మ శరీరం (అంటే పితృలకు కారణమైన పితామహులు-ఏకాదశ రుద్రులు). ప్రపితామహులు-ప్రపితామహిలు ఆదిత్యులు, ఈ సూక్ష్మ శరీరానికి కారణమైన పన్నెండు మాసాలతో కూడిన కాలం మరియు ప్రాణులు చేసిన కర్మఫలం. వీటివల్ల ప్రేరేపించబడిన కారణ శరీరం (అంటే పితామహులకి కారణమైన ప్రపితామహులు-ద్వాదశాదిత్యులు) ఇది బుద్ధి, అహంకారము అయినది. ఈ వసు, రుద్ర, ఆదిత్య రూపాల గురించి బృహదారణ్యకోపనిషత్తులో వివరించింది. ఇలాంటి శ్రేష్ఠ తత్త్వాలను కలిగిన శ్రాద్ధ మహత్త్వం అసాధారణమైనది.
*****
026.*హరణం చ పరస్వానాం పరదారాభిమర్శినమ్l
సుహృదశ్చ పరిత్యాగ: త్రయో దోషా: క్షయావహా:ll
భావం: ఇతరుల ఆస్తిని అపహరించడం, ఇతరుల భార్యలను రెచ్చగొట్టడం, స్నేహితులను విడిచి పెట్టడం.. ఇవి మూడు పూర్తిగా నాశనం చేసే దోషాలు.
****
027*అయం నిజ: పరోవేతి గణనా లఘు చేతసామ్l
ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్ll
భావం: ఇతడు నావాడు, అతడు ఇతరుడు... అన్నట్లుగా లెక్క పెట్టడం అల్పమనస్సు కలవాడికి ఉంటుంది. కానీ, ఉదారుడికి అనగా మంచి మనస్సు గలవాడికి ఈ భూమండలమే తన కుటుంబమవుతుంది.
****
028.*వసూన్ వదంతి వై పితౄన్ రుద్రాంశ్చైవ పితామహాన్ |
ప్రపితామహాంశ్చాదిత్యాన్ శ్రుతిరేషా సనాతనీ ||
(మనుస్మృతి)
వసు రుద్ర ఆదిత్య - ఈ ముగ్గురూ పితృ, పితామహ, ప్రపితామహ వీరియొక్క అధిష్ఠాన దేవతలు అని శ్రుతులు చాటుతున్నాయి. కావున వారిని ధ్యానించి శ్రాద్ధం చేయవలెను. తమ పిల్లలు ఇచ్చిన అన్నపానాదులతో తృప్తులైన పితృవులు శ్రాద్ధం చేసిన పిల్లలకు ఆయురారోగ్యమునూ, సత్సంతానము, విద్య, అధికారము, స్వర్గ మోక్షాది సకల సుఖాన్నీ కరుణిస్తారు - అని యాజ్ఞవల్క్యస్మృతిలో చెప్పబడింది.
పితృయజ్ఞంకంటె వేరు ధర్మం లేదు. పితృయజ్ఞంకన్న వేరు తపస్సు లేదు. పితృయజ్ఞాన్ని మించిన వేరే కర్మయే లేదు. ఇలా శ్రాధ్ధమహాత్మ్యాన్ని, శ్రేష్ఠతను శ్రుతి, స్మృతి, పురాణ, ఇతిహాసాలు కొనియాడుతున్నాయి.
శ్రాద్ధాత్ పరతరం నాన్యత్
శ్రేయస్కర ఉదాహృతమ్ |
(ధర్మప్రవృత్తి)
శ్రాద్ధం కన్న శ్రేష్ఠమైనది, శ్రేయస్కరమైనది మరొకటి లేదు. దేవపూజకన్న పితృపూజ అత్యంత ప్రాచీనమైనది. మనకు జన్మనిచ్చిన తల్లితండ్రులు ఉన్నప్పుడు వారి సేవను భక్తి శ్రద్ధలతో చేయడం అత్యంత శ్రేయస్కరమైనది మరియు శ్రేష్ఠమైనది. వారు గతించిన పిమ్మట సంవత్సరానికి ఒకసారైనా వారిని స్మరించి మన కృతజ్ఞత, భక్తిగౌరవములను చెల్లించవలసినది మనయొక్క పవిత్రమైన కర్తవ్యం కాదా? మాతాపితరులు మనకోసం పడిన శ్రమను మనం వంద జన్మలలోనూ తీర్చుటకు అలవి కానప్పుడు, సంవత్సరానికి ఒకసారైనా వారి స్మరణను చేయకుంటే మనం వారి సంతానమైనందుకు ప్రయోజనమేమిటి?
****
029.*స్వభావేన హి తుష్యంతి దేవి: సత్పురుషా: పితాl
జ్ఞానయస్త్వన్న పానేన వాక్య దానేన పండితా:ll
భావం: మంచి స్వభావముచేత దేవతలు, సజ్జనులు, తండ్రి... సంతృప్తి చెందుతారు. బంధు మిత్రులు అన్నపానాలతో సంతుష్టులవుతారు. విద్వాంసులైతే చక్కని మాటలతోనే ఆనందపడతార హృదయము.
****
030.*షోడశాబ్దాత్పరం పుత్రం ద్వాదశాబ్దాత్పరం స్త్రియంl
నా తాడయే దుష్ట వాక్యై:పీడయే న్న స్నుషాదికమ్ll
భావం: పదహారేళ్ళ వయసు దాటిన పుత్రులను తిట్టకూడదు. పన్నెండేళ్లు దాటిన కూతురితో కఠినమైన మాటలు మాట్లాడకూడదు. కోడళ్లను పరుష పదజాలంతో తిట్టకూడదు.
****
031.శ్రీమద్రామాయణము.
(312 )
"" జ్యేష్ట ఏవ తు గృహ్ణీయాత్ పితృవ్యం ధన మశేషతః,
శేషాః తమనుజీవేయః యథైవపితరం తథా""
ఇది స్మృతి ప్రమాణము.పిత్రార్జితములైన (రాజ్యము)సంపదలన్నిటికిని పెద్ధవాడే(జ్యేష్టుడే)అర్హుడు.ఇతరులు(తమ్ములు)ఆ జ్యేష్టుని తండ్రివలే గౌరవిస్తు విధేయులై నడచుకోవాలి.
రామాయణము అయోధ్యాకాండములో తనకు రాజ్యాధికారము కట్టబెట్టడానికి తల్లి కైకేయి చేసిన ఘాతుకాన్ని నిరసిస్తు భరతుడు తల్లితో,
032."" అస్మిన్ కులే హి పూర్వేషాం జ్యేష్టో రాజ్యే~భిషిచ్యతే,
అపరే భ్రాతారస్తస్మిన్ ప్రవర్తంతే సమసహితాః||(73-20),
ఓ పాపాత్మురాలా! మన ఇక్ష్వాకువంశమున కూడ పూర్వులు జ్యేష్డునకే రాజ్యాధికారము అప్పగించుచువచ్చిరి.ఇది మన సాంప్రదాయము.తక్కిన మా సోదరులందరము అన్నయ్య రామునికి విధేయులమై యుండవలసినదే యని తల్లిచేసిన పనిని గర్హించి కౌసల్యా మాతవద్ధకు వెళ్లి రామ వనవాసములో తన ప్రమేయము లేదని వివరిస్తూ,
033."" అప్రాప్య సదృశాన్ దారాన్ అనపత్యః ప్రమీయతామ్,
అనవాస్య క్రియాం ధర్మ్యాం యస్యార్యో~నుమతే గతః||(75-34),
జననీకౌసల్యామాతా! రాముని వనవాసమునకు పంపుటలో నా ప్రమేయమున్నచో "తగిన భార్యను చేపట్టక, అగ్నిహోత్రాది ధర్మకార్యమును అనుష్టింపనివాడై, సంతాహీనుడుగ మరణించెడి వానికి సంప్రాప్తించు పాపము నాకు చుట్టుకొనుగాక అంటు,
034.."" కమలపాణిః పృథివీమ్ అటతాం చీరసంవృతః,
భిక్షమాణో యథోన్మత్తో యస్యా~~ర్యో~నుమతే గతః||(75-39),
ఓ మాతా! నిజముగ ఈ వనవాస యాత్రలో ప్రమేయమున్మచో "మాసిపోయి చిరిగిన వస్త్రములను ధరించి ,పుర్రెను చేతపట్టుకొని బిచ్చమెత్తుకొనుచు యున్మత్తుని వలె తిరుగాడు వానికి పట్టు గతి నాకు పట్టుగాక! యని పలుపలు విధములుగ రామ వనవాసములో తన ప్రమేయము లేదని కౌసల్యామాత ముందు అట్డి పనులకి నేను పాల్పడలేదంటు అలా నేను ప్రవర్తించిన నాకు నరకము ప్రాప్తించుగాక యని విలపిస్తాడు.
కొన్ని కొన్ని సందర్భాలలో మన ప్రమేయము లేకపోయినా పరిస్థితుల ప్రభావకారణాల వల్ల మనము తాత్కాలికముగ నిందలు మోయవలసి వస్తుందని ఆయా సమయాలలో మనమెలా ప్రవర్తించాలో భరతుని పాత్ర ద్వారా గ్రహించమని రామాయణము మనలని జాగృతము చేస్తున్నది.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.
మీ విధేయుడు
మల్లాప్రగడ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
No comments:
Post a Comment