*మాఘ పురాణం*
17 వ అధ్యాయము
మాఘ పురాణం పదిహేడవ అధ్యాయంలో…
ఒకప్పుడు, ఇంద్రుడు ఒక ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి శాపం పొందాడు.
ఆ శాపం వలన అతనికి గాడిద ముఖం వచ్చింది. సిగ్గుతో, అతను పద్మగిరి గుహలో దాక్కున్నాడు. దేవతలు శ్రీమహావిష్ణువును ఆశ్రయించి ఇంద్రుని శాప విముక్తి గురించి అడిగారు.
శ్రీమహావిష్ణువు మాఘమాస స్నాన మహిమను వివరించి, గాడిద ముఖంతో ఉన్న ఇంద్రుడు మాఘమాసంలో నదీ స్నానం చేస్తే శాపం నుండి విముక్తి పొందుతాడని చెప్పాడు.
తన మాటలకు బలపరిచే ఉదాహరణగా, విశ్వామిత్రుని కథను కూడా చెప్పాడు…
ఒకసారి, విశ్వామిత్రుడు ఒక గంధర్వ స్త్రీతో కామ క్రీడలలో లీనమై తన తపస్సును కోల్పోయాడు. శాపం వలన అతనికి కోతి ముఖం వచ్చింది. కానీ, మాఘమాస స్నానం చేసి శ్రీమహావిష్ణువును ధ్యానించడం ద్వారా అతను శాపం నుండి విముక్తి పొందాడు.
శ్రీమహావిష్ణువు సలహా మేరకు, దేవతలు గాడిద ముఖంతో ఉన్న ఇంద్రునిచే మాఘమాస స్నానం చేయించారు. దాని ఫలితంగా, ఇంద్రుడు తన శాపం నుండి విముక్తి పొంది తిరిగి తన దివ్య శక్తులను పొందాడు. ఈ కథ మాఘమాస స్నానం యొక్క పుణ్య మహిమను మరియు భక్తి శక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది.. .
*ఇంద్రునికి కలిగిన శాపము:*```
వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. “రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము... ‘పూర్వము గృత్నృమదుడను మహర్షి గంగానది తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును వివరించుచుండెను. జహ్నువను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింప కోరగా గృత్నృమద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభం అగును. అటువంటి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాప నాశము కూడ అగుచున్నది. మాఘమాసమున ప్రాతః కాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహా పాతక విముక్తుడు అయినట్టుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు..
పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను అధ్యయనం చేసిన మిత్రవిందుడను ముని ఒక్కడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి, ఆమె ఒక నాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహ పరవశుడయ్యెను. అమెను ఎటులనైనా పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు
ఆ ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును, ఆమె చేష్టలను గమనిస్తూ ఉండెను.
మిత్రవింద ముని తెల్లవారు జామున శిష్యులను మేలుకొలిపి వేద పఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను, విడిపించుకొని పోవుచున్న ఆమెకు తాను ఎవరోనని చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశమై ఇంద్రుని పొందుకు అంగీకరించెను, కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్లేందుకు యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవు ఎవడవని అడిగెను. నేను ఇంద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవు అయి స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడియుండుమని శపించెను. ఆ చోటును విడిచి గంగా నదీ తీరమును చేరి అక్కడ తపము ఆచరించి యోగ శక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను.
ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగనేయుండును. అచట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలోనుండి అచట ఉన్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను. రాజైన ఇంద్రుడు లేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదకుచు నదీతీరముల యందు సముద్రతీరము నందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసము అగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తీరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించు కొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారిట్లనిరి. దేవతలారా వినుము మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతఃకాలమున తటాకమునందు స్నానము చేయుట శ్రీమహా విష్ణు పూజ, పురాణ పఠనము, యధా శక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి అదృష్టమనంతము. మాఘ శుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్పర్జనము, తిల దానము ఆవూప దానము, పాయస దానము, వస్త్రకంబళముల దానము, విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహా విష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు, మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి.
దేవతలును దివ్యమునుల మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగియుండెను. శంఖుచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగ నుండెను. కంకణములు వారములు వైజయంతీమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును దేవతలిట్లు స్తుతించిరి.
స్వామీ! నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీ అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నెంతటి వారైనను యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులు అయినారు. అట్టి నీకు మా నమస్కారములు స్వామీ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామీ! అటువంటి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయముల నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమయ మైనప్పుడు మఱ్ఱి ఆకుపై పరుండి చిదానంద స్వరూపడువైయుందువు.
పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరును యెరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదముల ననుసరించి సృష్టించి వాని యాందాసక్తుడవై యున్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయరూపమున నున్న నీకు నమస్కారము. సర్వ వ్యాప్తుడవైన నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటిని సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉర్దవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును నిన్ను స్తుతించుట తప్పయేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.
దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై యిట్లనెను. దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెననుభవించి దోషము చేసి మునిశాపమునొందెను. పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్దభ ముఖుడైన ఇంద్రునిచే నదీస్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖముకలవాడై, పూర్వమువలె దివ్య శక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు, కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీస్నానము చేయింపుడని చెప్పెను.
దేవతలు శ్రీమహావిష్ణువు మాటలనువిని విస్మితులైరి. స్వామి ముని శాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానముచే స్వస్ధుడగునా? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా! మాఘమాస స్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపి ముఖుడై మాఘస్నానము చేసి పూర్వ స్థితి పొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాస కాలము అగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి.
అట్లు వచ్చిన దంపతులులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీస్నానము చేయుచు భార్యను కూడ నదీస్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె ఈ చలిలో నాకీ చన్నీటి స్నానము బాధాకరము నేను స్నానము చేయజాలను. మీకు ఆసక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను అతని భార్య భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలసి స్నానము చేసెను. గంధర్వుడి భార్య మాఘ స్నానమును ధూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.
ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలలో తేలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని విశ్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి, “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామ వాంఛకు లోనై నీ తపశ్శక్తిని అంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము”, అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.
దేవతలారా! మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను..✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*మాఘ పురాణం - 18 వ అధ్యాయము*
*ఇంద్రుని శాపవిముక్తి*
శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను." దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు, మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు, నశించును.మాఘ వ్రతము నాచరించినవారు, నాకిష్టులు. వారు దేవతలై, వైకుంఠమును చేరుదురు.
మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేదములు, శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో, శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో, రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది. మేరువు పర్వతములలో గొప్పది. అన్ని దానములలో, ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము, సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరీ, ఇలా సర్వనదులయందును, పది సంవత్సరముల పాటు, సూర్యోదయ సమయమున, స్నానము చేసినచో, వచ్చు పుణ్యము, మూడు దినములు, అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి, పూజ మున్నగువానితో, వివిధ పుష్పములతో, సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన, మోక్షము వచ్చును, అని శ్రీమన్నారాయణుడు, దేవతలకు, మాఘవ్రత మహిమను వివరించెనుl.
దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి, యింద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి, చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.ఎంత ప్రయత్నించినను, ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని, శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి, మరునాడు మాఘస్నానాదికమును చేసి, ఆ తీర్థమును తొండపై పోసిరి.
పవిత్రోదకముచే తడిసిన తొండ, దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కరించి యిట్లు పలికెను." నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున, నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి, "మనుష్య జన్మము కష్ట ప్రదము, స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి, తపమాచరించుటమేలని" తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి, నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.
నేనును బంధువుల వద్దనుంటిని, వారి నిరాదరణ ఫలితముగ, చూచువారెవరును లేకపోవుటచే, భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు, బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు, జీవించుచుంటిని. భక్తి, వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమననేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి, పరిహాసము చేసితిని. ధనమును దాచి, సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి, నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు, నీతి నియమములను విడిచి, దురాచారవంతురాలనై, జీవితమును గడిపితిని, తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.
పులి, కోతి, ఎద్దు, మున్నగు పెక్కు జంతువుల జన్మనందితిని, పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును, ఆకలి కల వానికి పెట్టితిని, ఆ చిన్న మంచి పని వలన, మీరు దయయుంచి, నాకు శాపవిముక్తిని కలిగించిరి" అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే, ఆమె దేవతత్వమునంది,' దేవప్రియ' అను పేరును పొందెను. దేవతలలో, ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును, దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో, వికారరూపముతో తిరుగుచున్న యింద్రుని జూచి, బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికిపారిపోయెను. దేవతలను ఇంద్రుని జూచి, వెంబడించి, వానిని ఊరడించి, ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు, మహావిష్ణువు, నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను, ఆ, ప్రకారము చేయుదము" రమ్మని, తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెనుl.
ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి, సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా, జహ్నుముని, స్వామీ! యీ విష్ణు కథామృతము, ఇంకను వినవలెననున్నది. ఇంకను చెప్పుడని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు .ధనసంపాదనము తప్ప, ధనవినియోగము నాతడు చేయలేదు. పూజ, దానము, మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత, నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి, దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై, పంపాతీరమున, మఱ్ఱిచెట్టు పైనుండి, అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి, ఆ ప్రాంతమునకు, శిష్యులతో వచ్చి, మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు, మాఘస్నానము, పూజ, మున్నగునవి చేయుచు, శిష్యులకు, మాఘమాస మహత్త్యమును, వివరించుచుండెను, అతదు మాఘస్నాన మహిమను వివరించుచు, నొకనాడు, మాఘస్నానము చేసిన వారి సర్వపాపములును, సూర్యోదయమువలన చీకట్లు నశించినట్లుగా, నశించును. మాఘస్నానము చేయనివాడు నరకమునపోవును" అనుచు, మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును, చేయుట వలని శుభములను, చేయకపోవుటవలని అశుభములను, వివరించుచుండెను. ఆ సమయమున, పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము, వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు, పంపాజలమున, మాఘస్నానమును, వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన, మాఘ స్నానము వలన, వాని పిశాచరూపముపోయి, దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన, వైకుంఠమును చేరెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*మాఘ పురాణం - 19 వ అధ్యాయము*
*మునుల వాగ్వాదము*
గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. "ఓయీ వినుము. గోమతీ నదీ తీరమున, పవిత్రమైన నైమిశారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసికొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, యింద్రియ నిగ్రహము కలిగి, సర్వోత్తములైన వారిలో, పరస్పరము, నేనెక్కువయనగ నేనేయక్కువయను, వివాదము కలిగెను. భృగుమహర్షి, నేను తపోనిష్టుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవరున్నారని యనెను. గౌతముడును," నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసినవాడను. నేనే గొప్పవాడనని" పలికెను. లోమశుడను ముని," నాకు సమానుడు లేడు. నేను మునులకు గురువునని ప్రకటించెను." గార్గ్యుడను ముని, సభలో నిలబడి, "వేదశాస్త్రాదులన్నియు నాకు వచ్చును. కావున నేనే ఉత్తముడనని" యనెను. మాండవ్యుడు "నేను కర్మలను యేమరకుండ యధాకాలముగ చేయుదునుl.
నిత్యకర్మలనాచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటె ఉత్తముడెవడని" గర్జించెను. శంతనుడను ముని," నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రతకలవాడను. నన్ను మించిన వాడెవడు లేడని" పలికెను. పాలస్త్యుడను ముని లేచి," నేను వేదములు, శాస్త్రములు అన్నియు నేర్చినవాడను. పెద్దలు కూడ నన్నే గౌరవింతురు. కావున నేనే అధికుడనని"యనెను. శౌనకుడును," ఆత్మనేత్తలలో నేను మొదటివాడను, నాకంటె పూజ్యులెవరును" లేరనెను. ఆ మునివరులు, తమ గొప్ప తనమును, బిగ్గరగా, యెవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక, భృగు మహర్షి వద్దకు వచ్చి, వాని జడలను లాగి, పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరినొకరు ధూషించుకొనుచు, కొట్టు🌹 కొనుచు, వారి దండములను, ఛత్రములను లాగుచు, కోలాహలమును పెంచిరి.
ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా, కలహప్రియుడైన నారదుడు వచ్చెను, కలహించుకొనుచున్నవారిని, మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి, శ్రీహరికి, యీ విషయమును విన్నవించెను. శ్రీహరియు '"నారదా! ఆ మునులు జ్ఞానులైనను, నా మాయకు లోబడి, కలహించుకొనుచున్నారు. వీరి వివాదము, ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులను వారిని, వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును, యెల్లప్పుడును అయిదు సంవత్సరములవారుగనే యుందురు. వీరి బాల్యమున, చతుర్యుగములెన్నియో మార్లు గడచినవి. వీరితో బాటు వృద్ధుడు, బుద్ధిశాలియగు మార్కండేయుని గూడ పంపుదును. అతడు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా! నీవును అచటకు పోయి చూడుము" అని పంపెను. మార్కండేయ మహర్షి, వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని జూచి, వివాదపడుచున్న మునులు, వివాదమును ఆపి, అస్పష్టములైన మాటలతో, వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును, వారినందరిని కుశల ప్రశ్నాధికముతో, శాoతపరచెను. ఇట్లు కొంతకాలము గడచెను.
కొంతకాలము గడచిన తరువాత, బ్రహ్మజ్ఞానులగు సనక సనందాది మునులు నలుగురును, అచటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షియు, వారిని జూచి, యెదురువెళ్ళి, నమస్కరించి, అర్ఘ్యపాధ్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని, తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని జూచి, సనకాది మునులాశ్చర్య పడి, యిట్లనిరి. మార్కండేయ మునీంద్రా! నీవు వయో వృద్ధుడవు. మునులలో నుత్తముడవు, సప్త మహాకల్పములు, నీ ఆయుష్కాలము. ఇట్టి నీవుo బాలురమైన మాకు నమస్కరించి, పాదోదకమును నీ తలపై జల్లుకొనుచున్నావేమి? వృద్దులు, బాలురకు యెదురు వెళ్ళుట, నమస్కరించుట, చేయరాదని, శ్రుతివాక్యమున్నది కదా! మేము అయిదేండ్లవారమే కదా! అని పలికిరి.
ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని, మార్కండేయ మహర్షి యిట్లనెను. "భగవద్గావలాలమలారా! ఒకొక్క దినము గడుచుచుండగా, ప్రాణుల ఆయుర్దాయము, కుండ నుండి స్రవించు నీరువలె తగ్గిపోవుచున్నది. ఇరువది యొక్క కల్పములు జీవించినను, మృత్యువు తప్పదు. ఇందసత్యము లేదు. యెక్కువ వయస్సు ఉండుటవలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువుటచేత లాభమేమి, యోగమును పాటించుటచే, ఉపయోగమేమి? తపముచేత, కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు, చిరంజీవియైనచో, వచ్చిన ప్రయోజనమేమి? నిరర్దకముగ కాలము గడచుటచే, దుష్టుల జీవనము, గడచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించు వాడే, యెక్కువగ, వ్యర్థముగ, అజ్ఞానియై, యెక్కువ కాలము గడిపిన, వాని గొప్పదనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు, ప్రాణిలోకము భయమునంది, తాను చేసిన కర్మఫలముననుభవించి, మరల జన్మించును. నిత్యముకాని దేహముతో, విష్ణుకథా ప్రసంగము చేయువాని బ్రతుకు, సార్థకమైనది.🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞
*మాఘ పురాణం - 19 వ అధ్యాయము*
*మునుల వాగ్వాదము*
గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. "ఓయీ వినుము. గోమతీ నదీ తీరమున, పవిత్రమైన నైమిశారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసికొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, యింద్రియ నిగ్రహము కలిగి, సర్వోత్తములైన వారిలో, పరస్పరము, నేనెక్కువయనగ నేనేయక్కువయను, వివాదము కలిగెను. భృగుమహర్షి, నేను తపోనిష్టుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారెవరున్నారని యనెను. గౌతముడును," నేను అందరికంటే పెద్దవాడను, బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసినవాడను. నేనే గొప్పవాడనని" పలికెను. లోమశుడను ముని," నాకు సమానుడు లేడు. నేను మునులకు గురువునని ప్రకటించెను." గార్గ్యుడను ముని, సభలో నిలబడి, "వేదశాస్త్రాదులన్నియు నాకు వచ్చును. కావున నేనే ఉత్తముడనని" యనెను. మాండవ్యుడు "నేను కర్మలను యేమరకుండ యధాకాలముగ చేయుదునుl.
నిత్యకర్మలనాచరింతును, అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటె ఉత్తముడెవడని" గర్జించెను. శంతనుడను ముని," నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రతకలవాడను. నన్ను మించిన వాడెవడు లేడని" పలికెను. పాలస్త్యుడను ముని లేచి," నేను వేదములు, శాస్త్రములు అన్నియు నేర్చినవాడను. పెద్దలు కూడ నన్నే గౌరవింతురు. కావున నేనే అధికుడనని"యనెను. శౌనకుడును," ఆత్మనేత్తలలో నేను మొదటివాడను, నాకంటె పూజ్యులెవరును" లేరనెను. ఆ మునివరులు, తమ గొప్ప తనమును, బిగ్గరగా, యెవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక, భృగు మహర్షి వద్దకు వచ్చి, వాని జడలను లాగి, పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరినొకరు ధూషించుకొనుచు, కొట్టు కొనుచు, వారి దండములను, ఛత్రములను లాగుచు, కోలాహలమును పెంచిరి.
ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా, కలహప్రియుడైన నారదుడు వచ్చెను, కలహించుకొనుచున్నవారిని, మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి, శ్రీహరికి, యీ విషయమును విన్నవించెను. శ్రీహరియు '"నారదా! ఆ మునులు జ్ఞానులైనను, నా మాయకు లోబడి, కలహించుకొనుచున్నారు. వీరి వివాదము, ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులను వారిని, వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును, యెల్లప్పుడును అయిదు సంవత్సరములవారుగనే యుందురు. వీరి బాల్యమున, చతుర్యుగములెన్నియో మార్లు గడచినవి. వీరితో బాటు వృద్ధుడు, బుద్ధిశాలియగు మార్కండేయుని గూడ పంపుదును. అతడు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా! నీవును అచటకు పోయి చూడుము" అని పంపెను. మార్కండేయ మహర్షి, వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని జూచి, వివాదపడుచున్న మునులు, వివాదమును ఆపి, అస్పష్టములైన మాటలతో, వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును, వారినందరిని కుశల ప్రశ్నాధికముతో, శాoతపరచెను. ఇట్లు కొంతకాలము గడచెను.
కొంతకాలము గడచిన తరువాత, బ్రహ్మజ్ఞానులగు సనక సనందాది మునులు నలుగురును, అచటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షియు, వారిని జూచి, యెదురువెళ్ళి, నమస్కరించి, అర్ఘ్యపాధ్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని, తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని జూచి, సనకాది మునులాశ్చర్య పడి, యిట్లనిరి. మార్కండేయ మునీంద్రా! నీవు వయో వృద్ధుడవు. మునులలో నుత్తముడవు, సప్త మహాకల్పములు, నీ ఆయుష్కాలము. ఇట్టి నీవుo బాలురమైన మాకు నమస్కరించి, పాదోదకమును నీ తలపై జల్లుకొనుచున్నావేమి? వృద్దులు, బాలురకు యెదురు వెళ్ళుట, నమస్కరించుట, చేయరాదని, శ్రుతివాక్యమున్నది కదా! మేము అయిదేండ్లవారమే కదా! అని పలికిరి.
ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని, మార్కండేయ మహర్షి యిట్లనెను. "భగవద్గావలాలమలారా! ఒకొక్క దినము గడుచుచుండగా, ప్రాణుల ఆయుర్దాయము, కుండ నుండి స్రవించు నీరువలె తగ్గిపోవుచున్నది. ఇరువది యొక్క కల్పములు జీవించినను, మృత్యువు తప్పదు. ఇందసత్యము లేదు. యెక్కువ వయస్సు ఉండుటవలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువుటచేత లాభమేమి, యోగమును పాటించుటచే, ఉపయోగమేమి? తపముచేత, కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు, చిరంజీవియైనచో, వచ్చిన ప్రయోజనమేమి? నిరర్దకముగ కాలము గడచుటచే, దుష్టుల జీవనము, గడచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించు వాడే, యెక్కువగ, వ్యర్థముగ, అజ్ఞానియై, యెక్కువ కాలము గడిపిన, వాని గొప్పదనమేమున్నది? వినాశకాలము దాపురించినప్పుడు, ప్రాణిలోకము భయమునంది, తాను చేసిన కర్మఫలముననుభవించి, మరల జన్మించును. నిత్యముకాని దేహముతో, విష్ణుకథా ప్రసంగము చేయువాని బ్రతుకు, సార్థకమైనది.మహాత్ములైన సనక, సనందన, సనత్కుమార, సనత్పుజాతులారా! మీరు నిరంతరము, విష్ణు కథా ప్రసంగమును, చేయువారు, నిత్యము, ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి యెల్లప్పుడును, నీ హృదయపద్మములందే యుండును. మేము క్షణకాలమైనను, విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడ చేయము. నిరంతరము హరి కథా ప్రసంగము చేయు మీరు, బాలురైనను వృద్ధులే, హరికథా ప్రసంగములేని వారెంత వృద్ధులైనను, బాలురే కావున, మాకంటే మీరే గొప్పవారని, మార్కండేయ మహర్షి, సమాధానము నిచ్చెను. మార్కండేయుని మాటలను విని, సనకాది మహర్షులు, శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు, తమలో తాము, యెక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని, సిగ్గుపడిరి. వారందరును, మార్కండేయ మహర్షికి, సనకాది మునులకును, పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలిసికొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగశక్తి యిoడని ప్రార్థించిరి.
నారదుడును, శ్రీహరి వద్దకేగి, జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి, వ్యాస రూపమున, సూతునకు, సర్వశ్రుతుల జ్ఞానమును, బోధించెను. సూతునివలన, మునులు మొదలగు వారందరును, శ్రుతులసారము నెరిగిరి. శౌనకుడు, మునులును, అహంకారము మొదలైన మనోవికారములను విడిచి, ప్రశాంతచిత్తులై, పరమేశ్వర జ్ఞానము, పరమేశ్వర చింతనము, కలిగియుండిరి. హరకేయూరాది భూషణములు, తమ తమ విభిన్నరూపములనందినను కరిగిపోయి, తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా, ప్రాణులను తమ తమ కర్మ విశేషము ననుసరించి, వివిధరూపములు పొంది, తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదవేదాంగములను, సర్వశాస్త్రములను అభ్యసించి, పరమాత్మ మహత్త్యము నెరిగి, పరమాత్మ చింతనమును చేసి, భగవదనుగ్రహము నందుటయే, జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు, భగవచ్చింత, నేను నిరంతరముగ, అలవాటు చేసి, జీవులను తరింపజేయును. జహ్ను మునీశ్వరా! మాఘమాస వ్రతాచరణ, భగవచ్చింతనమును, జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన, ప్రాణి, యిహలోక సుఖములను, పరలోకములను, దుష్కర్మక్షయమును, సత్కర్మాచరణ ఫలమును పొంది, భవసాగరమును తరించును. మునుల అహంకారమును, మార్కండేయ ముని, వినయవివేకములను, సనక సనందనాదుల మహత్త్యమును, పరిశీలించి ప్రాణి వినయమును, భగవచ్చింతనమును, జ్ఞానఫలములని యెరిగి, ఆచరించి, భవసాగరమును, దాటవలెను సుమా, అని గృత్నృమద మహర్షి వివరించెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మాఘ పురాణము -20వ అధ్యాయము.*
భీముడు ఏకాదశీ వ్రతము చేయుట
పంచపాండవులలో రెండవ వాడిన భీముడు మహాబలవంతుడు భోజనప్రియుడు. ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు. బండెడన్నము అయినా చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలం పుట్టింది. ఏకాదశినాడు భోజనం చేయకూడదు కదాని భోజనం విషయంలో బెంగ ఉండేది. భోజనము చేసిన ఫలం దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి “ గురుదేవా ! అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అంటారు గదా! దాని విశిష్టత ఏమిట?” ని భీముడు అడిగాడు.
“అవును భీమసేనా! ఆరోజు అన్నిదినముల కంటే ప్రశస్తమయినది. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చు” అని పాండవ పురోహితుడు ధౌమ్యుడు చెప్పాడు.
“సరే నాకు అలా చేయాలని ఉన్నది గాని విప్రోత్తమా! నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్వితమే కదా! ఒక ఘడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎలాగ? అని విచారిస్తున్నాను. ఉపవాసము ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉంటుంది కనుక ఆకలి తీరేలా, ఏకాదశీ వ్రత ఫలము దక్కేలా నాకు వివరించమని భీముడు అడిగాడు.
భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి “రాజా! ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏకార్యము చేసినా కష్టములు కనిపించవు. నీవు దీక్షబూనినచో ఆకలి కలుగదు. రాబోవు మాఘశుద్ధ ఏకాదశీ మహా శ్రేష్ఠమయినది. దానికి మించిన పర్వదినం ఇంకొకటి లేదు. ఒక్కొక్క సమయములో మాఘ ఏకాదశి పుష్యమీ నక్షత్రముతో కూడినదై ఉంటుంది. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏది లేదు. సంవత్సరములో వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహా పర్వదినము. ఆ రోజు నియమము తప్పకుండా ఏకాదశి వ్రతము ఆచరించు. ఆకలి గురించి దిగులు పడకు. అని ధౌమ్యుడు భీమునకు వివరించాడు.
ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటచే మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసము ఉన్నాడు. మాఘ శుద్ధ ఏకాదశి “భీమ ఏకాదశి” అని పిలుస్తారు. ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు, అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసములోనే వస్తుంది. మహా శివరాత్రి మహత్యము గురించి కూడా వివరిస్తాను. శ్రద్ధాళుడవై ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో చెప్ప సాగాడు.
శివరాత్రి మహత్యము
ఏకాదశి మహావిష్ణువునకు ఎలా ప్రీతికరమైన దినమో అదేవిధముగా మాఘచతుర్దశి అనగా శివచతుర్దశి. దీనినే ‘శివరాత్రి’ అని అంటారు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమయిన రోజు. మాఘమాసములో వచ్చు అమావాస్యకు ముందురోజు దానినే “మహాశివరాత్రి” అని అందరూ పిలుస్తారు. ప్రతి మాసమందు వచ్చు మాసశివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు నదిలో గాని, తటాకమందుగాని, లేక నూతివద్ద గాని స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళితో బిల్వ పత్రములతో పూజించాలి. పూజించి శివప్రసాదము సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ ఉండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన ఎంతటి పాపములు ఉన్నా అవన్ని వెంటనే హరించి పోయి, కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రి కంటే మించినది ఇంకొకటి లేదు. ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది మాఘమాసం కృష్ణ పక్షములో వచ్చు చతుర్దశి. అందరు జాతి బేధములతో నిమిత్తం లేక శివరాత్రి వ్రతము ఆచరించి జాగరణ చేయవలయును.
“ పూర్వము శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడనే బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసిస్తు ఉండేవాడు. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. వాడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి, వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించటము తప్ప మరేమీ తెలియదు. జంతువులను వేటాడటములో నేర్పు గలవాడు, క్రూర మృగములు సహితం బోయవానిని చూచి భయపడి పారిపోయేవి. అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు.
ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళినట్లే బయలుదేరి వెళ్ళాడు. ఆనాడు సాయంకాలము అవుతున్నా జంతువులు ఏమీ కంటపడలేదు. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించక పొద్దు పోయినా అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువు కొరకు ఎదురు చూస్తున్నాడు. చలిఎక్కువ అవుతూ, మంచు కురుస్తున్నా కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరమును కప్పుకున్నాడు. అలా కప్పుకుంటున్న సమయములో ఆ కొమ్మలకు ఉన్న ఎండుటాకులు రాలి చెట్టుక్రింద ఉన్న శివలింగము మీద పడ్డాయి. ఆరోజు మహాశివరాత్రి రోజు బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు. తనకు తెలియక చేసినా కొన్ని మారేడు పత్రములు శివలింగముపై పడ్డాయి. ఆ కారణము చేత శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది. మాఘమాసములో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడటము తిండిలేక ఉపవాసము ఉండటము ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసాయి.
జరామరణములకు హెచ్చు తగ్గులు గాని, శిశువృద్ధులు గాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుష్యుడు తన జీవితమును గడపాలి.
మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణము ఆసన్నమై ప్రాణములు విడచిపెట్టాడు. యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుపోతుండగా కైలాసమునుంచి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు వెళ్ళారు. యమభటులు చేసేది లేక జరిగినది యమునితో చెప్పారు. యముడు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు.
శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తుంబుర, నారద గణములతో కొలువు తీరివున్న సమయములో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనము ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించాడు.
యముడు మహేశా! చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందిస్తున్నాను. నేను రావడమునకు కారణము ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు. దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వ పత్రములను కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకుతుందా ?” అని యముడు అడిగాడు.
యమధర్మరాజా! నాకు ఎంతో ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపైన వేసి, తిండిలేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపవిముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కుతుంది. ఈ బోయవాడు పాపాత్ముడయినప్పటికీ శివరాత్రి వ్రతమహిమ వలన నా సాయుజ్యము ప్రాప్తమయినదని పరమేశ్వరుడు యమునికి వివరించాడు. యముడు చేసేది లేక చంద్రశేఖరుని వద్దనుండి వెళ్ళిపోయాడు.
🍁🥀🍁🥀🍁🥀🍁🥀🍁🥀🍁
_*మాఘ పురాణం - 22 వ అధ్యాయము*_
_*క్షీరసాగరమధనము*_
గృత్నృమదమహాముని జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునివర్యా! వినుము, అశ్వమేధయాగము చేసినవాడును, ఏకాదశివ్రత నియమమును పాటించినవాడును, మాఘమాసవ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలమునంది తుదకు మోక్షమును గూడ పొందును. స్వర్గాధిపతియై యింద్ర పదవినందును. మాఘ ద్వాదశినాడు బ్రాహ్మణులతో గలసి పారణ చేయువాదు, అన్నదానము చేయువాదును పొందు పుణ్యము అనంతము అని పలికెను.
జహ్నుముని గృత్నృమదమహాముని! తిధులనేకములుండగా యేకాదశి అన్నిటికంటె శుభప్రదమైనది యెట్లయ్యెను? అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశీ వ్రతమొక్కటే యిచ్చుటయేమి? ఎవరైనను యిట్లు చేసి యితటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగెను. గృత్నృమదమహాముని యిట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్రపౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగుగను, సర్పరాజువాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడువరుసలుగ జుట్టి దేవతొలొక వైపునను రాక్షసులు మరియొక వైపునను పట్తిరి.
వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువామెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్శ్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృతకలశము మున్నగునవి సముద్రమునుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని యింద్రునకిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరువద్దకు పోయి నమస్కరించి యిట్లు స్తుతించిరి.
_*దేవదానవులు చేసిన శివస్తుతి*_
నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే
నమోగిరాం విదూరాయ నమస్తే గిరి ధన్వవే ||
నమశ్శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ
నమోనిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే ||
త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక
త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే ||
త్రయీధర్మైకసాధ్యాయ త్రిరూపాయోరురూపిణే
అరూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః ||
హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే
మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల ||
పాహ్యస్మాన్ కృపాయాశంభో విషాత్ వైస్వానరోసమాత్s
అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషమును మ్రింగి తన కంఠమును నలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటినుండి యేర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవ దానవులు సముద్రమును, ధనమును మాని అమృతపాత్రను స్వాధీనము చేసికొనవలయునని యత్నించిరి, ఒకరికి దక్కకుండ మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు యేర్పడినది.
మాయావియగు శ్రీమహావిష్ణువు మోహిని రూపము నందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు, జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వువలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములైయుండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగవంటి శరీరము కలిగి సర్వాభరణభూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగ సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారాయని మధురస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరిv.
ఆమె దేవదానవులను జూచి దేవతలారా, దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినైయుండి యీ అమృతకలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగ పంచెదను.దేవతల వర్గమొక వైపునను, రాక్షసుల వర్గము మరియొకవైపునను కూర్చుండిరి. ఈమె యెవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండ అమృతమును సమానముగ పంచునని తలచెను.
అందరిని మోహవ్యాప్త పరచుచున్న ఆ జగన్మోహిని అమృతపాత్రను చేత బట్టెను. ఆమె ఆ అమృతపాత్రను రెండు భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరియొకవైపున సురను(కల్లు) ఉంచెను. రాక్షసులున్నవైపున కల్లును, దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచునెవరికిని అనుమానము రాకుండ అటునిటు దిరుగుచునుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి చెవులకింపుగ ధ్వనించుచున్న పాదములయెందెల రవళితోను, హస్తకంకణముల సుమధుర నాదములతోను, ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగ మనోహర, మధురముగ దిరుగుచు అమృతమును దేవతలకును, సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగ చేసి కొన్నవారై త్రాగుచుండిరిl.
_*రాహుకేతువుల వివరణ*_
రాక్షసులపంక్తిలో కూర్చున్న యిద్దరికి దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సువర్చస్సు పెరుగుట తమవారందరును సముద్ర మధనజనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపదిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతలవరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగ దానిని త్రాగుటతో నామెకనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహినీ రూపముననున్న జగన్మోహనుదు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలోనుండిరి. చంద్రుదు మొదలగువారు త్వరత్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలోనుండిరి. వారు యింతశ్రమయిట్లు అయ్యెని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో నిద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను.
చక్రముచే నరుకబది చావుబ్రతుకు లేవి అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని యీస్థితి మాకు దర్భరముగనున్నది. మాగతియేమి మాకాహారమేదియని దీనముగ శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతోగాని, అమావాస్యతోగాని కల సంధికాలములయందు సూర్యుని, చంద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరిs.
ఇంద్రుడు మొదలగు దేవతలు అమృతకలశమును తీసికొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్రతీరమున అమృత కలశముంచినప్పుడు రెండు అమృతబిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరియొక బిందువు తులసి మొక్కగను అయినది. కొంత కాలము గడిచెను. సత్యజిత్తను సూద్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండిటిని సంరక్సించెను. ఆ రెండు మొక్కలున్నచోట మనోహరమైన పూలతోటగామారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచు పారిజాతపుష్పములను తులసీదళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్పసమృద్ధమై నయనానందకరముగ నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగ నుండెనుv.
ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకీయవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు దీసికొని వెళ్ళెను. శచీదేవిమున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు యీ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని(యక్షుని) పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్షయజమాని నడుగ కుండ వానికి తెలియకుండ దొంగతనముగ తెప్పించుచుండెనుl.
పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొనయత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండ ఆకాశమున కెగిరిపోయెను. సత్యజిత్తు యెంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యముకాకుండెను. దేవేద్రుడును 'నీవు యక్షుడవు, ఆకాశగమన శక్తికలవాడవు. మానవులకు దొరకవు. కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెనూ. పుష్పములు ప్రతిదినము పోవుచునే యున్నది. సత్యజిత్తునకేమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను.
యక్షుదు యధాపూర్వముగ పారిజాతపుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమనన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగ వాని దివ్యశక్తులతో బాతు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై గూడ సరిగా నడువలేక కుంటుచుండెను. యక్షుడును యెంత ప్రయత్నించినను అచటినుండి పోలేకపోయెను జరిగినదానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని 'ఓరీ నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి, మా పుష్పములను ప్రతిదినము యెందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెనూ యక్షుడును 'నేను యక్షుదను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పముల నపహరించి యింద్రునకు ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని యాజ్ఞచేత నిట్లు చేసితిని. కాని బుధ్ధిసాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు యేమియు మాటలాడక యింటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో నుండెను
*మాఘపురాణం - 22వ అధ్యాయం సంపూర్ణం*
*మాఘ పురాణం - 23 వ అధ్యాయము*
*నారదుని దౌత్యము - దేవతల దైన్యము*
గృత్నృమదమహర్షి జహ్నువుతో నిట్లనెను. పారిజాత పుష్పములకై వెళ్లిన యక్షుడింకను రాకపోవుటకు కారణమేమని యింద్రుడుని విచారించెను. పారిజాత పుష్పముపై నున్న యిష్టము అధికమగుటచే, తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు, దేవతలను గూడ, తనతో తీసికొనివచ్చెను. సువాసనలను విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి, యింద్రుడు, దేవతలు మహోత్సాహముతో, పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే, స్వర్గమునకు దీసికొని పోదలచిరి. ఆ మహోత్సాహములో, శ్రీహరి, పూజా నిర్మాల్యమును, పాదములతో, త్రొక్కిదాటిరి. ఫలితముగా, దివ్యశక్తులను గోల్పోయిరి. శక్తివిహీనులైరి, ఇంద్రాదులింకను రాలేదని, మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాతవృక్షమును పెకలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే, వారును, శక్తి హీనులై పడియుండిరి.
మరునాటి ఉదాట్యమున, సత్యజిత్తు, తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన యింద్రాదులను జూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును, విచారమును, చెందెను. వారికి నమస్కరించెను. "ఇంద్రాది దేవతలారా! మీరు మానవులమైన మాకంటె గొప్పవారు. ఇంతటి మీరు, స్వల్ప ప్రయోజనమునకై, యిట్టి అకార్యమునేల చేసితిరి. మీరు నాకు తెలియకుండ, పుష్పములను దొంగతనముగా తీసికొని పోదలచుట దోషము కాదా?" అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక, తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు, నేలపైనున్న మాంసమునకాశపడి, భూమిపై వానియవమానము నందినట్లు, మేమును, పారిజాత పుష్పముల కాశపడి, ధర్మమును తప్పి, దొంగలించి, యిట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితియేమిటో, యెట్టిదో, చెప్పుమని, యడిగిరి. సత్యజిత్తు వారికేమియు సమాధానమును చెప్పక, తన యాశ్రమమునకు పోయెను.
ఇంద్రుడు మొదలగువారు, ఆహారము లేక, దుఃఖపడుచు నచట పదునొకండు దినములుండిరి. వారికి ఆ కాలమున, అమృతాహారము లేదు. కామధేనువు యిచ్చు మధురక్షీరమును లేదు. కల్పవృక్షము, చింతామణి యిచ్చునట్టి, పుష్టికరములైన భక్ష్యభోజ్యములును లేవు. మిక్కిలి దీనులై యుండిరి. సత్యజిత్తును, దేవతల దురవస్థకు, విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును, తొలగించెను. తానేమి చేయవలెనో, దేవతల దుస్థితి తన వలన యేర్పడినది యెట్లు తొలగునో తెలియక, దీనులైయున్న దేవతలపై జాలిపడెను. అశరణ శరణ్యుడైన శ్రీహరిని, యధాపూర్వకముగ పూజించుచు, తానును, భార్యయు, నిరాహారులై యుండిరి. ఈ విధముగా, సత్యజిత్తు కూడ, పదనొకండు దినములు, నిరాహారుడై, శ్రీహరి పూజను మానక, శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడాకాశమున దిరుగుచు, దేవతల దురవస్థను, గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థపోవునో, అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి, యిట్లు స్తుతించెను.
*నారదకృత విష్ణుస్తుతి*
ఆర్తత్రాణపరాయణాయభవతే నారాయణాయాత్మనే
గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీశాయ చేశాయచ ||
మిత్రానేక హిమాంశుపావక మహాభాసాయ సాజ్యప్రదే
శ్రీమత్పంకజపత్ర మేత్ర నిలసత్ కృష్ణాయ తుభ్యం నమః ||
అచ్యుతాయాదిదేవాయ పురాణ పురుషాయచ
సర్వలోక నిధానాయ నమస్తే గరుడ ధ్వజ ||
నమో అనంతాయ హరయ క్షీరసాగరవాసినే
భోగీంద్ర తల్పశయన లక్ష్మ్యాలింగిత విగ్రహ ||
నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన
సర్వేశ సర్వగస్త్యంహి సర్వాధారస్సురేశ్వర ||
సర్వంత్వమేవ వృజసి నత్త్వ రూపస్త్యమవహి
పురుషాపి గుణాధ్యక్ష గుణాతీత స్స్నాతనః ||
పరబ్రహ్మసి విష్ణుస్త్యం బ్రహ్మసి భగవాన్ భవః
సృష్తిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ ||
త్రిగుణోసిగుణాధార స్త్రిమూర్తిస్త్యం త్రయీరమః
ఆ సీత్త్యన్మాయయా సర్వం జగత్ స్థావర జంగమం ||
త్వమేనైకార్ణవేజాతే జగత్యస్మిన్ జగత్పతే
జగత్ సహృత్యసకలం ప్రిత్వా భాబేహనే తు భాసకః ||
త్వమేవ సర్వలోకానాం మాతాత్వం నా పితా విభో
గురుస్త్యం సర్వభూతానాం శిక్షకస్పుదాయకః ||
ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావర జంగమం
ప్రసీదపాలయవిభో నమస్తే సురవల్లభ ||
నారదుని స్తుతిని విని, సర్వజ్ఞుడగు శ్రీహరి,యేమియు నెరుగనివానివలె, ''నారదా! స్వాగతము ఇప్పుడెందులకీస్తుతి? నీకేమి కావలయునో చెప్పుము. ఏమి చేసిన నీకు సుఖము అగునో, అది యెట్టిదైనను, దేవాదులు సాధింపజాలనిదైనను, నీకు సమకూర్చెదను" చెప్పుమని యడిగెను. నారదుడును, తలవంచి," ఇంద్రాదులు చెడుపనిని చేసి, ఆపదపాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వాని యందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతి దినము దొంగలించుచుండిరి. ఆ పుష్పములకై మిక్కిలి యిష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై, యింద్రుడు, దేవతలతో బాటు వెళ్లి, ఆ పారిజాత వృక్షము వద్ద, అగ్ని సమీపమున, రెక్కలు కాలిపడిన మిడుతవలె, దేవతా గుణముతో పడియున్నాడు. అమృతాహారులైన యింద్రాది దేవతలు, పదునొకండు దినముల నుండి, నిరాహారులై, దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణ మూర్తీ! నీవిప్పుడు, వారిని దయయుంచి రక్షింపవలయునని," నారదుడు కోరెను.నారదుని మాటలను విని శ్రీహరి, 'నారదా! అమృతకలశము నుండి తొణికి పడిన రెండు బిందువుల అమృతమే, పారిజాత వృక్షముగను, తులసిగను అయినది. అనగా ఆ రెండును, అమృతము నుండి పుట్టినవి. రెండు మిక్కిలి పవిత్రములు, సత్యజిత్తనువాడు, ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అదియొక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను, తులసి దళములను అమ్మి, ఆ ధనముతో, దరిద్రులను ఆర్తులను పోషించి, తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను, ఇట్టి యుత్తమునికి, దీనులకును, జీవనాధారమగు పుష్పసంపదను, త్రిలోకాధిపతియగు నింద్రుడు, నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకాదీనుడగు సత్యజిత్తు, నన్నర్చించిన నిర్మాల్యమును, పుష్పవాటికలో జల్లగా, భోగలాలనుడగు నింద్రుడు, నా నిర్మాల్యమును గూడ దాటెను. త్రొక్కెను. ఇన్ని దోషములచే, త్రిలోకాధిపతియగు నింద్రుడు, వాని యనుచరులు, శక్తిహీనులై, తోటలో పడి యున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును, తెలిసికాని, తెలియకకాని, దాటిన, తొక్కిన, యెంతటి వాడైనను, శక్తిని కోల్పోయి, దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు, యింద్రాదుల దైన్యమునకు బాధపడుచు, నేమి చేయవలెనో తెలియక, తానును, భార్యతో బాటు, నిరాహారుడై, నన్నర్చించుచు, నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు, నేటి వరకు, పదనొకండు దినములు, దేవతలు అమృతపానము లేక, నిరాహారులైరి. సత్యజిత్తును, వారిని జూచి, భార్యతోబాటు, నిరాహారుడై యుండెను. దేవతల విముక్తికై, నన్ను ప్రతిదినము, నర్చించునే యున్నాడు. నేడు పదకొండవ దినము. అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు, నేడు కూడ, ఉపవాసముండి, నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు, జాగరణమొనర్చినచో, నేను ప్రసన్నుడై, అతడేది కోరినను వెంటనే యిచ్చెదను. అతడే కాదు. యెవరైనను, యేకాడశి నాడు, ఉపవాసముండి, జాగరణ చేసి, నా మంత్రమును జపించినచో, వారికిని, కోరిన దానినిచ్చెదను" అని, విష్ణువు సమాధానము ' నిచ్చెను. నారదుడును యేమియును మాటలాడలేక, తన దారిన బోయెను, అని గృత్నృమదమహాముని, జహ్నువునకు చెప్పెను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*మాఘపురాణం - 24వ అధ్యాయము*
విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట
శూద్ర స్త్రీ వృత్తాంతము
మాఘమాసమందలి నదీస్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడ పరమ పవిత్రమైనది.
ఒక మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపొయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గందర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంట చూచెను. ఆమె అందము యౌవనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా మరలనా గంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు, గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆదృశ్యమును చూచి మండిపడుచు “నీవు తపస్వివైయుండి కూడా కామతృష్ణ గల వాడవైతివి గాన నీకు కోతి ముఖము సంభవించుగాక యని విశ్వామిత్రుణ్ణి, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు”మణి భార్యను శపించి వెళ్ళిపొయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖము కలిగివుండగా నారదుడు ఈవిషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడకు వచ్చి “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోని నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సరేలెమ్ము. గంగా నదిలో స్నానం చేసి నీ కమండలంతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము. అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంగా మారిన గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయినాడు.