Friday, 20 February 2026

22-24

 [12/11, 9:12 am] . Mallapragada: _*కార్తీక పురాణం - 22 వ అధ్యాయము*_


 *పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట*


☘☘☘☘☘☘☘☘☘


మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను.

పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి , శ్రీహరిని గానముచేసి , సాష్టాంగ నమస్కారము చేసి , సూర్యోదయముకాగానే నదికిపోయి , స్నానమాచరించి తన గృహమున కెగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు - మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి *"రాజా ! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని , యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము , నీ రాజ్యము నీకు దక్కును"*, అని దీవించి అదృశ్యుడయ్యెను. *"ఈతడెవరో మహానుభావునివలె ఉన్నారు అని , ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక , శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా !*


ఆ యుద్దములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి *"పురంజయా రక్షింపుము రక్షింపు"* మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా ! విషం త్రాగినను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా *'శ్రీ హరి'* అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా ! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా !


హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులు పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును. సంసారసాగరం ఉద్దరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు , అంబరీషుడు , శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు , భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదలనొసంగి కాపాడుచుండును.


శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి , వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు , నిరాకారుడు , నిర్వికల్పుడు , నిత్యానందుడు , నీరజాక్షుడు , పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహాత్మ్య మందలి ద్వావింశోధ్యాయము - ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము.*


******

[13/11, 9:36 am] . Mallapragada: _*కార్తీక పురాణం - 23 వ అధ్యాయము*_


*శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట*


అగస్త్యుడు మరల అత్రిమహర్షిని గాంచి *"ఓ మునిపుంగవా ! విజయమొందిన పురంజయుడు యేమిచేసెనో వివరింపు"* మని అడుగగా అత్రిమహాముని యిట్లు చెప్పిరి - కుంభసంభవా ! పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము , శత్రుశేషము వుండకూడదని తెలిసి , తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకంముగా తన రాజ్యమును యేలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావమువలన గొప్ప పరాక్రమవంతుడు , పవిత్రుడు , సత్యదీక్షాతత్పరుడు , నిత్యాన్నదాత , భక్తప్రియవాది , తేజోవంతుడు , వేదవేదాంగవేత్తయై యుండును. మరియు అనేక శత్రువులను జయించి దశదిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై , విష్ణు సేవాధురంధరుడై , కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కుడా జయించినవాడై యుండెను. ఇన్ని యేల ? అతడిప్పుడు విష్ణుభక్తాగ్రేసరుడు , సదాచారసత్పురుషులలో వుత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తిలేదు. ఏ దేశమున , యే కాలమున , యే క్షేత్రమున యే విధముగా శ్రీ హరిని పూజించిన కృతార్దుడనగుదునా ? యని విచారించుచుండగా  ఒకానొకనాడు అశరీరవాణి *"పురంజయా ! కావేరీతీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు"* అని పలికెను.


అంతట పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని , రాజ్యభారమును మంత్రులకు అప్పగించి , సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు , ఆయా దేవతలను సేవించుచు , పుణ్యనదులలో స్నానము చేయుచు , శ్రీరంగమును జేరుకొనెను. అక్కడ కావేరీనది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యముపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమొంది , చేతులు జోడించి , *"దామోదరా ! గోవిందా ! గోపాలా ! హరే ! కృష్ణా ! వాసుదేవా ! అనంతా ! అచ్యుతా ! ముకుందా ! పురాణపురుషా ! హృషికేశా ! ద్రౌపదీమాన సంరక్షకా ! దీనజన భక్తపోషా ! ప్రహ్లాదవరదా ! గరుడధ్వజా ! కరివరదా ! పాహిమాం ! పాహమాం ! రక్షమాం రక్షమాం ! దాసోహం పరమాత్మ దాసోహం"* యని విష్ణు సోత్త్రమును పఠించి , కార్తీక మాసమంతయు శ్రీ రంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల , మహిమవలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో , పాడిపంటలతో , ధనధాన్యాలతో , ఆయురారోగ్యములతో నుండిరి.


అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహా గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యా నగరమందలి వీరులు యుద్దనేర్పరులై , రాజనీతి గలవారై , వైరిగర్భ నిర్బేదకులై , నిరంతరము విజయశశీలురై , అప్రమత్తులై యుండిరి. ఆ నగర మందలి అంగనామణులు హంసగజగామినులూ , పద్మ పత్రాయత లోచనులూనై విపుల శోణీత్వము , విశాల కటిత్వము , సూక్ష్మ మద్యత్వము , సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు , శీలవతులనియు , గుణవతులనియు ఖ్యాతికలిగి యుండిరి.


ఆ నగర మందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిశారదలై , ప్రౌఢలై , వయోగుణ రూప లావణ్య సంపన్నలై , సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుండిరి. ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూషా పారాయణలై సద్గుణాలంకార భూషితలై చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరలై యుండిరి.


పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీకమాస వ్రతమాచరించి సతీసమేతుడై యింటికి సుఖముగా జేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో యెదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పరాయుణుడై రాజ్యపాలన మొనర్చుచు , కొంతకాలము గడిపి వృద్దాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని , తన కుమారునికి రాజ్యభారము అప్పిగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడా వానప్రస్థాశ్రమమందు కూడా యేటేటా విధివిధానముగ కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడగుటచే మరణించి వైకుంఠమునుకు పోయెను. కావున , ఓ అగస్త్యా ! కార్తీకవ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి , చదివినపుడు వినువారికి కూడా వైకుంఠప్రాప్తి కలుగును.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహత్మ్య మందలి త్రయోవింశోధ్యాయము - ఇరవైమూడో రోజు పారాయణము సమాప్తము.*


****

[14/11, 7:09 am] . Mallapragada: [

*🚩కార్తీక పురాణం - 24 వ అధ్యాయము🚩*_


*అంబరీషుని ద్వాదశి వ్రతము*



అత్రి మహాముని మరల అగస్త్యునితో *"ఓ కుంభసంభవా ! కార్తీకవ్రత ప్రభావము నెంతివిచారించిననూ , యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము.*


*"గంగా , గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసినందువలనను , సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతముచేయు విధానమెట్లో చెప్పెదను వినుము.*


*కార్తీక శుద్ధదశమి రోజున , పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కాలదు. దానిని కూడా వివరించెదను. సావధానుడవై అలకింపుము"* అని ఇట్లు చెప్పుచున్నాడు.


పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు , ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి , ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన , తొందరగా స్నానమున కేగిరమ్మనమని కోరెను. దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంత సేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. *"ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకాతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చువరకు ఆగితినా ద్వాదశీ ఘడియలు దాటిపొవును. వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించినయెడల , హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు , భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక , ఈ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు."* అని అలోచించి *"బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే పోగట్టగలరు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి"* దని , సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.


*"ఓ పండిత శ్రేష్టులారా ! నిన్నటి దినమున ఏకాదశి యగుటం జేసి నేను కటిక ఉపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి ఇంతవరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా ? లేక , వ్రతభంగమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలెనా ? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిన"* దని కోరెను. అంతట ఆ ధర్మజ్ఞులైన పండితులు , ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని , దీర్ఘముగా అలోచించి *"మహా రాజా ! సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తినొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము , నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు , దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరు సదాపూజింపవలెను. గృహస్తు , ఇంటికి వచ్చిన అతిధి కడజాతివాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును , మహతపశ్శాలియు , సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను"* అని విశదపరచిరి.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి చతుర్వింశోధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.*


🙏

25-27

 [15/11, 11:00 am] . Mallapragada: _*🚩కార్తీక పురాణం - 25 వ అధ్యాయము🚩*_


*దూర్వాసుడు అంబరీషుని శపించుట*


☘☘

*"అంబరీషా ! పూర్వజన్మలో కించిత్ పాపవిశేషమువలన నీకీ అనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము"* అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు *"ఓ పండితోత్తములారా ! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్టను విడచుట కన్న , విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును ? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన , జలపాన మొనరించి వూరకుందును"* అని వారి ఏదుటనే జలపానము నొనరించెను.


అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ *"ఓరీ మదాంధా ! నన్ను భోజనానికి రమ్మని , నేను రాకనే నీవేల భుజించితివి ? ఎంత దుర్మార్గము , ఎంత నిర్లక్ష్యము ? ఎంతటి ధర్మ పరిత్యాగివి ? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన , నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు ?   శ్రీ హరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే అవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా ! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా ! నీ వంశము కళంకము కాలేదా?"* అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు , ముని కోపమునకు గడ గడ వణుకుచు , ముకుళిత హస్తములతో *"మహానుభావా ! నేను ధర్మహీనుడను , నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ , దయా దాక్షిణ్యములు గలవారూ కాన , నన్ను కాపాడు"* డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని *"దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను , రెండవ జన్మలో తాబేలుగానూ , మూడవజన్మలో పందిగాను , నాలుగవ జన్మలో సింహముగాను , ఐదవ జన్మలో వామనుడు గాను , ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను , ఎ ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను , ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను , తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను , పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక"* అని వెనుక ముందు ఆలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా , శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని , తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి *"మునివర్యా ! అటులనే - మీ శాపమనుభవింతు"* నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా , శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి *"బ్రతుకుజీవుడా"* అని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను , దేవలోకమునకు వెళ్లి దేవేంద్రుని , బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని , కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ ఎంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. 


*ఇట్లు స్కాంద పురాణాంర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

[16/11, 7:43 am] . Mallapragada: _*🚩కార్తీక పురాణం - 26 వ అధ్యాయము🚩*_


*దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ*


ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపమువల్ల కలిగిన ప్రమాదమును తెలిసి , మిగిలన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.


ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము , భువర్లోకము , పాతాళలోకము , సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి *"వాసుదేవా ! జగన్నాథా ! శరణాగతరక్షణ బిరుదాంకితా ! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీవక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము. శ్రీహరి ! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"* దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి *"దూర్వాసా ! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా ! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో , దేవ , బ్రాహ్మణ , సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును. నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని , అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథినై వచ్చికూడ , నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి , నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను ! చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని , పవిత్రతకును చేయదగినదే కదా ? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే ? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని , తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి , దయాశాలి , ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.


అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము , సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి , ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప , యదువంశమున శ్రీకృష్ణునిగను , కలియుగమున బుద్దుడుగను , కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట *"కల్కి"* యను పేరున జన్మించి , అశ్వారూడుండనై పరిభ్రమించుచు బ్రహ్మదోషులనందరను మట్టుబెట్టుదును. నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను ఈ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వింశోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.*


🙏

[17/11, 7:51 am] . Mallapragada: _*🚩కార్తీక పురాణం - 27 వ అధ్యాయము🚩*_


*దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట*


మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను - కుంభ సంభవా ! ఆ శ్రీ హరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను.


*"ఓ దూర్వాసమునీ ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము ఎత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కావున , అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని , ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును , బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును , కాలితో తన్నినవాడును , విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును , విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మ హంతకులే అగుదురు. కాన , ఓ దూర్వాస మహర్షి ! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు , విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో ! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి , నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును"* అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి    సప్తవింశోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.*

Tuesday, 17 February 2026

 [03/02, 12:50 pm] . Mallapragada: *శతపత్ర -1*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



లండన్! ఒకప్పుడు సూర్యుడస్తమించని బ్రిటీష్ మహా సామ్రాజ్యానికి రాజధానీ నగరం. యూరప్ లోని పురాతన నగరాల్లో లండన్ ఒకటి. ప్రస్తుతం వలస రాజ్యపాలన అంతమయ్యాక బ్రిటన్ కి మాత్రమే రాజధానిగా పరిమితమైపోయిందీ నగరం. రెండుసార్లు తగలబడిపోగా పునర్నిర్మించ బడిన నగరం లండన్. యూరప్ లో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు లండన్ లో వేలాది మంది ఆ మహమ్మారిబారిన పడి చనిపోయారు.


చరిత్ర ప్రసిద్ధమైన ఎందరో వీరుల్ని, ఎన్నో యుద్ధాల్ని, మరెన్నో ఘోరాల్ని చూసిన నగరం. ఎన్నో ఖండాలు, ఎన్నో దేశాల చరిత్రల్ని, సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని, ప్రపంచ అద్భుతాల్ని, వింతల్ని గుప్పిటపట్టి దాచిన నగరం.


వలస రాజ్యాల నుంచి అంతులేని సంపదే కాదు. అమూల్యమైన, అలభ్యమైన గ్రంథాలు కూడా బ్రిటన్ కి తరలించబడ్డాయి. అందుకే ప్రపంచంలో అనేక భాషలకు చెందిన సాహిత్య, చారిత్రక గ్రంధాలు కూడా ఇప్పటికీ లండన్ లైబ్రరీలో కన్పిస్తాయి. మనలో చాలామంది మన నమ్మకాల్ని మూఢనమ్మకాలనుకుంటారు. పాశ్చాత్యులు అవి అధునాతన భావాలని, వారిలో మూఢ నమ్మకాలుగాని, భయాలుగాని అస్సలు కనిపించవని అనుకుంటారు. నిజానికి మనకన్నా పాశ్చాత్యులకే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయని చాలామందికి తెలియదు.


దయ్యాలు, భూతాలు, భయాలు మనదేశం లో కన్నా అమెరికా, ఆఫ్రికా, యూరప్ దేశాలవారికే ఎక్కువ.


దయ్యాలు, భూతాలు వణికించే వింత జీవుల కథలతో హాలీవుడ్ నిర్మాతలు నిర్మించినన్ని దయ్యాల సినిమాలు మరే దేశంలోనూ నిర్మించబడలేదు.

📖


మనం బయటికి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురైతే అశుభంగా భావిస్తాం. కొన్ని దేశాల్లో పిల్లి ఎదురైతే శుభశకునంగా భావిస్తారు. పదమూడు సంఖ్య గురించి మనకి ఎలాంటి సెంటిమెంట్లూ లేవు. పదమూడు కాని ఆ సంఖ్యను చూస్తేనే వణికిపోయేవారున్నారు అక్కడ. వాళ్ళు పదమూడు సైతాన్ సంఖ్యగా భావిస్తారు. ఎంత భయమంటే హోటల్లో ఆ సంఖ్యతో గది ఉండదు. పదమూడు వదిలేసి పధ్నాలుగుతో కంటిన్యూ చేస్తారు.


అలాగే ఇంటి నెంబరు కూడా 13 ఉంచరు. ఆ సంఖ్యని అరిష్టంగా భావిస్తారు.


అయితే ఇదే పదమూడు సంఖ్యను మయన్ నాగరికతకు చెందినవారు చాలా పవిత్రంగా భావిస్తారు. భూమి నుంచి స్వర్గానికి మధ్య పదమూడు లోకాలున్నాయని, ఆ సంఖ్య దేవతల సంఖ్య అని భావించేవారు. మనకి కూడా ఏడు ఏడు పధ్నాలుగు లోకాలున్నా యంటారు. పైన స్వర్గానికి, భూమికి మధ్యన గాంధర్వ, కిన్నెర, కింపురుష, విద్యాధర, యక్ష మొదలైన దైవలోకాలున్నాయని, కింద అతల, వితల, సుతల, పాతాళ, తలాతల మొదలైన ఏడు లోకాలున్నాయని, అవి రాక్షస లోకాలని అంటారు. వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కిన పురాణ గాధ మనకు తెలిసిందే.


నమ్మకాలు, మూఢనమ్మకాలు, భ్రమలు, నిజాలు ఆయా దేశ కాల పరిస్థితులనుబట్టి వేరువేరుగా ఉంటాయి. ఒకచోట మంచి అనుకునే విషయం మరోచోట చెడుకావచ్చు. అయితే దయ్యాలు, భూతాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి.


అమెరికాలోని మెక్సికో ప్రాంతపు అడవుల్లో ను, ఆఫ్రికా అడవుల్లోను, మనదేశంలో కేరళ, అస్సాం ప్రాంతాల్లోనూ ఇప్పటికీ గొప్ప గొప్ప మంత్రగాళ్ళున్నారు.


లండన్ నగరం వరకే చూస్తే- అక్కడి హీత్రూ విమానాశ్రయంలో దయ్యాల గురించి అనేక కథలు ప్రచారంలో వున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా షేక్ ష్పియర్ నాటకాల్ని ప్రదర్శిస్తున్న గొప్ప ధియేటర్ ఒకటి లండన్ లో ఉంది. ఆ ధియేటర్ లో ఇప్పటికీ దయ్యాలున్నాయని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.


అసలు ఈ దయ్యాలు, భూతాలు ఏమిటి? ఆత్మ ఏమిటి? మనిషి మరణించిన తర్వాత ఆత్మ దయ్యమవుతుందా? మరణానంతరం కూడా ఆత్మకు జీవితం ఉందా? ఉంటే అది ఎలాంటి జీవితం?


ఆత్మ చావు లేనిది. అగ్నితో కాల్చబడదు. కత్తితో చీల్చబడదు. చావు శరీరానికేగాని, ఆత్మకు లేదు అని గీతాచార్యుడు బోధించాడు.


శరీరాన్ని పోగొట్టుకున్న ఆత్మ మరో శరీరం ధరించాలి. అంటే ఆత్మ మరణానంతరం మనిషి కావచ్చు. కుక్క కావచ్చు, నక్క కావచ్చు. మరో జీవి గర్భాన్ని వెదుక్కుని పోవాలి. ఆత్మ గర్భస్థశిశువుగా మారి పునర్జన్మించాలి కాని మధ్యలో మరో జన్మకు పోకుండా దయ్యాలు, భూతాలుగా మారటం ఏమిటి? అసలు మరణానంతరం ఆత్మ ఏమవుతోంది?

📖


ఈ ఆత్మశోధన ఈనాటిది కాదు. ఏనాటికీ మనిషి మేథస్సుకు అంతుచిక్కని దైవరహస్యమిది.


మనిషి అంతరిక్షంలో ఎన్నో అద్భుతాల్ని ఆవిష్కరించగలుగుతున్నాడు. శోధించి ఎన్నో కొత్త కొత్త విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. కాని మన భూమిపైనే అంతు చిక్కని, విచిత్రమైన ఎన్నో మిస్టరీలు దాగి వున్నాయి. వాటిని మాత్రం అస్సలు ఛేదించలేకపోతున్నాడు.


మంగోలియా మహావీరుడు చెంఘిజ్ ఖాన్ చనిపోయి శతాబ్దాలు గడిచాయి. అయినా ఇంతవరకు అతని సమాధిని కనిపెట్టలేక పోయారు. ఆ సమాధిని కనిపెట్టి అందులో దాచిన బంగారాన్ని, వజ్రవైఢూర్యాల్ని కొల్లగొట్టాలని ఇప్పటికీ అన్వేషణ సాగిస్తూనే వున్నారు.


ప్రస్తుతం చెంఘిజ్ ఖాన్ సమాధిగా చెప్పబడుతున్న చోట ఆ నిధి లేదు. ఇక్కడో విచిత్రం ఉంది. ఆ సమాధి ముందు ఒక శిలా అశ్వం వుంది.


చెంఘిజ్ ఖాన్ పునర్జన్మించినప్పుడు గుర్తుగా ఆ అశ్వం ముందు కాళ్ళు లేపి బిగ్గరగా సకిలిస్తుందట.


"ఈ సూచన ఇంతవరకూ జరగలేదు. కాబట్టి చెంఘిజ్ ఖాన్ ఇంకా పుట్టలేదనే అనుకోవాలి.


ఇలాంటిదే వీరబ్రహ్మేంద్రస్వామి- యాగంటి లో బసవడు లేచి రంకె వేస్తాడని కాలజ్ఞానంలో రాయటం.


శ్రీకృష్ణుడి ద్వారకానగరం నీటమునిగిన గాథ లాంటిదే, ఒకప్పుడు అట్లాంటిక్ సముద్రంలో అట్లాంటిస్ అనే నగరం కూడా నీట మునిగిపోయింది. ఆ నగరాన్ని కనిపెట్టి బంగారం తీయాలని చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు.


బెర్ముడా ట్రయాంగిల్ అనే సముద్రదీవి వైపు వెళ్ళిన ఏ నౌకా వెనక్కి తిరిగిరాలేదు. దీవి మీదుగా ఎగిరిన ఏ విమానం కూడా తిరిగి ల్యాండ్ కాలేదు. దీని మిస్టరీ ఏమిటో ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఫ్లయింగ్ సాసర్స్ ఇంకా అంతుచిక్కని మిస్టరీగానే వుంది.


లోకంలో ఘనకార్యలు చేయటంకోసమే కొందరు పుడతారు. అనుభవంలోకి వస్తేగాని తనలో ఉండే ప్రత్యేకత ఏమిటో కొందరికి అర్థంకాదు.


ఏదో సాహసం చేయాలి, ఏదో సాధించాలని పట్టుదలైతే ఉందిగాని, ఏం సాధించాలో తెలీని స్థితిలో ఒక యువతి అన్వేషణ సాగిస్తోంది.


ప్రపంచంలోని మిస్టరీలను స్టడీ చేస్తూ ప్రస్తుతం లండన్లోనే వుంది. ఆ యువతి పేరు శతపత్ర.

📖


అదేపనిగా కాలింగ్ బెల్ మోగుతుంటే బిరబిరా వచ్చి తలుపుతీసింది విశ్వదా.

ఎదురుగా శతపత్ర. లేతాకుపచ్చ చక్కటి డిజైన్ లోని చుడీదార్ లో చిరునవ్వులు చిందిస్తూ అరవిరిసిన ముద్ద మందారంలా నిలబడి వుంది.


నడుమ్మీద చేతులుంచుకుని కించిత్తు కోపంగా చూసింది విశ్వదా.


“అనుకున్నాను. వీకెండ్ వస్తేగాని ముఖం చూపించవనుకున్నాను. ఇవాళ లైబ్రరీ సెలవుగాబట్టి నేను గుర్తొచ్చాను. అంతేగా?” అనడిగింది సీరియస్ గా విశ్వదా.


“అంతేగా అంటే... అంతే మరి. నేనేం చెప్పినా నువ్వు నమ్మవుగా...” అంది శతపత్ర.


"నన్ను నమ్మించాలని చూడకు. నీమీద నాకు ఎంత కోపంగా వుందో తెలుసా?" అంది విశ్వదా.


"అది తెలిసే నీకోపం పోగొట్టాలని వచ్చాను. అయినా ఏమిటే ఇది. డోర్ లో నిలబెట్టే మాట్లాడతావా? లోపలికి రానీయవా?” అంది నవ్వుతూ శతపత్ర.


తల ఊపి చిన్నగా నిట్టూర్చింది విశ్వదా. “రా తల్లీ. లోపలికి రా” అంటూ పక్కకు తప్పుకుంది.


"అంత మర్యాద అక్కర్లేదులే” అంటూ లోపలికి వచ్చింది శతపత్ర. తలుపుమూసి వెనుతిరిగింది విశ్వదా.


"నాకొస్తున్న కోపానికి నిన్నేం చేయాలో తెలీటంలేదే. పదిరోజులైంది నిన్ను చూసి. ప్లాట్ కొస్తేనేమో ఉండవు. ఎప్పుడు చూసినా లైబ్రరీ... లైబ్రరీ. పోనీ లైబ్రరీ కొద్దామంటే అక్కడంతా సైలెన్స్. మాట్లాడుకోడం అసలు కుదరదు. ఈమధ్య మరీ పుస్తకాల పురుగు వైపోతున్నావ్. కూచో, కాఫీ తెస్తాను" అంటూ లోపలికి వెళ్ళింది విశ్వదా.


శతపత్ర వయసు పాతికేళ్ళు. అయిదున్నర అడుగుల ఎత్తు. ఆ ఎత్తుకు తగిన అంగసౌష్ఠవం. అందానికి నిర్వచనం ఈ అమ్మాయేనా అన్పిస్తుంది ఆమెనిచూడగానే. అంతటి సౌందర్యవతి. అందం ఒక్కటే కాదు. ఒక విధమైన ఠీవి, దర్పం ఆమెలో కొట్టొచ్చినట్టు కన్పిస్తాయి. ఆచితూచి మాట్లాడటం, ఏ పని చేసినా హుందాగా చేయటం శతపత్ర ప్రత్యేకత.


పద్మదళాయతాక్షి. అంటే తామరపూవు రేకువంటి కనులు కలిగినది అనర్ధం.


ఆకర్ణాయతనేత్రి. అంటే చెవులవరకు వ్యాపించిన కనులు కలది అని అర్ధం. ఈ రెండు పోలికలు స్త్రీయొక్క విశాలనేత్రాలని తెలియజేస్తాయి.


అటువంటి విశాల నేత్రాలు, విశాలమైన ఫాలభాగం, కోటేరులా తీర్చిదిద్దినట్టుండే చక్కటి ముక్కు పగడాల వంటి పెదవులు, శంఖంలాంటి మెడ, స్వచ్ఛమైన బంగారంలా మెరిసే మేనిఛాయ... ఇవన్నీ అరుదుగా రాజవంశ స్త్రీలలో మాత్రమే కన్పించే సోయగం లక్షణాలు. శతపత్రను చూస్తే ఆమె ఏ రాజవంశానికో చెందిన యువతి అని అపోహపడతారు. అంతగా విలక్షణమైన, అందమైన యువతి శతపత్ర.


ఆమె లండన్ వచ్చి ఆరేళ్ళయింది. చదువు అయిపోయింది. అయినా ఇక్కడే ఉంది. ఇండియా తిరిగివెళ్ళలేదు. ఎప్పుడు వెళ్తుందో కూడా తెలీదు. స్నేహితురాలైన విశ్వదాకి కూడా ఆ వివరాలు తెలీదు.


విశ్వదా వయసు కూడా పాతికేళ్ళు. ఆమె అయిదేళ్ళుగా లండన్ లో ఉంటోంది. ఆమె చదువు ఇంకా పూర్తికాలేదు. చదువుతో పాటు పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తోంది. గొప్ప అందం అని చెప్పలేం. తన అందాన్ని ఇనుమడింపచేసుకోడానికి మిడ్డీస్, స్కర్టు- ఇలా అక్కడి యువతుల్లాగే డ్రస్ చేసుకుంటుంది. తన అందాల ప్రదర్శనకి ప్రాధాన్యత నిస్తుంది. అలాగని చెడ్డది కాదు. బాయ్ ఫ్రెండ్స్ లేరు.


డ్రెస్ విషయం విశ్వదాకి పూర్తి వ్యతిరేకి శతపత్ర. ఆమెకు మన సాంప్రదాయ దుస్తులంటేనే ఇష్టం. చీర జాకెట్ ధరించటం మరీ ఇష్టం. సందర్భాన్నిబట్టి చుడీదార్లు, జీన్స్ ప్యాంట్స్ షర్టులు ధరిస్తుంది. ఒళ్ళు కనబడే దుస్తులు ఆమెకు దూరంగా వుండాల్సిందే.


ఇద్దరూ హైదరాబాదీ యువతులే కావటంతో వారి స్నేహం మరింత గట్టిపడింది. అయితే యిద్దరూ ఎవరి ఫ్లాట్ లో వాళ్ళుంటున్నారు.


శతపత్ర ఉంటున్న ఫ్లాట్ అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో వుంది. తన బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటోంది. విశ్వదా మాత్రం ఒంటరిగానే ఉంటోంది తన ప్లాట్ లో.

🍁

*సశేషం*

[03/02, 7:21 pm] . Mallapragada: *శతపత్ర -2*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



కిచెన్ లో నుండి రెండు కాఫీ కలిపి తెచ్చి ఒకటి శతపత్రకి ఇస్తూ- "వంద ఆకుల ఒయ్యారీ... తీసుకోవమ్మా కాఫీ” అంది కొంటెగా!


"ఇదిగో... అలా తెలుగులో పిలిస్తే కోపం వస్తుంది. తెలుసుగదా” కాఫీ అందుకుంటూ ఉడుక్కుంది శతపత్ర. 


“ఎందుకే కోపం. శతపత్ర అంటే వంద ఆకులనేగా అర్ధం. నీ మూడ్స్ కూడా వంద రకాలుగా ఉంటాయి. అందుకే నేను అలా అన్నాను" అని అంది ఆమె ఎదురుగా కూచుంటూ విశ్వదా.


“సర్లే... అయినా వచ్చీరాగానే నామీద విరుచుకుపడుతున్నావ్! ఏమైంది నీకు?” కాఫీ సిప్ చేస్తూ మధ్యలో అడిగింది.


“నాకేమీ కాలేదు. నీకే ఏదో అయింది. మరీ పుస్తకాల పురుగువైపోతున్నావ్. ఆ లైబ్రరీ తప్ప మరే లోకం అస్సలు కనిపించటం లేదు నీకు” అంది.


“నువ్వు కన్పించావ్ చాలదా? ఈ రోజంతా నీతోనే. భోజనం కూడా ఇక్కడే."


"సంతోషం. ఆ మధ్య ఇండియా నుంచి అమ్మ పంపిన ఆవకాయపచ్చడి ఉంది. ముద్దపప్పు, నెయ్యి, గడ్డ పెరుగు, అప్పడాలు. ఇవి చాలా? నాన్ వెజ్ ఏమన్నా చెయ్యాలా, గుడ్లు ఉన్నాయి. ఆమ్లెట్స్ వేసుకోవచ్చు...”

"ఇవి చాలుగాని... ఏమిటే... వంట అయిపోయినట్టు మాట్లాడుతున్నావ్" అంది శతపత్ర.


"అయిపోయినట్టు కాదు. అయిపోయింది. మనిద్దరికీ వండి స్నానానికి వెళ్ళొచ్చాను. నువ్వొచ్చావు.”


"అంటే నేనొస్తానని ముందే తెలుసా?”


"తెలుసు.. నీ ఫ్లాట్ కి ఫోన్ చేస్తే నో రెస్పాన్స్. నీ పక్క ఫ్లాట్ లో అనంతయ్యగారి కూతురుందిగా సుబ్బలక్ష్మి. ఫోన్ చేసి నీ గురించి అడిగితే చెప్పింది. నా వద్దకే నువ్వు బయలుదేరి వస్తున్నావని.”


"సో... నీ కోసం నేను వస్తున్నానని తెలిసి కూడా.... నామీద కోపమన్నమాట.”


"కోపం ఉండదా?” అంటూ ఖాళీ కప్పులతో కిచెన్లోకి వెళ్ళి మూడు నిముషాల తర్వాత తిరిగివచ్చింది విశ్వదా.


"ఇంతకీ నువ్వు ఇండియా ఎప్పుడు వెళ్తున్నావ్?” పక్కన కూచుంటూ అడిగింది.


“తెలీదు” అంది శతపత్ర.


"నేను మాత్రం వచ్చే జూన్ లో ఇండియా వెళ్ళిపోవాలి. అప్పటికి ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. నీలాగే కొద్దిరోజులు ఉందామనుకున్నాను. బట్ డాడీ ఆర్డర్. తప్పదు.”


"ఎందుకింత తొందర?”


"నాకు పెళ్ళి చేయాలని ఇంట్లోవాళ్ళు తొందరపడుతున్నారు.”


"నీకా... అప్పుడే పెళ్ళా?"


"హలో... అల్రెడీ పాతికేళ్లు వచ్చేశాయమ్మా. ఇంకెప్పుడు పెళ్ళి? వయసైపోయాకా? నువ్వు కూడా లైన్లోనే ఉన్నావు. ఆ సంగతి మర్చిపోకు.”


“మర్చిపోలేదుగాని, వయసొచ్చింది గాబట్టి పెళ్ళిచేసుకోవాలి. అంతేనా? ఇంకేమీ లేదా?”


“ఇంకేముంటుంది?”


"అబ్బాయి నచ్చాలి. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవాలి. అన్నిటికీ మించి ప్రేమగా చూసుకోవాలి...." అంది శతపత్ర.


“నువ్వు చెప్పే విషయాలు లవ్ మేరేజస్ కి వర్తిస్తాయి తప్ప, అరేంజ్డ్ మేరేజస్ కి వర్తించవు.”


“ఎందుకు వర్తించవు? మైనారిటీతీరిన యువతి తనకు నచ్చినవాడ్ని పెళ్ళి చేసుకోవచ్చని చట్టం వుంది...”


"హలో మేడమ్... కొన్ని విషయాల్ని చట్టాలతో ముడిపెట్టి ఆలోచించలేం. నా వరకే తీసుకో. నా ఉడ్బి అమెరికాలో ఇంజనీర్. మొదటిసారి నేను మా వూరు - వెళ్లినప్పుడు అనుకోకుండా మా పెళ్ళి చూపులు జరిగిపోయాయి. మా డాడీ ఒక్కటే చెప్పారు. నీకు కుర్రాడు నచ్చితేనే సంబంధం ఓకే చేస్తాను. ఛాయిస్ నీది అన్నారు. అతని పేరు మోహన్. నాకు నచ్చాడు. నేనూ తనకు నచ్చాను. ఇద్దరం మాట్లాడుకున్నాం. మా అభిప్రాయాలతో మనసులు కలిశాయి. ఓకే చెప్పేశాను. పూర్వంలా కాదు, ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకే స్వేచ్ఛనిస్తున్నారు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తేనే ప్రమాదం” అంది

విశ్వదా.


“సో... యూ ఆర్ లక్కీ.. విష్ యు బెస్టాఫ్ లక్. పెళ్ళి తర్వాత అమెరికా, ఇక ఆపైన నేను గుర్తుండను.”


“గుర్తుండవా? నీలా అనుకున్నావా నేను. మా పెళ్ళి అయిన తర్వాత అమెరికా వెళ్ళేప్పుడు లండన్ లో నీకోసం ఆగుతాం. నా ఉడ్బి ని నీకు చూపిస్తాను. నీ ప్లాట్లోనే రెండురోజులు స్టే చేస్తాం. అయినా ఏం చెప్పగలం. ఈలోపలే నాకన్నా నువ్వే ముందు ఇండియా వెళ్ళిపోతావేమో...” అంది.


"లేదు. లేదు. ఇంకొంతకాలం ఇక్కడే వుండాలి”


“ఎందుకు? నాకసలు తెలీక అడుగుతాను. అంత చదువుకోవాలంటే మనదేశంలో లైబ్రరీలు లేవా?”


ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఒక్క నిముషం మౌనంగా ఉండిపోయింది శతపత్ర


ఆమె మౌనాన్ని మరోలా అర్ధంచేసుకుంది విశ్వదా. చిన్నగా నవ్వింది. "సో... నీ ప్రాబ్లం నాకు తెలిసిపోయింది. ఇప్పట్లో పెళ్ళి చేసుకోవటం నీకిష్టంలేదు. హైదరాబాద్ వెళ్తే మీ వాళ్ళు నీకు పెళ్ళి చేసేస్తారని భయపడు తున్నావ్. అందుకే ఆగిపోయావ్” అంది.


“నో... నో... అలాంటిదేమీ లేదు. నువ్వనుకున్న కారణమైతే నేను లైబ్రరీలో గంటలకొద్దీ సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఏముంది?”


“మరెందుకు లైబ్రరీకి వెళ్తున్నావ్?”


“అన్వేషణ”


"వాట్? దేనికోసం అన్వేషణ?”


"చూడు విశ్వదా? ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నేటికీ అంతుచిక్కని ఎన్నో మిస్టరీలున్నాయి. విచిత్రమైనవి, భయానక మైనవి, దారుణమైనవి ఎన్నో... అలాంటి మిస్టరీలకు సంబంధించిన సమాచారం కోసం అన్వేషిస్తున్నాను.”


“ఓ షిట్...” అంటూ నుదురు రుద్దుకుంది విశ్వదా.


"అసలు ఇలాంటి ఆలోచన నీకెందుకొచ్చిందే. తెల్సుకుని ఏంచేస్తావ్. ఆ మిస్టరీలను ఛేదించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని ఆశపడు తున్నావా?”


“లేదు” అంది నవ్వుతూ శతపత్ర.


"మరెందుకు? అలాంటి వింతమిస్టరీల గురించి తెలుసుకుని ఏం చేస్తావ్. పూర్తిగా కాకున్నా నాకూ కొన్నిటి గురించి తెలుసు. బెర్ముడా ట్రయాంగిల్... అదో అంతు చిక్కని మిస్టరీ. దాని రహస్యం ఇప్పటికీ మహా మహులకే అంతు చిక్కలేదు. నీవల్ల అవుతుందా?


అట్లాంటిక్ సముద్రం లోతుల్లో గొప్ప బిలం వుంది. అది ఎక్కడికి పోతుందో, అది అసలు ఎలా ఏర్పడిందో నేటీకీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.


ఫ్లయింగ్ సాసర్స్ గురించి అనేక కథనాలు ఉన్నాయి. వాటి సంగతి కూడా మిస్టరీగానే ఉండిపోయింది. అంతదేనికి? మనదేశం లోనే ఉత్తర భారతంలో ఓ గ్రామం వద్ద ఏటా ఒక మాసంలో పక్షులు సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. అవి అలా ఎందుకు మరణిస్తున్నాయన్న ప్రశ్నకు నేటికీ బదులు దొరకలేదు."


"విశ్వదా! ప్లీజ్. చాలు ఇక ఆపవే. ఇవన్నీ నాకు తెలుసు" అంది శతపత్ర.


"తెలిసినవాటి కోసం అన్వేషణ దేనికే?"


"తెలియని వాటికోసం.”


"అర్థం కాలేదు..."


"క్వీన్ విక్టోరియా లైబ్రరీలో ఉన్నంత సాహిత్య సంపద ప్రపంచంలో మరే లైబ్రరీలోనూ లేదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలు, అనేక దేశాలకు చెందిన గ్రంథాలు అక్కడ ఉన్నాయి. మన దేశానికి చెందిన ఎంతో విలువైన ప్రాచీన తాళపత్ర గ్రంథాలూ ఉన్నాయి.


నాకో మిస్టరీ గురించి తెలుసు. అది ఎక్కడ వుందో తెలీదు. దాని జాడ ఖచ్చితంగా ఈ లైబ్రరీలో తెలుస్తుందని నా నమ్మకం. అందుకే మహాసముద్రంలాంటి ఆ గ్రంథాల మధ్య నా అన్వేషణ సాగిస్తున్నాను. ఏదో రోజు నాక్కావలసిన సమాచారం అక్కడ ఖచ్చితంగా దొరుకుతుందని నా నమ్మకం."


"ఓకే... ఐ అగ్రీ విత్ యు... బట్... నీకు తెలిసిన మిస్టరీ ఏమిటి?" అడిగింది విశ్వదా.

శతపత్ర కాస్సేపు మౌనంగా వుండిపోయింది. బహుశా విశ్వదాకు తన అనుభవాన్ని చెప్పాలా వద్దాని ఆలోచనలో పడినట్టుంది. ఏం చెప్పేదోగాని, ఇంతలోనే ఒక సంఘటన జరిగింది... 


బయటనుంచి ఏవో వస్తువులు కిందపడి భళ్ళున పగిలిన అలికిడి, ఆ వెనకే ఏవో అరుపులు, కేకలు, పెద్దగా ఒక్కసారిగా వినవచ్చాయి. ఇద్దరూ ఉలిక్కిపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఆ గొడవ అంతకంతకూ పెరుగుతోందేగాని తరగటం లేదు.


"ఏమిటే ఆ గోల, పద చూద్దాం” అంది లేచి నిలబడుతూ శతపత్ర.


"ఆ గోల మనకెందుకులేవే. కూచో” అంది విశ్వదా.


"అరె. అంత గొడవ జరుగుతుంటే మనకెందుకులే అంటావేమిటి?” అంది శతపత్ర.


“నీకు కొత్త కావచ్చు. అప్పుడప్పుడూ ఇలా జరగడం మాకు మామూలే. దయ్యంగోల.”


"మైగాడ్. దయ్యమా!" అంటూ ఆశ్చర్యంగా విచిత్రంగా చూసింది శతపత్ర.


"అవును. చివరి ప్లాట్ లో వున్న సుఖదేవ్ సింగ్ భార్య అంజలి ఒంటిమీదికి ఇలా అప్పుడప్పుడు దయ్యం వచ్చి గోల చేస్తూంటుంది” చెప్పింది విశ్వదా.


“ఎవరా దయ్యం?" అడిగింది శతపత్ర.


"సుఖదేవ్ సింగ్  మొదటి భార్య పూర్ణిమ.” ఆలోచనల్లో కూరుకుపోయింది శతపత్ర.


“నిజం కాదనుకుంటున్నావా? చూస్తే నీకే తెలుస్తుంది. ఒకసారి చూశాను. కళ్ళు పెద్దవి చేసి చక్రాల్లా తిప్పుతూ ఉగ్రంగా చూసింది. ఆ చూపులు చాలా భయం గొల్పుతాయి. పూర్ణిమ దెయ్యం ఒంటిమీద ఉన్నప్పుడు అంజలిని పట్టుకోవడం చాలా కష్టం. బలమైన మనుషులు నలుగురు పట్టుకున్నా ఆ సమయంలో తోసిపారేస్తుంది. ఆ అరుపుల బీభత్సం మనకు దడ పుట్టిస్తుంది.


"ఏం జరిగిందసలు. ఆ పూర్ణిమ ఎలా చనిపోయింది?” కుతూహలంగా అడిగింది శతపత్ర.

🍁

*సశేషం*

[03/02, 7:24 pm] . Mallapragada: *శతపత్ర -3*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



విశ్వదా చెప్పసాగింది..


"సుఖదేవ్ సింగ్ వాళ్ళది చాలాకాలంగా బ్రిటన్ లోనే సెటిలైన కుటుంబం.


అతడి తండ్రి హయాంలో పంజాబ్ నుంచి ఇక్కడికి వలస వచ్చేశారు. వ్యాపారాల్లో బాగా సంపాదించారు. పూర్ణిమా వాళ్ళదీ అలాంటి కుటుంబమే. పైగా దగ్గర బంధుత్వం కూడా వుంది. నాలుగేళ్ళ క్రితం మాట. నేనప్పుడే ఈ ప్లాట్లోకి కొత్తగా వచ్చాను.


సుఖదేవ్ సింగ్, పూర్ణిమలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దల ఆశీస్సులతో పెళ్ళి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వారి పెళ్ళయిన రెండో సంవత్సరంలో ఇక్కడికి సమీపంలోనే జరిగిన రోడ్ ప్రమాదంలో పూర్ణిమ చనిపోయింది. ఆ విషాదం నుంచి బైటపడిన తర్వాత పంజాబ్ లోని తమ బంధువుల అమ్మాయి అంజలిని పెళ్ళి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ ఫ్లాట్లో సుఖదేవ్, అంజలితోపాటు అతని తల్లి కళాంజలి ఉంటుంది.


పెళ్ళి చేసుకుని ఇక్కడికి వచ్చిన వారం రోజుల తర్వాత మొదటిసారిగా పూర్ణిమ ప్రేతాత్మ అంజలిని ఆవహించి నానా బీభత్సం చేసింది. తను చనిపోయిందన్న బాధలేకుండా అతడు మళ్ళీ పెళ్ళి చేసుకుని సుఖంగా ఉంటున్నందుకు తిట్టిపోసింది. తనకులేని సుఖం అతడికి దక్కకూడదంటూ అంజలిని చంపాలని చూసింది.


అప్పటినుండి అప్పుడప్పుడు అంజలిని ఆవహించి ఇలా నానా యాగీ చేస్తూంటుంది పూర్ణిమ ఆత్మ. అది ఆత్మ కావచ్చు, దయ్యం కావచ్చు, భూతం కావచ్చు. అంజలి ఒంటి మీదికి వచ్చినప్పుడే దాని ఉనికి తెలుస్తుంది. ఇప్పుడా ఫ్లాట్లో జరుగుతున్న గోల ఇదే. పూర్ణిమ దెయ్యం అంజలి ఒంటిమీదికి వచ్చినట్టుంది" వివరించింది విశ్వదా.


నమ్మలేనట్టు. చాలా ఆసక్తిగా ఆ మాటలు వింది శతపత్ర. తనకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. అదేమిటో స్వయంగా చూడాలనిపించింది. అంజలి అనే ఆ యువతి దయ్యం పట్టినట్టు కావాలనే గొడవచేస్తోందేమోనని డౌటు కూడా ఏర్పడింది.


"విశ్వదా... నిజంగా దయ్యాలున్నాయని నువ్వు నమ్ముతున్నావా?” అనడిగింది. 


"వై నాట్? నేను నమ్ముతున్నాను. అనుభవం లోకి వస్తే నువ్వూ నమ్ముతావ్?" అంది నమ్మకంగా విశ్వదా.


"ఎందరో వైద్యులు, మానసిక శాస్త్రవేత్తలు కేవలం భ్రమ మాత్రమే. దయ్యాలు, భూతాలు లేవని చెప్తున్నారు. దయ్యం పట్టినట్టు నటించటం కూడా పిచ్చిలో ఒక భాగం అంటున్నారు" వాదించింది. శతపత్ర.


“అంటున్నారని ఏదీ ఆగిపోవడం లేదుగా? జనం నమ్ముతున్నారు. నీకు ఉదాహరణకి రెండు సంఘటనలు చెప్తాను. ఇక్కడ ఇంగ్లాండ్ లోనే మాంచెస్టర్ లో ఒకాయనకు పాతబంగళా ఒకటుంది. అది ఫస్ట్ ఫ్లోర్ లో రెండు మూడుచోట్ల గోడలు పగుళ్లు వచ్చాయి. దాన్ని బాగు చేయించి అమ్మేయాలనుకున్నాడాయన.


తను జర్మనీ వెళ్తూ కాస్త ఆ పని చూడమని తన ఫ్రెండ్ కి ఆ పని అప్పగించాడు.


మన ఇండియాలో అయితే పగుళ్ళు తీసిన చోట సిమెంట్ పూయించి రంగులు వేసేస్తారు. కానీ ఇక్కడ ఏ పనిచేసినా సిస్టమేటిక్ గా ఉంటుంది. పగుళ్ళని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీసి, వాటిని అధ్యయనం చేసి అవసరమైనంత మేర గోడకూల్చి తిరిగి రీబిల్ట్ చేస్తారు.


అదే ప్రకారం ఆ ఫ్రెండ్ తనకు తెలిసిన ఒక కాంట్రాక్టర్ని పిలిపించాడు. ఫోటోగ్రాఫర్ తో సహా వచ్చాడాయన. ఎక్కడెక్కడ గోడలకు పగుళ్ళు ఉన్నాయో అవన్నీ ఫోటోలు తీసుకున్నారు. ప్రింట్లు వచ్చిన తర్వాత చూసి అక్కడ అందరూ షాక్ తిన్నారు.


వాళ్ళు ఫోటోలు తీసినప్పుడు తాము ముగ్గురూ తప్ప ఆ ఇంట్లో ఎవరూ లేరు. కాని ఫోటోల్లో ఒక వృద్ధురాలు కన్పించింది. ఒక ఫోటోలో గోడ పక్కన వాలుకుర్చీలో పడుకుని వుంటే, మరో ఫోటోలో నిలబడి, ఇంకో ఫోటోలో మెట్లెక్కుతూ. అది చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు వాళ్ళు:


తెల్లటి గౌనులో స్పష్టతలేని విధంగా గాజు బొమ్మలా ఉందామె ఫోటోల్లో. ఆ ఫ్రెండు, కాంట్రాక్టరు భయపడిపోయి ఇక రిపేరు ఆరంభించలేదు. జర్మనీ వెళ్ళిన ఇంటి ఓనరు తిరిగొచ్చాక ఆ ఫోటోలు చూసి కన్నీరు పెట్టుకున్నాట్ట. ఫోటోల్లో వున్న వృద్ధురాలు అతడి నాయనమ్మ. ఆ ఇంట్లోనే పదేళ్ళక్రితం మరణించింది.


ఆమె పోయినా, ఆమె ఆత్మ అక్కడే ఇంకా తిరుగుతోందని అర్ధంగావటంతో ఆ ఇంటిని రిపేరు చేయించకుండా అలాగే ఉంచేశాడా యన. కొంతకాలం కిందట ఫోటోలతో సహా ఈ వ్యవహారం అనేక పత్రికల్లో ప్రచురితమైంది.


న్యూయార్క్ సిటీలో పీటర్ అనే వ్యక్తి చాలా ధనవంతుడు. అతను వ్యాపార లావాదేవీ లన్నీ చూసుకుని రాత్రి పన్నెండు గంటలకి గాని నిద్రపోయేవాడు కాదు.


ఒకరాత్రి తమ ఆవరణలో మొక్కల మధ్య ఎవరో తిరుగుతున్నట్టు గుర్తించాడు. కిటికీ పక్కకొచ్చి చూస్తే ఒక పొడుగాటి మనిషి స్పోటకం మచ్చలతో కూడిన వికారమైన ముఖంతో నిశ్శబ్దంగా తిరగటం కన్పించింది.


ఎవడో దొంగ అనుకుని రివాల్వర్ తో బయటి కొచ్చి 'ఎవరది?' అనరిచాడు. ఆ వ్యక్తి మౌనంగా వెళ్ళిపోనారంభించాడు. అతన్ని పట్టుకోవాలని ఎంత వేగంగా వెళ్ళినా సాధ్యం కాలేదు. అతడు గేటుదాటి రోడ్డు మీదకుపోయాడు. అతన్ని ఆపాలని తనూ రోడ్ ఎక్కబోతూ అనుమానంతో ఆగిపోయాడు పీటర్. ఆ ఆగంతకుడు రోడ్ ఎక్కడం చూశాడుగాని, తర్వాత అతను కన్పించలేదు.


పీటర్ వెనుతిరిగి లోనికొస్తుండగా రోడ్డుమీద పెద్ద శబ్దం... తిరిగి చూస్తే దారుణ దృశ్యం...


రోడ్డుపై వస్తున్న ట్రక్కు ఒకటి అదుపుతప్పి పక్కన చెట్టును గుద్దుకుంది. డ్రయివర్, క్లీనరు స్పాట్ డెడ్.


పీటర్ కి వణుకు పుట్టింది. పొరపాటున తను రోడ్డు మీదకు వెళ్ళుంటే యాక్సిడెంట్ స్పాట్ లో తనుండేవాడని అర్థమైంది. ఆ తర్వాత కూడా తమ ఆవరణలో ఎవరో తిరుగుతున్నట్టు గమనించినా ఎప్పుడూ తలుపులు తెరిచి బయటికి రాలేదు. ఎవరినీ రానిచ్చేవాడుకాదు.


వారంరోజులు గడిచాయి. ఓ రోజు షాపింగ్ కాంప్లెక్సికి వెళ్ళాడు పీటర్. పధ్నాలుగు అంతస్తుల భవనం అది. లిఫ్ట్ లో పైకి వెళ్ళాలి. లిఫ్ట్ లో పదిమంది ఎక్కారు. చివరిగా పీటర్ వస్తూ లిఫ్ట్ బాయ్ ని చూసి అదిరిపడ్డాడు. అదే ముఖం... స్పోటకం మచ్చలతో కూడిన వికారమైన ముఖం. తమ ఆవరణలో తిరుగుతున్న వ్యక్తిముఖం. అనుమానం వచ్చి లిఫ్ట్ ఎక్కకుండా బయటే ఆగిపోయాడు.


లిఫ్ట్ బాయ్ అతడ్నే చూస్తున్నాడు.


లిఫ్ట్ బయలుదేరింది. పీటర్ కి గుండెలు దడదడలాడాయి. ఏదో జరగబోతోందని భయం. మూడు నిముషాల తర్వాత అతడి భయం నిజమైంది. పదో అంతస్తు నుంచి రోప్ తెగి లిఫ్ట్ వేగంగా వచ్చి కిందపడింది. లిఫ్ట్ లో ఉన్నవాళ్ళలో ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు.


విచిత్రం ఏమిటంటే- మరణించినవాళ్ళలో లిఫ్ట్ బాయ్ లేడు. యధార్ధంగా జరిగిన పీటర్ అనుభవాలు కూడా న్యూస్ పేపర్స్ లో వచ్చాయి. ఇలాంటివి చాలా వున్నాయి.” శతపత్రకు వివరంగా చెప్పింది విశ్వదా.


కాని ఆమె విశ్వదా మాటల్ని కొట్టిపారేసింది. "నాకైతే అస్సలు నమ్మకం లేదు. ఎనీవే. కమాన్. నువ్వు చెప్తూన్న సిక్కు ఫ్యామిలీ లోని దయ్యం సంగతేమిటో చూద్దాం.” అంటూ ఆతృతగా బయలుదేరింది శతపత్ర. తన ప్లాట్ కి తాళంపెట్టి శతపత్రను తీసుకుని కారిడార్ చివర వున్న సిక్కు ఫ్యామిలీ ప్లాట్ వైపుకి దారితీసింది విశ్వదా.

🍁

*సశేషం*

[04/02, 7:31 pm] . Mallapragada: *శతపత్ర - 4*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



తన ప్లాట్ కి తాళంపెట్టి శతపత్రను తీసుకుని కారిడార్ చివర వున్న సిక్కు ఫ్యామిలీ ప్లాట్ వైపుకి దారితీసింది విశ్వదా.

📖


"బతికున్నంతకాలం ఎంతో మంచిగా పేరు తెచ్చుకున్నావు.  మరి ఎందుకు ఇప్పుడు చచ్చి సాధిస్తున్నావ్? నీకేం లోటు చేశామని? నీకిది న్యాయంగా ఉందా పూర్ణిమా?" కన్నీళ్ళతో అడుగుతోంది అత్త కళాంజలి.


ఆ మాటలకి కళ్ళు ఎర్రజేసి- మరింత క్రూరంగా చూసింది అంజలిని ఆవహించిన పూర్ణిమ దయ్యం.


"ఏయ్ అత్తా... నీ కొడుక్కి ఇంకో పెళ్ళి చేశావ్. నీకు న్యాయంగా ఉందా?" అంటూ పెద్ద స్వరంతో ఎదురు ప్రశ్నించింది. 


“నాకు న్యాయమేనే... నువ్వు చచ్చావని సన్నాసుల్లో కలిసిపోతాడా? వాడికి తోడు కావాలని పెళ్ళి చేశాం. చచ్చిన నీకు ఆత్మశాంతి కోసం కర్మకాండలు చేసినట్టే నా కొడుకు బతికున్నాడు గాబట్టి మళ్ళీ పెళ్ళి చేశాను. తప్పా?” అంది కళాంజలి.


“తప్పే... ముమ్మాటికీ తప్పే. నాకు కోపం రాదా? ఊరుకుంటానా? నా స్థానం ఎప్పటికీ నాదే. ఇంకొకర్తిని రానివ్వను..." భయంకరం గా అరుస్తోంది దయ్యం. పూనకంతో ఊగిపోతోంది. కళ్ళు పెద్దవిచేసి అరుస్తోంది. ఎర్రటి కుంకుమబొట్టు, జుట్టు విరబోసుకుని ఆమెచూసే చూపులు, చేసే ఆగడాలు వెన్నులో దడ పుట్టిస్తున్నాయి.


నలుగురు బలమైన స్త్రీలు ధైర్యంగా నిలబడి అంజలిని ఒడిసి పట్టుకున్నారు. ఐనా ఆగటంలేదామె. విదిలించేస్తోంది. ఎగిరి దూకుతోంది. అవసరమయితే ఆపటానికి సిద్ధంగా నలుగురు మగాళ్ళు కూడా రెడీగా వున్నారు. వాళ్ళలో ఆమె భర్త సుఖదేవ్ సింగ్ కూడా ఉన్నాడు. తప్పించుకుందంటే కిటికీలోంచి బయటకు దూకి అంజలిని చంపేస్తుందని భయపడుతున్నారంతా. ఎందుకైనా మంచిదని కిటికీ తలుపులు మూసేసి వుంచారు.


ఆ ఫ్లాట్ ముందు చాలామంది గుమిగూడి పోయారు. కింద, పైన, పక్క ఫ్లాట్లో ఉండే చాలామంది బయటే నిలబడి లోపలి తంతును భయం భయంగా చూస్తున్నారు. వాళ్ళలో ఇండియన్స్ మాత్రమే కాదు. జర్మనీ, ఫ్రెంచ్ ఫ్యామిలీసి కి చెందినవాళ్ళు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు జడుసు కుంటారని వెనక్కి లాక్కుపోతున్నారు కొందరు.


"ఒసే పూర్ణిమా! నువ్వు చచ్చావని నా కొడుకు ఇక జీవితాంతం ఎటువంటి సుఖం లేకుండా ఒంటరిగా బతకాలా? ఎందుకే ఇలా మమ్మల్ని పీడిస్తున్నావ్?" విసుగ్గా అరిచింది అత్త కళాంజలి.


"బతకాలి...” అంటూ పళ్ళు పటపట కొరుకుతూ రక్తవర్ణం దాల్చిన కళ్ళతో మొగుడు సుఖదేవ్ వంక చూసింది పూర్ణిమ దయ్యం. ఎగిరెగిరి తుళ్ళుతూ తప్పించు కోడానికి గింజుకుంటోంది.


ఆమె ఉగ్రరూపం చూస్తున్నవాళ్ళకి గుండెలు పీచుపీచుమంటున్నాయి. కాళ్ళలో వణుకు పుడుతోంది. ఎక్కడ వచ్చి మీద పడుతుందో నని భయంగా చూస్తున్నారు.


ఆ దృశ్యం భయానకం... బీభత్సం... గింజుకుంటూనే అరిచింది దయ్యం. "ఏయ్ అత్తా... అడగవే నీ కొడుకు నడగవే... నాతో ప్రేమగా ఉన్నాడా లేదా అడుగు. నువ్వే నా లోకం అన్నాడు. చావులోనూ, బతుకు లోనూ కలిసుందాం అన్నాడు. మరి నాతో వాడు ఎందుకు చావలేదు? పైగా నన్ను  మర్చిపోయి ఇంకోదాన్ని పెళ్ళి చేసుకుని సుఖంగా ఉంటాడా.... ఉండనివ్వనే... మీ అందర్నీ నాశనం చేస్తా...” భయానకంగా నవ్వుతోంది.


సరిగ్గా శతపత్ర, విశ్వదాలు ఆ ఫ్లాట్ ముందుకు వస్తుండగా లోపల జరుగుతున్న సంఘటన అది.


"ఏమిటే విశ్వదా... బయటే ఉండి అంతా చోద్యం చూస్తున్నారు" ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది శతపత్ర.


"చూడక... లోనికి పోతారనుకున్నావా? అలా వెళ్ళాలంటే ధైర్యం ఉండాలమ్మా. అదిగో విను... ఆ దయ్యం అరుపులు ఎలా ఉన్నాయో, మనకెందుగ్గాని రావే వెనక్కి వెళ్ళిపోదాం" అంది ఒకింత గాభరాపడుతూ విశ్వదా.


"ఏయ్... ఏమిటే అంత భయం. లోనికి పోతే చంపుతుందా? రా చూద్దాం" అంది శతపత్ర.


"చంపుతుంటే చూద్దామా...”


“విశ్వదా... అది ఇంతవరకు ఎవరినైనా చంపిందా?”


“లేదు”


"మరి భయమెందుకు? ఇప్పుడు కూడా చంపదు. కమాన్” అంటూ విశ్వదాని పిలిచింది శతపత్ర.


"ఏమిటే... నీకు భయం వేయదా?"


“రాచబిడ్డనే... భయమంటే ఏమిటో నాకు తెలీదు”


మాట్లాడుకుంటూనే ఇద్దరూ గుంపును చేరుకున్నారు. గుంపును దాటి గుమ్మంలోకి పోబోతూంటే ఉన్నట్టుండి లోపలి పూర్ణిమ దెయ్యంగా పెద్దగా అరిచింది.


"వద్దు... రావద్దు... దాన్ని రావద్దని చెప్పండి.... నా ఒళ్ళు భగ్గు మంటోంది. దాన్ని ఆపండి" అంటూ, ఆ అరుపులు విని లోపలివాళ్ళే కాదు, బయటివాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎవరిని ఉద్దేశించి అలా అరుస్తోందో అర్థంకాలేదు. ఈలోపల డోర్ సమీపంలోకి వచ్చేశారిద్దరూ.


"వద్దు... రావద్దు... ఒసే శతపత్రా ఆగిపోవే” ఒక్కసారిగా తన పేరు పెట్టి దయ్యం పిలవటంతో శతపత్ర షాకయింది. విశ్వదా ఆశ్చర్యానికి అంతులేదు. లోపలి పరిస్థితి చాలా బీభత్సంగా వుంది.


అటో ఇద్దరు, ఇటో ఇద్దరు మహిళలు అంజలిని బలంగా ఒడిసి పట్టుకుని ఆపుతున్నారు.


విరబోసిన జుట్టులోంచి, ఎర్రబడ్డ కళ్ళతో క్రూరంగా చూస్తోంది. అంజలిని ఆవహించిన పూర్ణిమా దయ్యం.


ఆమె ఉగ్రరూపాన్ని చూళ్ళేకపోయింది విశ్వదా. భయంతో శతపత్ర వెనక ఒదిగి నిలబడింది.


"ఆ దెయ్యం నిన్ను రావద్దంటోంది. ఏం చేస్తుందో ఏమిటో... మనకెందుకొచ్చిందిగాని వెళ్ళిపోదాంరావే..." అంది విశ్వదా భయంతో.


“నా పేరు తనకెలా తెలుసు?" ఆశ్చర్యం నుంచి తేరుకోలేక అడిగింది శతపత్ర.


"అదేకదా... దయ్యాలకు అన్నీ తెలిసిపోతాయ్. వెనక్కి వెళ్ళిపోదాం రావే..." అంది విశ్వదా.


“ఇక్కడ ఇంతమంది ఉండగా దెయ్యం నన్ను మాత్రమే ఎందుకు రావద్దంటోంది? తెలియాలి" అంటూ ముందుకు ధైర్యంగా అడుగులేసింది శతపత్ర.


విశ్వదా ఫ్లాట్ కి తను వచ్చి పోతూ వుంటుంది. అంజలిని రెండు మూడుసార్లు తను చూసింది. ఆమె కూడా తనను చూసింది కాని, తన పేరు తెలిసే అవకాశం లేదు.... ఏమో తెలుసుకుందేమో.


ఒకవేళ తన పేరు తెలుసుకుంది అనుకున్నా కూడా గదిలో ఉన్న అంజలికి కారిడార్లో తను వస్తున్నట్టు ఎలా తెలిసింది? ఒకవేళ నిజంగా అది పూర్ణిమా దయ్యమేనా... ఇదేదో తెలుసుకోవాలి.

📖


గడప దాటబోయింది శతపత్ర.


"రావద్దని చెప్పాగా... లోనికి రావద్దు” క్రూరంగా చూస్తూ మరోమారు హెచ్చరించింది దయ్యం.


"వస్తే ఏమవుతుంది?" చేతులు కట్టుకుని గుమ్మం ముందే నిలబడి లోపలికి చూస్తూ అడిగింది శతపత్ర.


"నేను భరించలేను... తట్టుకోలేను. వెళ్ళిపోవే..." ఇల్లెగిరిపోయేలా అరుస్తూ గింజుకుంటోంది దయ్యం.


"నేనేం చేశానని? ఎందుకు తట్టుకోలేవ్? ఇదిగో అంజలీ.. నీ భర్త బాధపడుతున్నాడు. నీ అత్త ఏడుస్తోంది. ఇంక నువ్వు ఆడుతున్న నాటకం చాలు. ఇంతటితో ఆపేసెయ్" ధైర్యంగా చెప్పింది శతపత్ర.


“నాది నాటకమా! నన్నెవరనుకుంటున్నావే.. నేను అంజలినికాదు... పూర్ణిమను" హుంకరించింది ఆత్మ.


"ఓ.కె. నువ్వు పూర్ణిమవని ఒప్పుకుంటున్నా ను. నువ్వు ఎవ్వరినైనా కాని, మీ మధ్య అంజలి నలిగిపోతోంది. ఆమెను పీడించకు. తక్షణం వదిలి వెళ్ళిపో."


"వెళ్ళను... దీన్ని వదలను.”


"అయితే నేను లోపలికి వస్తున్నా.”


“వద్దు. నువ్వు రానేవద్దు.”


“అయితే వెళ్ళిపో.”


“వెళ్ళను..." దయ్యంతోపాటు తనూ పెద్దగా అరుస్తోంది శతపత్ర. ఈ సరికొత్త మలుపేమిటో అర్ధంగాక అంతా చేష్టలుడిగి చూస్తున్నారు.


శతపత్ర గడప దాటింది. నెమ్మదిగా అయిదడుగులు ముందుకేసింది. విశ్వదా మాత్రం వణికిపోతూ బయటే ఆగిపోయింది. శతపత్ర తనను సమీపించటం చూసి గగ్గోలుగా అరవటం ఆరంభించింది పూర్ణిమ దయ్యం. అరుపుల మధ్య తిట్టిపోస్తోంది–


"రావద్దని చెప్పాగదా! ఎందుకొచ్చావే... నా ఒళ్ళు కాలిపోతున్నట్టుంది. వేడి మంటలు... అమ్మో... భరించలేను" అంటూ పెద్దగా గింజుకుంటోంది.


అంతలోనే అంజలి శరీరాన్ని వదిలి బయటికొస్తోంది. తిరిగి శరీరాన్ని ఆవహిస్తోంది.


దయ్యం వదలగానే పట్టుకున్నవాళ్ళ చేతుల్లో తోటకూర కాడలా వేలాడబడి పోతోంది అంజలి. తిరిగి ఆవహించగానే తుపానుగాలి ఒక్కపెట్టున వీచినట్టు చివ్వున లేచి కేకలు వేస్తూ గంతులేస్తోంది.


భీతావహంగా మారిపోయింది పరిస్థితి. అంజలి శరీరాన్ని వదలగానే ఏదో రివ్వు రివ్వున గదిలో పైన తిరుగుతున్న శబ్దాన్ని స్పష్టంగా వింటున్నారంతా. బంతిలా గోడల్ని తాకి వెనక్కి వస్తుంటే ఖరీదైన వస్తువులు భళ్ళున పగిలి కిందపడుతున్నాయి.


"నావల్ల కావటంలేదే... నీకు దండం పెడతాను. వెళ్ళిపోవే శతపత్రా...” తిరిగి అంజలిని ఆవహించి బాధాపూరితంగా అరుస్తోంది పూర్ణిమ దయ్యం.


అంత బీభత్సంలో కూడా కించిత్తు కూడా భయపడకుండా ఎదురుగా నిలబడివుంది శతపత్ర. గుమ్మం వద్ద గుమిగూడిన వాళ్ళలో చాలామంది భయంతో దూరంగా పారిపోయారు. లోపలున్న వాళ్ళకి చెమటలు పట్టేస్తు న్నాయి. 


"నువ్వు నీజంగా దయ్యానివైతే నా గురించి ఎందుకు భయపడుతున్నావ్?" చాలా స్థిరంగా అడిగింది శతపత్ర. 


"నన్ను కాల్చి బూడిద చేద్దామనా... నీ గురించి నీకే తెలీదు.” అంది దయ్యం.


“అయితే నువ్వీ అమ్మాయిని వదిలివెళ్ళిపో" అంది శతపత్ర.


“వెళ్ళనంటున్నాగా...”


"అయితే నేనే నిన్ను పట్టుకుంటా”


అంజలిని పట్టుకోవాలని అడుగు ముందుకేసింది శతపత్ర.


భయంతో పెద్దగా అరుస్తూ తనని పట్టుకున్న వాళ్ళని విదిలిస్తూ నాలుగడుగులు వెనక్కి దూకింది దయ్యం. "వద్దు. నన్ను తాకొద్దూ" అనరిచింది.


"ఏమవుతుందో తాకిచూస్తాను.”


"వద్దు వద్దు. నువ్వు చెప్పినట్టు వింటాను. నన్నేమీ చేయకు.” 


"అయితే అంజలిని వదిలి వెళ్ళిపోతావా?" అని అడిగింది శతపత్ర.


“పోతాను”


“మళ్ళీ రాకూడదు.”


"రాను"


"రానని నమ్మకం ఏమిటి?”


"రాను... రాను... నా మొగుడిచేత్తో పసుపు నీరు తాగించమని చెప్పు. వెళ్ళిపోతాను" అంది దయ్యం.


"నువ్వు వెళ్ళిపోతున్నట్టు రుజువు చూపించాలి" అంది శతపత్ర. 


“చూపిస్తాను. అదిగో... ఆ కిటికీ అద్దం పగలగొట్టుకుని వెళ్ళిపోతాను" 


ఆ సంభాషణంతా మొత్తం ఆశ్చర్యంగా వింటున్నారంతా. శతపత్ర ప్రత్యేకించి చెప్పక్కర్లేకుండానే సుఖదేవ్ సింగ్ గ్లాసు మంచినీటిలో చిటికెడు పసుపు కలిపి తెచ్చాడు.


అంజలిని ఆవహించిన పూర్ణిమ దయ్యం మొగుడ్ని ప్రేమగా చూస్తూ పసుపునీరు తాగింది. తాగుతూ హృదయవిదారకంగా ఏడుస్తోంది. 


"నాకు చాల్లేదు... బిందెడు కావాలి" అంది తక్షణం బిందెడు పసుపు నీళ్ళు తెచ్చాడు సుఖదేవ్ సింగ్.


అందర్నీ ఆశ్చర్యపరుస్తూ బిందెలో సగం నీరు తాగేసింది" మిగిలిన నీటిని తలమీద పోసుకుంది. అంతే- అంజలి శరీరం నుంచి దయ్యం తప్పుకుంది. గదిలో రివ్వురివ్వున ఏదో అదృశ్యశక్తి తిరుగుతున్న శబ్దం విన్పించింది.

పది సెకన్ల తర్వాత అంత ఎత్తులో ఉన్న కిటికీ అద్దం విచిత్రంగా భళ్ళున పగిలింది. అంతే- గదిలో నిశ్శబ్దం అలముకుంది.

📖


స్పృహలేని అంజలిని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టారు. ఆమెను స్పృహలోకి తెచ్చే ప్రయత్నాలు ఆరంభించారు.


అంజలి అత్తగారు కళాంజలి అయితే ఆనందంతో శతపత్ర రెండు చేతులూ పట్టుకుని వదల్లేదు-


"పెద్దపెద్ద మంత్రగాళ్ళని తీసుకొచ్చాం. ఎవరూ పూర్ణిమ దయ్యాన్ని వదిలించలేక పోయారు. ఆ మొండి దయ్యాన్ని వదిలించి, నా కోడల్ని, మా కుటుంబాన్ని కాపాడావ్. కాళ్ళకు మొక్కాలని వుంది తల్లీ. వయసులో చిన్నదానివి అని ఆ పనిచేయలేక పోతున్నాను” అంది కన్నీటితో.


"మాకెంతో ఉపకారం చేసిన నిన్ను ఉత్త చేతులతో పంపించలేము. మేమిచ్చే కానుకలు తీసుకెళ్ళాలి" అంటూ ఆనందంతో అర్థించాడు సుఖదేవ్ సింగ్.


సున్నితంగా వారిని తిరస్కరించింది శతపత్ర "మీరు నాకేవో శక్తులున్నాయని పొరపాటు పడుతున్నట్టున్నారు. అలాంటిదేమీ లేదు. అందరిలాగే నేను కూడా ఏం జరుగుతుందో చూద్దామని వచ్చాను. కారణం తెలీదుగాని పూర్ణిమ నన్ను చూసి భయపడింది. దాన్ని అడ్డం పెట్టుకుని వెళ్ళిపొమ్మని చెప్పాను. అంతే... నాకు ఈ కానుకలు అవసరం లేదు. మీ అభిమానం చాలు" అంటూ అంజలిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి విశ్వదాతో కలిసి ఆమె ప్లాట్ కి వచ్చేసింది శతపత్ర.

🍁

*సశేషం*

[06/02, 2:39 pm] . Mallapragada: *శతపత్ర -5*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



“ఓ మైగాడ్... తలుచుకుంటేనే వెన్నులోంచి దడపుడుతోంది. పూర్ణిమ దయ్యం ఉగ్రరూపం కళ్ళముందు మెదులుతోంది. నిజం చెప్పవే. నీ దగ్గర మంత్రశక్తులేవో ఉన్నాయి కదూ?" అంది విశ్వదా.


“మళ్ళీ ఆరంభించావా?" అంటూ విసుగ్గా నుదురు రుద్దుకుంది శతపత్ర.


అంతక్రితమే ఇద్దరూ భోజనంచేసి తీరికగా కూర్చున్నారు.


జరిగిన సంఘటనల్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలీక తనే బోలెడు కన్ఫ్యూజ్ లో వుంది. తనకేవో మంత్రశక్తులున్నాయని విశ్వదా అనుమానిస్తోంది. ఏం చెప్పాలి? నిజానికి తనకో విచిత్రమైన కల వస్తుంటుంది అప్పుడప్పుడూ ఆ కల గురించి ఇంతవరకూ ఎవరికీ చెప్పలేదు. విశ్వదాకి చెప్పాలను కుంది. కానీ జరిగిన సంఘటనతో ఇక చెప్పకూడదని నిర్ణయించు కుంది-


"ఏయ్ విశ్వదా... ఎన్నిసార్లు చెప్పాలే నీకు? నాకే మంత్రశక్తులూ లేవు. అసలు ఇలా ఎందుకు జరిగిందో కూడా తెలీదు" అంది శతపత్ర.


అర్థమైనట్టుగా తలూపింది విశ్వదా.


"అవును. నాకు గుర్తొస్తోంది. నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావని నువ్వు అడిగినప్పుడు దయ్యం ఏమందో గుర్తుందా? నీ గురించి నీకే తెలీదన్నమాట... అంది. అంటే నీకే తెలీని ఏదో శక్తి నీలో ఉంది. ముందు అదేమిటో తెలుసుకో” అంది.


"తెలుసుకుని ఏంచేయాలి? దయ్యాల్ని వదిలించమంటావా? నాకు అది ముఖ్యం కాదు. నా వల్ల ఒకరికి ఉపకారం జరిగిందంటే సంతోషమే. అలాగని నాలో ఏవో శక్తులున్నాయని ప్రచారం చేసుకోవటం, నన్నో మంత్రగత్తెగా నలుగురూ చూడ్డం నాకు నచ్చదు. ఇక ఈ విషయం మర్చిపో. నేను బయల్దేరతాను. రేపు లైబ్రరీలో నేను స్టడీ చేయాల్సిన బుక్స్ లిస్ట్ తయారుచేసు కోవాలి" అంది శతపత్ర.


“ఓ.కే. మళ్ళీ లైబ్రరీ ప్రపంచంలోకి వచ్చేశావన్న మాట. అసలు ఇప్పట్లో నీక్కావలసిన సమాచారం లైబ్రరీలో దొరుకుతుందంటావా?" విసుగ్గా అడిగింది విశ్వదా.


"తెలీదు... మూడు మాసాలుగా ప్రయత్నిస్తున్నాను. రేపే దొరకచ్చు. లేదూ, ఇంకో మూడు మాసాలు పట్టొచ్చు. నాకేం కావాలో అది సాధించుకునేవరకు లండన్ వదిలిపోనన్నది వాస్తవం" అంటూ లేచింది శతపత్ర.


అప్పటికి మధ్యాహ్నం రెండుగంటలు కావస్తోంది సమయం. అది శీతాకాలం ముగిసి వేసవి ఆరంభమవుతున్నరోజులు. ఇప్పుడు లండన్ నగరం మీద దూది పింజల్లా పడే మంచు మచ్చుకయినా కన్పించటంలేదు. అదే శీతాకాలం మధ్య ప్రాంతంలో అయితే తెల్లవారేసరికి ఇళ్ళ మీద, రోడ్లమీద, చెట్లమీద ఎటుచూసినా తెల్లటి మంచుపొడి కన్పిస్తుంది.


విశ్వదా ఫ్లాట్ లోంచి బయలుదేరింది శతపత్ర. విశ్వదా డోర్ దాకా సాగనంపడానికి వచ్చింది-


"మళ్ళీ ఎప్పుడు దర్శనం?" అడిగింది.


"ఫోన్ చెయ్యి, వస్తాను" అంది శతపత్ర.


"ఫోన్ చేయకుండా రాలేవా? ఇందుకే నాక్కోపం.. గోడమీద పిల్లిలా మాట్లాడతావ్"


“ఓ.కే తల్లీ! నిష్టూరాలేయకు. ఫోన్ చేయకుండానే వస్తా. సరేనా? బై" అంది విశ్వదా.

📖


శతపత్ర ఉంటున్న ఫ్లాట్, సౌత్ లండన్ లో గెలాక్సీ అవెన్యూ థర్డ్ రోడ్లోని యూనివర్సల్ టవర్స్ లో ఉంది... ఆ ఫ్లాట్లో తన బాబాయివాళ్ళ ఫ్యామిలీతో ఉంటోంది.


విశ్వదా ఫ్లాట్ నుంచి బయలుదేరిన శతపత్ర సరాసరి గెలాక్సీ అవెన్యూ వైపు తన ఎలక్ట్రానిక్ స్కూటీని పోనిస్తోంది. మధ్యాహ్నంవేళ గాబట్టి ట్రాఫిక్ అంతగా లేదు. స్కూటీ నిశ్శబ్దంగా పరుగుతీస్తోంది.


శతపత్ర మనసులో నిశ్శబ్దంగా సుడులు తిరుగుతున్నాయి ఆలోచనలు. ఎంత మర్చిపోదామన్నా విశ్వదా ఫ్లాట్ వద్ద జరిగిన సంఘటన మర్చిపోలేకపోతోంది. అసలు తనేమిటి? గొప్ప భక్తురాలుకాదు. మంత్రాలు మాయలు తెలీదు. దేవుడి మీద నమ్మకం వుంది గాబట్టి అప్పుడప్పుడూ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వస్తుంది. అంతకుమించి తనేమీ మహనీయురాలుకాదు. అందరిలాగే తనూ ఓ సాధారణ ఆడపిల్ల. మరెందుకిలా జరిగింది? పూర్ణిమలాంటి మొండిదయ్యం తనను చూసి భయపడుతూ అంజలిని వదిలిపోవటం ఏమిటి? తనలో అంత ప్రత్యేకత ఏముందని? మెదడును తొలుస్తున్న ప్రశ్న ఇది. దయ్యాలు, భూతాలు ఇదంతా పనిలేనివాళ్ళ అభూతకల్పనలని తన నమ్మకం. తన నమ్మకాన్ని వమ్ము చేసిన బలవత్తరమైన సంఘటన ఇది. దయ్యాలు లేవని చెప్పటానికి కొంచెం కూడా అవకాశం లేని వాస్తవ సంఘటన.


మూడు విషయాలు ఇప్పటికే తనని ఆశ్చర్యపరుస్తున్నాయి. లోపల గదిలో ఉన్న అంజలి కారిడార్ లో వస్తున్న తనను చూడకుండానే రావద్దని హెచ్చరించటం ఒకటి. రెండోది... తనను పేరుపెట్టి పిలవటం. మూడోది తాను చెప్పినట్టే ఆ దయ్యం కిటికీ అద్దాన్ని పగలగొట్టుకొని బయటికి పారిపోవటం-


రెండు గ్లాసుల నీళ్ళు తాగితేనే పొట్ట ఉబ్బుతుంది. అలాంటిది అరబిందెడు పసుపునీళ్ళు నాన్ స్టాప్ గా తాగేసినా అంజలి పొట్ట పల్చగానే ఉంది. ఇది మనుషులకు సాధ్యమా?


అంతా బాగానే ఉంది. తనవల్ల సుఖదేవ్ సింగ్ ఫ్యామిలీకి మంచి జరిగిందంటే సంతోషమే. కాని అసలు విషయం అలాగే ఉండిపోయింది.


తనలో ప్రత్యేకత ఏమిటి? తనను చూస్తే దయ్యాలకు ఎందుకు భయం? కొంపదీసి తనే ఒక పెద్ద దయ్యమా? తన ప్రశ్న తనకే నవ్వు పుట్టించింది. ఆలోచనల్లో ఉండగానే స్కూటీ వీధికార్నర్ ని సమీపించింది. అంతలో అటునుంచి ఏదో వెహికల్ వేగంగా దూసుకొస్తున్న అలికిడితో సడెన్ గా ఆమె ఆలోచనలు చెదిరిపోయాయి.


ఇంగ్లీష్ ఎల్ షేపులో డెడ్లీ కర్వ్ అది.


ఆమె ఆలోచనల నుంచి బయటపడి జాగ్రత్త పడే లోపలే హై స్పీడ్ తో సర్రున మలుపు తిరిగిందో కారు. భయంతో పక్కకు తిప్పుతూ సడెన్ బ్రేక్ వేసింది శతపత్ర.. అటు కారు డ్రయివర్ కూడా చివరిక్షణంలో ఆమెను చూసి కారు పక్కకు కోస్తూ సడెన్ బ్రేక్ వేశాడు.


కారు అటు- స్కూటీ ఇటు.


రెండు క్రాష్ అయితేకాలేదు, కాని సడెన్ బ్రేక్ వేయడంతో కారు రోడ్డుమీద నిప్పురవ్వలు రేపుతూ కొంత దూరం పోయి అడ్డం తిరిగింది.


ఇటు స్కూటీ బ్యాలన్స్ తప్పి ఆమెను కింద పడేయాలని చూసింది. కాని పాపం తనే కిందపడింది. ఆమె స్కూటీ మీద నుంచి చాకచక్యంగా దూకి తప్పించుకుంది.


కారు డోర్ తెరుచుకుని కిందకు దిగాడొక ఆజానుబాహుడు. ముప్పెలోపు వయసులో బలంగా, దృఢంగా స్మార్ట్ గా ఉన్నాడు. ఆరదుగుల రెండు అంగుళాలకు తక్కువ గాని పొడవు. అతను ఆసియాకు చెందిన వాడా, యూరోపియనా? గుర్తుపట్టడం కష్టం. కాని మనిషి చాలా హుందాగా, హుషారుగా ఉన్నాడు.


అతడ్ని చూడగానే శతపత్రకు ఒళ్ళు మండిపోయింది. “యూ ఇడియట్... స్టుపిడ్... ఆర్ యూ క్రేజీ" అంటూ తీవ్రమైన పదజాలంతో కోపమంతా కళ్ళలో చూపిస్తూ అరిచింది ముందుకువస్తూ.


అతను విసుగ్గా నొసలు విరిచి అరచేత్తో నుదురు రుద్దుకున్నాడు.


"డామిట్... టైం బాడ్ అంటే ఇదే... ఈ పిచ్చుకపిల్లకి చిక్కిపోయాను. ఇదేదో గయ్యాళి గంగమ్మలా ఉంది. దేవుడా... నువ్వే కాపాడాలి..." అంటూ ఆకాశం వంక చూసి చెంపలేసుకున్నాడు.


అతని మాటలను అస్పష్టంగా అయినా శతపత్ర కర్ణేంద్రియాలకు సోకనే సోకాయి. ఆంధ్రా నుంచి ఇంగ్లాండ్ వచ్చిన అచ్చమైన తెలుగు యువకుడని అర్థమైపోయింది.


దాంతో మరింతగా కోపం ముంచుకొచ్చింది "హలో... నువ్వు తెలుగువాడివా?" దగ్గరకి వస్తూ దబాయించింది.


"ఎస్. యంగ్ లేడీ. తెలుగువాడినే. వాడిగా, వేడిగా ఉండే కరుకైన ఆంధ్రుణ్ణి. సో వాట్?" తనూ కాస్త రఫ్ గానే బదులిచ్చాడు.


"సో వాట్? దారినపోయేవాళ్ళని చంపాలనే కంకణం కట్టుకుని కారు నడుపుతున్నావా?" దబాయించింది.


“నో.... నో... నాకైతే అలాంటి ఉద్దేశం లేదు. నువ్వే చంపాలనుకుంటున్నావ్. నువ్వు చావటానికి నా కారే దొరికిందా..." ఎదురుదాటికి దిగాడు.


“వ్వాట్... నేను చావాలనుకుంటున్నానా?!”


"ఎస్.. నీది సూసైడ్ కేస్, ఐ విల్ కంప్లయింట్ టు ద పోలీస్” అన్నాడు. అతడి మాటలకి ఒళ్ళు మండిపోయింది శతపత్రకి. తప్పు తన దగ్గరుంచుకుని ఎదురు దాడి చేస్తున్నాడు ఘనుడు. 


“హలో... ఆర్ యూ మ్యాడ్? ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి లండన్ వచ్చావా? నాది సూసైడ్ కేసా!" కోపంతో నిలదీసింది.


అతను మహా మొండి ఘటంలాగున్నాడు. తనమాటకు కట్టుబడే వున్నాడు. కొంచెం కూడా తగ్గలేదు.


"అవును... ఖచ్చితంగా నీది సూసైడ్ కేసే. నేను మాత్రం పిచ్చాసుపత్రి నుంచి రాలేదు. అయాం పర్ఫెక్ట్ ఆల్ రైట్?" అన్నాడతను.


“షటప్...” షౌట్ చేసింది శతపత్ర.


“మందుకొట్టి కారు నడుపుతున్నావా? టర్నింగ్ లో రాష్ డ్రైవింగ్ తో వచ్చింది నువ్వా, నేనా...? ఎదురుదాడి చేసి దబాయించేస్తున్నావ్. పోలీసుల్ని పిలుస్తాను. తప్పెవరిదో వాళ్ళే తేలుస్తారు.” అంటూ సెల్ ఫోన్ అందుకుంది శతపత్ర.


"ఓ.కె. నీ ఆనందాన్ని నేనెందుకు పాడుచేయాలి... ఫోన్ చెయ్యి. బైదిబై.... అయాం రుద్రపాద. పోలీసులకి నా పేరు కూడా చెప్పు" అన్నాడు.


“వాట్ రుద్రపాద! నువ్వు రుద్రపాద అయితే శివుడి దగ్గరుండాలి. ఇలా రోడ్లమీద కాదు. ఈ శతపత్రతో ఆటలాడుతున్నావ్. అయిపోయావ్... వెయిట్ అండ్ సీ...” అంటూ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయబోయింది.


చటుక్కున ఫోన్ లాక్కున్నాడు రుద్రపాద.


“ఓ మైగాడ్. ఆర్ యు మిసెస్ శతపత్ర?" బోలెడు ఆశ్చర్యపోతూ అడిగాడు.


"నో... అయాం మిస్ శతపత్ర”


"సో... మా అంకుల్ వాళ్ళమ్మాయి శతపత్ర నువ్వే కదూ?” అన్నాడు రుద్రపాద.


శతపత్ర ఆశ్చర్యపోయింది.


"అంకులా! ఏ అంకుల్?" అనుమానంగా అడిగింది.


"ఆయనే... మా అంకుల్. వరుసకు మావయ్య అవుతాడు. ఆ బుల్లిగౌను పిల్లని చిన్నప్పుడు తెగ ఏడిపించేవాడ్ని. మీది హైదరాబాదే కదూ?"


"అవును"


"చూశావా? ఇద్దరం హైదరాబాదీలం. పైగా మా అంకుల్ కూతురువి. మనలో మనకి ఎందుకొచ్చిన గొడవ. రాజీపడిపోదాం. నీ దారి నీది, నా దారి నాది. ఓకేనా?"


"నీ వెధవకోతలు నా దగ్గర కోయకు. మా డాడీ పేరు చెప్పు?” అంటూ అతడి చేతిలోని సెల్ ఫోన్ లాక్కుంది.


"ఆయన పేరు నరసింహనాయుడు కదూ?" తడుముకోకుండా అడిగేశాడు రుద్రపాద.


"ఇంకా నయం. పెదరాయుడు అనలేదు" అంది వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ.


"కాదా? మరేమిటబ్బా... సమరసింహారెడ్డా?"


"ఆపుతావా? నువ్వో కోతలరాయుడివి. సినిమా పేర్లు చెప్పి నన్ను బోల్తాకొట్టించ లేవు. మా డాడీ పేరు నాచేత చెప్పించలేవు. ఆల్రెడీ... నా పేరు శతపత్ర అని, నాకింకా పెళ్ళికాలేదని, తెలివిగా సమాచారం రాబట్టేశావ్. ఇంకా ఫూల్ కావటానికి సిద్ధంగా లేను. పిచ్చివేషాలేయకుండా ముందు ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో నేర్చుకో.”


"సర్లే... అది తెలిస్తే ఎప్పుడో నాకు పెళ్ళయి పోయి ఉండేది. ఇంకా బ్యాచిలర్ గా ఎందుకుండిపోతాను? నా ఫ్రెండ్స్ అంతా నన్ను ఒట్టి అమాయకుడివిరా అంటారు తెలుసా?" అన్నాడు రుద్రపాద. 


"అలాగా పాపం... ఇది మాత్రం శుద్ధ అబద్ధం. నువ్వు వట్టి మాయగాడివి. మాటల గారడీతో ముంచేస్తావ్. ఇంకా నీతో వాదిస్తే నాకు మెంటలొస్తుంది వెళ్ళిపో. నీ దారి నీది, నా దారి నాది" అంటూ విసవిసా తన స్కూటీ వద్దకెళ్ళి, దాన్ని లేపి నిలబెట్టింది.


కారుకు జేరబడి హుందాగా ఆమెనే చూస్తూ నవ్వుతున్నాడు రుద్రపాద. ఆమె స్కూటీ మీద కూర్చుని తిరిగి చూసింది. అతని పెదవుల మీద కొంటెనవ్వు. ఆమెను మరింత ఉడికించింది. అది చాలదన్నట్టు- "హలో మిస్ శతపత్రా. వెరీ నైస్ టు మీట్ యు" అన్నాడు.


ఆమెకు నిజంగానే ఒళ్ళు మండిపోయింది. "నీకు నైస్ గా ఉండొచ్చు. నాకు అసహ్యంగా ఉంది. లండన్ లో మరోసారి నా కంటపడే ప్రయత్నం చేయకు, స్కూటీతో గుద్ది నేనే నిన్ను యాక్సిడెంట్ చేసేస్తా" అంటూ స్కూటీని ముందుకు దూకించి, వీధి మలుపులో అదృశ్యమైంది.


కాస్సేపు అటే చూస్తూ నిలబడిపోయాడు రుద్రపాద, అతడి కళ్ళముందు ఇంకా శతపత్ర రూపం మెదులుతోంది. 'కీడులో మేలంటే ఇదే కావచ్చు...యాక్సిడెంట్ జరగలేదు కాని. ఇలా జరిగివుండకపోతే ఇంత అందాన్ని చూసే అదృష్టాన్ని మిస్సయి వుండేవాణ్ణి. ఎవరో ఏమిటో తెలీదు. బట్ బ్యూటీ ఆఫ్-యూనివర్స్' అనుకుంటూ కారులో కూర్చుని డోర్ మూశాడు.

🍁

*సశేషం*

[06/02, 2:50 pm] . Mallapragada: *శతపత్ర -6*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



యూనివర్సల్ టవర్స్ పద్ధెనిమిది అంతస్తుల బిల్డింగ్- దిగువ మూడంతస్తుల్లో అన్ని ఆఫీసులు, సూపర్ మార్కెట్లూ, ఆపైనవన్నీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్. తొమ్మిదో అంతస్తులో ఉంది శతపత్ర బాబాయివాళ్ళ ఫ్లాటు. స్కూటీని పార్కింగ్ లో ఉంచి లిఫ్ట్ లో పైకి చేరుకుంది శతపత్ర. అప్పటికి సాయంకాలం మూడైంది. తమ ఫ్లాట్ నంబర్ త్రీ జీరో సిక్స్ లో అడుగుపెట్టేసరికి పధ్నాలుగేళ్ళ గోకుల్ పేపర్ మీద ఏవో లెక్కలు చేస్తూ కన్పించాడు.


శతపత్ర బాబాయి పేరు బాలగోపాలం... వరసకు బాబాయి అవుతాడు. శతపత్ర తండ్రి విక్రమవర్మ, బాలగోపాలం అన్నదమ్ము ల బిడ్డలు. బాలగోపాలం భార్య పేరు సువర్ణ. వాళ్ళు లండన్ వలస వచ్చి ఇరవై ఏళ్ళు అయింది. మొదట్లో చాలా కష్టాలుపడ్డాడు బాలగోపాలం తర్వాత వ్యాపారంలో నిలదొక్కుకున్నాడు.


ప్రస్తుతం అతను లండన్ లో అరడజను రెస్టారెంట్లకు అధిపతి. చూడ్డానికి మనిషి కరుగ్గా కన్పిస్తాడు గాని చాలా సరదామనిషి. ఆయన వయసు ఏభై ఐదు సంవత్సరాలు. పర్సనాలిటీ కొంచెం ఎక్కువే.


ఇక ఆయన భార్య సువర్ణ. వయస్సు యాభై సంవత్సరాలు. ఇప్పటికీ చాలా నాజుగ్గా, అందంగా ఉంటుంది. కలివిడి మనిషి. మనసులో ఏదీ దాచుకునే స్వభావం కాదు. వాళ్ళు లండన్ వచ్చిన ఆరేళ్ళ తర్వాత పుట్టిన ఏకైక పుత్రరత్నం గోకుల్. అందుకే తల్లి దగ్గర వాడికి గారాబం ఎక్కువ. శతపత్రను వాళ్ళు తమ సొంత కూతురు లానే చూసుకుంటారు.


"ఏరా గోకుల్... హోమ్ వర్కా? లెక్కలు చేస్తున్నావా?” కూర్చుంటూ అడిగింది శతపత్ర.


“అక్కా! వచ్చేశావా? ఇది హోమ్ వర్క్ కాదక్కా నా ఫ్రెండు జానీగాడి లెక్క.. ఇది తెలీక నా బుర్ర వేడెక్కుతోంది. కాస్త చెప్పక్కా" అడిగాడు గోకుల్. 


"ఏమిట్రా అంత చిక్కు లెక్క?” కుతూహలంగా అడిగింది శతపత్ర. 


"జాక్ అండ్ జిల్ బ్రదర్స్. వాళ్ళ మమ్మీ చెరో నాలుగు చాక్లెట్లు ఇచ్చి స్కూలుకు పంపింది. స్కూలు కొచ్చాక చూస్తే జాన్ దగ్గర నాలుగు చాక్లెట్లూ భద్రంగా ఉన్నాయి. జిల్ దగ్గర మాత్రం మూడే చాక్లెట్లున్నాయి. ఆ నాలుగవ చాక్లెట్ ఏమైందో లెక్క తేలటం లేదక్కా.."


"నీ బొంద. ఇది కూడా తెలీలేదా? జిల్ గాడు ఆ నాలుగో చాక్లెట్ని దారిలో తినేసి వుంటాడు. ఐనా ఇది కూడా ఓ లెక్కేనా?” అంది శతపత్ర.


“అవును కదా... నాకీ ఆలోచనే తట్టలేదు చూశావా? అక్కా! ఇంకో చిక్కు ప్రశ్న వుంది. అడుగుతాను చెప్పాలి” అన్నాడు గోకుల్.


“పోరా. అసలే ఓ ఇడియట్ నన్ను ఫూల్ ని చేశాడు. చిరాగ్గా ఉంది. ముందు ఫ్రెషప్ అవాలి" అంటూ లేచింది.


"నిన్ను ఫూల్ ని చేశాడా! ఎవడక్కా వాడు? వాడి అంతు చూస్తాను" కోపంగా అన్నాడు గోకుల్.


"ముందు హోమ్ వర్క్ చూడు. రేపు స్కూలుంది” అంటూ తన బెడ్ రూమ్లోకి వెళ్ళిపోయింది శతపత్ర.


అటాచ్ డ్ బాత్రూమ్ లో ఫ్రెషప్ అయి బయటికొచ్చేసరికి పొగలు చిమ్ముతున్న చిక్కటి కాఫీకప్పుతో ఎదురుగా నిలబడుంది పిన్ని సువర్ణ.


"థాంక్స్ పిన్నీ!” అంటూ కప్పు అందుకుంది శతపత్ర.


“ఎవడా ఇడియట్?” కూపీ లాగుతున్నట్టు అడిగింది సువర్ణ. 


“ఎవరి గురించి పిన్నీ?" అంది శతపత్ర.


"అదే... నిన్ను ఫూల్ ని చేశాడంటే, వాడెంత పెద్దవెధవో అర్థమవుతోంది. ఇంతకీ ఏంచేశాడే?”


సువర్ణ వదిలేలా లేదని - శతపత్రకి అర్థమైపోయింది. “కార్ లో రాంగ్ సైడ్ వచ్చింది వాడు. థాంక్ గాడ్. యాక్సిడెంట్ కాలేదుకాని, తప్పంతా నాదేనన్నట్టు వెధవ బిల్డపిచ్చి నన్ను ఫూల్ ని చేశాడు” అంటూ తాగిన కాఫీకప్పు చేతికిచ్చింది శతపత్ర.


“అవునా... చూడవే శతా... లండన్ కుర్రవాళ్ళది హైస్పీడు. మనమే జాగ్రత్తగా పోవాలి...”


“వాడిక్కడివాడు కాదులే. ఇండియావాడు. తెలుగువాడు. కరుకైన ఆంధ్రుడట. స్టుపిడ్"


"ఆ స్టుపిడ్ మళ్ళీ కనిపిస్తే మనింటికి కాఫీకి పిలవ్వే" అంది సువర్ణ.


“అదేమిటి పిన్నీ”


"నిన్ను ఫూల్ని చేశాడుగా”


“పిన్నీ...” ఇద్దరూ నవ్వుకున్నారు. 


“భోజనానికి రాలేదే?” వెంటనే అడిగింది సువర్ణ.


“ఏంచేయను. విశ్వదా వదల్లేదు. అక్కడే భోంచేశాను" పూర్ణిమ దయ్యం సంఘటన చెప్పాలని నోటి చివరికి వచ్చిన మాటల్ని చటుక్కున మింగేసింది శతపత్ర. సువర్ణకి దయ్యాలంటే మా చెడ్డ భయం. ఇప్పుడీ విషయం చెప్తే పెద్ద హడావుడి చేస్తుంది. దిష్ఠి తీస్తానంటుంది, తాడు కట్టిస్తా మసీదుకు పదమంటుంది. భరించలేం.


సువర్ణ వెళ్ళిన అయిదు నిముషాల తర్వాత శతపత్ర తిరిగి హాల్లోకి వచ్చేసరికి బాబాయి బాలగోపాలం తిరిగి హాల్లో కన్పించాడు. అప్పడే నిద్రలేచి వచ్చుండాలి. భోజనం చేశాక ఓ గంట నిద్రపోవటం ఆయన అలవాటు. '


"ఏమ్మా! ఎంతసేపైందిరా వచ్చి?” అంటూ ఆప్యాయంగా పలకరించాడు.


"ఇంతక్రితమే వచ్చాను బాబాయ్. ఇప్పుడే నిద్ర లేచావా?" ఆయన ఎదురుగా కూర్చుంది.


"అవునమ్మా! అన్నట్టు ఉదయం డాడీ ఫోన్ చేశారు. నీతోచెప్పానా?” అన్నాడు బాలగోపాలం.


“లేదు బాబాయ్”


"లేదా! అయితే నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసినట్లున్నాడు. నీ విషయంలో మమ్మీ, డాడీ చాలా బాధపడుతున్నారమ్మా” అన్నాడు బాల గోపాలం.


"బాధా? ఎందుకు బాబాయ్?”


“ఎందుకంటావేమిటి తల్లీ! వాళ్ళు నిన్ను చూసి ఆరేళ్ళయ్యింది. మధ్యలో కూడా నువ్వు వెళ్ళలేదాయె. నీకు వయసు పాతిక దాటింది. వాళ్ళకి బాధ ఉండదా మరి?


నీకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారట. చదివింది చాలు. ఇక అర్జెంటుగా ఇండియా పంపించేయమని నామీద మండిపడుతున్నాడమ్మా.”


“ఓకె. బాబాయ్. నేను ఫోన్చేసి వాళ్లతో మాట్లాడతాలే" అంది శతపత్ర.


“ఏం మాట్లాడతావ్. నేనూ ఆ మాటే అడిగాను. అదేమిటన్నయ్యా! ఈ మాటేదో శతపత్రకి ఫోన్ చేసి చెప్పరాదూ? తానేదో హిస్టరీ స్టడీ చేస్తున్నానంటోంది. అది పూర్తి అయితేగాని ఇండియా రానంటోంది అన్నాను. దానికి ఏమన్నాడో తెలుసా! నిజం చెప్పరా బాలగోపాలం. మా అనుమానాలు మాకున్నాయి. అమ్మాయి నిజంగా స్టడీ చేస్తోందా లేక ఎవరైనా కుర్రాడితో లవ్ లో పడిందా అనడిగాడమ్మా. ఏం చెప్పను?

ఊరుకో అన్నయ్యా! మన అమ్మాయి బంగారం. అలాంటిదేమీ లేదు. నేను గ్యారంటీ అన్నాను. ఐనా ఆలస్యమయ్యే కొద్దీ ఇలాంటి పనికిమాలిన డౌట్లే వస్తుంటాయి. ఓసారి ఇండియా వెళ్ళి, వాళ్ళకి నచ్చచెప్పిరావచ్చు గదరా?" నచ్చచెప్పే ధోరణిలో అడిగాడు బాలగోపాలం.


చిన్నగా నిట్టూర్చింది శతపత్ర.


"బాబాయ్ ఇంటికివెళ్తే పెళ్ళి చేస్తామంటూ వెంటపడతారు. నాకు అది నచ్చదు. మమ్మీ విషయంలో నాకు భయంలేదు. తను కాలేజీ లెక్చరర్. నేనేంచెప్పినా అర్ధంచేసుకుంటుంది. డాడీతోనే ఇబ్బంది అంతా. తన పంతం నెగ్గించుకోవాలని చూస్తారు ఆయన.


ప్రతి మనిషికీ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉండాలి. నాకూ ఉంది, అది నెరవేరిన తర్వాతనే పెళ్ళి. ప్రస్తుతానికి ఇండియా వెళ్ళే ఉద్దేశ్యం లేదు" అంది శతపత్ర.


“మరి ఆయన ఊరుకుంటాడా? నేను నిన్ను పంపించకపోతే తనే వచ్చి వెంట తీసుకు పోతానంటున్నాడు. ఎందుకైనా మంచిది. నువ్వే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు” అంటూ హెచ్చరించాడు బాలగోపాలం.


"అలాగే బాబాయ్” అంది శతపత్ర.

🍁

*సశేషం*

[07/02, 4:43 pm] . Mallapragada: *శతపత్ర -7*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



"అలాగే బాబాయ్" అంది శతపత్ర.


"అది సరే. ఇంతకీ నువ్వు స్టడీ చేస్తోంది ఏమిటి?” అడిగాడు బాబాయ్.


"ఆ విషయం నన్నడుగు డాడీ. నేను చెప్తాను" అంటూ వచ్చి శతపత్ర పక్కన కూర్చున్నాడు గోకుల్.


"ఏమిట్రా నిన్నడిగేది. నీకేం తెలుసని?”


"నాకు అన్నీ తెలుసు డాడీ. మీకే ఏమీ తెలీదు"


"ఒరే... నిన్ను గోకులం కాదురా. గోకర్ణం అని పిలవాలి. డిప్ప చెవులు వెధవా, చూడమ్మా వీడు. మమ్మీ అండ చూసుకుని నన్ను డమ్మీని చేయాలని చూస్తున్నాడు వెధవ! అసలు వీడికేం తెలుసని?”


"డాడీ, అక్క వరల్డ్ మిస్టరీస్ ని స్టడీ చేస్తోంది. నాకు తెలీదనుకున్నావా? అక్కా! చిన్నపిల్లాణ్ణి చేసి డాడీ నన్ను దబాయించేస్తున్నారు చూడు."


"ఓ.కె. ఓ.కె. ఒప్పుకుంటున్నాను. అసలు వరల్డ్ మిస్టరీస్ అంటే ఏమిటి?" అడిగాడు బాలగోపాలం.


"ప్రపంచ వింతలు. అవునా అక్కా?” అన్నాడు గోకుల్.


"అవును బాబాయ్. గోకుల్ చెప్పింది నిజమే. నాకో వింత గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. దాన్ని తెలుసుకోవాలనే రోజూ నేను లైబ్రరీకి వెళ్తున్నాను” అంది.


“నాకు తెలీక అడుగుతాగాని ఏమ్మా... ప్రపంచ వ్యాప్తంగా అనేక వింతలున్నాయి. మన ఇండియాలోని తాజ్మహల్ కట్టడం ప్రపంచ వింతల్లో ఒకటి. చైనా గోడ. వేలాడే ఉద్యానవనాలు. ఢిల్లీలోని కుతుబ్మీనార్, ఇక్కడ లండన్ బిగ్ బెన్, ప్యారిస్ లో ఈఫిల్ టవర్... ఇవన్నీ అద్భుతాలే వీటి గురించి ఇంకా ఏం తెలుసుకోవాలని నీ ప్రయత్నం?" ఆశ్చర్యంతో అడిగాడు బాలగోపాలం.


శతపత్ర కాస్సేపు మౌనం వహించింది.


గోకుల్ అలవాటు ప్రకారం- "డాడీ... అక్క, ఇంకా తెలుసుకోవాలనేగా ప్రయత్నిస్తోంది. తెలుసుకున్నాక చెప్తుందిలే" అన్నాడు ఆరిందలా.


దాంతో చటుక్కున కోపం వచ్చింది బాల గోపాలానికి. "ఒరే... బండ వెధవా... నేను అడుగుతున్నా గదా! తెలిసీ తెలియకుండా వాగితే నోరు దబ్బలంతో కుట్టేస్తాను అంట్ల వెధవాని పోరా. పెద్దవాళ్ళ మాటల మధ్యలో నువ్వేంటి? పోయి. నీ స్కూల్ బుక్స్ చదువుకో... పో” అంటూ గట్టిగా కసురుకున్నాడు.


"డాడీ... నువ్వు నాకు నచ్చలేదు” అంటూ రోషంతో చివ్వున లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు గోకుల్.


“ఒరే, నచ్చినా నచ్చకపోయినా నేను నీ డాడీనేరా కుయ్యా! పెద్దకబుర్లు చెప్తే చంపేస్తాను. పో" అన్నాడు తనూ ఘాటుగా బాలగోపాలం.


ఏదో పనిలో లోపలున్న సువర్ణ వినలేదు. వింటే గనక కొడుక్కి సపోర్టు వచ్చేది.


“చెప్పమ్మా, శతపత్రా! ఈ ప్రపంచ వింతల మీద నీకేమిటి అంత ఇంట్రెస్టు?" మామూలు మూడ్ లోకి వచ్చేస్తూ తిరిగి శతపత్రను అడిగాడు బాలగోపాలం.


"బాబయ్, నువ్వన్నది నిజమే. ప్రపంచ వ్యాప్తంగా అనేక వింతలున్నాయి. అదికాదు నాకు కావలసింది. ఆ వింతల్లోఅంతుచిక్కని మిస్టరీలు కొన్ని ఉన్నాయి. మనం ఎంతో అభివృద్ధి సాధించినా ఆ మిస్టరీలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉండిపోయాయి. అలాంటి అంతుచిక్కని మిస్టరీల గురించి తెలుసుకునే ప్రయత్నం నాది" అంటూ కాస్త విపులంగా చెప్పింది శతపత్ర.


ఆయనకి కొంత అర్థమైంది. "నీ ఉద్దేశం... బర్ముడా ట్రయాంగిల్ అనే వింత దీవి గురించి ఇప్పటికీ ఏమీ తెలుసుకోలేక పోయారంటారు. అలాంటిదేనా?" అనడిగాడు.


"కరెక్టుగా ఊహించావ్ బాబాయ్. అలాంటి అన్ సాల్వడ్ మిస్టరీస్ మీద స్టడీ చేస్తున్నాను" అసలు విషయం అది కాదని ఆమెకు తెలుసు. తనను అప్పుడప్పుడూ కలలో డిస్ట్రబ్ చేస్తున్న ఒక ప్రదేశం ఎక్కడుందో, అసలు ఉందో లేదో తెల్సుకునే ప్రయత్నం తనది. కాని ఆ విషయం చెప్పి కొత్త సమస్యలు తెచ్చుకోవటం ఆమెకి ఇష్టంలేదు. ఆమె మాటలు వింటున్న బాలగోపాలంలో చిన్నగా ఆసక్తి పెరిగింది. కుతూహలంగా చూశాడు.


"అర్ధమైంది. నువ్వు తెలుసుకున్న వాటిలో ఒక మిస్టరీ గురించి చెప్పు" అనడిగాడు బాలగోపాలం.


"ఇప్పుడు అవసరమా బాబాయ్?" ఒకింత ఇబ్బందికరంగా చూసింది శతపత్ర.


"ఆకలేసినప్పుడే అన్నం తినాలి. కళ్ళు మూతలు పడినప్పుడే నిద్రపోవాలి. ఆసక్తి కలిగినప్పుడే వినాలి"


"మనుషులు మాయమయిపోవటం నువ్వెప్పుడన్నా చూశావా బాబాయ్" అడిగింది శతపత్ర. 


"ఆ చూశాను"


"చూశావా?! ఎప్పుడు?!! ఎక్కడ?!!!"


"సినిమాల్లో చూశానమ్మా... మాయలు, మంత్రాలు, అదృశ్యమైపోవడం..." అన్నాడు బాలగోపాలం.


“సినిమాల్లో కాదు. నిజంగానే. మనుషులు మాయమైపోవడం విన్నావా...?" అడిగింది శతపత్ర.


“అదేమిటమ్మా? ఎక్కడన్నా మనుషులు మాయమైపోతారా? నువ్వడుగుతుంటే ఒక సంగతి గుర్తొస్తోంది. ఆ మధ్య పేపర్లో

 ఒక ఆర్టికల్ చూశాను-


మన శరీరంలో అనేక ధాతువులు మిశ్రమంగా ఉంటాయి గదా! ఎక్కడో నూటికో కోటికో కొందరి శరీరాల్లో భాస్వరం శాతం అధికంగా ఉంటుందట. అలాంటి వాళ్ళు మాంచి ఎండలో నడవటం ప్రమాదమట. ఎండ వేడిమికి శరీరంలోని భాస్వరం వేడెక్కి భగ్గున మండి చూస్తుండ గానే ఆ మనిషి కాలి బూడిదైపోతాట్ట. అలా కాలిపోయిన వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా కొన్ని ప్రచురించారు. చాలా ఆశ్చర్యమనిపించింది. నిజంగా ఇలా జరుగుతుందా అనిపించింది. కాని అది యధార్ధ సంఘటన” అంటూ తను చదివిన విషయాన్ని చెప్పుకొచ్చాడు బాలగోపాలం.


"అవును బాబాయ్. ప్రపంచంలో నమ్మలేని నిజాలు అనేకం ఉన్నాయి. వాటిలో నువ్వు చెప్పిందే కాదు. నేను చెప్పిందీ నిజమే. ప్రతి ఏటా ఈ భూమ్మీద ఏదో చోట కొందరు మనుషులు అంతర్థానమైపోతున్నారు” అంది.


“ఎలా మాయమైపోతారు? వాళ్ళకేమన్నా మంత్రశక్తులున్నాయా? మాయమై ఎక్కడికి పోతున్నారు?”


"మనుషులు అదృశ్యమయిన సంఘటనలు మాత్రం వాస్తవం. వాళ్ళు ఏమవుతున్నారు? ఎక్కడికి పోతున్నారో తెలీదు. మాయమైన వాళ్ళు తిరిగి వచ్చిన దాఖలాలు కూడా లేవు. జస్ట్ వేనిష్. అంతే...”


“ఓ మైగాడ్. నమ్మలేకపోతున్నాను...” అన్నాడు బాబాయ్.

🍁

*సశేషం*


*శతపత్ర -8*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



అప్పటికి చీకటిపడే వేళయింది. నిద్ర లేచిన గోకుల్ “మమ్మీ... ఆకలి” అంటూ అరవటం తో ఆ సంభాషణకి బ్రేక్ పడింది. శతపత్ర లేచి స్నానానికి తన గదిలోకి వెళ్ళిపోయింది.

📖


అర్ధరాత్రి దాటింది. సమయం ఒంటిగంట.


లండన్ నగరం ప్రశాంతంగా గాఢనిద్రలో ఉంది. ఈ సీజన్లోనే మొదటిసారిగా దూది పింజల్లా తెల్లటి మంచు పొడి నగరం మీద కురుస్తోంది. విపరీతమైన చలి. తన బెడ్రూమ్ లో డబుల్ కాట్ మీద రెండు రగ్గులు కప్పుకుని వెచ్చగా నిద్రపోతోంది శతపత్ర. ఆ నిద్రలో ఒక స్వప్నం. అప్పుడప్పుడూ తనను డిస్ట్రబ్ చేస్తున్న అదే విచిత్రమైన కల. అది కలో మెలకువో కూడా తెలియని సుషుప్తి అవస్థ.


ఎదురుగా ఎత్తయిన మూడుకొండ శిఖరాల్ని చూస్తోంది శతపత్ర. ఆ కొండలపైన బూడిద రంగు గ్రద్దలు నిశ్శబ్దంగా చక్కర్లు కొడుతున్నాయి.


కొండల వెంట ఎత్తయిన వృక్షాలు తలలు విరబోసుకుని కూచున్న దయ్యాల్లా దర్శనమిస్తున్నాయి. పశ్చిమంగా సూర్యుడు అస్తమించబోతున్నాడు.


రెండు కొండల నడుమ దారి చేసుకుంటూ తిరిగి నడక ఆరంభించింది శతపత్ర. అది ఏ ప్రదేశమో, తను ఎక్కడుందో ఆమెకు అర్థంకావటం లేదు. గాలికి ఎండుటాకుల శబ్దాలు గుండెల్ని జలదరింప చేస్తున్నాయి. తెరలు తెరలుగా వీస్తున్న గాలికి చెట్ల కొమ్మలు ఊగుతూ ఈలలు వేస్తున్నాయి.


దూరంగా గుట్టలమీద నక్కల ఊళలు వెన్నులో చలిపుట్టిస్తున్నాయి. ఎండిపోయిన వృక్ష శాఖలమీద తీరిగ్గా కూచున్న గుడ్ల గూబలు కొన్ని ఎవరో రాయి విసిరినట్టు ఒక్కసారిగా రొద చేస్తూ గాల్లోకి ఎగిరాయి.

అదే సమయంలో లోయ ప్రాంతం నుంచి గబ్బిలాల రొద గుండెల్ని జలదరింప జేస్తోంది. అయినా వేటినీ లెక్కచేయటం లేదు శతపత్ర. ముందుకు పోతూనే వుంది. మొక్కలు, చెట్ల కొమ్మలు క్రమంగా వెనక్కి పోతున్నాయి. 


గాలి వేడెక్కిపోతోంది. అదృశ్యరూపాలు ఏవో చెట్ల పైభాగాన ఎగిరిపోతున్న భ్రాంతి.

ముందుకు ఇంకా ముందుకు నడుస్తూనే వుంది శతపత్ర. క్రమంగా ఒక శిధిలమైన గోడను చేరుకుంది. ఆ గోడను ఏ కాలంలో కట్టారో, ఎవరు కట్టారో తెలీదు. ఆ గోడ శిధిలాలను దాటగానే దిగువన లోయలోకి కాలిబాట కన్పిస్తోంది. ఆ మార్గంలో ఎవరూ నడచిన జాడలేదు. నేలమీద దట్టంగా పచ్చిక పెరిగి వుంది. అక్కడి నుంచి కిందికి చూస్తుంటే ఎదురుగా కనుచూపుమేర లోయ కనిపిస్తోంది.


లోయలోకి దిగటం ఆరంభించింది శతపత్ర. తన వెనక ఎవరో అనుసరిస్తున్నారు. అస్పష్టమైన రూపం. ఎవరో తెలియటం లేదు. శతపత్ర ఆ బాట ననుసరించి లోయ లోకి దిగుతోంది. దట్టమైన వృక్షాలు, పొదల తో బీభత్సంగా వుంది లోయ. దిగువకు వెళ్ళే కొద్దీ చీకట్లు అలుముకుంటు న్నాయి. ఎవరో అరుస్తున్నారు. "వద్దు... రావద్దు" అంటూ.


చెట్లకొమ్మలు జలజలా ఊగుతున్నాయి. అయినా ఆమె పాదాలు ఆగలేదు. లోయ లోకి ప్రయాణిస్తూనే ఉంది. అంతలో ఎక్కడి నుంచో ఎనుబోతుల రంకెలు బిగ్గరగా వినవచ్చాయి. గుండెల్ని పీచుమనిపించే కఠోరమైన రంకెలు లోయలో మారుమోగు తున్నాయి. అదే సమయంలో చెట్లమీదుగా ఒక స్త్రీ ఆర్తనాదం బిగ్గరగా వినవచ్చింది.


తలెత్తి చూసింది శతపత్ర. ఆకాశం ఎర్రగా ఉంది. పైన ఎవరూ లేరు. ఆర్తనాదం మాత్రం ఎగువ నుంచి ఆరంభమై అలా అలా లోయ దిగువ ప్రాంతానికి పోతూ క్రమంగా మందగించింది. ఆ స్త్రీ ఎవరు? ఆకాశ మార్గంలో అదృశ్యరూపంలో ఎక్కడికి వెళ్ళిందీ తెలీదు. మరింత ముందుకు అలా అలా సాగిపోయింది.


అంతలో ఓ గండుపిల్లి ఎక్కడి నుంచో చటుక్కున దూకింది. దారికడ్డంగా నిలబడి క్రూరంగా చూసింది. మీదకు దూకబోయింది.


శతపత్ర దానివంక తీక్షణంగా చూసింది.

అంతే? అది కంగారుపడి గిరుక్కున తిరిగి ఎటో పారిపోయింది.


మరికాస్త దూరం వెళ్ళేసరికి ఓ పిల్లల కోడి తన ఏభై పిల్లల్ని వెంటేసుకుని దారి కడ్డం వచ్చింది. అయినా దడవలేదు శతపత్ర. ఆమె ఆగకుండా ముందుకు రావటంతో అది కూడా తప్పుకుంది. అప్పటికి లోయమధ్యకు వచ్చేసిందామె.


అంతలో పెద్ద పెద్ద కొమ్ములతో బలిష్టమైన అడవి దున్న ఒకటి బుసలు కొడుతూ ఆమెకు ఎదురు వచ్చేసింది. ఎంత వేగంగా అంటే అది మీదికొచ్చి కొమ్ములతో కుమ్మేస్తుందన్నంతగా...


సాధారణ మానవులైతే గుండె బేజారై పరుగులు తీయాల్సిందే. కాని ఆమెలో మొండి ధైర్యం ఏమిటోగాని, కాస్త కూడా జంకకుండా ఎదురు వెళ్ళింది.


ఎంతో వేగంగా వచ్చిన ఆ అడవిదున్న ఆమెకు సమీపంలోకి వచ్చీరాగానే సడెన్ బ్రేక్ వేసినట్టు ఆగిపోయింది. ఆమెను సూటిగా చూసింది. కొన్ని సెకన్లపాటు అలా ఎదురెదురుగా ఉండిపోయారు.


అడవిదున్న గిరుక్కున వెనుతిరిగింది. పెద్దగా రంకెవేస్తూ వచ్చిన దారినేవెళ్ళిపోతూ అదృశ్యమైంది. ఆమె మరికాస్త ముందుకెళ్ళ గానే లోయ చివర ఒక కొండ పాదాన్ని చేరుకుంది. ఎదురుగా ఒక విశాలమైన గుహ మార్గం కన్పించింది. గుహ వైపు అడుగులేసింది శతపత్ర.


"వద్దు....రావద్దు. నీకు ఇక్కడికి రావడానికి అనుమతి లేదు. వెళ్ళు... వెనక్కి వెళ్ళిపో" అంటూ ఎక్కడినుంచో అనేక కంఠాలు ఒక్కసారిగా అరిచాయి.


అంతే... సడెన్ గా మెలుకువ వచ్చేసింది శతపత్రకి. దిగ్గున లేచి కూచుంది. అంత చలిలో కూడా ఆమెకు శరీరమంతా చెమటలు పోశాయి. నుదురు రుద్దుకుంది. రావద్దంటున్న ఆ అరుపులు ఇంకా చెవిలో మారు మోగుతున్నాయి.


బెడ్ దిగి బాత్రూమ్ కెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని వచ్చి మంచినీరు తాగింది. అప్పటిగ్గాని ఆమె గుండె వేగం సాధారణ స్థితికి రాలేదు.


ఇది అప్పుడప్పుడూ తనకు వస్తున్న కలే అయినా ఇప్పటి కలలో ఓ ప్రత్యేకత ఉంది. గతంలో వచ్చిన కలలో కూడా అవే కొండలు, అదే లోయ ప్రాంతం. లోయలోకి దిగిన కొంతసేపటికి మెలకువ వచ్చేసేది. కాని ఈ కలలో కొన్ని శక్తులు పిల్లి రూపంలోను, కోడి రూపంలోను, దున్నపోతు రూపంలోను తనను ముందుకు పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. కొత్తగా ఒక గుహ మార్గాన్ని చూసింది. ఎవరో తనను లోపలకు రావద్దని అరుస్తున్నారు. ఇప్పుడొచ్చిన కలలో కొత్త మార్పు ఇది.


ఆ కొండలు, ఆ లోయ ఎక్కడున్నాయి? అసలు అవి వున్నాయా లేదా తెలీదు. అలాంటి ప్రదేశం ఎక్కడుందో తెలుసుకోవా లనే తన ప్రయత్నం... ఆ ప్రదేశానికి, తనకు ఏమిటి సంబంధం? పదే పదే ఆ లోయ ప్రాంతం తన కలలో కన్పించి తనకు ఎందుకు డిస్ట్రబ్ చేస్తోంది అర్థం కాదు. అంతటి భయానకమైన కలలో కూడా ఎక్కడా తను భయపడకపోవటం ఆశ్చర్యంగా ఉంది తనకే.


అడవిదున్న అరుపులు, ఆకాశంలో స్త్రీ రోదన ఇంకా చెవుల్లో ప్రతి ధ్వనిస్తూనే వున్నాయి.


అన్నిటికీ మించి ఇప్పుడొచ్చిన కలలో మరొక్క విశేషం ఏమంటే-తన వెనకే ఎవరో వస్తున్నారు. ఎవరో తెలీదు గాని తనను అనుసరించి నీడలా ఒక ఆకారం తనవెంట రావటం మొదటిసారి గుర్తించింది.


క్లాక్ వంక చూసింది శతపత్ర. అర్ధరాత్రి రెండుగంటలు దాటింది సమయం. తిరిగి నిద్రకు ఉపక్రమించింది. కాసేపటికే ప్రశాంతంగా నిద్రపోయింది.

📖


అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. సెల్ ఫోన్ అదేపనిగా మోగుతుంటే మెలకువ వచ్చేసింది. చూస్తే సమయం ఉదయం ఆరుగంటలు.


ఇంత పొద్దుటే ఎవరు ఫోన్ చేస్తున్నారో అర్ధం కాలేదు. చేయిచాపి సెల్ అందుకుని నంబర్ చూసింది. అవతల విశ్వదా లైన్లో ఉంది. “ఆరుగంటలకి నిద్ర లేపమని నీకు చెప్పానా? ఎందుకే ఫోన్ చేశావ్ రాక్షసీ" అంది విసుగ్గా.


"తెల్లారిపోయింది మేడమ్. ఏంటి ఇంకా బెడ్ దిగలేదా?" నవ్వుతూ అడిగింది విశ్వదా.


"ఏడు దాటిందే... బెడ్ దిగే అలవాటు లేదుగా. నువ్వేమిటే ఇంత పొద్దుటే ఫోన్ చేశావ్."


"కారణం ఉంది డియర్. లేకపోతే ఉత్తినే ఫోన్ చేసి నీతో తిట్లు తినటం నాకేమన్నా సరదానా?" అంది విశ్వదా.


“విషయం చెప్పకపోతే నిజంగానే తిడతాను.”


"ఇంతకుముందే మన ఫ్రెండ్ సమీక్ష ఫోన్ చేసింది. అది ఇండియా వెళ్ళిపోతోంది.”


"వాట్?" ఏదో వినకూడని మాట విన్నట్టు అరిచింది శతపత్ర. ఆమె కళ్ళ ముందు అందమైన సమీక్ష ముఖం మెదులుతోంది. ఈ మధ్యనే దాని చదువు కూడా పూర్తయింది. కొద్దిరోజులు ఆగి యూరప్ అంతా చూసి వెళ్ళాలనుకుంది. తమ బెస్ట్ ఫ్రెండ్ అది.


వచ్చే నెల్లో యూరప్ ట్రిప్ కి ప్లాన్ కూడా చేశారు. ఇంతలోనే వెళ్ళిపోతోందంటే నమ్మలేకపోతోంది..


"ఏమైందట?” అడిగింది..


"ఏముంది. పొరపాటున పరీక్షలు అయిపోయాయని చెప్పేసింది. ఇండియాలో తన బావ ఊరుకుంటాడా! ఎప్పుడో సెటిలైన సంబంధం... ఏకంగా పెళ్ళికి ముహూర్తాలు పెట్టేసి వెంటనే బయలుదేరి వచ్చేయమని ఆర్డర్ జారీ చేశారు. పదిరోజుల్లో పెళ్ళి.

పాపం ఏడుపు ఒక్కటే తక్కువ దానికి. అప్పుడే లండన్ వదిలి వెళ్ళాలని లేదు తనకి. కాని తప్పదు. ఇప్పుడు ఎనిమిది గంటల ఫ్లయిట్ కి వెళ్ళిపోతోంది. సెండాఫ్ ఇవ్వటానికి బయలుదేరుతున్నాను. ఎయిర్ పోర్ట్ కి నువ్వు కూడా వస్తావేమోనని ఫోన్ చేశాను" వివరించింది విశ్వదా.


"ఆగవే నేనూ వస్తున్నాను" అంది శతపత్ర హడావుడిగా బెడ్ దిగుతూ.


“ఎంతసేపట్లో వస్తావ్?”


"అరగంటలో నీ ఫ్లాట్ వద్ద ఉంటా.”


"ఓ పని చెయ్యి. నీ స్కూటీతో పనులు కావు. టాక్సీలో వచ్చెయ్యి. నేను కిందే రోడ్ సైడ్ లో నీకోసం ఎదురుచూస్తూంటాను” అంది విశ్వదా.


“ఓకె” అని ఫోన్ పెట్టేసింది శతపత్ర.


ఈ హడావుడిలో కల సంగతి పూర్తిగా మర్చిపోయిందామె. వెంటనే స్నానం చేసి పావుగంటలో రెడీ అయింది. చక్కగా చీర, జాకెట్టు ధరించి సింపుల్ గా అలంకరించుకు ని వేనిటీ బ్యాగ్ అందుకుని బయటికొచ్చే సరికి పిన్ని సువర్ణ వేడివేడిగా కాఫీ కప్పు అందించింది. అయదుగంటలకే లేచిపోవటం ఆమె అలవాటు.


పిన్నితో విషయం చెప్పి లిఫ్టులో కిందకు వచ్చేసరికి ఆరుముప్ఫై నిముషాలు. అప్పటికింకా మంచుపొడి రాలుతూనే వుంది బయట. అటుగా వచ్చిన టాక్సీలో విశ్వదా వద్దకి బయలుదేరింది శతపత్ర.

📖


టాక్సీ ఎయిర్ పోర్ట్ కి చేరుకునేసరికి ఏడు గంటల నలభై నిముషాలు టైమ్. మంచు పొడి రాలటం తగ్గింది. ఎటు చూసినా పిండి గుమ్మరించినట్టు ఇళ్ళమీదా, చెట్ల మీదా, రోడ్లమీదా తెల్లటి మంచు.


దారి పొడవునా బుల్ డోజర్లాంటి యంత్రాలు రోడ్లమీద అరడుగు మందాన పేరుకున్న మంచును తొలగించటంలో బిజీగా ఉన్నాయి. వాతావరణం ఆహ్లాదభరితంగా వుంది. సూర్యకిరణాలు ఇప్పుడిప్పుడే నేలను తాకుతున్నాయి. ఇండియా వెళ్ళిపోతున్న సమీక్ష ఇంకా ఎయిర్ పోర్ట్ కి చేరుకోలేదు. సెండాఫ్ ఇవ్వటానికి అంత క్రితమే మరో నలుగురు అమ్మాయిలు వచ్చున్నారు. శతపత్ర, విశ్వదాలు వాళ్ళతో జాయినయ్యారు. అంతా ఒకేసారి ఇలా కలుసుకోవటం హ్యాపీగా ఫీలయ్యారంతా.


షెడ్యూల్ టైమ్ కి అరగంట లేటుగా బయలుదేరుతోంది విమానం. సమీక్ష ఆలస్యానికి అదో కారణం. ఫోన్ చేస్తే ట్రాఫిక్ ఉందట. అయిదు నిముషాల్లో అక్కడికి వచ్చేస్తానంది. అమ్మాయిలంతా లాంజ్ లో గుంపుగా నిలబడి కబుర్లలో పడ్డారు. ఎయిర్ పోర్ట్ చాలా బిజీగా ఉంది.


ప్రతి అయిదు నిముషాలకి ఒక ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటే మరో ఫ్లయిట్ లాండవుతోంది.

లండన్ ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ట్రాఫిక్ చాలా బిజీగా ఉంటుంది. పదినిముషాలు ఇట్టే గడిచిపోయాయి

🍁

*సశేషం*



*శతపత్ర -9*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు


పదినిముషాలు ఇట్టే గడిచిపోయాయి.


రెండు సూట్ కేస్ లతో సమీక్ష టాక్సీ దిగింది. నవ్వులు, కేరింతలు ఒకరినొకరు ఆప్యాయం గా పలకరింపులు, సమీక్ష చాలా ఉత్సాహం గా ఉంది. లండన్ వదిలి వెళ్ళిపోతున్న ఆనందం ఆమెలో కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. అమ్మాయిలంతా ఆమె బావ గురించి జోకులు పేలుస్తున్నారు. వాళ్ళకి నవ్వుతూ కౌంటరిస్తోంది సమీక్ష. 


ఈ హడావుడి మధ్యలో ఓ కొత్త గొంతు- "హలో సూసైడ్ కేస్. హౌ ఆర్ యూ?" అంటూ పలకరించింది. సుపరిచితమైన గొంతు సడన్ గా వెనుక నుండి వినబడగానే ఉలిక్కిపడుతూ తిరిగి చూసింది శతపత్ర.


ఎరుదుగా రుద్రపాద.


తన సూట్ కేస్, ఎయిర్ బ్యాగ్ లను ట్రాలీ మీద తోసుకొస్తున్నాడు. అదే చిరునవ్వు. అదే హుషారు. మరింత స్మార్ట్, మరింత అందంగా కన్పిస్తున్నాడు. అదే ఫ్లయిట్ కి అతను కూడా ఇండియా వెళ్ళిపోతున్నట్టు న్నాడు.


కళ్ళు పెద్దవి చేసి పది సెకన్ల వరకు అలా అతడ్నే చూస్తూండిపోయింది శతపత్ర. అమ్మాయిలంతా ఆ అపరిచితుడ్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు.


శతపత్ర తేరుకుంది. ఆమెకు ఒళ్ళు మండుతోంది. సూసైడ్ కేస్ అని పిలవటం మరింతగా మండించింది. దాంతో మరింత ఫైరయిపోయింది. 


“ఇడియట్... నేను... నేను సూసైడ్ కేసా? నువ్వే డ్రైవింగ్ డెవిల్. నువ్వు ఇక్కడ కూడా దాపురించాలా?" అనేసింది బిగ్గరగా.


అతనెవరో మిగిలిన యువతులకు తెలీదు. అతను శతపత్రను పిలిచి గొడవపడ్డం ఏమిటో అంతకన్నా తెలీదు. వారిలో విశ్వదా ఒక్కతే కొంత ఊహించగలిగింది. ఎలాగంటే నిన్న చీకటిపడే వేళ ఫోన్ చేసినప్పుడు జరిగింది ఆమెతో చెప్పింది శతపత్ర.


శతపత్ర రుసరుసలకు అతను బెదరలేదు. భయపడలేదు. ఆమెను మరింత టీజ్ చేస్తూ- “దాపురించలేదు మేడమ్. ఇండియా వెళ్ళిపోతున్నాను. ఇప్పట్లో నన్ను చూడాలన్నా లండన్ లో చూళ్లేవు” అన్నాడు.


"చూడాలన్న కోరికగాని, అవసరంగాని నాకు లేదు. యు కెన్ గో” అంది కటువుగా శతపత్ర.


"అబ్బో! నాకు మాత్రం నిన్ను చూడాలన్న కోరికగాని, అవసరంగాని ఉందా ఏమిటి? అయినా చూశావా? నిన్న రోడ్డు మీద కలుసుకున్నాం. ఇప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఇలా కలుసుకున్నాం. ఏదైనా రాసిపెట్టి వుంటే తప్పదమ్మడూ. అప్పుడప్పుడూ ఇలాగే కలుసుకుంటాం. కాని ఏ మాటకా మాట చెప్పుకోవాలి. యూ ఆర్ సో బ్యూటీఫుల్. కోపంలో మరింత అందంగా వుంటావ్ తెలుసా?” అన్నాడు.


"నాకు తెలుసులే."


"తేలీదేమో అనుకుని గుర్తుచేశానే... అయినా అమ్మాయిలంతా ఇలా గుంపుగా వచ్చారేమిటి? మిమ్మల్ని చూస్తుంటే ఇది లండన్ ఎయిర్ పోర్ట్ లా లేదు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లా ఉంది. కొంపదీసి మీరంతా సామూహికంగా ఇండియాకు వలసరావటం లేదు గదా?'


"హలో! వలస రావలసిన ఖర్మ మాకేమిటి? మా మాతృభూషి ఇండియా” అంది నవ్వుతూ విశ్వదా.


"అలాగా. అయితే మాతృదేవిలందరికీ వందనం. ఈ అమ్మాయికి తప్ప. బైదబై అయామ్ రుద్రపాద. నా పేరు గుర్తుంటుంది గా?" అని శతపత్రని అడిగాడు.


“షటప్" కోపంతో ఉడికిపోతోంది శతపత్ర.


అమ్మాయిలంతా ఆ ఇద్దరి గొడవను ఎంజాయ్ చేస్తూ నవ్వుతున్నారు. ఆమెను మరింత ఉడికిస్తూ- "అయితే మీరంతా ఇండియా వచ్చేస్తున్నారన్న మాట" అన్నాడు.


"మేం రావటం లేదు. నువ్వెళ్ళొచ్చు. మా ఫ్రెండ్ కి సెండాఫ్ ఇవ్వటానికొచ్చాం" అంది సీరియస్ గా శతపత్ర.


“అదా సంగతి. ఓకె” నాకు సెండాఫ్ ఇవ్వటానికి ఎవరూ రాలేదు. పనిలో పనిగా నాకు కూడా మీరందరూ సెండాఫ్ ఇస్తే సంతోషిస్తాను" అన్నాడు రుద్రపాద.


“నువ్వెళ్ళిపోతే సంతోషిస్తాను.”


“వెళ్తాలే... నూరాకులూ...”


"ఏయ్.. హోల్డ్ యువర్ టంగ్..." అంటూ హెచ్చరించింది శతపత్రి. అమ్మాయిలంతా నవ్వారు.


“నూరాకులేమిటి? మేనర్స్ తెలీదా? నా గురించి నీకు తెలీదు" అంటూ హెచ్చరించింది శతపత్ర.


అయినా అతను జంకలేదు. అదే చిరునవ్వు. “హలో... సంస్కృతంలో శతపత్ర అంటే అచ్చతెలుగులో నూరాకులు అని అర్థం. మీరే చెప్పండి, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? భాష వేరైనా భావం ఒక్కటే. అవునో కాదో నీ ఫ్రెండ్స్ ని అడుగు."


విసుగ్గా చూసింది శతపత్ర. “మిస్టర్ రుద్రపాద... నా పేరు శతపత్ర దాన్ని నూరాకులని, హండ్రెడ్ లీవ్స్ అని రకరకాల భాషల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నాతో గొడవపడాలనే వచ్చావా?” అంది.


"లేదు. ఫ్లైట్ ఎక్కాలని వచ్చాను”


"వెళ్ళి ఎక్కు.. న్యూసెన్స్ చేస్తే మర్యాదగా వుండదు. ఐ హేట్ యు" అంది. 


“నేనూ ఐ టూ హేట్ యూ అనే చెప్తాను. ఐ లవ్ యూ అని అస్సలు చెప్పను."


"వాట్?" మరోసారి కళ్ళింతలు చేసి నోరు తెరిచి అలా చూస్తూండిపోయింది శతపత్ర. ఇంత మొండి మనిషిని తనింతవరకు ఎక్కడా చూళ్ళేదు. కొంచెం కూడా బెదురు, భయం లేవు. నోటికొచ్చింది వాగటమే పనిలా వుంది.


"మరీ ఆశ్చర్యపోకు డియర్. నువ్విన్నది కరక్టే. ఈ అమ్మాయిలంతా సాక్షి, ఐ లవ్ యూ అని చెప్పనంటున్నాను. ఇంకెందుకు కోపం?


"చాలా అందంగా వున్నావ్. ఏం లాభం? అమ్మాయికి ఇంతటి గయ్యాళితనం ఉండకూడదు. కొంచెం కోపం తగ్గిస్తే మంచిది. నీ ఉడ్ బి సుఖపడతాడు" గడగడా ప్రవాహంలా మాట్లాడేస్తున్నాడు రుద్రపాద. శతపత్ర కౌంటర్ ఇవ్వటానిక్కూడా అతను అవకాశం ఇవ్వలేదు.


"అయినా ఏమిటిది? మనం మనం తెలుగు వాళ్ళం. ఇలా లండన్ ఎయిర్ పోర్ట్ లో గొడవపడ్డం ఏమిటి? ఎనీవే బ్యూటీ... నిన్న యాక్సిడెంట్ లో కలిశాం. ఇప్పుడు ఎయిర్ పోర్ట్ లో... ఏమో... మళ్ళీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కలుస్తామో... దేవుడా... ఇంకెప్పుడూ ఈ పెంకిపిల్ల నాకు ఎదురుపడకుండా చూడు" అంటూ పైకి చూసి లెంపలేసుకుని తన దారిన ట్రాలీలో ముందుకెళ్ళిపోయాడు రుద్రపాద. అమ్మాయిలంతా శతపత్రని కాస్సేపు టీజ్ చేసేవాళ్ళే. కాని అంతలోనే బోర్డింగ్ కి అనౌన్స్మెంట్ వచ్చింది. వెంటనే అమ్మాయిలంతా సమీక్షకు బై చెప్పారు.


అంతా ఆప్యాయంగా సెండాఫ్ ఇస్తుండగా తన లగేజీతో వెళ్ళిపోయింది సమీక్ష.


అంతవరకూ అక్కడే ఉన్నాడు రుద్రపాద. సమీక్ష వెళ్ళగానే వెనకే తనూ బైలుదేరాడు. సెక్యూరిటీ చెక్ లోకి ఎంటరవుతూ తిరిగి చూసి శతపత్రవైపు చిరునవ్వుతో చేయి ఊపాడు.


తనకు తెలీకుండానే చిరునవ్వు నవ్వి చేయి ఊపింది శతపత్ర. అది గమనించిన అమ్మాయిలు టీజ్ చేయటం ఆరంభించారు. ప్లయిట్ టేకాఫ్ తీసుకునే వరకు నవ్వులు, కేరింతలతో అమ్మాయిలంతా అక్కడే లాంజ్ లో ఉన్నారు. కాస్సేపటికి సమీక్ష ప్లయిట్లోంచి శతపత్ర సెల్ కి ఫోన్ చేసింది.


“సమీక్ష...అంతా ఓకేనా? సీట్ కంఫర్టబుల్ గా ఉందా?" అడిగింది శతపత్ర. 


“అంతా ఓకేగాని నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను" అంది సమీక్ష.


"ఇదిగో ముందే చెప్తున్నాను. మీ పెళ్ళి తాలూకు వీడియో, సీడీ ఒకటి మాకు పంపించటం మర్చిపోవద్దు."


"ఓ.కె శతా... అలాగే పంపిస్తాగాని నీ శత్రువు రుద్రపాద లేడూ?"


"వాడి సంగతి ఎందుకే?”


"ఎందుకంటావేమిటే... ఆ దుర్మార్గుడు ఇప్పుడు నా పక్క సీట్లోనే ఉన్నాడు" గుసగుసలాడుతున్నట్టు చెప్పింది సమీక్ష. శతపత్ర త్రుళ్ళిపడింది.


అమ్మాయిలంతా స్పీకర్ ఫోన్లోంచి వాళ్ళ సంభాషణంతా వింటున్నారు. 


"ఓ మైగాడ్... వాడు నీ పక్క సీట్లో ఏమిటే? మాటలతోనే బోల్తా కొట్టించి నిన్ను లేపుకెళ్ళి పోతాడు వాడు. తర్వాత నీ బావ లబోదిబో మన్నా ప్రయోజనం ఉండదు" అని హెచ్చరించింది.


"రుద్రపాద చాలా మంచివాడు" అంది.


"నీకెలా తెలుసే?" 


"ఎలా ఏమిటే... అతనెవరనుకుంటున్నావు. నా కజిన్ బ్రదర్" అంది సమీక్ష.


"వాట్...?!" అని అరిచింది శతపత్ర.


కళ్ళు గిర్రున తిరిగి కిందపడుతుందేమో అన్పించింది. అమ్మాయిలంతా ఒకేసారి తెల్లబోయారు. అసలు పరిచయమే లేనట్టు అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ ఎంత నాటకం ఆడారు.


చటుక్కున శతపత్ర చేతిలోంచి ఫోన్ లాక్కుంది విశ్వదా, "ఏయ్.. ఏమే జోక్ చేస్తున్నావా? అతను కజిన్ అయితే కలిసి రావాలి. విడివిడిగా ఎలా వచ్చారే?" అనడిగింది.


"సారీ విశ్వదా! అక్కడ చెప్తే అన్నయ్య కోప్పడతాడని మీకు చెప్పలేదు. నిన్న ఎవరో అమ్మాయితో గొడవపడ్డానని, ఆ అమ్మాయి పేరు శతపత్ర అని చెప్పినప్పుడే నేను అనుమానించాను. అదే నిజమైంది. అన్నయ్య తన ఆఫీస్ పనిమీద పదిరోజుల క్రితం లండన్ వచ్చాడు. వాడి సొంత అక్క ఇక్కడే ఉన్నా వాళ్ళింట్లో దిగడు. ఏ వూరు వెళ్ళినా హోటల్లో దిగటం వాడి అలవాటు. నేను మా మావయ్య వాళ్ళింట్లో ఉంటున్నా ను. తెలుసుగదా. అందుకే విడివిడిగా ఎయిర్ పోర్ట్ కి వచ్చాం. సాధారణంగా అమ్మాయిలంటే దూరంగా ఉంటాడు అన్నయ్య. అలాంటిది శతపత్రతో కావాలని గొడవపడుతుంటే నేను కూడా సరదాగా చూస్తూ ఊరుకున్నాను. ఎనీవే. టీజ్ చేసినందుకు శతపత్రకి సారీ చెప్పమన్నాడు. శతా, ప్లీజ్ మా అన్నయ్య చెడ్డవాడు కాదు. ఓకే... బి హ్యాపీ బై..." అని అవతల లైన్ కట్ చేసింది సమీక్ష.


శతపత్ర మదిలో రుద్రపాద మెదిలాడు. ఆమెకు తెలీకుండానే గులాబీ పెదవుల మీద చిరునవ్వులు పూశాయి. టాక్సీకోసం ఎయిర్ పోర్ట్ బయటికి బయలుదేరారంతా.

🍁

*సశేషం*

*శతపత్ర -10*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



"నాన్సీ! వేరార్ యూ?” దేనికోసమో వెదుకులాడుతూ బెడ్రూమ్ లోంచి పెద్దగా భార్యను పిలిచాడు స్టీఫెన్ వార్నర్.


"అయాం ఇన్ ది కిచెన్. వాట్ హ్యాపెన్ డియర్?". సరిగ్గా అంతే రేంజ్ లో కిచెన్లోంచి వినవచ్చింది నాన్సీ గొంతు. అది పశ్చిమ లండన్ ప్రాంతం.


ఒక కెనాల్ ని ఆనుకొని వుంది రెండతస్తుల పాతకాలం నాటి బిల్డింగ్ ఒకటి. ఆ ఇంటి చుట్టూ అనేక పూలమొక్కలు, చక్కని లాన్ తో కూడిన ఆవరణ వుంది. ఎత్తైన కాంపౌండు వుంది. వెనకపక్క కెనాల్ విశాలమైంది. అందులో పెంపుడు బాతులు తిరుగుతుంటాయి. సాయంకాలం కెనాల్లో బోటింగ్ చాలా సరదాగా ఉంటుంది.


కాంపౌండు మూలన గ్యారేజ్ లో ఓల్డ్ మోడల్ ఫోర్ సీటర్ ఫోర్డ్ కారు వుంది. స్టీఫెన్ వార్నర్ వయసిప్పుడు అరవై సంవత్సరాలు. ఆరడుగుల హైటు, తగిన లావుతో ఇప్పటికీ మనిషి చాలా దృఢంగానే ఉన్నాడు. మిగలపండిన జాంపండు రంగులో ఉంటాడు.


నిగనిగలాడే బట్టతల, చత్వారం కళ్ళజోడు ఆయన స్పెషాలిటీ. ఆయన భార్య నాన్సీ..... ఆమె వయసు ఏభై ఐదు సంవత్సరాలు. కాస్తలావుగా మీడియం హైట్ లో ఉంటుంది. వాళ్ళది ఆదర్శ దాంపత్యం. యూరోపియన్స్ దుస్తులు మార్చినంత సులువుగా డైవోర్స్ తీసేసుకుంటారు. అందుకే ఒక్కొక్కరూ ఐదారు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళి చేసుకున్నాక జీవితాంతం కలిసి బతకాలనే సెంటిమెంట్ అక్కడలేదు.


కాని స్టీఫెన్ వార్నర్, నాన్సీలు తమ పెళ్ళయి నప్పట్నుంచి కలిసి కాపురం చేస్తూ ఆనందం గా ఉంటున్నారు. విడిపోవాలనే ఆలోచనే వాళ్ళకి ఎప్పుడూ రాలేదు.


ఆ దంపతులకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఒక కొడుకు అమెరికాలో ఇంజనీర్ గా సెటిలయ్యాడు. ఒక కొడుకు బ్రిటీష్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా చేస్తున్నాడు. కూతురు డాక్టర్. జర్మనీలో ఉంటోంది. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉన్నారు. మనవలు, మనవరాళ్ళు ఉన్నారు. ఆ పాత ఇల్లు అమ్మేసి తమ వద్దకు వచ్చేయమంటారు కొడుకులు. కాని ఆ ఇల్లు, ఆ వాతావరణం అంటే ఆ దంపతులకు ప్రాణం. అందుకే ఇక్కడే ఉంటున్నారు.


వీరితోపాటు అక్కడ సూజీ అనే ముసలి కుక్క కూడా ఒకటి వుంటోంది.


అంత ఎత్తున, నల్లగా భూతంలా ఉండే ఆ కుక్కని కొత్తవాళ్ళు చూస్తే జడుసుకుంటారు. వేళకు వచ్చి తినటం, వెళ్ళి తన డాగ్ హౌస్ లో నిద్రపోవటం ఇదే దాని పని. అది మొరిగిన సందర్భాలు చాలా తక్కువ. పగలు లోపలకు ఎవరు వచ్చి వెళ్ళినా పట్టించుకోదు. రాత్రిపూట వచ్చారో, వాళ్ళ అంతు చూడకుండా వదలదు. అయితే ఆ ఇంటి గురించి తెలిసినవాళ్ళెవరూ లోపల అడుగుపెట్టడానికి సాహసించరు. దానికో కారణం ఉంది.

📖


స్టీఫెన్ వార్నర్ ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నాడు. క్వీన్ విక్టోరియా మెమోరియల్ లైబ్రరీ చీఫ్ ఇన్ఛార్జ్ ఆయన. అతి పెద్దదైన ఆ లైబ్రరీలో అనేక విభాగాలున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన అతి ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి. సుమారు పాతికమంది లైబ్రేరియన్లుగా అందులో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ హెడ్డు స్టీఫెన్ వార్నర్. ఆ లైబ్రరీలో ఏ భాషలో, ఏ గ్రంథం ఎక్కడ ఉందో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలీదు. పరిశోధనకు తమకు అవసరమైన గ్రంథాల కోసం ఔత్సాహికులు ఆయన్ని సంప్రదిస్తుంటారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఆయన చిరపరిచితుడు.


అటువంటి స్టీఫెన్ వార్నర్ లైబ్రరీకి బయలు దేరుతూ తన బ్రీఫ్ కేస్ కనపడక భార్యని సాయం కోసం పిలిచాడు. “నాన్సీ. ప్లీజ్ కమ్ హియర్?" అనరిచాడు పెద్దగా.


"ఏమిటి స్టీఫెన్. ఏమిటి హడావుడి?” అంటూ కిచెన్లోంచి గబగబా బయటికొచ్చింది నాన్సీ.


"నా బ్రీఫ్ కేస్.... ఇక్కడే పెట్టాను రాత్రి. ఇప్పుడది కన్పించడంలేదు ఏమైంది?" రిపోర్ట్ చేశాడు.


"ఎందుకు ఇక్కడ పెట్టారు? ఎన్నిసార్లు చెప్పాను. బీరువాలో పెట్టి తాళం వేయమని.. ఈ పిల్ల దెయ్యాలతో పెద్ద చావొచ్చింది. ఏది కనపడ్డా ఉంచవు. 'అవే తీసుండాలి. ఉండండి చూస్తాను" అని వెదకటం ఆరంభించింది నాన్సీ- 


పిల్ల దెయ్యాలంటే ఆ ఇంట్లో చిన్నపిల్లలు 

ఉన్నారనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె చెప్పింది నిజంగా పిల్లదెయ్యాలే. ఆ ఇంట్లో వాటి అల్లరీ అంతా ఇంతా కాదు. వీటి గురించి తెలిసినవాళ్ళు ఎవరూ అనుమతి లేకుండా పొరపాటున కూడా ఆ కాంపౌండ్లోకి అడుగుపెట్టరు. నాన్సీ హెచ్చరికతో ఇది ఎవరి పనో స్టీఫెన్ కి అర్ధమైపోయింది.


"ఏయ్ క్రిష్ట, రోసీ... ఎక్కడున్నార్రా?” అంటూ గబగబా మెట్లెక్కి పైఅంతస్తులోకి వెళ్ళాడు.


అతను లోపల అడుగుపెడుతుండగానే దఢాలున ఏదో కిందపడ్డ చప్పుడైంది. వాళ్ళిద్దరూ పైనే ఉన్నారని, పైగా వాళ్ళకి కోపం వచ్చిందని వార్నరికి అర్థమైపోయింది. డ్రాయింగ్రూమ్లోకి వచ్చి చుట్టూ చూశాడు. కార్నర్లోని ఫ్లవర్ వేజ్ కిందపడి ఇంకా దొర్లుతోంది. “మంచి పిల్లలు ఇలా అల్లరి చేయరు. డూ యు నో దట్. కమాన్" అంటూ ఫ్లవర్ వేజ్ తీసి యధాస్థానంలో ఉంచాడు.


“నాకు లైబ్రరీకి వెళ్ళే టైమైంది. మీరిలా నా బ్రీఫ్ కేస్ దాచేస్తే ఎలా పిల్లలూ... ప్లీజ్.... మీరు మంచి అమ్మాయిలని నాకు తెలుసు. కమాన్ ప్లీజ్...” పిలిచాడు.


పక్కగదిలో అలికిడైంది. అతడి బ్రీఫ్ కేస్ గాల్లో తేలుతూ నెమ్మదిగా దగ్గరకొచ్చింది. దాన్ని అందుకుని టేబిల్ మీద ఉంచి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. "మీకెందుకు కోపం వచ్చింది? నాకు తెలియాలి కదా. అంకుల్ తో అబద్ధమాడకూడదు. ఓ.కె? మీరు నాకు కన్పిస్తే సంతోషిస్తాను” అన్నాడు. మరుక్షణం అతని ఎదురుగా పొట్టిగౌన్లు ధరించిన ఇద్దరు అమ్మాయిలు ప్రత్యక్షమయ్యారు. ఒకమ్మాయి వయసు పదేళ్ళు ఉంటుంది. ఎర్రగా, బొద్దుగా, చాలా అందంగా ఉంది. రెండో అమ్మాయి వయసు ఎనిమిదేళ్ళు. చాలా అందంగా ఉంది. పెద్దమ్మాయి పేరు క్రిష్ట. రెండో అమ్మాయి పేరు రోసీ, ముద్దులు మూటగట్టేంత ముచ్చటగా ఉన్న ఆ పాపల్ని చూస్తే వాళ్ళు దెయ్యాలని ఎవరూ అనుకోరు.

📖


సుమారు ముప్ఫై సంవత్సరాల క్రితం మాట. అప్పట్లో ఆ కట్టడం థామ్సన్ షెప్పర్డ్ అనే పెద్దమనిషిది. థామ్సన్ దంపతుల పిల్లలు ఈ క్రిస్టీ, రోసీలు. అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో ఆ దంపతులు యార్క్ షైర్ లో మృతిచెందారు.


అప్పటికి క్రిష్ట వయసు పదేళ్ళు. రోసీ వయసు ఎనిమిదేళ్ళు. యార్క్ షైర్ నుంచి మృతదేహాలు ఇంటికి తీసుకురాబడ్డాయి. తల్లిదండ్రుల భౌతికకాయల్ని చూసి ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. వాళ్ళకి బంధువులంతా వున్నా తాము అనాధలయి పోయినట్టు వారికి అర్థమైంది.


థామ్సన్ కి తమ్ముడు ఒకడున్నాడు. వాడి పేరు డేవిడ్. కర్మకాండలన్నీ ముగిశాక పిల్లలిద్దర్ని తన వద్దకు తీసుకెళ్ళి ఆ ఇంటిని అమ్మేయాలని చూశాడు. వాళ్ళు పారిపోయి వచ్చేసి అదే ఇంట్లో ఆత్మహత్య చేసుకుని మరణించారు.


ఆ విధంగా వారసులు లేని ఆ కట్టడం థామ్సన్ తమ్ముడు డేవిడ్ పరమైంది.


అయితే అసలు సమస్య కూడా అప్పుడే మొదలైంది. మరణించిన పాపలిద్దరూ పిల్ల దెయ్యాలుగా మారి తెగ అల్లరిచేయటం ఆరంభించారు. వీటి గురించి తెలిసిన ఎవరూ ఆ ఇంటిని కొనటానికి ముందుకురాలేదు.


ఆ సమయంలో చవగ్గా వస్తున్న ఆ కట్టడాన్ని స్టీఫెన్ వార్నర్ కొనుక్కున్నాడు. తన పిల్లలు ముగ్గురితో సహా ఆ ఇంట్లో దిగాడు. మొదట్లో అవి వాళ్ళని చాలా భయపెట్టాయి. వండిన పదార్ధాలు పాడుచేసేవి. సీసాలకొద్దీ బీర్ తాగేసేవి. ఒకచోట ఉంచిన వస్తువుల్ని మరో చోట పడేసేవి. అతిధులు వస్తే అదరగొట్టేవి.

వచ్చినవాళ్ళు కూర్చొని వుండగా గ్లాసులు గాల్లో తేలుతూ వారి వద్దకి రావటం సోఫాలు తిరగబడడం, తినే వస్తువులు ఎగిరొచ్చి మీదపడడం లాంటివి కళ్ళముందు జరుగుతుంటే భయపడి పారిపోయారు.


అవి దెయ్యాలని తెలుసుకాబట్టి స్టీఫెన్ వార్నర్ నాన్సీలు క్రమంగా వాటిని బుజ్జగించి మచ్చిక చేసుకుని ప్రేమను పంచి తమ కుటుంబ సభ్యులుగా మార్చేసుకున్నారు. అవి కూడా అంకుల్, ఆంటీ అని పిలుస్తూ వారికూడా తిరగటం ఆరంభించాయి.

🍁

*సశేషం*

*శతపత్ర -11*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



స్టీఫెన్ వార్నర్ దంపతుల పిల్లలు ముగ్గురూ దెయ్యం పాపలతో ఆడుకున్నవాళ్ళే. వాళ్ళ కుక్క సూజీకి కూడా ఆ పిల్ల దెయ్యాలు మంచి దోస్తులు. పిల్లలు, పెద్దాళ్ళయి ఎవరి దారిన వారు వెళ్ళిపోవడంతో స్టీఫెన్ దంపతులకు ఆ పిల్లదెయ్యాలే గారాల బిడ్డలయ్యాయి. అవి అల్లరి చేయకపోతే వీళ్ళకి ఏమీ తోచదు. వాళ్ళు బతికుంటే ఈపాటికి సుమారు నలభైయ్యేళ్ళ వాళ్ళ య్యేవారు. వారు మరణించేనాటికి ఏ వయసులో ఉన్నారో ఇప్పటికీ అలానే చిన్నపిల్లల్లా ఉండిపోయారు.


క్రిష్టి, రోసీలు ఎదురుగా ప్రత్యక్షం కాగానే వాళ్ళని లేపి తన ముందు టేబుల్ మీద కూర్చోబెట్టుకుని ప్రేమగా చూశాడు స్టీఫెన్ వార్నర్.


"ఏమైందిరా మీకు అలక ఎందుకొచ్చింది" అంటూ అడిగాడు ఎంతో లాలనగా.


"సూజీ మాతో ఆడుకోవడం లేదు. దానికి బద్ధకం మరీ ఎక్కువయిపోతోంది. నువ్వు దానికి భయం చెప్పాలి అంకుల్" అంది క్రిష్టి.


“రాత్రి బీర్ తాగామని అంటీ తిట్టింది. అంటీ కి కూడా భయం చెప్పాల్సిందే” అంది మారాంగా రోసీ.


“ఇంతేనా... ఇంకేమన్నా ఉందా?"


"మాకు ఆడుకోడానికి బెలూన్లు తీసుకువస్తా నన్నావు. ఇంతవరకూ తీసుకురాలేదుగా. అందుకే మాకు బాగా కోపం వచ్చింది" అంది క్రిష్టి.


"అదా... సారీ డియర్. నిన్న పని ఒత్తిడి వల్ల మీ బెలూన్ల సంగతి మర్చిపోయాను. ఇవాళ తెస్తాను. ప్రామిస్" భరోసా ఇచ్చాడు స్టీఫెన్ వార్నర్.


“మరి... అంటీకి భయం చెప్పరా... బీరు తాగామని తిట్టిందిగా...” అంది రోసీ.


అంతలో నాన్సీ అక్కడికి వచ్చేసింది.


"ఏమిటే రిపోర్ట్ చేస్తున్నారు? బీర్ తాగితే తిట్టరా?... తెచ్చినవన్నీ మీరే తాగేస్తే ఊరుకోవాలా... మీరిలా చేస్తే ఇంట్లో ఒక్క బీర్ సీసా కూడా లేకుండా చేస్తానంతే. రాను రాను మీ అల్లరి మరీ ఎక్కువైపోతోంది” అనరిచింది.


"చూడు అంకుల్... ఎలా తిడుతుందో... నాకు కోపం వస్తోంది. ఆంటీని మెట్లమీంచి తోసేస్తాను" అంది రోసీ.


"తోస్తావా. వేలెడంత లేవు. నన్ను తోస్తారా, అంకుల్ అండ చూసుకుని మీరిద్దరూ మరీ పెంకిపిల్లల్లా తయారయ్యారు. ఏయ్ రోసీ. ఆగవే" అంటూ ముందుకొచ్చి రోసీని పట్టుకోబోయింది నాన్సీ.


చటుక్కున టేబిల్ పై నుంచి దూకి మూలకెళ్ళింది రోసీ. నాన్సీ వెంట పడ్డంతో గోడవెంట నడుచుకుంటూ పైకెళ్ళి సీలింగ్ నుంచి తల్లకిందులుగా వేలాడుతూ-


“ఆంటీ... రా మరి నన్ను పట్టుకో” అని అరిచింది ఉడికిస్తూ రోసీ, అది చూసి క్రిష్టీ, స్టీఫెన్లు పగలబడి నవ్వారు. నాన్సీ కూడా నవ్వేసింది.


వాళ్ళు కిందికి వచ్చేసరికి వారి కుక్క సూజీ ఆ దెయ్యం పిల్లలతో ఆడుకోడానికి సిద్ధంగా బంతిని తోసుకుంటూ వచ్చింది. దానివైపు వెళ్ళిపోయారు క్రిష్టీ, రోసీలు.


“తిడితే వాళ్ళు మరింత అల్లరి చేస్తారు. తెలుసుగదా వదిలెయ్ డియర్. నాకు టైమైంది. బయలుదేరుతున్నాను” అంటూ తన బ్రీఫ్ కేస్ తో బయటికొచ్చాడు స్టీఫెన్ వార్నర్. అతడి కారు వరకు వచ్చింది సాగనంపటానికి అతని భార్య నాన్సీ.


తన చిన్న ఫోర్డ్ కారు స్టార్ట్ చేశాడు స్టీఫెన్ వార్నర్. కారును బయటకు దూకించాడు. నాన్సీ బై చెప్పింది.


కారు గేటు దాటగానే వెళ్ళి గేటు మూసి వెనుదిరిగింది. అప్పటికే ఆవరణలో కొచ్చేసి బంతితో ఆడుకుంటున్నారు ముసలికుక్క సూజీతోపాటు క్రిష్టీ, రోసీ దెయ్యాలు.


నిజానికి బయటివాళ్ళు చూస్తే బంతితో ఆడుకుంటున్న సూజీ మాత్రమే కన్పిస్తుంది. క్రిష్టీ, రోసీలు కన్పించరు. వాళ్ళు స్టీఫెన్ దంపతులకు మాత్రమే కన్పిస్తారు.

📖


క్వీన్ విక్టోరియా మెమోరియల్ లైబ్రరీ. ఎందరో పాఠకులు లోపల సెక్షన్లలో కూచుని చదువుకుంటున్నారు. చీమ చిటుక్కుమన్నా విన్పించేంత నిశ్శబ్దంగా ఉంది.


ఉదయం సుమారు పదకొండు గంటల ప్రాంతం. లైబ్రరీ చీఫ్ స్టీఫెన్ వార్నర్ ఛాంబర్ డోర్ మీద చిన్నగా అలికిడి అయింది.


ఆ సమయంలో ఏవో లైబ్రరీ ఫైళ్లు చెక్ చేస్తున్నాడు స్టీఫెన్ వార్నర్. యధాలాపంగా ఫైల్ మూసి తలెత్తి డోర్ వంక చూశాడు. “యస్... కమిన్” అన్నాడు. చిన్నగా డోర్ తెరుచుకుని లోపలకొచ్చింది శతపత్ర.


"గుడ్ మార్నింగ్ సర్” అంది మర్యాదపూర్వకంగా.


“యస్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ యంగ్ లేడీ" అడిగాడు స్టీఫెన్ వార్నర్.


"సర్. ఐ వాంట్ సమ్ అమెరికన్ ఇంగ్లీష్ జర్నల్స్. బట్ దట్ సెక్షన్ లైబ్రేరియన్ నాట్ హెల్పింగ్ మి. ప్లీజ్ రికమెండ్ మి...” అని అడిగింది శతపత్ర.


“ఓకె. ఓకె... ఐ అండర్ స్టాండ్ యువర్ ప్రాబ్లం. గో దేర్” అన్నాడు స్టీఫెన్ వార్నర్.


"థాంక్యూ... థాంక్యూ సర్” అని శతపత్ర వెళ్ళిపోడానికి వెనుతిరిగింది.


"మిస్ శతపత్రా" పిలిచాడాయన.


"ఎస్సార్” అంటూ తిరిగి చూసింది.


"రామ్మా... వచ్చి ఇలా కూర్చో. నీతో మాట్లాడాలి” అన్నాడు.


త్రుళ్ళిపడింది శతపత్ర. తన చెవుల్ని నమ్మలేకపోయింది. ఏదో అద్భుతం చూస్తున్నట్టు ఆయన్ని చూస్తూండిపోయింది. ఆయన తెలుగు మాట్లాడుతున్నాడు.


ఒక యూరోపియన్ అచ్చ తెలుగులో మాట్లాడుతున్నాడు. గతంలో తమ సంభాషణంతా ఇంగ్లీష్ లోనే సాగేది. మాట వరసక్కూడా తనకు తెలుగు తెలుసని ఆయన ఎప్పుడూ చెప్పలేదు.


“మరీ ఆశ్చర్యపోతున్నట్టున్నావు" అంటూ మృదువుగా నవ్వాడు స్టీఫెన్ వార్నర్.


"మీ తెలుగుభాషకు మొదటి నిఘంటువు రాసిన బ్రౌన్ దొర మా ఇంగ్లీష్ వాడేనని గుర్తుంటే, ఇలా ఆశ్చర్యపోవు. నాకు తెలిసిన భాషలు పన్నెండైతే, అందులో నాలుగు ఇండియాకు చెందిన భాషలున్నాయి. సంస్కృతం, ఉర్దూ, హిందీ, తెలుగు చదవగలను. మాట్లాడగలను" అన్నాడాయన.


మంత్రముగ్దల్లా వెనుతిరిగి వచ్చి-ఆయన ఎదురుగా సీట్లో కూర్చుంది.


"నమ్మలేకపోతున్నాను సర్. మీరు ఇండియా ఎన్నిసార్లు వెళ్ళారు? అడిగింది.


"వెళ్ళటం ఏమిటమ్మా. నేను పుట్టి, పెరిగింది ఇండియాలోనే. అదీ మీ హైదరాబాద్ లోనే. నమ్మలేకపోతున్నావు కదూ? బ్రిటీష్ వలస పాలన నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత చాలా ఇంగ్లీష్ కుటుంబాలు ఇంగ్లాండ్ కి తిరిగి రాకుండా అక్కడే నివాసం ఉండిపోయాయి. వాళ్ళని ఆంగ్లోఇండియన్స్ అంటున్నాం. అలాంటి కుటుంబాల్లో మాదీ ఒకటి. మీకు స్వాతంత్య్రం వచ్చినప్పుడే నేను పుట్టాను. అప్పట్లో మేం హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. నా బాల్యం, చదువు అంతా హైదరాబాద్ లోనే గడిచింది.


నా ఇరవయ్యో ఏటకే ఇంగ్లీష్ తోపాటు సంస్కృతం, హిందీ, ఉర్దూ, తెలుగు అభ్యసించాను. చిన్నప్పట్నుంచి నాకు భాషలంటే చాలా అభిమానం. నా ఇరవై రెండో సంవత్సరం మా డాడీ పోయాక, మమ్మీ నేను తిరిగి ఇంగ్లాండ్ వచ్చేశాం. ఇక్కడికొచ్చాక ఫ్రెంచి, ఇటలీ, రష్యా, జర్మనీ ఇలా మరో ఎనిమిది భాషలు నేర్చుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ మా అమ్మకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాను.


నా ముప్ఫయ్యో ఏట ఈ లైబ్రరీలో ఒక సెక్షన్ కి లైబ్రేరియన్ గా ఉద్యోగం సంపాదించు కున్నాను. తర్వాత అనారోగ్యంతో మమ్మీ పోయింది. మరుసటి సంవత్సరం నాన్సీ అనే డచ్చి యువతితో లవ్ మేరేజ్ జరిగింది.


ఇండియాలో పుట్టి, పెరిగిన మూలంగా కావచ్చు వివాహవ్యవస్థ మీద నాకు ఎంతో గౌరవం. అందుకే ఇప్పటికీ నాన్సీ నేనూ హ్యాపీగా ఉన్నాం. భాషలమీద నాకున్న పట్టు, అనేక భాషలు తెలిసి వుండటం, విధి నిర్వహణలో నాకున్న ఏకాగ్రత- ఇవే నన్ను ఈ కుర్చీలో కూర్చోబెట్టాయి. సో... తెలుగు నేలమీద పుట్టి, పెరిగిన నాకు తెలుగన్నా, తెలుగువాళ్ళన్నా ప్రత్యేక అభిమానం.


మా ఫ్యామిలీతో కలిసి ప్రపంచంలో అనేక ప్రదేశాలు చూశాం. కాని ఎక్కువసార్లు వచ్చింది ఇండియాకే. ఇప్పటికీ మా తల్లి తరపు బంధువులు ఇండియాలోనే వున్నారు" అంటూ ఆయన వివరిస్తుంటే చాలా ఆశ్చర్యానికి గురైంది శతపత్ర. ఏం చెప్పాలో, ఎలా అభినందించాలో కూడా అర్ధంకాలేదు అమెకు. 


"మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగానూ, ఆనందంగానూ ఉంది సర్" అంది ఉత్సాహంగా.


"థాంక్యూ మై చైల్డ్ నౌ కమ్ టు ది పాయింట్. మూడు మాసాలుగా నిన్ను చూస్తున్నాను. సెలవురోజు తప్ప నిత్యం నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్నో పుస్తకాలు చదువుతున్నావు. దేని గురించో తెలుసుకోవచ్చా?" అడిగాడు వార్నర్.


"ప్రత్యేకించి కారణం లేదు. జస్ట్ ఇంట్రెస్ట్. అంతే” అంది శతపత్ర నవ్వుతూ.


"నోనో... నా వద్ద దాచాల్సిన పనిలేదు. యూ నీడ్ సమ్ ఇన్ఫర్మేషన్. దానికోసం లైబ్రరీలో అన్వేషిస్తున్నావు. యామై రైట్' ఆయన సూటిగా అడిగేసరికి మొదట కొంత సంకోచించింది. తర్వాత అవునన్నట్టు తలూపింది.


“దెన్... నా అంచనా కరెక్ట్. ఇప్పుడు నీక్కావలసిన ఇన్ఫర్మేషన్ ఏమిటని నేనడగను. ఎందుకంటే నీ డౌట్స్ తీర్చడానికో మనం ఫ్రీగా మాట్లాడుకోడానికో ఇది చోటు కాదు. లైబ్రరీ రూల్స్ ని మనం పాటించాలి గదా. ఓ పని చెయ్యి. రేపు హాలిడే. లైబ్రరీ ఉండదు. నేను మా ఇంటి దగ్గర ఫ్రీగానే ఉంటాను. మా ఆవిడ నాన్సీ నిన్ను చూస్తే చాలా సంతోషిస్తుంది. రేపు ఉదయం తొమ్మిది గంటలకి మా ఇంటికి రా” అంటూ తన విజిటింగ్ కార్డు శతపత్రకి అందించాడు.


"థాంక్యూ సర్” అంది కృతజ్ఞతగా శతపత్ర.


"సో... రేపు వస్తున్నావుగా?” అన్నాడు.


"తప్పకుండా వస్తాను సర్. నాకు మీ హెల్ప్ కావాలి”


“ష్యూర్... రేపు మార్నింగ్ నీ లంచ్ మా ఇంట్లోనే... బైదిబై శతపత్రా ఒక ముఖ్య విషయం. తెలిసిన వాళ్ళెవరూ మా ఇంటికి రావాలంటే భయపడతారు. మరేం లేదు. మా ఇంట్లో చాలాకాలంగా రెండు దెయ్యం పిల్లలున్నాయి..." అన్నాడు స్టీఫెన్ వార్నర్.


"దెయ్యం పిల్లలా..." అంది నవ్వేస్తూ శతపత్ర.


ఆయన 'ఆశ్చర్యంగా చూశాడు.


"నీకు దెయ్యాలంటే భయంలేదుగదా?” అడిగాడు.


"లేదు సర్” అంది నవ్వాపుకుంటూ.


“దెన్ ఇట్స్ ఓకె.”


శతపత్రకి దెయ్యాలనగానే విశ్వదా ప్లాట్ వద్ద సిక్కు కుటుంబం ప్లాట్ లో పూర్ణిమా దయ్యం గుర్తుకొచ్చింది. అదేమిటో గాని పెద్ద దెయ్యమే తనని చూసి పారిపోయింది. ఇక ఈ పిల్ల దెయ్యాలెంత అన్పించింది.


"అవి భయపెడతాయా సార్?" అడిగింది.


“మేం ఇల్లు కొన్నప్పటికే అవిఅక్కడున్నాయి. ఎనిమిది, పదేళ్ళ ఆడపిల్లలు వాళ్ళు. అప్పటికీ, ఇప్పటికీ అదే వయసు వాళ్ళది. మేం వాటికి అలవాటు పడిపోయాం. తెగ అల్లరి చేస్తాయి. కొత్తవాళ్ళు వస్తే వాళ్ళని భయపెట్టాలని చూస్తాయి. కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. మేం వుంటాం గదా. నువ్వు తప్పకుండా రావాలి" వివరించాడు స్టీఫెన్ వార్నర్.


"ష్యూర్ సర్. ఆ పిల్లదెయ్యాల్ని చూడడాని కైనా వస్తాను. థాంక్యూ సర్. వస్తాను" అంటూ లేచి బయటికి వెళ్ళిపోయింది శతపత్ర. ఆమె చెప్పిన లైబ్రేరియన్ కి ఫోన్ చేయటానికి తన ముందున్న టెలిఫోన్ సెట్ ని దగ్గరకు లాక్కున్నాడు లైబ్రరీ చీఫ్ స్టీఫెన్ వార్నర్.

🍁

*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*కథల ప్రపంచం* 

***

13/02, 11:43 am] . Mallapragada: *శతపత్ర -12*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



మరుసటి రోజు ఉదయం-


సరిగ్గా తొమ్మిది గంటలవేళ- శతపత్ర ఎలక్ట్రిక్ స్కూటీ స్టీఫెన్ వార్నర్ కాంపౌండ్ గేట్ ముందు ఆగింది. పెద్ద కెనాల్ సైడ్ కాలనీ అది.


ఎగువన బ్రిడ్జి దాటి వస్తున్నప్పుడే ఆ ప్రాంతాన్ని పరికించింది శతపత్ర. ఎవరో చిత్రకారుడు గీసిన అందమైన స్కెచ్ లా ఉందా కాలనీ. చక్కని పనితనంతో కూడిన పాతకాలం కట్టడాలతోపాటు అధునాతన భవనాలు కలగలసి వున్నాయక్కడ.


ప్రశాంతమైన వాతావరణం, ఎటు చూసినా పచ్చదనం, తెల్లగా పెద్ద పెద్ద వెన్నముద్దలు నీటిమీద తేలుతున్నట్టు కాలువలో విహరిస్తున్నాయి పెద్ద సైజు తెల్లబాతులు. కొందరు బోటింగ్ చేస్తున్నారు.


కాలువ వెంట ఉన్న ప్రతి ఇంటి పెరడువైపున బోట్లు వున్నాయి. ఆ కాలువలోకి మరబోట్ల కు అనుమతి లేదు. తెడ్లు ఉపయోగించే బోట్లే తిరగొచ్చు.


స్కూటీ సైడ్ స్టాండ్ వేసింది శతపత్ర.


గేటు తెరవబోతూ యథాలాపంగా లోపలకు చూసింది. లోపల నుంచి చిన్నపిల్లల నవ్వులు, కేరింతలు విన్పించటమే అందుక్కారణం. అలా లోపలకు చూసిన శతపత్రకు ఒక అద్భుత దృశ్యం కన్పించింది.


లోపల లాన్ మీద భూతంలా వున్న ఒక నల్లకుక్క ఫుట్ బాల్ సైజులోని ఎర్రటి బంతి కోసం అటూ ఇటూ పరుగులు తీస్తోంది. ఆ బంతి కాస్సేపు నేలమీద దొర్లుతోంది. వెంటనే గాల్లోకి లేస్తోంది. తానుగా అంత దూరం ఎగురుతోంది బంతి. అక్కడ ఎవరో ఉండి పట్టుకున్నట్టుగా గాల్లో నిలబడుతోంది బంతి. అటునుంచి రెండోవైపు ఎగురుతోంది.


ఆ బంతి వెంట పరుగు తీస్తోంది కుక్క. ఆడుకుంటున్న చిన్నపిల్లల నవ్వులైతే విన్పిస్తున్నాయిగాని. అలాంటి వాళ్ళెవరూ అక్కడ కన్పించటంలేదు.


ఆ బ్లాక్ డాగ్ స్టీఫెన్ వార్నర్ గారి కుక్క సూజీ అని, దెయ్యం పిల్లలని ఆయన చెప్పిన పిల్ల దెయ్యాలు ఆ కుక్కతో కలిసి బంతాట ఆడుతున్నాయని శతపత్ర గ్రహించింది. కానీ భయపడలేదామె. గేటు తీసి స్కూటీని లోపలకు తెచ్చి తిరిగి గేటు మూసింది.


స్కూటీ ఎక్కి అంతదూరంలోని ఇంటివైపు పోనిచ్చింది. మరోపక్క ఆ కుక్కను, బంతిని గమనిస్తూనే వుందామె.


సమీపంలోకి రాగానే పిల్లల ఆర్తనాదాలు విన్పించాయి. పిల్ల దెయ్యాలైన, క్రిస్టీ, రోసీలు శతపత్రను చూసి ఆట ఆపేశాయి. ఆమె సమీపంలోకి రాగానే అవి తట్టుకోలేక పెద్దగా అరుస్తూ బంతి పారేసి ఇంట్లోకి పారిపోయాయి. కుక్క సూజీ కూడా పెద్దగా మొరుగుతూ శతపత్ర స్కూటీ వెంటపడింది.


శతపత్ర పోర్టికోలో స్కూటీ దిగి వెనుతిరిగి కుక్కవంక చూసింది. ఆశ్చర్యం, అద్భుతం. మీదకు దూకేంత ఫోర్స్ తో వస్తున్న ఆ కుక్క ఒక్కసారిగా ఆగిపోయింది. పది సెకన్లు శతపత్ర కళ్ళలోకి చూసింది. అంతే. ఒక మానవాతీతశక్తిని చూసిన విధంగా ఎంతో వినయంగా నేలబారుకు సాగిలపడి తలదించుకుంది.


శతపత్ర దగ్గరకెళ్ళి దాని తల నిమిరింది. "గుడ్ బోయ్. గో... గో బ్యాక్" అంది.


ఆమె మాటల్ని ఆర్డర్ గా భావించినట్టు సూజీ చివ్వున లేచి తన డాగ్ హౌస్ వైపు పారిపోయింది. అంతలో స్టీఫెన్ వార్నర్ బయటికొచ్చాడు-

“రామ్మా ఎంతసేపైంది వచ్చి?” అంటూ ఆప్యాయంగా పలకరించాడు. 


"ఇప్పుడే వచ్చాను సర్. మీ డాగ్ సూజీ చాలా బాగుంది” అంది శతపత్ర.


"అది కొత్తవాళ్ళని చూస్తే పెద్దగా అరుస్తుంది. నిన్ను చూసి ఏమీ గొడవచేయలేదా?" ఆశ్చర్యంగా అడిగాడాయన.


"లేదు సర్. నన్ను పలకరించి తన డాగ్ హౌస్ కి వెళ్ళిపోయింది” అంది నవ్వుతూ శతపత్ర.


“విచిత్రంగా ఉంది. నీ దగ్గర ఏదో విశేషం ఉందమ్మా. సాధారణంగా మా సూజీ ఎవరినీ వదలదు. కమాన్...” అన్నాడు స్టీఫెన్.


ఇద్దరూ హాల్లోకి వచ్చారు. సరిగ్గా అప్పుడే కంగారుగా వచ్చింది నాన్సీ.


"ఏమైంది? పిల్లలిద్దరూ పారిపోయి పెరట్లో దాక్కున్నారు. ఆంటీ ఆమెను పంపించెయ్ అని అరుస్తున్నారు. నాకు ఏమీ అర్థం కావటంలేదు. ఎవరు ఈ అమ్మాయి?" అడిగింది శతపత్రను చూస్తూ.


“క్రిష్ట, రోసీలు ఎక్కడ?” స్టీఫెన్ అడిగాడు భార్యని.


"నేను వాళ్ళ గురించే చెప్తున్నాను. పెరట్లో కాలవవైపు దూరంగా పారిపోయారువాళ్ళు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదు” మళ్ళీ అంది నాన్సీ.


అప్పుడు కల్పించుకుని- “ఆంటీ, నా పేరు శతపత్ర. సార్ కి శిష్యురాలిని. మీ క్రిష్ట, రోసీలు నన్ను చూసే భయపడి దూరంగా పారిపోయారు. నేను వెళితే కాని వాళ్ళు రారు" అంది. 


శతపత్రవైపు ఆశ్చర్యంగా చూసింది నాన్సీ.


"ఇట్స్ క్రేజీ. లోకంలో దెయ్యాల్ని చూసి మనుషులు భయపడతారు. దెయ్యాలు మనుషుల్ని చూసి భయపడ్డం ఏమిటి?” అంది నమ్మలేనట్టు.


"రాత్రి తాగిన బీరు కిక్కు దిగలేదేమో. వెళ్ళి పిలుచుకు రా...” అన్నాడు స్టీఫెన్ వార్నర్.


“నాకు తెలుసు సార్... నేను వెళ్ళిన తరువాత గాని అవి తిరిగి రావు" అంది శతపత్ర.


“ఓ మైగాడ్. అరచేతిలో గరుడరేఖ ఉన్నవాళ్ళను చూస్తే పాములు భయపడి పారిపోతాయని, పట్టుకున్నా ఏమీ చేయవని ఇండియాలో ఉండగా విన్నాను. నీ అరచేతి లో అలా ఏదన్నా రేఖగాని ఉందా ఏమిటి? ఈ కొంటె దెయ్యాలు నిన్ను చూసి అలా పారిపోవడం నాకు అర్థంకావడం లేదు" సీఫెన్ మరింతగా ఆశ్చర్యపోయాడు.


“నాకూ అర్థం కాలేదు సార్. కాని, ఒకటి రెండు అనుభవాలు అయిన తర్వాత అర్థమైంది ఎందుకో నేనంటే దెయ్యాలు భయపడతాయని" అంది శతపత్ర.


"నమ్మలేకపోతున్నాను. గత ముప్పై సంవత్సరాల కాలంలో క్రిస్టీ, రోసీలు ఇలా పారిపోవటం ఇదే మొదటిసారి. ఈ అమ్మాయికి మంత్రతంత్రా లేమన్నా తెలుసా?" అంది ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ నాన్సీ.


“సారీ ఆంటీ... నేను మంత్రగత్తెను కాను. ఎలాంటి మంత్రాలు నాకు తెలీదు. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా నాకు తెలీదు" అంది నవ్వుతూ శతపత్ర.


భార్యకి శతపత్రని పరిచయం చేశాడు స్టీఫెన్ వార్నర్. నాన్సీ మంచితనం, ఆదరణ శతపత్రకు నచ్చాయి. స్టీఫెన్ వార్నర్ లాగే నాన్సీకి కూడా ఇండియన్స్ అంటే ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉన్నాయి. మంచితనానికి మారు పేరైన ఆ ఆదర్శ దంపతులతో కలిసి భోజనం చేయటం అదృష్టంగా భావించింది శతపత్ర.


తరువాత స్టీఫెన్ వార్నర్, శతపత్రలు మేడమీది డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు.


నాన్సీ ఉన్నంతసేపు వారి సంభాషణ ఇంగ్లీష్ లో సాగింది. ఇప్పుడు తెలుగులో మాట్లాడుకోనారంభించారు.

📖


"నువ్విక్కడికి రావటం వలన నాకో కొత్త విషయం తెలిసిందమ్మా. దెయ్యాలకు నువ్వు శత్రువని” అంటూ నవ్వాడు స్టీఫెన్ వార్నర్.


శతపత్ర చిన్నగా నవ్వి ఊరుకుంది.


"ఒకటి కాదు రెండు కాదు. సుమారు మూడు మాసాలుగా లైబ్రరీలో కొనసాగుతోంది నీ అన్వేషణ దేనికోసం?" అంటూ సూటిగా అసలు విషయం లోకి వచ్చేశాడాయన. ఒకింత ఆలోచించింది శతపత్ర.


వెంటనే తన సమస్య చెప్పటం ఆమెకిష్టం లేదు. విన్నాక ఆయన ఎలా స్పందిస్తాడో తెలీదు. విని తేలిగ్గా కొట్టిపారేస్తే తనకే ప్రయోజనం ఉండదు. “సార్! మీకెప్పుడైనా కలలు వస్తుంటాయా?" అడిగింది.


“నాకూ కలలు వస్తుంటాయి. నాకే కాదు. కలగనని మనిషంటూ భూమ్మీద ఎవడూ ఉండడు. యూనొ... ఈ మధ్య పరిశోధనల్లో మనుషులకేకాదు ఏనుగులు, గుర్రాలు, చింపాంజీలవంటి జంతువులు కూడా కలల కంటాయని రుజువైంది" బదులిచ్చాడు.


"కలల మీద మీ అభిప్రాయం ఏమిటి?" అని వెంటనే అడిగింది శతపత్ర.


"అవి వస్తుంటాయి. పోతుంటాయి. వెరీ కామన్... వాటికి నీ సమస్యకీ సంబంధం ఏమిటి?” 


"సంబంధం ఉంది సార్. మీకొచ్చిన కలలు ఎప్పుడైనా నిజమయ్యాయా?" అడిగింది శతపత్ర.


"నీకో సంగతి తెలుసా? రాత్రి వచ్చిన కలని తెల్లవారేసరికి మర్చిపోతాన్నేను. ఇక నిజమయిందో లేదో ఎలా తెలుస్తుంది?" అన్నాడు స్టీఫెన్.


"నిజమవుతాయంటారా? మీ అనుభవంలో అలాంటి సంఘటన ఏదీ జరగలేదన్నారు సరే. మీ అభిప్రాయం ఏమిటి? కలలు నిజమయ్యే అవకాశం ఉందా?"


“నువ్వింత సీరియస్ గా అడుగుతున్నావు కాబట్టి నేను నా అభిప్రాయం చెప్తాను. నిజం వేరు. అనుభవం వేరు. చాలామంది తమ అనుభవానికి వస్తేనే ఏదయినా నిజమని నమ్ముతారు. ఉదాహరణకి చాలామంది దెయ్యాలు లేవని, ఉంటే చూపించమని మొండిగా వాదిస్తారు. మొదట్లో నేనూ నమ్మేవాడిని కాదు.


దెయ్యాలు నిజం కాదు. కేవలం భ్రాంతి, అదంతా అబద్ధం అనుకునేవాణ్ణి. కాని ఇప్పుడు? ముప్పయ్యేళ్ళ క్రితం ఈ ఇల్లు కొన్నప్పుడు ఇక్కడ ఉన్న చిలిపిపిల్ల దెయ్యాలు క్రిప్ట్, రోసీతో పరిచయం. ఇప్పటికీ మేము వాటితోనే సహజీవనం చేస్తున్నాం.


ఇంకా పది సంవత్సరాల తర్వాతగాని తమకి ముక్తి కలగదని ఓసారి క్రిష్టి నాతో చెప్పింది. ఏం చెప్పగలం... అప్పటివరకు మేము ఉండాలిగా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కలలు నిజమవుతాయా అంటే నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మనివాళ్ళు ఉన్నారు. అలాగని కలలన్నీ కూడా నిజం కావు. ఈ కలలమీద ఒక ప్రత్యేక శాస్త్రమే ఉంది.


కలలు రావటానికి అనేక కారణాలు చెప్తారు. సాధారణంగా మనం పగలు చూసిన దృశ్యాలు, సంఘటనలు వాటిలో మన మనసుకు బాగా హత్తుకున్నవి నిద్రలో మనకు కలగా వస్తాయంటారు. అలాగే తీరని కోరిక కూడా కలగా వచ్చే అవకాశం ఉందంటారు. ఉదాహరణకి ఒక మనిషికి విమానంలో ప్రయాణం చేయాలని సరదా అనుకుందాం. ఏవో కారణాలచేత అతని కోరిక తీరలేదు. ఆకాశంలో విమానం వెళుతుంటే ఆశగా చూస్తుంటాడు. అతనికి రాత్రిళ్ళు విమానంలో ప్రయాణం చేస్తున్నట్టు కలవస్తుంది. అంటే మనం మెలకువగా ఉన్నప్పుడు తీరని కోరికలు ఏవైతే  ఉంటాయో అవి కలల రూపంలో తీరుతుంటాయన్న మాట.


అలాగే నిద్ర సమయంలో ఉండే మన మానసిక స్థితిని బట్టి ఆ కలయొక్క నిడివి ఆధారపడి వుంటుంది. ఒక్కోసారి అనేక సంఘటనల సమాహారంగా ఒకే కల తెల్లవార్లూ రావచ్చు. ఆ కలలు చిత్రవిచిత్రం గా రకరకాల మలుపులు తిరుగుతాయి.


ఇక కలలు నిజమవుతాయా అంటే, ఎక్కడో నూటికో కోటికో కొందరి కలలు మాత్రమే నిజమయ్యే అవకాశం ఉంది. కొన్ని కలలు వెంటనే జరగొచ్చు. కొన్ని ఆలస్యంగా జరగొచ్చు” వివరించాడు స్టీపెన్ వార్నర్.


అప్పటికీ శతపత్ర సమాధానపడలేదు.


"అర్థమైంది సర్. కానీ... ఒకే కల తిరిగి తిరిగి వస్తుంటే ఏమను కోవాలి?" అంది శతపత్ర,


నమ్మలేనట్టు చూశాడు స్టీఫెన్ వార్నర్.


"అలా వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ అలా వస్తోందీ అంటే ఆ కల తాలూకు ఆబ్జెక్ట్ ఏదో నిన్ను బాగా ఆకర్షించి ఉండాలి" అన్నాడు.


"ఆబ్జెక్ట్ కాదు సర్. నేను పుట్టి పెరిగాక ఎన్నడూ చూడని ఒక ఒంటరి ప్రదేశం అది" చెప్పింది.


"అర్ధం కాలేదు. ఎటువంటి ప్రదేశం అది?" స్టీఫెన్ లో ఉత్కంఠ తొంగిచూసింది. అందుకే వెంటనే అడిగాడు. ఆయనతో తన సమస్య చర్చించటానికే నిశ్చయించుకుంది శతపత్ర. గట్టిగా గొంతు సవరించుకుని ఆయనవంక చూసింది. 


"సార్. అదో విచిత్రమైన కల. ఇంతవరకూ ఎవరికీ చెప్పలేదు. మీరే ఫస్ట్ పర్సన్” అంది.


“ఫరవాలేదమ్మా చెప్పు. నాకు విషయం తెలియకుండా నీకు సాయపడలేను కదా" అని ప్రోత్సహించాడు స్టీఫెన్ వార్నర్.

🍁

*సశేషం*

[13/02, 7:11 pm] . Mallapragada: *శతపత్ర -13*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



“సుమారు పదిమాసాల క్రితం మొదటిసారి గా ఈ కల వచ్చింది-సాయంకాల సమయం లో మూడు కొండ శిఖరాల మధ్య ప్రాంతంలో ఒంటరిగా నిలబడి వున్నాను. ఎదురుగా పెద్ద లోయ. ఇదే సార్ ఆ కల" అంది.


"ఆ ప్రాంతాన్ని ఎప్పుడన్నా చూశావేమో. ఆలోచించావా?” అని అడిగాడు స్టీఫెన్ వార్నర్.


"లేదు. ఎప్పుడూ చూళ్ళేదు.”


"తిరిగి తిరిగి ఆ ప్రదేశమే కల్లోకి వస్తోందా?"


"అవును.”


"కొంచెం కూడా ఛేంజ్ లేదా?”


"ఉంది. నెలకి కనీసం రెండుసార్లయినా ఆ ప్రదేశం కల్లో కన్పిస్తోంది. మొదట్లో వచ్చిన కలల్లో ఆ ప్రదేశంలో నేను నిలబడి చూసేదాన్ని. ఆ తరువాత లోయలోకి నడుస్తున్నట్టు. ఏవో శక్తులు నన్ను అడ్డుకుంటున్నట్టు కల వస్తోంది. రాత్రి మూడు గంటల ప్రాంతంలో కూడా ఇదే కల" చెప్పింది శతపత్ర.


"వెరీ ఇంట్రెస్టింగ్.. అండ్ ఆల్ సో అన్ బిలీవ బుల్. మరి నీ కలకు, లైబ్రరీలో అన్వేషించ టానికి సంబంధం?”


“నాకెందుకో ఆ ప్రదేశం ఒక అన్ సాల్వడ్ మిస్టరీస్ లాంటి ప్రాంతమై వుంటుందని అనుమానం. జస్ట్ లైక్.. బర్ముడా ట్రయాంగిల్ ఈజిప్టు పిరమిడ్స్... ఇలా ఖచ్చితంగా ఎవరికీ అంతుచిక్కని ఒక విచిత్రమైన ప్రదేశం అయి వుంటుందని ఊహించాను.

ఆ కోణంలోనే ప్రపంచవ్యాప్తంగా అటువంటి ప్రదేశాలకు సంబంధించిన సమాచారం కోసం రోజూ లైబ్రరీలో కూర్చుని అన్వేషిస్తున్నాను.”


"నీ అంచనా సరైందే కావచ్చు. ఇందులో మరో విశేషం కూడా ఉంది. గమనించావో లేదో... నిన్ను చూసి దెయ్యాలు ఇలా పారిపోవడానికి, నీకు కల్లో కన్పిస్తున్న ప్రదేశానికి ఏదన్నా సంబంధం వుందేమో?”


ఆయన మాటలు వింటూ వులిక్కిపడింది శతపత్ర.


"ఉండొచ్చు. ఉండకపోవచ్చు. ఖచ్చితమైన ఆధారం లేదు కదా?” అంది శతపత్ర. 


"అదీ కరెక్టే. అయినా ఏదో కల అని పట్టించు కోకుండా వదిలేయొచ్చు కదా. దీనిమీద ఎందుకు నీకు ఇంత ఇంట్రస్ట్?" అడిగాడు ఆయన.


“నన్ను బాగా డిస్ట్రబ్ చేస్తోంది సార్. నేను కాబట్టి గాని, అదే కల ఇంకెవరికన్నా వస్తే ఖచ్చితంగా భయపడతారు. అది అంత భీతావహంగా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడో ఉండే ఉంటుంది. అది తెలుసుకునే ప్రయత్నవే నాది” అంది శతపత్ర.


“తెలుసుకుని ఏం చేస్తావు?” నవ్వుతూ అడిగాడు.


“వెళ్తాను” వెంటనే బదులిచ్చింది. శతపత్ర.


ఉద్వేగంతో చూశాడాయన.


“ఖచ్చితంగా వెళ్తాను సర్. ఆ ప్రదేశం- కేవలం నాకే ఎందుకు కలలో కన్పిస్తోందో తెలియాలంటే నేను అక్కడికి వెళ్ళాలి కదా" అంది శతపత్ర. ఆమె పట్టుదలకు మెచ్చుకో లుగా చూశాడు స్టీఫెన్ వార్నర్. 


“ఆ కల నిన్నెంతగా డిస్టర్బ్ చేస్తోందో అర్థమైందమ్మా. బహుశా అది నీ గత జన్మ

తాలూకు ముఖ్యఘట్టం జరిగిన ప్రదేశం కావచ్చు. లేదా నీ భవిష్యత్తు మీద మంచో చెడో ప్రభావం చూపించే ప్రాంతం కావచ్చు. కాని ఆ ప్రదేశాన్ని కనిపెట్టడం అంత సులువు కాకపోవచ్చు” అన్నాడు.


“అయినా తప్పదు సర్. కనిపెట్టాలి” అంది.


స్థిరంగా, ఒక్కక్షణం ఆలోచించాడు స్టీఫెన్ వార్నర్.


“చూడమ్మా. నీ ప్రయత్నాన్ని ఆపటమో, హెచ్చరించటమో నా ఉద్దేశం కాదుగాని, నువ్వు కల్లో చూస్తున్న లోయ ప్రాంతానికి చెందిన ఏదో ఒక బలీయమైన శక్తి నిన్ను ఆకర్షిస్తోందని అనుమానంగా ఉంది. నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది" అన్నాడు సీరియస్.


“శక్తులు ఆకర్షిస్తాయా?” ఆశ్చర్యంగా అడిగింది.


"కాదని అనుకుంటున్నావా? పిరమిడ్స్ గురించి తెలుసన్నావుగా?" అన్నాడు స్టీఫెన్ వార్నర్.


“కొంతమాత్రమే తెలుసు...”


“మమ్మీల గురించి కూడా తెలుసా?”


"తెలుసు సర్. ఆ కాలంలో, అంటే ఈజిప్టును పరిపాలించిన ఫారో చక్రవర్తుల కాలంలో చనిపోయిన వాళ్ళ భౌతిక శరీరం పాడవకుండా శవాలకు ఏవో లేపనాలు, పూతలు పూసేవారు. ఆ తరువాత ఒక ద్రవాన్ని ఉడికించేవారు. అందులో ఒక చెట్టు బెరడును ముంచి శవానికి చుట్టి మమ్మీగా తయారుచేసి శవపేటికలో ఉంచి పాతిపెట్టే వారు.


ఒక్కోసారి క్రూరమయిన నేరస్తులను బతికి వుండగానే మమ్మీలుగా మార్చే శిక్ష విధించేవారు. ఈ కార్యక్రమంలో వారి మత పెద్దలు శిష్యులు ప్రధానపాత్ర వహించేవారు.  

మరణించిన ఫారో చక్రవర్తుల శవాల్ని కూడా మమ్మీలుగా చేసి పిరమిడ్స్ లో ఆభరణాల మధ్య భద్రపరిచేవారు.


మరణానంతర జీవితాన్ని ఈజిప్టియన్లు నమ్మేవారు. మమ్మీగా మార్చ బడినవారు భవిష్యత్తులో ఎప్పుడో తిరిగి ప్రాణంతో లేస్తారని భావించేవారు. చక్రవర్తులు, ధనవంతులైనవారు చనిపోయినప్పుడు వారి విలువైన వస్తువులు, బతికున్న భార్యలు, నౌకర్లు, పెంపుడు జంతువులను కూడా మమ్మీలతోపాటు ఆ పిరమిడ్స్ లోను సమాధులలోనూ ఉంచేవారు. కొద్దిరోజులకు అలా ఉంచిన వారు కూడా మరణించేవారు. పిరమిడ్స్ లో రాజుగారి మమ్మీతో పాటు రథాలు, సింహాసనం, విలువైన సంపద కూడా బయటపడిన సందర్భాలున్నాయి...” అంటూ తనకు తెలిసిన విషయాల్ని చెప్పుకొచ్చింది శతపత్ర.


"పిరమిడ్స్ గురించి ఒక చారిత్రకాంశంగా మాత్రమే 'నీకు తెలుసు. వాటి వెనకవున్న ఈవిల్ పవర్స్ గురించి నీకు తెలీదు. తమ పూర్వీకులు ఏ ఉద్దేశంతో తమను మమ్మీగా మార్చారో ఆ ఉద్దేశానికీ, తమ ఉనికికీ భంగం కల్గించేవారిని అవి క్షమించవు.”


"అంటే మరణించిన ఆ శరీరం తాలూకు ఆత్మ ఆ మమ్మీని ఎప్పటికీ ఆవహించే ఉంటుందంటారా?" అని ఆసక్తిగా అడిగింది శతపత్ర.


“ష్యూర్. ప్రాచీన ఈజిప్టియన్లు దైవభక్తి గలవారు. మంత్రతంత్రాలు తెలిసినవారు. వైద్యశాస్త్రంలో నిష్ణాతులు, కెమికల్స్ తయారుచేయటంలో సిద్ధహస్తులు. మమ్మీగా మార్చిన శవాలు ఈనాటికీ పాడవకుండా ఈరోజే మరణించినంతగా ఉంటున్నాయంటే దానికి ఆ కాలం వారు ఉపయోగించిన కెమికల్సే కారణం. వాటిని ఎలా తయారుచేసేవారో ఈరోజు ఎవరికీ అర్థంకాదు. ఇండియాలో ఢిల్లీలోని తుప్పు పట్టని ఇనుపస్తంభాన్ని ఎలా తయారు చేశారో తెలియనట్టే ఈజిప్షియన్లు మమ్మీలు గా మార్చే కెమికల్స్ కూడా ఎవరికీ తెలీదు.”


"మమ్మీలకు ఈవిల్' పవర్స్ ఉంటాయా?"


"ఉంటాయి. అలాగని అకారణంగా అవి ఎవరికీ అపకారం చేయవు. లాప్టార్ లో డగ్లస్ అనే ధనవంతుడైన యువకుడు ఉండేవాడు. ఇది పందొమ్మిదివందల పది ప్రాంతంలో జరిగిన యధార్థగాధ.


అతను ఓసారి లండన్ వచ్చినప్పుడు జాతకం చెప్పటంలో సుప్రసిద్ధుడైన ఒక జ్యోతిష్కుడికి తన చేయి చూపి జాతకం చెప్పమన్నాడు. ఆయన చెప్పిన జాతకానికి తిరుగుండదు. ఆయన డగ్లస్ చేతిరేఖలను చూసి చాలాసేవు ఆలోచించి ఫలితాలు చెప్పాడు. ముఖ్యంగా మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. ఆయుధాలతో జాగ్రత్తగా వుండాలి. లేకపోతే ఎడంచేయి లేకుండా పోయే ప్రమాదం ఉంది. లాటరీల్లో ఎప్పుడూ పాల్గొన వద్దు. అలాగే బహుమతిగా వచ్చిన వస్తువుల్ని తాకొద్దు.


ఆయన చెప్పిన ఫలితాలు విని డగ్లస్ మండిపడ్డాడు.


"ఇదీ ఒక జాతకమేనా... నేను ధనవంతుణ్ణి. నా చేయిపోవడం ఏమిటి? లాటరీలతో నాకేమి పని? నోటికొచ్చింది చెప్తావా?" అంటూ జ్యోతిష్కుని మీద అరిచాడు.


"నుదుటి రాతను తప్పించలేరు. వెళ్ళిరా నాయనా..." అన్నాడా జ్యోతిష్కుడు.


ఇది జరిగిన ఆరుమాసాల తర్వాత డగ్లస్ ఫ్రెండ్స్ ఇద్దరు కైరో నగరానికి హాలిడేస్ ట్రిప్ వెళుతూ డగ్లస్ ని కూడా రమ్మన్నారు. ముగ్గురూ కైరో చేరుకున్నారు. హ్యాపీగా టూర్ చేశారు. డెజర్ట్ చూశారు. పిరమిడ్స్ చూశారు. కైరో నగర అందాలు చూశారు.


కైరోలో ఒకచోట ఒక మమ్మీని కొందరు అమ్మకానికి పెట్టారు. ఈజిప్టు సందర్శించిన గుర్తుగా ఓ మమ్మీని కొందామని ఫ్రెండ్స్ ప్రపోజ్ చేశారు.


అప్పటికి జ్యోతిష్కుడి హెచ్చరికలను డగ్లస్ మర్చిపోయాడు. అతను హిస్టరీ చదవలేదు.

చారిత్రక ప్రాధాన్యత వున్న వస్తువుల్ని కొనాలన్న ధ్యాసా లేదు. కాని విధి అతనిచేత ఆ పని చేయించింది. ఆ మమ్మీ ఒకప్పుడు ఏదో గుడిలో ప్రధాన పూజారిణి అట. ఆ మమ్మీని అద్దాలు బిగించిన బాక్స్ లో ఉంచారు. ఈజిప్ట్ భాషలో దానిమీద ఏవో రాతలు కూడా ఉన్నాయి.


మొత్తానికి మమ్మీని కొన్నారు. దాన్నెవరు తీసుకోవాలనే విషయంలో మిత్రులు ముగ్గురూ లాటరీ వేశారు. లాటరీలో మమ్మీ డగ్లస్ కి వచ్చింది.


తమ ముగ్గురిలో లాటరీలో మమ్మీ తనకే వచ్చినందుకు అది తన అదృష్టంగా భావించాడు డగ్లస్. నిజానికి ఆ క్షణమే తనను దురదృష్టం చుట్టుకుందని గ్రహించ లేకపోయాడు. మమ్మీని ఉంచిన బాక్స్ ని ఇంగ్లాండ్ లోని తన ఇంటి అడ్రస్ కి పార్శిల్ పంపించాడు. మిత్రులిద్దరితో కలిసి మళ్ళీ ఈజిప్టులో తన టూర్ ని కంటిన్యూ చేశాడు.

📖


ఈజిప్టు, నైలునది మీద బోటులో షికారు చేస్తుండగా, ఉన్నట్టుండి తుపాన్ ఏర్పడింది. ఆ సమయంలో బోటు మునిగిపోతుందని భయపడ్డారు ముగ్గురూ. ఆ హడావుడిలో పొరపాటున డగ్లస్ వద్ద వున్న రివాల్వర్ పేలి బుల్లెట్ అతడి ఎడం భుజంలో దిగబడింది. తుపాన్ లో బోటుమీద ఎటో కొట్టుకు పోయిన మిత్రులు తిరిగి కైరో చేరుకునేసరికి వారం రోజులు దాటింది. దాంతో డగ్లస్ ఎడం చేతి బుల్లెట్ గాయం సెప్టిక్ అయింది. చేయి తీసేశారు డాక్టర్లు.


అప్పుడు జ్యోతిష్కుడు చెప్పిన భవిష్యవాణి డగ్లస్ కి గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు ఇక చేయగలిగింది ఏముంది? తమ యాత్రను ముగించుకుని ఇంగ్లాండ్ కి తిరుగు ప్రయాణ మయ్యారు. దారిలో జరిగిన ఒక అనుకోని ప్రమాదంలో మిత్రులిద్దరూ మరణించారు.


చివరకు డగ్లస్ ఒక్కడే ఇంగ్లాండ్ చేరుకున్నాడు. ఇంటికొచ్చేసరికి తను పంపించిన మమ్మీ హాల్లో అలంకరింపబడి వుంది. మమ్మీ కళ్ళు తనను కోపంగా చూస్తున్నట్టుగా వున్నాయి. దానితో డగ్లస్ వణికిపోయాడు. భయం పట్టుకుంది. తనను చుట్టుముట్టిన కష్టాలకి ఆ మమ్మీనే కారణం అనుకున్నాడు. దాన్ని తన స్నేహితురాలైన ఓ యువతికి బహుమతిగా ఇచ్చేశాడు.

🍁

*సశేషం*

*శతపత్ర -14*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



మమ్మీని ఇంటికి తీసుకెళ్ళిన వారం రోజుల లోనే ఆ స్నేహితురాలికి అనేక కష్టాలు ఆరంభమయ్యాయి. ఆమె తల్లి మెట్లు దిగుతూ జారిపడి కాలు విరగ్గొట్టుకుంది. కొద్దిరోజులు బెడ్ మీదే ఉండిపోయింది. అప్పటికే ఆమెకు పెళ్ళి నిశ్చయమైంది. ఆ పెళ్ళి చెడిపోయింది. ఆమె పెంపుడు కుక్కలు మూడు పిచ్చిపట్టి ఒకేరోజు చనిపోయాయి. వరస కష్టాలతో ఆమె వణికిపోయింది. తెలీని నీరసంతో తనూ ఆస్పత్రి పాలైంది.


ఇవన్నీ చూశాక ఇదంతా మమ్మీ ప్రభావమని గ్రహించింది. ఆరోజే డగ్లస్ ని పిలిచి మమ్మీని తిరిగి ఇచ్చేసింది. మమ్మీని వెనక్కు తెచ్చిన తర్వాత  ఆమె యధాస్థితికి వస్తుందని అనుకున్నాడు డగ్లస్. కాని అలా జరగలేదు. ఆమె మరింతగా నీరసపడింది. చివరికి తెలీని ఆ వ్యాధికి తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది.


ఆ తర్వాత ఒక ఫ్రెండ్ సలహాతో డగ్లస్ ఆ మమ్మీని బ్రిటీష్ మ్యూజియమ్ కి డొనేట్ చేశాడు. ఆ ఫ్రెండే మమ్మీని తీసుకెళ్ళి ఒప్పగించాడు. అతన్ని కూడా వదల్లేదు మమ్మీ. ఆ ఫ్రెండ్ వారం రోజులు తిరక్క ముందే బెడ్ మీద నిద్రపోతున్నవాడు నిద్రపోతున్నట్టే మరణించాడు.


ఆ మమ్మీ సృష్టిస్తున్న ఇబ్బందులు, ప్రమాదాల గురించి తెలుసుకున్న మ్యూజియమ్ అధికారులు దాన్ని న్యూయార్క్ లోని మ్యూజియమ్ కి డొనేట్ చేసి వదిలించుకోవాలనుకున్నారు. అదే ప్రకారం మమ్మీని ఒక షిప్ లో అమెరికాకు పంపించారు.


ఆ షిప్ పేరు టైటానిక్. అది ఏమైందో అందరికి తెలుసు. 13.4. 1912వ తేదీన ఒక మంచు పలకను గుద్దుకుని టైటానిక్ సముద్రంలో మునిగిపోయింది. ఆ ప్రమాదం లో సుమారు పన్నెండు వందలమంది జలసమాధి అయ్యారు. వారితో పాటే ఆ మమ్మీ కూడా సముద్రంలో కలిసిపోయింది" వివరించాడు" స్టీఫెన్ వార్నర్.


నమ్మశక్యంగాని ఆ గాధని ఆశ్చర్యంతో ఎంతో ఆసక్తిగా విన్నది శతపత్ర. “తరువాత.... డగ్లస్ ఏమయ్యాడు సార్?" కుతూహలంగా అడిగింది శతపత్ర.


"అదే ఆశ్చర్యం... ఎక్కడో అమెరికా తీరంలో టైటానిక్ మునిగిపోయిన అదేరోజు విచిత్రంగా ఇక్కడ ఇంగ్లాండ్ లో డగ్లస్ కూడా మరణించాడు” అంటూ భారంగా నిట్టూర్చాడు స్టీఫెన్ వార్నర్.


“నమ్మలేకపోతున్నాను సర్... మమ్మీలకు అంత పవర్ ఉందంటే చాలా ఆశ్చర్యంగా వుంది. కాని నాదో డౌటు" అంది శతపత్ర.


“అడుగమ్మా. ఏమిటది?” అడిగాడు స్టీఫెన్.


“ఏ మతాచారం ప్రకారమైనా చూడండి, హిందూమతంగాని, క్రైస్తవం గాని, ముస్లిం గాని, బౌద్దంగాని ఇలా ఏ మతం ప్రాతిపదికన చూసినా మనిషి చనిపోయిన తరువాత ఆత్మ పైకి వెళ్ళిపోతుందని, చేసిన పాపపుణ్యాల ప్రకారం ఆ ఆత్మలకు స్వర్గమో నరకమో ప్రాప్తిస్తాయని అంటారు.


'అలానే సమయం రాకుండా ముందే శరీరాన్ని పోగొట్టుకున్న ఆత్మలు అంతవరకూ భూమ్మీదే సంచరిస్తాయని కదా నమ్మకాలు.

కాని ఈ ఈజిప్టియన్లు మాత్రం ఎందుకిలా? మృతదేహాల్ని మమ్మీలుగా మార్చి భవిష్యత్తులో ఎప్పుడో అవి తిరిగి మళ్ళీ బతుకుతాయని విశ్వసించటం?" ప్రశ్నించింది శతపత్ర.


ఆమె ప్రశ్నకు నిజానికి స్టీఫెన్ వార్నర్ వద్ద కూడా సమాధానం లేదు. ఏం చెప్పాలో తెలీక ఆలోచిస్తుండగా డోర్ వద్ద అలికిడైంది. నాన్సీ- మూడు అందమైన డచ్ డిజైన్డ్ కప్పుల్లో పొగలు చిమ్ముతున్న కాఫీతో లోపలకి వస్తూ కన్పించింది.


"మీరు ఏదో భాషలో మాట్లాడుకుంటే నాకేమీ అర్థంకాదు. ఇంగ్లీష్ లో మాట్లాడితే నేనూ మీ చర్చలో పాలుపంచుకుంటాను” అంది నవ్వుతూ.


“ఏమిటీ? పనులన్నీ అయిపోయాయా?” కాఫీ కప్పు అందుకుంటూ అడిగాడు స్టీఫెన్.


“అందుకేగా మీతో జాయినవుతున్నాను" అంటూ శతపత్రకు ఒక కప్పు అందించి, తను కూడా ఒక కప్పు తీసుకుంటూ భర్త పక్కన కూర్చుంది. ముగ్గురూ కాఫీ తాగారు.


శతపత్ర సందేహాన్ని నాన్సీకి వివరించాడు స్టీఫెన్ వార్నర్. ఆమె రాకతో వారి సంభాషణ ఇంగ్లీష్ లోకి మారింది. “నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను” అంది అంతా విన్నాక శతపత్రను చూస్తూ నాన్సీ.


"నువ్వు చెప్తావా? చెప్పు చూద్దాం” అన్నాడు నవ్వుతూ స్టీఫెన్ వార్నర్. సీరియస్ గా చూసింది నాన్సీ.


"అంటే, మీ ఉద్దేశం ఏమిటి? నాకేమీ తెలీదనా? ఇదిగో అమ్మాయ్, శతపత్రా, నీ సందేహం న్యాయమైందే. ప్రపంచంలో అందరి విశ్వాసం ఏమంటే మన శరీరంలో ఆత్మ ఒక్కటే ఉంటుందని, కాని నిజానికి రెండు ఆత్మలుంటాయి” అంది.


"ఓర్నాయనో రెండు ఆత్మలా... నువ్వు మమ్మల్ని మరింత కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నావు నాన్సీ” అన్నాడు కంగారుగా స్టీఫెన్ వార్నర్.


“నొనొ... నొ కన్ఫ్యూజ్... వినండి. మీకో ఉదాహరణ చెప్తాను. కారు ఉంది. అది పనిచేస్తుంది కదా? అది ఎప్పుడు పని చేస్తుంది? డ్రైవరు కూర్చుని స్టార్ట్ చేసినప్పుడు పనిచేస్తుంది. పరుగులు తీస్తుంది. డ్రైవరు దిగిపోతే పనిచేయదు. ఏ యంత్రమయినా అంతే. మంచి కండిషన్ లో ఉన్న యంత్రమైనా సరే మనిషి లేందే పనిచేయదు. అవునా?” అడిగింది.


“అఫ్కోర్స్. యు ఆర్ కరెక్ట్” అన్నాడు స్టీఫెన్ వార్నర్. శతపత్ర ఆసక్తిగా వింటోంది.


"మన మానవ శరీరం కూడా ఒక యంత్రం అనుకుందాం. ఆ శరీరంలో స్వతస్సిద్ధంగా ఒక ఆత్మ ఉంది. అది భౌతికమైన ఆత్మ. అదే శరీర ధర్మాల్ని కాపాడుతోంది. ఈ భౌతికమైన ఆత్మకి పరమాత్మ సంబంధమయిన ఆత్మ తోడయినప్పుడే జీవం ఏర్పడి చలనం వస్తోంది. అర్థమయిందా?” అని అడిగింది.


"అర్థం కాలేదు" అంది శతపత్ర.


"అంతా మనమే... మనవల్లే అంతా జరుగుతోంది అనుకుంటాం. మన బుర్ర ఆలోచిస్తుంది. కాళ్ళు, చేతులు పనిచేస్తాయి.. ఇవి మన ఆధీనంలోనే ఉంటాయి. కాని శరీరం మొత్తం మన నియంత్రణలో ఉండదు.


ఆకలేస్తే భోంచేస్తున్నాం. కాని జీర్ణవ్యవస్థ పని మన నియంత్రణలో లేదు. నిరంతరం గుండె కొట్టుకుంటోంది. దాని నియంత్రణ మన చేతుల్లో లేదు. ఇలా మన ప్రమేయం లేకుండానే శరీర విధుల్ని నిర్వర్తింపచేస్తున్న దే భౌతికమైన ఆత్మ. ఒక మనిషి కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు శరీర విధులన్నీ సక్రమంగా వున్నా చలనం మాత్రం ఉండదు. ఎందుచేత? అక్కడ భౌతికమైన ఆత్మ ఒక్కటే శరీర విధుల్ని నిర్వర్తింపచేస్తోంది.


“పరమాత్మ సంబంధమైన ఆత్మతొలగిపోడం చేత చలనం లేకుండాపోతోంది.కాబట్టి భౌతిక ఆత్మ నియంత్రణలో వున్నా శరీరమనే ఈ యంత్రంలోకి, పరమాత్మ సంబంధమైన ఆత్మ అనే డ్రైవరు ప్రవేశించి స్థిరంగా ఉన్నప్పుడే ఈ యంత్రం సక్రమంగా పనిచేస్తుంది.


ఈ సిద్ధాంతాన్ని మా డచ్చివాళ్ళేకాదు ఈజిప్షియన్లు కూడా గాఢంగా విశ్వసిస్తారు.


నీ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు తెలిసి ఉండాలి. భౌతిక 'ఆత్మ నియంత్రణలోని ఈ శరీర యంత్రం పాడవకుండా దీన్ని సురక్షితం గా ఉంచితే భవిష్యత్తులో ఏదోరోజు శరీరాన్ని వదిలిపోయిన దివ్యాత్మ తిరిగి ప్రవేశించి ఆ శవం బతుకుతుందని పురాతన ఈజిప్టియ న్లూ నమ్మేవారు. అందుకే శవాల్ని అత్యంత భద్రంగా మమ్మీలుగా మార్చి పిరమిడ్స్ లో భద్రపర్చేవారు" వివరించింది నాన్సీ.


“నాన్సీ క్లారిఫికేషన్ విన్నావుగా శతపత్రా?... పురాతన ఈజిప్షియన్లు శవాలను మమ్మీలు గా మార్చటంతో ఊరుకోలేదు. శరీరానికి సంబంధించిన భౌతికమైన ఆత్మను ప్రేరేపించి తమ మంత్రాలతో కొన్ని శక్తులు ఆపాదించి, కాపలా ఉంచేవారు ఎంత కాలమైనా కూడా

అసలు ఆత్మ తిరిగి ఆ శరీరంలోకి ప్రవేశించే దాకా భౌతిక ఆత్మ మమ్మీకి రక్షణగా ఉంటుంది. సో... అటువంటి మమ్మీ యొక్క లక్ష్యానికి, ప్రశాంతతకు ఎవరు భంగం కలిగించినా అవి క్షమించవు. శపిస్తాయి.

ప్రతీకారం తీర్చుకుంటాయి. వాటి శక్తి నీకు అర్ధంకావటానికి టుటాంఖమెన్ సమాధికి సంబంధించిన వాస్తవ గాధ చెప్తాను విను” అన్నాడు స్టీఫెన్ వార్నర్.


"టుటాంఖమెన్ ఎవరు?” అడిగింది శతపత్ర.


"క్రీస్తుపూర్వం పధ్నాలుగో శతాబ్దంలో ఈజిప్టును పరిపాలించిన గొప్ప చక్రవర్తి టుటాంఖమెన్. క్రీ.పూ. 1352 ప్రాంతంలో ఆయన మరణించగా మమ్మీగా మార్చబడి సమాధి చేయబడ్డాడు” వివరించాడు స్టీఫెన్ వార్నర్.


"అతడి సమాధి ఎలా బయటపడింది?”


“అదే చెప్తున్నాను... వ్యాలీ ఆఫ్ కింగ్స్ వద్ద ఒక పిరమిడ్ లో టుటాంఖన్ మెన్ సమాధి వుంది.


మిస్టర్ కానర్వాన్ అనే ఆర్కియాలజిస్టు సాహసి, మొండివాడు. అతడి సబార్డినేట్ కార్టన్ అనే మరో ఆర్కియాలజిస్టు... ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు వారికి సహాయకులుగా మరో ఇరవైమంది కింగ్స్ వ్యాలీలో సమాధుల్ని కనుగొని, వాటి గురించి బయట ప్రపంచానికి తెలియజేయా లని ఒక టీమ్ బయలుదేరారు.


ఇలా మమ్మీలను కనుగొనే ప్రయత్నం మంచిది కాదని కానర్వాన్ ఫ్రెండ్ ఒకడు అతన్ని ముందే హెచ్చరించాడు. గత అనుభవాలనూ వివరించాడు. గతంలో ఇలానే ఒక ఆర్కియాలజిస్టూ ఒక సమాధి నుంచి శవపేటికతో సహా మమ్మీని ఇంగ్లాండ్ తీసుకెళ్ళగా అతనికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దురదృష్టం వెన్నంటి ఆర్థిక ఇబ్బందుల పాలయ్యాడు. అతడి ప్రాణ ప్రదమైన ప్రియురాలు సముద్రంలో మునిగి చనిపోయింది. మమ్మీని ఉంచిన ఇల్లు కాలి బూడిదయింది. ఆ మమ్మీని ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ అనూహ్యరీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు.


ఇదంతా వినికూడా టీమ్ లీడర్ కానర్వాన్ లెక్కచేయలేదు. అవన్నీ కేవలం భయాలు మాత్రమేనంటూ కొట్టిపారేశాడు. తన సాహసాన్ని ప్రపంచానికి నిరూపించాలను కున్నాడు. 


“పొరపాటున కూడా మమ్మీ సమాధుల్లోకి ప్రవేశించకు. ఈ హెచ్చరికను పెడచెవిన పెడితే కోరి చిక్కులు తెచ్చుకున్నట్టే. ప్రాణాలతో ఈజిప్టు దాటి బయటకుపోలేవు" అంటూ మరో సన్నిహితుడు చేసిన హెచ్చరికను కూడా కానర్వాన్ లెక్క చేయలేదు.

🍁

*సశేషం*

16/02, 11:43 am] . Mallapragada: *శతపత్ర -15*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



1920 ప్రాంతంలో కానర్వాన్ కింగ్స్ వ్యాలీకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నప్పుడే సన్నిహితులు చేసిన హెచ్చరికలు అవి. అవన్నీ మూఢ నమ్మకా లంటూ కొట్టిపారేశాడు కానర్వాన్" అంటూ చెప్పటం ఒకింత ఆపాడు స్టీఫెన్ వార్నర్.


అతడు చెప్తున్న మాటలు శతపత్రకన్నా నాన్సీకే ఎక్కువ ఆత్రుత కలిగించినట్టుంది.. "తర్వాత ఏమైంది?" అనడిగింది ఆసక్తిగా వెంటనే.


"ఎవరైతే భౌతికమైన మమ్మీల శాశ్వత నిద్రకు భంగం కలిగిస్తారో, వారు తమ మృత్యువును కోరి ఆహ్వానించుకున్నట్టే. ఇది ప్రాచీన ఈజిప్టియన్ల ప్రగాఢ నమ్మకం. ఇప్పటికీ ఈజిప్టు ప్రజలు ఈ నమ్మకాన్ని గౌరవిస్తారు. కాని మొండివాడైన కానర్వాన్ గౌరవించలేదు.


మూఢనమ్మకమని అపహాస్యం చేశాడు. తన టీమ్ మెంబర్స్ ని ప్రోత్సహించి కింగ్స్ వ్యాలీలో పని ప్రారంభించాడు. 

రాత్రింబవళ్ళు నిర్విరామంగా పని చేయటం ప్రారంభించారు. రోజులు గడిచిపోతున్నాయి.


మొత్తానికి 1923లో టుటాంఖమెన్ సమాధిని కనుగొన్నారు. సమాధిలో అంతులేని సంపదతోపాటు రాజుగారి బంగారు సింహాసనాన్ని, ఆయన ఉపయోగించిన మణిమయఖచితమైన బంగారు రథాన్ని, ఆభరణాలు, ఆ కాలం నాటి వస్తువులు అనేకం దొరికాయి.

టుటాంఖమెన్ మమ్మీని ఉంచిన బంగారు శవపేటికను సమాధినుంచి బయటికి తీశారు.


కానర్వాన్ తన సాహసాన్ని ప్రపంచానికి చాటాడు. కాని విధి నుంచి తప్పించుకోలేక పోయాడు..

📖


టుటాంఖమెన్ సమాధి తెరిచిన అయిదు మాసాల్లోనే కానర్వాన్ చనిపోయాడు. చనిపోయేముందు 'భరింపరాని వేదనతో నేను చనిపోతున్నాను. దేవుడా!' అంటూ వెర్రిగా కేకలు వేశాట్ట- సంపూర్ణ ఆరోగ్యంగా వున్న కానర్వాన్ అలా హఠాత్తుగా మరణించటం అందరినీ ఆశ్చర్యపరిచింది. టుటాంఖమెన్ మమ్మీ అలా తన మొదటి ప్రతీకారం తీర్చుకుంది. కానర్వాన్ చనిపోయిన కొద్ది రోజులకే విచిత్రంగా అతడి సహచరుడు కార్టర్ కూడా చనిపోయాడు.


కానర్వాన్ చనిపోయాడని తెలిసి అతని ఫ్రెండ్ ఒకడు ఈజిప్టు వెళ్ళాడు. విషయం తెలుసుకుని ఇదేమిటో చూద్దామని అతను కూడా టుటాంఖమెన్ సమాధిలోకి వెళ్ళి పరిశీలించి వచ్చాడు. వెళ్ళి వచ్చీ రాగానే తీవ్రమైన జ్వరంతో మంచానపడి పన్నెండు గంటల్లోపల చనిపోయాడు.


అంతేకాదు. టుటాంఖమెన్ సమాధిని ఎక్స్ రే తీసిన వ్యక్తికి ఉన్నట్టుండి మతిచెడింది. ఇంగ్లాండ్ తిరిగివస్తూ దారిలోచనిపోయాడు. తర్వాత కానర్వాన్ సెక్రటరీ కూడా విచిత్రంగా మరణించాడు.


కానర్వాన్ తో పనిచేసిన టీమ్ లోని మెంబర్స్ మొత్తం ఒక్కొక్కరే మరణించారు. ఎవరూ మిగల్లేదు. ఇదంతా యధార్థంగా జరిగిన సంఘటన. ఇంత జరిగినా కొత్తగా విన్నవాళ్ళు సూపర్ పవర్స్ లేవనీ అవన్నీ కో ఇన్సిడెంట్స్ అనీ కొట్టి పారేస్తారు. అందుకే చెప్తాను. ఏదైనా అనుభవానికి వస్తేగాని మనిషి నమ్మడు." అంటూ ముగించాడు స్టీఫెన్ వార్నర్.

📖


అంతవరకూ వింటూ కూచున్న నాన్సీ ఏదో పని గుర్తుకొచ్చి లేచి కిందకు వెళ్ళిపోయింది. స్టీఫెన్ వార్నర్, శతపత్రలు చాలాసేపు ఈ విషయాల మీద చర్చించుకున్నారు. చివరకు స్టీఫెన్ ఓ సలహా ఇచ్చాడు--


"చూడమ్మా శతపత్రా బయట ఎవరికీ తెలియని ఒక రహస్యం మా లైబ్రరీలో ఉంది. అది టాప్ సీక్రెట్. ఇప్పుడు హై అథారిటీస్ లో కొందరికి మాత్రమే ఈ విషయం తెలుసు. నీ సమస్య నాకు అర్ధమైంది గాబట్టి ఆ రహస్యం ఇప్పుడు నీతో చెబుతున్నాను.


ప్రపంచ వ్యాప్తంగా అరుదైన కొన్ని రహస్య ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల వెనక ఉన్న మిస్టరీని ఈనాటికీ ఎవరూ ఛేదించలేక పోయారు. ఇలాంటివి అందరికీ తెలిసినవి చాలా ఉన్నప్పటికీ, నేను చెప్పేది మాత్రం అతి ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన ప్రదేశం.


బ్రిటీష్ పరిపాలనా కాలంలో, దేశాలవారీగా అలాంటి ప్రదేశాల ఫోటోగ్రాఫ్స్ ని, వివరాలని వాటికి సంబంధించిన బుక్స్ ని సేకరించి ఇక్కడ భద్రపరిచారు.


అవి సాధారణ ప్రజలు చదివి అవేమిటో చూడాలని వెళ్తే ప్రమాదమని భావించి వాటిని అందరికీ అందుబాటులో లేకుండా ఒక ప్రత్యేక విభాగంలో భద్రం చేసి తాళాలు వేసివుంచారు.


నెలరోజులకోసారి తలుపులు తెరిచి లోపల శుభ్రం చేయించి తిరిగి తాళాలు వేస్తాం. నా పర్యవేక్షణలోనే చాలా భద్రంగా జరుగుతుందా పని.


నీవు అనుమానిస్తున్నట్టు నీ కలలో కన్పించే ప్రాంతం ఆ మిస్టరీస్ లో ఒకటయి వుంటే దాని గురించిన సమాచారం మా సీక్రెట్ విభాగంలోనే నీకు దొరకాలి. అక్కడ దొరకలేదంటే నువ్వా కల గురించి ఇక మర్చిపోవచ్చు. నీకు నేను చేయగల సాయం ఇదే.


నీకోసం నేను రేపు ఉదయం ఒక గంట ముందుగా లైబ్రరీకి వస్తాను. నువ్వు కూడా రావాలి. నేను ఎవరూ చూడకుండా తాళం తీసి ఆ విభాగంలోకి నిన్ను పంపించి బయట తాళం వేస్తాను. పనికాగానే నా సెల్ కి ఫోన్ చేస్తే వచ్చి తలుపు తీస్తాను. ఓకేనా?"


"థాంక్యూ సర్... తప్పకుండా వస్తాను" అంది ఎంతో వినయంగా కృతజ్ఞతాభావంతో శతపత్ర.


ఇద్దరూ మెట్లుదిగి కిందకు వచ్చారు. అప్పటికి తన పనులు ముగించుకుని నాన్సీ కూడా హాల్లోకి వచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఆప్యాయంగా శతపత్ర వెంట పోర్టికోలోకి వచ్చి ఆమెను సాగనంపారు.


శతపత్ర స్కూటీ మీద బయటకి వెళ్ళిపోగానే స్టీఫెన్ వార్నర్ భార్యను చూస్తూ- "ఇంతకీ మన క్రిష్ట, రోసీలు ఎక్కడ?" అని అడిగాడు భార్యని.


"ఎంతకీ నాకు అర్థంగాని విషయం అదే... అంత మంచి అమ్మాయిని చూసి ఈ దెయ్యం పిల్లలు భయపడ్డం ఏమిటి? ఆ కాలువ గట్టునే కూచున్నట్టున్నాయి. నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తానుండు. వాళ్ళిద్దరూ లేకపోతే ఇంట్లో అసలు సందడే లేదు" అంటూ పిల్ల దెయ్యాలయిన క్రిష్ట, రోసీలను పిలుచుకు రావటానికి పెరటివైపు బయలుదేరింది నాన్సీ.

📖


మరునాడు ఉదయం-


ఎందుకో లేచినప్పట్నుంచి శతపత్రకు మనసు అస్సలు బాగోలేదు. అదేపనిగా కుడికన్ను అదురుతోంది. మగాళ్ళకి ఎడం కన్ను, ఆడాళ్ళకి కుడికన్ను అదిరితే ఏదో కీడు జరుగుతుందంటారు. ఒక్కోసారి నిద్రలేమి వల్ల కంటినరాల అలసటతో కూడా

కనురెప్పలు అదురుతుంటాయి. శతపత్ర సెంటిమెంట్ పూల్ కాదు. కాని ఉదయం నుండి మనసు బాగాలేకపోవటం, ఆపైన కుడికన్ను అదే పనిగా అదరటం చూస్తుంటే, ఏదో కీడు జరగనుందా అనే ఆలోచనలు ఆమెను ముసురుకుంటున్నాయి. ఇవాళ లైబ్రరీకి వెళ్ళటం వాయిదా వేద్దామనుకుంది. కాని అంతలోనే మనసు మార్చుకుంది.


స్టీఫెన్ వార్నర్ తనకు తానుగా హెల్ప్ చేస్తామన్నారు. ఓ గంట ముందుగానే లైబ్రరీకి రమ్మన్నారు. ఆయన చెప్పినప్పుడు వెళ్ళాలిగాని మనకోసం ఆయన్ని రమ్మనటం మర్యాద కాదు. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవటమే తెలివైన పని.


అనేక విధాలుగా ఆలోచించిన శతపత్ర చివరకు వెళ్ళటానికే నిశ్చయించుకుంది. చకచకా రెడీ అయి ఎనిమిది గంటలకే బయటికి బయలుదేరింది.


"ఇంత పొద్దుటే బయలుదేరావ్. ఎక్కడికే" అంటూ కాఫీ కప్పు అందిస్తూ అడిగింది పిన్ని సువర్ణ.


శతపత్ర ఏదో చెప్పేలోపలే బాబాయ్ అందుకున్నాడు. ఆయన కూడా బయటకు బయలుదేరే హడావుడిలో ఉన్నాడు. "ఎవరన్నా బయటికి వెళుతుంటే ఎక్కడికి అని అడగకూడదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు?” అని అంటూ కసురుకున్నాడు. భార్యని.


“అవునా! మరైతే ఏమని అడగాలేమిటి?" అమాయకంగా ముఖంపెట్టి ఒకింత దీర్ఘం తీస్తూ అడిగింది సువర్ణ భర్తవైపు చూస్తూ. “పనేమిటి? అనడగాలి" చెప్పాడు.


"ఏం పనులో ఏమిటో! ఇంగ్లాండ్ లో ఉంటున్నా, మీ ఇండియన్ సెంటిమెంట్లు పోవడంలేదు" అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయిందావిడ. వెళ్తున్న భార్యను చూస్తూ అదోలా ముఖంపెట్టి వెక్కిరించాడు బాల గోపాలం.


“చూశావా అమ్మాయ్, తనకేమీ సెంటిమెంట్లే లేనట్టు, మనవి ఇండియన్ సెంటిమెంట్లు అంటోంది మీ పిన్ని. మరి యూరప్ లోఉన్నా పసుపు రుద్దుకుని స్నానాలూ, పెద్దగా గణగణ గంటలు వాయిస్తూ ఆ పూజలు, పునస్కారాలు అవన్నీ సెంటిమెంట్లు కావా?" అంటూ నవ్వేశాడు.


"లైబ్రరీ వద్ద పనుంది. నేను వెళ్తున్నాను" అంటూ బయలుదేరింది శతపత్ర.


“జాగ్రత్త తల్లీ” వెనక నుంచి హెచ్చరించాడు బాలగోపాలం. శతపత్ర వెళ్ళిన పది నిమిషాలకు తను కూడా బయటకు బయలుదేరాడు.


"పనేమిటి?” గుమ్మంలోకొచ్చి అడిగింది సువర్ణ.


ఆమె కావాలనే తన మాట తనకే ఇలా అప్పజెప్పేస్తోందని బాలగోపాలానికి అర్ధమైపోయి పెద్దగా నవ్వేశాడు.


"లండన్ మహానగరంలో ఆరు రెస్టారెంట్లకు అధిపతినే. నీ పతిదేవుడికి పాతిక ముప్పై పనులుంటాయి.. అన్నీ నీకు చెప్పాలా? వెధవ చాదస్తం నువ్వూ... తలుపేసుకో” అంటూ బయటికి వెళ్ళిపోయాడు.

📖


సరిగ్గా తొమ్మిది గంటలకి క్వీన్ విక్టోరియా మెమోరియల్ లైబ్రరీకి చేరుకుంది శతపత్ర.


ఆరోజు మంచు కురవకపోవటంతో లండన్ వీధులు అద్దంలా మెరుస్తున్నాయి. నగర శోభని ఎంజాయ్ చేసే మూడ్ లో శతపత్ర లేదిప్పుడు. కుడికన్ను ఇంకా అదేపనిగా అదురుతోంది. ఎందుకు? నిజంగా ఏదన్నా కీడు జరగనుందా? మనసును తొలుస్తున్న ప్రశ్న ఇది.


కొన్నిటిని ఎంతగా మూఢనమ్మకాలని కొట్టిపారేసినా, మనసు మాత్రం తెలియని అలజడితో గుబులు పుట్టిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం శతపత్ర మానసిక స్థితి కూడా అలానే ఉంది.


ఒకవేళ నిజంగా కీడు జరిగేట్టయితే తనకి వస్తున్న కలకి, దీనికి సంబంధం ఏదన్నా ఉండి వుంటుందా? ఆ కోణంలో కూడా ఆలోచించిందామె. అలాగని భయపడి వాయిదా వేసుకునే అవకాశం లేదు.


తనకోసం గంటముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు స్టీఫెన్ వార్నర్ గారు. ఆయన కారు పార్కింగ్ లో ఉంది అప్పటికే. ఏమైతే అయిందని మనసు దృఢపరుచుకుంది శతపత్ర.


తన స్కూటీని లాక్ చేసి వెనుతిరుగుతుండ గా పరుగు పరుగున అక్కడికొచ్చింది విశ్వదా.


ఆమెను చూసి షాకయింది శతపత్ర, “విశ్వదా! నువ్వేమిటే ఇక్కడికి వచ్చావ్?” అంది ఆశ్చర్యపడుతూ.


“నా సంగతి అలా ఉంచు. ఇంతకుముందు లైబ్రరీ తెరిచాక వచ్చేదానివి. ఇప్పుడేమిటి గంటముందే వచ్చాశావ్?" ఎదురు ప్రశ్నించింది విశ్వదా.


"పనుండి వచ్చాను.”


"ఏం పని? కొంపదీసి నీ బాయ్ ఫ్రెండ్ ఎవరన్నా వస్తున్నాడా? అలాంటిదేమన్నా ఉంటే చెప్పెయ్ లేటయినా బాధలేదు. ఆ నవమన్మధుడు ఎలా ఉంటాడో చూసి వెళ్తాను” అంది విశ్వదా.


"చంపుతాను. పొద్దుటే జోకులేయకు. నిజంగా పనుండే వచ్చాను. నాకోసం కొన్ని ఓల్డ్ బుక్స్ తీసి ఉంచుతాను, ఎర్లీగా రమ్మన్నారు స్టీఫెన్ వార్నర్ గారు. అందుకే వచ్చాను. నీ సంగతేమిటి? ఏం పనిమీద వచ్చావిటు?"


“నీకోసం కాదులే. టాక్సీలో ఇటుగా పోతూ నిన్ను చూసి ఆగాను. నేను మెట్రోట్రైన్ లో రమణా రావుగారింటికి వెళ్తున్నాను. అదేనే.. ఎత్తుపళ్ళ రమణ రావుగారు. వాళ్ళ ఫ్యామిలీ ఇండియా వెళ్ళి నిన్ననే తిరిగి వచ్చారు. వాళ్ళచేత మా డాడీ ఏదో పార్శిల్ పంపించారట. కాలేజీ టైమ్ లోపలే వెళ్ళి కలెక్ట్ చేసి తెచ్చుకుందామని పొద్దున్నే బయలుదేరాను" అంది విశ్వదా.


బరువుగా నిట్టూర్చింది శతపత్ర-


"ఇండియా. వెళ్ళివస్తున్న వాళ్ళని చూస్తుంటే నాకూ ఓసారివెళ్ళి అందరీ చూసిరావాలని ఉంటుంది. మమ్మీని, డాడీని, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీని.. ప్చ్.. ఎప్పటికి వీలవుతుందో మా డాడీకి నేనంటే ప్రాణం.

నాకూ అంతే. అసలు ఇంతకాలం ఆయన్ని చూడకుండా ఎలా ఉండా గలిగాను. తలచుకొంటే ఆశ్చర్యంగా ఉంటుంది” అంది బాధగా.


"మాతృదేశానికి దూరంగా ఉండే మనలాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు, బాధలు తప్పవు. నాకూ వెళ్ళి రావాలనుంది. కాని ఎలా వీలవుతుంది. ఎగ్జామ్స్ అవ్వాలి గదా. కాని ఒక్కటిమాత్రం నిజం" అంది విశ్వదా.


"ఏమిటి ఆ నిజం?”


“నాకన్నా ముందుగా నువ్వే ఇండియా వెళ్ళిపోతావనిపిస్తోంది. ఏమో ఈ రోజే వెళ్ళిపోతావేమో.”


“ఈరోజా... ఏమిటే భయపెట్టేస్తున్నావ్?”


“డోన్ట్ వర్రీ. జస్ట్ జోక్ చేశానంతే. టేకిటీజీ. ఈవెనింగ్ ఫోన్ చేస్తాను. నా ప్లాట్ కి రావాలి.


మావాళ్ళు ఏం పంపించారో చూపిస్తాను. ట్యాక్సీ వెయిటింగ్ లో ఉంది. వస్తాను. బై" ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెళ్లిపోయింది విశ్వదా.


ట్యాక్సీ వెళ్లిపోయింది. తన వేనిటీ బ్యాగ్ తీసుకుని లైబ్రరీలోకి నడిచింది శతపత్ర.

📖


ఆమె వెళ్ళేసరికి లైబ్రరీ సెంట్రల్ హాల్లోనే ఆమెకోసం ఎదురుచూస్తూ కనిపించాడు స్టీఫెన్ వార్నర్.


"సారీ సర్. కొంచెం లేటయింది. మిమ్మల్ని వెయిట్ చేయించాను" అంది ఆలస్యానికి నొచ్చుకుంటూ.


"నో ప్రాబ్లమ్ మై చైల్డ్... కమ్ విత్ మి" అంటూ తన ఛాంబర్ వైపు దారితీశాడు ఆయన.


తన ఛాంబరికి పక్కనే ఉన్న చిన్న కారిడార్ చివరన ఉంది ఆయన చెప్పిన సీక్రెట్ లైబ్రరీ. సాధారణంగా అటుగా ఎవరూ రారు.


ఇద్దరూ డోర్ వద్దకి చేరుకున్నారు.


స్టీఫెన్ వార్నర్ తాళం తీసి డోర్స్ తెరిచాడు.


ఎందుకో తెలీదుగాని లోపలికి చూస్తున్న శతపత్రకి గుండెలు కొద్ది క్షణాలు వేగంగా కొట్టుకున్నాయి. తన అన్వేషణకి ఇది చివరి మజిలీ అన్పిస్తోంది.


"లోపలికి వెళ్ళమ్మా. నీమీద నాకున్న నమ్మకంతో నీకీ అవకాశం ఇస్తున్నాను. నాకు మాట రాకుండా చూసుకో... లోపల ఉన్నవి అపురూపమైన అతి ప్రాచీన గ్రంథాలు, ముట్టుకుంటే పాడయిపోయే ప్రమాదం ఉంది. బీకేర్ ఫుల్. పని పూర్తి అయిపోగానే నా సెల్ కి ఫోన్ చెయ్యి. వచ్చి తాళం తీస్తాను. గో ఇన్ సైడ్ క్విక్ లీ" అంటూ హెచ్చరించాడు స్టీఫెన్ వార్నర్.


కృతజ్ఞత నిండిన కళ్ళతో ఆయన్ని చూసింది శతపత్ర. "థాంక్యూ, సర్. మీ సాయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. మెనీ మెనీ థ్యాంక్స్" అంది.


ఆమె లోపలకు వెళ్ళగానే "బెస్ట్ ఆఫ్ లక్” అంటూ డోర్స్ ఎప్పటిలా మూసి లాక్ చేసుకొని ఏమీ తెలీనట్టే తన ఛాంబర్ కి వెళ్ళిపోయాడు స్టీఫెన్ వార్నర్.

🍁

*సశేషం*

[17/02, 11:22 am] . Mallapragada: *శతపత్ర - 16*

🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

ఆమె గది లోపలకు వెళ్ళగానే "బెస్ట్ ఆఫ్ లక్” అంటూ డోర్స్ ఎప్పటిలా మూసి లాక్ చేసుకొని ఏమీ తెలీనట్టే తన ఛాంబర్ కి వెళ్ళిపోయాడు స్టీఫెన్ వార్నర్.


లోపలకు అడుగుపెట్టిన శతపత్ర కాస్సేపు అలాగే నిలబడి చుట్టూ చూసింది. అది సువిశాలమైన పెద్ద హాలు. వరుసగా నిలబెట్టి వున్న స్టీల్ రాక్స్ లో చాలా నీట్ గా వరుసలు తీరి వున్నాయి ప్రాచీన గ్రంథాలు. అవన్నీ ఖండాల వారీగా, దేశాలవారీగా చక్కగా విడివిడిగా ఉంచబడ్డాయి. ఓసారి వాటన్నిటినీ చుట్టి వచ్చింది శతపత్ర.


ఆసియా విభాగంలో చైనా, ఇండియాలకు సంబంధించిన రాక్స్ లో అత్యధికంగా బుక్స్ కన్పిస్తున్నాయి. ఆఫ్రికా, అమెరికాలది తర్వాతి స్థానం.


అక్కడ ప్రాచీన తాళపత్ర గ్రంథాలు అనేకం ఉన్నాయి. అలాగే నూటయాభై సంవత్సరాల క్రితం ప్రచురితమైన బుక్స్ కూడా భద్రపరిచి వున్నాయి.


అదో పుస్తక ప్రపంచం. అందులో తనకు కావలసిన సమాచారం ఏ ఖండంలో ఏ దేశానికి చెందిన గ్రంథంలో లభిస్తుందో ఎలా తెలుసుకోవడం?


అలాగని మొత్తం బుక్స్ గాలించాలి అంటే అందుకు ఒక్కరోజు కాదు, ఒక జీవితకాలం చాలదు. వాటిలో అనేక భాషలకు చెందిన గ్రంథాలున్నాయి. తనకు ఇంగ్లీషు హిందీ, తెలుగు తప్ప మరో భాష తెలీదు.


కాస్సేపు దీర్ఘంగా ఆలోచించింది శతపత్ర.


తెలీక ఒక మనిషి ప్రమాదకరమైన ప్రాంతం లో అడుగుపెట్టి ప్రాణాలు పోగొట్టుకోవటం వేరు. ఏదో ఉంది అని తెలిస్తే, అది ఎంత ప్రమాదభరితమైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు మనిషి.


అక్కడ అటువంటి ప్రదేశాల గురించే కాదు, మంత్ర తంత్రాలు, క్షుద్రవిద్యలు, భూతప్రేత పిశాచ సంబంధమైనవి, రకరకాలైన విష ప్రయోగాల గురించి, అత్యంత ప్రమాదకరమైన యుద్ధవిద్యల గురించి, మహారాజుల, రాణుల శృంగార జీవితాల గురించి, దేవదాసీల గురించి ఇలా ఒకటేమిటి మనిషికి మంచి చేసేవి, హానిచేసే సాహిత్యమంతా అక్కడ ఉంది.


అతి నిగూఢము, అతి ప్రమాదకరము అయినటువంటి ఆ సమాచారం సామాన్యు లకు అందుబాటులో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సాహిత్యాన్ని ముందు చూపుతో ఇలా రహస్యంగా భద్రపరిచిన బ్రిటీషర్ల దూరాలోచనకు అబ్బురపడి మనసులోనే అభినందించకుండా వుండలేక పోయింది శతపత్ర.


తను ఇండియన్. తనకు వస్తున్న కల కూడా భారత భూభాగానికి చెందినదే అయి వుండాలి. కాబట్టి మిగిలిన ఖండాలు దేశాలతో తనకు పనిలేదు. ముందుగా ఇండియా విభాగం నుంచే తన పరిశీలన ఆరంభించటం మంచిదనిపించింది.

ఆసియా విభాగంలో ఇండియాకు చెందిన బుక్స్ ఉన్న రాక్స్ వైపు వెళ్ళింది. అలా వెళ్తూండగా ఎందుకో ఆమె అడుగులు తడబడ్డాయి. చలి చలి వాతావరణంలో కూడా చిరుచెమటలు పోస్తున్నాయి. ఆపైన కుడికన్ను ఇంకా అదురుతూనే వుంది.


ఏదో ఊహాతీతమైన అదృశ్యశక్తి తన ముందు కదులుతున్నట్టుగా, ఏవో తెలీని విచిత్ర ఆలాపనలు తన చెవులకు సోకుతున్నట్టుగా భ్రమ కలుగుతోంది.

అయినా కూడా అడుగు వెనక్కి తగ్గలేదామె. సహజంగానే ఆమె ధైర్యస్తురాలు, మహా మొండి.


తన మానసిక సంఘర్షణలను పక్కకునెట్టి సూటిగా రాక్స్ ముందు కెళ్ళింది. వాటిలో మళ్ళీ ఇంగ్లీషుతో పాటు హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ ప్రాంతీయ భాషల సెక్షన్లు ఉన్నాయి. వాటిలో అనేక తాళపత్ర గ్రంథాలు, ఎప్పుడో ప్రింటయిన పుస్తకాలు కూడా ఉన్నాయి.


ముందుగా తెలుగుభాష నుంచి తన అన్వేషణను ఆరంభించింది శతపత్ర. ఒక్కో గ్రంథం తీసి చూసి తిరిగి అతిజాగ్రత్తగా యథాస్థానంలో ఉంచుతోంది. తెలుగు సాహిత్య పరిశీలనకి సుమారు నాలుగు గంటల సమయం వెచ్చించినా ప్రయోజనం కలగలేదు.


తర్వాత హిందీ సాహిత్యం వైపు మళ్ళింది. అన్నీ మర్చిపోయిందామె, సాయంకాలం మూడు గంటలయింది.


తనకు కావలసిన సమాచారం ఏదో ఒక గ్రంథంలో లభించకపోదు అనే ఆశతో వరుసగా గ్రంథాలను తిరగేస్తూనే వుంది. సరిగ్గా ఆమె చూస్తున్న రాక్ లో హిందీ పుస్తకాలకు పై అరలోనే ఉన్నాయి ఇంగ్లీషు పుస్తకాలు, ఆమె ఒక తాళపత్ర గ్రంథాన్ని తీసి చూసి తిరిగి యథాస్థానంలో ఉంచుతూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. పై వరుసలోని ఇంగ్లీషు బుక్స్ లోంచి ఎవరో తోసినట్టుగా ఒక బుక్ జారి ఆమె మీద పడింది.


ఏం జరిగిందో అర్ధంగాక అదిరిపడి ఒక్కసారిగా ఎగిరి వెనక్కి దూకింది శతపత్ర, ఆమెనుంచి జారి దబ్బున నేలమీద పడిందా పుస్తకం.


అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఆ సంఘటన తో రెండు నిముషాల వరకు ఆమె గుండెదడ తగ్గలేదు. కింద పడున్న బుక్ వంక ఒకింత బెదురుగా చూసింది.


అది తాళపత్ర గ్రంథం కాదు.


మామూలు పేపరు మీద ప్రింటయిన చందమామ సైజులోని ఇంగ్లీషు పుస్తకం. చాలా పాతది. అట్టమీద ఏదో ముఖచిత్రం ప్రింటయి ఉంది. ధైర్యాని కూడగట్టుకుంటూ వంగి ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుని, సరిగ్గా తిప్పి ముఖ చిత్రాన్ని చూసింది. అంతే-


మరోమారు షాక్ తో బిగసుకుపోయింది.

ఆమెకి తన కల ఎదురుగా సాక్షాత్కరించినట్టయింది.


మూడు కొండగుట్టలు, వాటిమధ్యలో లోయ ప్రాంతం. తను నిలబడి చూస్తుండగా కలలో ఆ ప్రాంతం తనకు ఎలా కన్పించిందో సరిగ్గా అదే దృశ్యం ఆ పుస్తకానికి ముఖచిత్రంగా ముద్రించబడి వుంది.


'అన్ సాల్వడ్ అండ్ డేంజర్ మిస్టరీస్ ఇన్ ఇండియా' అనే టైటిల్ తో ప్రింటయిన ఇంగ్లీషు బుక్ అది.


ముఖచిత్రం దిగువన 'ది వ్యాలీ ఆఫ్ గరుడా' అని ప్రింటయి ఉంది. పేపరు చాలా డెలికేట్ గా ఉంది. తాకితే చాలు చినిగిపోయేలా ఉంది.


కలలో తను చూసిన దృశ్యం. చేతిలో పుస్తకం అట్టమీద అదే దృశ్యం. తిలకిస్తున్న శతపత్రకి చేతులు వణుకుతున్నాయి. రంగు మాసినా దృశ్యం స్పష్టంగానే ఉంది. ఆ దృశ్యం తాలూకు ప్రాంతాన్ని గరుడలోయగా వ్యవహరిస్తారని అర్థమైంది.


కాని... కానీ... ఈ లోయకు, తనకు ఏమిటి అనుబంధం. పదే పదే తన స్వప్నంలో ఎందుకు సాక్షాత్కరిస్తోంది? అసలు ఆ లోయలో ఏముంది?


అన్నిటికీ మించి తన శ్రమను చూసి జాలిపడి ఏదో అదృశ్యశక్తి తనకు సాయం చేసిందా అన్నట్లుగా పై అరలోని ఆ బుక్ తానుగా జారి తనమీద పడ్డం ఏమిటి?


ఆ పుస్తకాలన్నీ సీడీల్లో భద్రపరిచే వుంటారు. కాని తను కంప్యూటర్లో అన్వేషించే అవకాశం లేదు.


ఎందుకంటే అఫీషియల్ గా పర్మిషన్ తో వచ్చినవారికి మాత్రమే ఆ సౌకర్యం ఉంది. అనఫీషియల్ గా తను కంప్యూటర్ వినియోగిస్తే రికార్డవుతుంది. స్టీఫెన్ వార్నర్ చిక్కుల్లో పడతారు. అందుకే తనను డైరెక్ట్ గా లోపలకు పంపించారాయన...ఆలోచిస్తూ ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క పేజీ తిరగేయసాగింది శతపత్ర. 


అది పందొమ్మిది వందల అయిదో సంవత్సరంలో ప్రింటైన బుక్, అంటే దాని వయస్సు సుమారు నూట అయిదు సంవత్సరాలు. ఇంగ్లీషు భాషలో ఇంగ్లాండు లోనే ప్రింటయింది. ఆ పుస్తకాన్ని రాసిన రచయిత పేరు జాన్ ఉడ్.


ఆ కాలంలో అతనో ప్రముఖ జర్నలిస్టు, టూరిస్ట్ కూడా. బ్రిటీష్ పరిపాలనా కాలంలో అతను ఒక సంవత్సరం పాటు ఇండియాలో విస్తృతంగా పర్యటించాడు. మళ్ళీ తిరిగి ఇంగ్లాండు వచ్చాక అక్కడ సాంఘిక రాజకీయ పరిస్థితుల గురించి, భారతీయుల స్వాతంత్య్ర కాంక్ష గురించి, భారత నైసర్గిక స్వరూపం; అక్కడి వింతలు, విశేషాలను గురించి అనేక రచనలు చేశాడు. అలాంటి వాటిలో ఈ 'అన్ సాల్వడ్ డేంజర్ మిస్టరీస్ ఇన్ ఇండియా' అనే పుస్తకం ఒకటి.

పుస్తకం ఆరంభ పరిచయంలోనే తన మాట గా రచయిత జాన్ ఉడ్ ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. 


బహుశా ఈ ఒక్క కాపీ తప్ప ప్రపంచవ్యాప్తం గా దీని తాలూకు కాపీలన్నీ ఎప్పుడో నాశనమైపోయి వుండాలి. అసలు ఇలాంటి ఒక బుక్ ఉందని తాను ఎప్పుడూ వినలేదు.


ఆ బుక్ 1905లో ప్రింటయిందంటే, అప్పట్లో ఇండియాలో అది బెంగాల్ రెండుగా విభజన జరుగుతున్న కాలం, లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో బెంగాలు అప్పుడే తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్ అని రెండుగా విభజించారు. అందుకు దారితీసిన పరిస్థితులు చాలా ఉన్నాయి.


జూలై ఏడో తేదీ 1905న బెంగాల్ విభజన అనంతరం అందుకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిచాయి. అలనాటి ప్రముఖ తెలుగు మాసపత్రిక 'భారతి' వ్యవస్థాపక సంవత్సరం కూడా అదే.


అలాగే సికింద్రాబాద్ లో ఆంధ్ర సంవర్ధిని అనే గ్రంథాలయం స్థాపించబడింది కూడా అదే సంవత్సరం. ఆ మరుసటి సంవత్సరమే 1906లో దాదా భాయి నౌరోజీ అధ్యక్షతన కలకత్తా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హాజరైన ప్రముఖ ఆంధ్రుల్లో పి.ఆనందాచార్యులు, హరి సర్వోత్తమరావు, మునగాల రాజా, కొమర్రాజు లక్ష్మణరావు వంటి స్వాతంత్ర్య సమరయోధులున్నారు. ఆ సమావేశంలోనే వందేమాతరం గీతాన్ని జాతీయగీతంగా స్వీకరించటం జరిగింది. స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కూడా ఆ సమావేశంలోనే.


అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆ కాలంలో ఇక్కడ ఇంగ్లాండ్ లో ముద్రితమైన అరుదైన పుస్తకం ఇప్పుడు తన చేతుల్లో ఉంది. దీర్ఘంగా ఆలోచిస్తూ పేజీలను జాగ్రత్తగా తిరగేస్తోంది శతపత్ర. మొత్తం ఏడు మిస్టరీలకు సంబంధించిన సమాచారంతో వంద పేజీల బుక్ అది. దగ్గర్లోని టేబిల్ ముందు కూర్చుని చదవటం ఆరంభించింది.


ముందుగా అందులో ఒక సొరంగ మార్గం గురించి చెప్పబడింది. అది గుజరాత్ తీరంలో మునిగిపోయిన శ్రీకృష్ణుడి ద్వారకా నగరానికి సంబంధించినది. నీట మునిగే సమయానికి అంతులేని సిరిసంపదలతో తులతూగుతున్న నగరం ద్వారక. ఆ పైన శ్రీకృష్ణుని వద్దగల శమంతకమణి అనే సూర్య ప్రసాదితమైన హారం రోజుకి కొన్ని పుట్ల బంగారాన్ని ఇచ్చేదట.


మణిమయ రత్నఖచితమైన బంగారు గోపురాలతో అలరారే రాజసౌధాలు, జనా వాసాలతో సహా నగరం నీట మునిగింది. అత్యవసర సమయాల్లో తప్పించుకోవడానికి రాజసౌధం నుండి అనేక సొరంగ మార్గాలు ఉండేవట.


ప్రస్తుతం ఉన్న ద్వారకకు పదిమైళ్ళ దూరం లోని అటవీ ప్రాంతంలోని కొండల్లో ఒక సొరంగ మార్గం ఉంది. అది నీట మునిగిన ద్వారక రాజసౌధం నుంచి ఏర్పరచిన సొరంగ మార్గం అని స్థానికుల నమ్మకం.


ఆ సొరంగ మార్గంలో వెళ్తే నీటిలో ఉన్న అలనాటి ద్వారక రాజసౌధంలోకి చేరుకో వచ్చని, ఆ విధంగా అక్కడి సంపదను తెచ్చుకోవచ్చని ఆశపడి ఎందరో సొరంగం లోకి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళలో ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగిరాలేదు. గతకాలం నుంచి కొన్ని వందలమంది అదృశ్యమయి వుంటారు.


అయినా సరే ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆ సొరంగంలో ప్రవేశించి అదృశ్యమవుతూనే వున్నారు. గుంపుగా వెళ్ళినవాళ్ళు తిరిగి రాలేదు. లోపల ఏం జరుగుతుందనేది వేల సంవత్సరాలు గడిచినా మిస్టరీగానే ఉండిపోయింది.


స్థానికులతో మాట్లాడి సేకరించిన అలాంటి సంఘటనల్ని కూడా చక్కగా ఆ పుస్తకంలో పొందుపరిచాడు జాన్ ఉడ్..


ఆ సొరంగ మార్గాన్ని శాశ్వతంగా మూసేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని ఆ పని ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని రాశాడు జాన్ ఉడ్.


అంతేకాదు. ఆ సొరంగం మిస్టరీ ఏమిటో ఛేదించాలని ప్రభుత్వం పంపించిన కొందరు సాహసికులు సారంగంలో కొంతదూరం వెళ్ళి ఇక ముందుకు పోలేక భయంతో వెనక్కి వచ్చేసిన సంఘటనలను కూడా ఉదహరించాడు.


ఆ విశేషాలు చదివి ఆలోచనలోపడింది శతపత్ర. ప్రస్తుతం ద్వారక చుట్టుపక్కల అలాంటి ఒక సొరంగమార్గం ఉన్న సమాచారం లేదు. దాని గురించి ఇప్పుడు ఎవరికీ తెలిసినట్టు కూడా లేదు. బహుశా అప్పట్లోనే బ్రిటీష్ ప్రభుత్వం ఆ సొరంగ మార్గాన్ని శాశ్వతంగా మూసేయించి వుంటుంది.


పుస్తకంలో రెండో మిస్టరీగా అస్సాం ప్రాంతం లోని కొండమీది ఒక బావి గురించి చెప్పబడింది. తనకు కావలసిన గరుడ లోయ సమాచారం నాలుగో మిస్టరీ.


డైరెక్ట్ గా ఆ పేజీలు తీసి చదవడానికి ధైర్యం చాలడం లేదు. అయినా సాహసించి ఆ పేజీల్లోకి వెళ్ళబోతూండగా సడన్ గా మోగింది ఆమె సెల్ ఫోన్.


ఉలిక్కిపడి టైమ్ చూసింది శతపత్ర. సాయంకాలం నాలుగు గంటలు. ఫోన్ చేసింది బాబాయి. ఆయన తనకు ఫోన్ చేయడం చాలా చాలా అరుదైన విషయం.

ఫోన్ ఆన్ చేసింది. 


“ఏం తల్లీ... ఎక్కడున్నావ్?" బాలగోపాలం గొంతు ఫోన్ లో.


"లైబ్రరీలో ఉన్నాను బాబాయ్. వచ్చేస్తాను" చెప్పింది.


"లేదమ్మా నువ్వు వెంటనే బయలుదేరి రావాలి"


"ఏమైంది బాబాయ్?”


"నో ఆర్గ్యుమెంట్స్... నీ కోసం ఇంటి దగ్గర ఎదురుచూస్తుంటాను. వెంటనే బయలుదేరు.”


"ఓ.కె బాబాయ్. వచ్చేస్తున్నాను.”


ఫోన్ ఆఫ్ చేసి ఆలోచనల్లో పడిపోయింది. ఏమిటంత అర్జంటు పని? ఊహకి అందటం లేదు. ఎంతో ముఖ్యమైన పని అయుండాలి. లేకపోతే బాబాయి ఇలా వెంటనే బయలుదేరమని ఒత్తిడి చేయడు.


ఇక ఆలస్యం చేయకుండా తన దగ్గరున్న మినీ డిజిటల్ కెమెరాతో ఆ పుస్తకాన్ని కవర్ డిజైన్ తో సహా ప్రతి పేజీని చకచకా ఫోటోలు తీయటం ఆరంభించింది. ఇరవై నిముషాల్లో ఆ పని పూర్తి చేసింది.


తర్వాత ఆ బుక్ ని భద్రంగా యధాస్థానంలో ఉంచి డిజిటల్ కెమెరాని తన వేనిటీ బ్యాగ్ లో జాగ్రత్త చేసుకుని అప్పుడు స్టీఫెన్ వార్నరికి ఫోన్ చేసింది.


మూడు నిముషాల తర్వాత ఆయన వచ్చి తలుపులు తెరిచాడు. "ఏమైంది శతపత్రా? నీక్కావలసిన సమాచారం దొరికిందా?” అంటూ ఆతృతగా అడిగాడు.


“లేదు సర్” కావాలనే అబద్ధం చెప్పింది శతపత్ర.


"మా బాబాయి ఎందుకో వెంటనే రమ్మని ఫోన్ చేశారు. వెళ్ళాలి. మరోసారి వస్తాను సర్” అంది తిరిగి తనే.


"ఓ.కె. ఇట్సాల్ రైట్... శ్రమపడందే ఫలితం దక్కదమ్మా. ట్రై అగైన్. నీకోసం మరో అవకాశం తప్పకుండా ఇస్తాను" అంటూ డోర్స్ లాక్ చేశాడు.


ఆయన తన ఛాంబర్ లోకి వెళ్ళగానే శతపత్ర వేగంగా బయటకి వచ్చేసింది. స్కూటీని స్టార్ట్ చేసి తాముంటున్న సౌత్ లండన్ లోని గ్యాలక్సీ అవెన్యూ థర్డ్ రోడ్ లోని యూనివర్సల్ టవర్స్ దిశగా పోనిచ్చింది.

🍁

*సశేషం*




[19/02, 5:26 pm] . Mallapragada: *శతపత్ర -18*

🍁


రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు



లండన్ నుంచి ఎనిమిది గంటలు ప్రయాణం చేసి ముంబయి విమానాశ్రయంలో ఫ్లైట్ దిగేసరికి తెల్లవారుజామున అయిదు గంటలయింది సమయం. అక్కడ్నుంచి మరో ఫ్లైట్ పట్టుకుని బాలగోపాలం కుటుంబం హైదరాబాద్ చేరుకునేసరికి ఉదయం పది గంటలు. ఫార్మాలిటీస్ అన్నీ ముగించుకుని బయటపడేసరికి మరో అరగంట పట్టింది.


చలి ప్రాంతమైన యూరప్ నుండి సమ శీతోష్ణ మండలంలోని ఇండియాకు రాగానే వాతావరణం కాస్త వేడిగా అన్పించింది. ఆరేళ్ళ తర్వాత తిరిగి నగరానికి వస్తున్న ఆనందం శతపత్రలో మచ్చుకైనా కానరావటం లేదు. ఆమె మనసు తండ్రి ఆరోగ్యం గురించే కలవరపడుతోంది.


విక్రమవర్మ ఇంటినుంచి ఎయిర్పోర్ట్ కి కారు వచ్చింది. డ్రైవరు తాతారావు వారికోసం ఎదురుచూస్తున్నాడు. అతను బాగా తెలిసినవాడే. చాలా ఏళ్ళుగా విక్రమవర్మ ఇంటి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.


"తాతారావ్... డాడీ ఆరోగ్యం ఎలా వుంది? బాగానే ఉన్నారుకదా?" లగేజీ కారు డిక్కీ లోకి సర్దుతున్న అతడ్ని ప్రశ్నించింది శతపత్ర భయాన్ని దిగమింగుకుంటూ.


“ఫరవాలేదమ్మా... ఇక్కడ ఏమీ మాట్లాడ కూడదని మీ మేనమామ ప్రతాపవర్మగారి ఆర్డర్. మీరు లోపల కూచోండి" అంటూ నిర్లిప్తంగా బదులిచ్చాడు తాతారావు. అతడి మాటల్లో ఉత్సాహం లేదు. ముఖం దిగులుగా కళ తప్పి ఉంది. అతడేదో దాస్తున్నాడనిపించి కంగారుపడింది శతపత్ర. తన మేనమామ ప్రతాపవర్మ మిలిటరీలో మేజర్. స్వయానా తన తల్లి కమలాదేవికి అన్న.


ఆయన కూడా ఇక్కడే ఉన్నాడంటే పరిస్థితి తీవ్రత అర్ధమవుతోంది. ఏదో జరిగిందనే అనుమానం మరింత బలపడింది ఆమెకి. మరిన్ని ప్రశ్నలు అడక్కుండా, తను కార్ లో కూచుని శతపత్రను లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది సువర్ణ. బాలగోపాలం, గోకులం ఇద్దరూ కారు ముందు సీట్లో కూచున్నారు. లగేజి సర్ది డిక్కీ మూసి కారు స్టార్ట్ చేశాడు తాతారావు..


"మీరంతా ఏదో దాస్తున్నట్టున్నారు. నాకు భయంగా ఉంది. నిజం చెప్పండి. డాడీ ఎలా ఉన్నారు?” అడిగింది శతపత్ర. ఆమెకు ఏడుపు ముంచుకొస్తోంది.


ఎవరికి వారు ఆ ప్రశ్న తమకు వినబడనట్టే మౌనం వహించారు. సిగ్నల్స్ వద్ద కారు ఆగినప్పుడు పక్కన క్యాంటిన్లోని ఎఫ్.ఎమ్. రేడియో నుంచి పాట వినబడింది. “ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోవు. ఎదలోపలి మమకారం ఎక్కడికీపోదు. గానగంధర్వుడు శ్రీ బాల మురళీకృష్ణగారు ఆలపించిన పాత సినిమా శోకగీతం అది. తన ప్రస్తుత పరిస్థితి కి ఆ పాట అతికినట్టుగా సరిపోయిందని పించింది శతపత్రకి.


మనిషి ఊరువాడా వదిలి ఏ దేశం వెళ్ళి ఎంతకాలం ఉన్నా, ఎదలో తమవారి మీద ఉండే అనుబంధాలు, మమకారాలు పెరుగుతాయేగాని కొంచెం కూడా తరగవు. చాలాకాలం తర్వాత స్వదేశంలో అడుగు పెట్టినందుకు తనవారిని చూడబోతున్నందు కు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉండాల్సిన సమయమిది.


కాని ఇటువంటి సందిగ్ధావస్థలో తనిలా తిరిగి రావలసివస్తుందని ఎప్పుడూ అనుకో లేదు. డాడీ ఎలా ఉన్నారో.. అసలు ఉన్నారో లేదో తెలీని అయోమయ పరిస్థితి. శతపత్రకి దుఃఖం పొంగుకొస్తోంది. తనకు తెలీకుండానే చెంపలు కన్నీటితో తడిసిపోతున్నాయి. రెక్కలు కట్టుకొని ఇంటిముందు వాలాలని మనసు పదే పదే తొందరచేస్తోంది.


ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అధిగమించి దిల్ సుఖ్ నగర్ సంజీవయ్య కాలనీకి చేరుకునేసరికి పది దాటిపోయింది సమయం.


కాలనీ అయిదో వీధిలోకి కారుమలుపు తిరగ్గానే అంత దూరంలో ఎడంపక్కన మూడంతస్థుల భవంతి వంక భయంతో దృష్టిసారించింది శతపత్ర. అదే విక్రమవర్మ నివాసం. దూరంనుంచే అక్కడి పరిస్థితిని గమనించింది శతపత్ర. ఆమె ముఖం మరింత విషణ్ణవదనమైంది. తను భయపడిన పరిస్థితే అక్కడ కనబడుతోంది.

అక్కడ అనేక వాహనాలు కన్పిస్తున్నాయి. చాలామంది పోలీసులు అధికారులు కన్పిస్తున్నారు. వీధిలో ఎంతోమంది జనం. పుష్పగుచ్చాలతో లోపలికి వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు. అల్లంత దూరాన ఒక లారీని కొందరు పూలతో అలంకరిస్తున్నారు. 


"బాబాయ్. అటు చూడు బాబాయ్. ఆ ఏర్పాట్లు... ఆ జనం... నాకు భయంగా ఉంది. ఇప్పుడన్నా నిజం చెప్పు బాబాయ్. డాడీ ఎలా ఉన్నారు?" ముందు సీట్లో బాలగోపాలం భుజాన్ని వణుకుతున్న చేత్తో బలంగా అదిమేస్తూ గాభరాగా అడిగింది శతపత్ర.


అంతే... ఇక దుఃఖాన్ని నిలువరించుకోవడం బాలగోపాలంకి సాధ్యం కాలేదు. ఆయన పోయాడన్న సంగతి లండన్ లో ఉండగానే తమకు తెలుసు ఆ విషయం శతపత్రకి తెలీకుండా ఎలాగో ఇంటివరకు తీసుకురా గలిగారు. ఇక దాచిమాత్రం ఏం లాభం?


"ఇంకెక్కడి డాడీ తల్లీ. అంతా ఐపోయింది. ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయారు. నీకోసమే అంతా ఎదురుచూస్తున్నారు" అంటూ ఏడ్చేశాడు బాలగోపాలం. ఇటు సువర్ణ కూడా బావురుమంది. మంచు విడిపోయింది. పరదా తొలగిపోయింది. షాక్ తో ఘనీభవించిన మంచు ముద్దయి పోయింది శతపత్ర.


బాలగోపాలం, విక్రమవర్మకి కజిన్ అయినా సొంత అన్నదమ్ముల్లా వుండేవారు. ఆయన పోవటం తమ కుటుంబానికి పెద్ద దిక్కు పోయినట్టయింది. శతపత్ర కోసం దుఃఖాన్ని దిగమింగి ఎలాగో ఇంత దూరం వచ్చారు. ఇక ఆపుకోలేక ఒక్కసారిగా ఏడ్చేశారు. తండ్రి పోయిన వార్త తెలిసిపోవడంతో దుఃఖంతో గుండె ఒక్కసారిగా బండబారి పోయినట్టయింది శతపత్రకి. శిలావిగ్రహంలా అయిపోయింది.


ఈలోపల కారును చూడగానే గేటు వద్ద జనం పక్కలకు తొలగి దారిచ్చారు. కారు సరాసరి లోపలకెళ్ళి ఆగింది. గబగబా కారు దిగారంతా, అంతవరకూ మౌనంగా ఉన్న ఆవరణ శతపత్ర రాకతో ఒక్కసారిగా ఏడుపులు, రోదనలతో నిండిపోయింది. అక్కడ పోర్టికోలో సందర్శకుల దర్శనార్ధం ఎ.సి. బాక్సులో ఉంచారు విక్రమవర్మ  భౌతిక కాయాన్ని. ఆ ప్రాంతమంతా పుష్పగుచ్చాలు పూలదండలతో నిండిపోయి వుంది.


ఎడంగా స్త్రీల మధ్య పుట్టెడు దుఃఖంలో ఉన్న కమలాదేవి కూతురు శతపత్రను చూసి లేచి వచ్చింది. పక్కన ఎవరితోనో మాట్లాడుతున్న మేనమామ ప్రతాపవర్మ.. తన అన్న ఆదిత్యవర్మలు ఇంకా ఇతర బంధువులంతా దగ్గరకొచ్చారు. ఎవరి వంకా చూడలేదు శతపత్ర.


ఉప్పెనలా ఉబుకుతున్న కన్నీళ్ళతో, తడబడుతున్న అడుగులతో సూటిగా ఎ.సి. బాక్సు ముందుకు వెళ్ళి అద్దంలోంచి తండ్రి భౌతికకాయం వంక చూసింది.


విక్రమవర్మ ముఖం మాత్రం కనబడుతోంది. గాఢమైన నిద్రలో ఉన్నట్టున్నాడాయన. శతపత్రకు గుండెలు పగిలిపోతున్నట్ట నిపించింది. తండ్రితో హ్యాపీగా గడిపిన రోజులు తన చిన్ననాటి సంగతులు గుర్తుకొస్తున్నాయి.


తనకు పట్టుపరికిణీలు కొని తను ధరించగా తండ్రి కళ్ళలో లక్ష వెలుగులు... తన కాళ్ళకు వెండిపట్టీలు వేసి చూసుకొని వెన్నెల్లా ఆశీస్సులు కురిపించిన రోజులు... చెవులకు జూకాలు... ముక్కుకు పుడక... చేతుల నిండా గాజులు... నడుముకి వడ్డాణం... పాపిట బిళ్ళ నుదుట... ఇంకా ఎన్నో... ప్రతిసారి తండ్రిలో ఆనందపు వెలుగులు.


వర్తమానపు ఆనందాలు కొన్నాళ్ళకి జ్ఞాపకాలుగా మిగిలిపోవడం అంటే ఇదేనా? శాశ్వతం కాని ఆనందం చరిత్రపుటల్లో ఎందుకు...? ఘనీభవించిన వేదన కరిగిపోయింది. కనురెప్పల మాటున ఆగిన కన్నీళ్ళు కాలువైపోయాయి.


అంతే.. ఇక ఆగలేకపోయింది. అనురాగా ప్యాయతల సౌథం కుప్పకూలిపోయింది.


"ఎందుకిలా జరిగింది? చెప్పండి డాడీ.. ఎన్నిసార్లు పిలిచినా రాలేదన్న కోపంతో నాకింత పెద్ద శిక్ష వేస్తారా? మాట్లాడండి నేను వచ్చేశాను. మీతో మాట్లాడాలి. చూడండి డాడీ... డాడీ" అంటూ ఉన్నట్టుండి పెద్దగా రోదిస్తూ తలను బాక్స్ కేసి కొట్టుకుంది శతపత్ర. తండ్రి అంటే ఆమెకు ఎంత ప్రేమో కుటుంబంలో అందరికీ తెలుసు. ఆమె దుఃఖం చూపరుల గుండెల్ని కదిలించింది. ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనన్న భయం తో కమలాదేవి వేగంగా వచ్చి కూతుర్ని లేపి కౌగిట పొదువుకుంది. బంధువులంతా చుట్టూ చేరి తల్లీకూతుళ్ళను ఓదార్చనారంభించారు.


క్షణాల్లో శోకసముద్రమైపోయిందా ప్రాంతం.


లండన్ నుంచి శతపత్ర మిగిలినవారి రాకతో రావలసినవాళ్ళంతా వచ్చేసినట్టయింది. ఇక విక్రమవర్మ అంతిమ యాత్రకి మిగిలిన ఏర్పాట్లు జరిగిపోయాయి.


ఆయన భౌతికకాయాన్ని బయట పూలతో అలంకరించి వున్న లారీపైకి చేర్చారు. పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అశేష ప్రజావాహిణి అనుసరించి వస్తూండగా సిబిఐ ఆఫీసర్ విక్రమవర్మ అంతిమయాత్ర ఘనంగా ప్రారంభమయింది.


ఇదే మానవ జీవితం.. ఇంతకంటే ఏముంది? ఏముంటుంది? ఏమీ ఉండదు... కాని ఒకటుంటుంది. బతికుండగా అతను చేసిన దానధర్మాలు, ఆర్తులకు, అనాధలకు, అభాగ్యులకు అతను చేసిన సేవలు, పంచిన ధనం, సంపద, చేసుకున్న పూజలు, తిరిగిన పుణ్యక్షేత్రాల ఫలం... హోమఫలం, యజ్ఞఫలం... మిగిలే వుంటాయి. వచ్చే జన్మకి అవి బట్వాడా అవుతాయి. బతుకును పండిస్తాయి.

🍁

*సశేషం*

[20/02, 12:44 pm] . Mallapragada: *శతపత్ర -19*


విక్రమవర్మ గతించి ఒక నెల దాటింది. చేయాల్సిన కర్మకాండలు ముగిశాయి. ప్రత్యర్ధుల్ని చిత్తుచేయగల నేర్పు, ప్రతిభా పాటవాలు కలిగిన ఒక ధీశాలిని సి.బి.ఐ. కోల్పోయింది. అయితే ఆయన మరణం మాత్రం ఒక అంతు చిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. ఆయన్ని ఎవరు చంపారో ఎవరికీ తెలీదు.


ఒరిస్సాలో ఒక కేసు పరిశోధన ముగించుకు ని ఢిల్లీవెళ్ళకుండా అదేరోజు ఇటు నగరానికి వచ్చాడాయన. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న దారిలో అస్సాసినేషన్ జరిగింది. ఎత్తయిన బిల్డింగ్ పైనుంచి దుండగులు కారుమీద కాల్పులు జరిపారు. ఆయనతో ప్రయాణిస్తున్న మరో జూనియర్ అధికారి, ఆ కారు డ్రైవర్ స్పాట్ డెడ్ కాగా, విక్రమవర్మ ఆస్పత్రిలో ఒక రోజంతా మృత్యువుతో పోరాడి కన్ను మూశాడు.


హంతకులు ఒకరికన్నా ఎక్కువే ఉండొచ్చని పోలీసులు నిర్ధారించారు. ఆ ముఠా కాల్పుల అనంతరం మెరుపు వేగంతో అక్కడి నుండి మాయమయ్యారు. నగర పోలీసులతో పాటుగా సి.బి.ఐ. కూడా ఈ కేసును పరిశోధిస్తోంది. కాని ఇంతవరకు అరెస్టులు జరగలేదు.


అసలు ఒరిస్సా నుంచి తన ప్రోగ్రామ్ మార్చుకుని ఢిల్లీ వెళ్ళకుండా ఆయన హైదరాబాద్ వస్తున్నట్లు, ఆ కారులోనే ప్రయాణిస్తున్నట్టు, ప్రత్యర్థులకు ఎలా తెలిసిందో ఊహకి అందని విషయం.


ఈ విషయాలన్నీ తెలిసి చాలా బాధపడింది శతపత్ర. డాడీ పోయిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోంది. ఇక ఇప్పట్లో లండన్ వెళ్ళే ఉద్దేశ్యం ఆమెకులేదు. నలభై రోజుల తర్వాత బాలగోపాలం కుటుంబం తిరిగి లండన్ వెళ్ళిపోయింది. అందరు బంధువులూ వెళ్ళిపోయారు.


అన్నయ్య ఆదిత్యవర్మ సివిల్స్ చేసి ఐఏఎస్ పాసయ్యాడు. ప్రస్తుతం అతను ఒరిస్సా సి.ఎమ్.కి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అతను కూడా తన కుటుంబంతో భువనేశ్వర్ వెళ్ళిపోయాడు. అంతేకాదు కొద్ది రోజులు తమతో ఉండి వస్తుందని తల్లి కమలాదేవిని తమతో తీసుకుపోయాడు. ఇక ఆ ఇంట్లో మిగిలింది శతపత్రతోపాటు నానమ్మ పద్మావతి, తాతయ్య మహేంద్ర వర్మ. ఆ ఇంటిని నమ్ముకుని చాలాకాలంగా పనిచేస్తున్న వంటావిడ, అవుట్ హౌస్ లో ఉండే తోటమాలి కుటుంబం కూడా అక్కడే వుంటారు.


డ్రైవర్ తాతారావు మాత్రం డ్యూటీకి వచ్చి ఇంటికెళ్ళి పోతుంటాడు. అందరూ శతపత్ర ను కనిపెట్టి చూసుకుంటున్నారు. లండన్ నుంచి వచ్చాక ఇంతవరకూ ఇల్లు వదిలి బయటకు వెళ్ళలేదామె. తండ్రిమీద బెంగతో చిక్కిసగమైంది. మానసిక స్థితి కూడా బాగుండటం లేదు.

📖


ఇలా ఉండగా ఆ రోజు రాత్రి తెల్లవారు జామున మరోసారి అమె కలలో సాక్షాత్కరించింది ఆ గరుడలోయ. ఈసారి లోయ పైన గాలిలో విహరిస్తున్నట్టుగా వచ్చిందా కల. టక్కున లేచి కూర్చుంది శతపత్ర. కాస్సేపు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. తన తండ్రి మరణానికి దారితీసిన పరిస్థితులకి, కలలో వస్తున్న గరుడలోయకీ సంబంధం ఉందేమోనని భయపడుతున్న సమయంలో మరోసారి ఆ కలరావడం ఆమెలో కలకలం రేపింది.


తనను నీడలా వెంటాడుతున్న కలమీద పిచ్చిగా కోపం ముంచుకొచ్చింది. ఇక మళ్ళీ నిద్రపోలేదు. లేచి ముఖం కడుక్కుంది. కాఫీ పెట్టుకు తాగింది. అప్పుడు సమయం తెల్లవారుఝాము అయిదుగంటలు. తన లగేజీలో వెతికి మినీ డిజిటల్ కెమెరాను తీసుకుంది. కంప్యూటర్ ముందు కూర్చుని దాన్ని కంప్యూటర్ కి అనుసంధానం చేసింది.


స్క్రీన్ మీద అన్ సాల్వడ్ మిస్టరీస్ ఇన్ ఇండియా పేరుతో జాన్ ఉడ్ రాసిన పుస్తకం ప్రత్యక్షమైంది. గరుడలోయ ముఖచిత్రం స్క్రీన్ నిండుగా కనిపిస్తోంది.


మొదటి మిస్టరీ ద్వారక సమీపంలోని సొరంగం గురించి. అప్పట్లో లైబ్రరీలోనే ఆ సొరంగం గురించి చదివింది. రెండో మిస్టరీ చదవబోతుండగా అర్జెంటుగా ఇంటికి రమ్మని బాబాయి ఫోన్ చేశాడు.


తనకు బాగా గుర్తు.... ఆ బుక్ లోని నాలుగో మిస్టరీ గరుడలోయ. ఆ లోయ గురించి తెలుసుకోవాలని ఎంతగా కుతూహలం ఉన్నా ఎందుకో ఒక విధమైన జంకు ఆమె గుండెల్లో గూడు కట్టుకొని వుంది. అందుకే అప్పుడు వెంటనే ఆ లోయ గురించి చదవలేదు.


ఇప్పుడూ ధైర్యం చేయలేకపోతోంది. మిగిలిన మిస్టరీల గురించి తెలుసుకొని చివరగా ది వ్యాలీ ఆఫ్ గరుడా గురించి చదవాలనుకుంది. చకచకా పేజీలు తిప్పి రెండో మిస్టరీ వద్ద ఆగింది. చదవటం ఆరంభించింది.


రెండో మిస్టరీ అస్సాంలోని ఒక కొండమీది బావి గురించి. గౌహతికి దక్షిణంగా ఎనభై మైళ్ళ దూరంలోని అటవీ ప్రాంతంలో ఒక ఎత్తయిన కొండమీద ఉందా బావి. అది సహజసిద్ధంగా ఏర్పడిందా, ఎవరన్నా తవ్వారా? ఆ బావి లోతు ఎంత? నీళ్ళు ఉన్నాయా, లేవా? ఇవన్నీ తెలిసినవాళ్ళు ఎవరూ లేరు.


స్థానిక గిరిజనులు మాత్రం దాన్ని వజ్రాల కొండగాను ఆ బావిని వజ్రాల బావిగాను పిలుస్తారు. దానికో స్థలపురాణం కూడా ఉంది-


పూర్వం ఎప్పుడో ఆ కొండ ప్రాంతంలో దేవతలకు రాజు ఇంద్రుడికి, వక్రాసురుడనే రాక్షసుడికి భయంకరమైన యుద్ధం జరిగిందట. ఆ సందర్భంగా ఇంద్రుడి వజ్రాయుధం పొరపాటున నిలువుగా కొండ మీదికి జారటంతో కొండ లోపలికి ఆ బావి ఏర్పడిందని, తర్వాత ఇంద్రుడు తిరిగి ఆయుధాన్ని పైకి లాక్కుని ఆ రాక్షసుడిని వధించాడని ఆ రాక్షసుడి తల ఆ బావిలోనే పడిందని ఆ కథ సారాంశం.


వజ్రాయుధం వల్ల ఏర్పడిన ఆ బావిలో వజ్రాలు దొరికేవని ఇప్పటికీ దొరుకుతాయని, రాక్షసుడి తెగిన శిరస్సును తప్పించుకుని పోగలిగితే మోయగలిగినన్ని వజ్రాలు తెచ్చుకోవచ్చని చెప్పుకుంటూ వుంటారు.


విశాలమైన ఆ బావి చుట్టూ ఎత్తయిన వృక్షాలు, దట్టమైన పొదలు ఉన్నాయి. లోపలికి ప్రత్యేకించి మెట్లంటూ లేవు. కాని బావి లోపలికి దిగటానికి అనువుగా బావి గోడల వెంట బండలు ఉన్నాయి.


ఆ బావి గురించిన గాథ విని వజ్రాలమీది ఆశతో అనేకమంది ఆ బావిలోకి దిగి మళ్ళీ తిరిగిరాలేదు. పురాతన కాలం నుంచి ఎందరో ఆ బావికి బలయ్యారు. నడుముకి తాళ్ళు కట్టుకుని బావిలోకి దిగినవాళ్ళు కూడా అదృశ్యమయ్యారట. శవాలు కూడా లభ్యం కాలేదు. బావిలోకి తొంగిచూస్తే చీకటి తప్ప ఏమీ కనబడదు. అయినా కూడా ప్రతి సంవత్సరం ఎందరో ఆ బావిలోకి దిగి అదృశ్యమవుతూనే వున్నారు.


జాన్ ఉడ్ ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ బావి ఫోటోలు తీశాడు. అప్పటి ఆ ప్రాంతం కలెక్టరు ఆర్నాల్డ్ ని కలసి బావి గురించి ప్రస్తావించినప్పుడు త్వరలోనే ఆ బావిమీద ఇనుపకంచెలు వేసి చెక్కలు బిగించి మట్టితో దాన్ని శాశ్వతంగా మూయించేస్తానని మాట ఇచ్చాడట. ఆ బావి తాలూకు కొన్ని ఫోటోల్ని అప్పటి పత్రికల పేజీల్లో ప్రచురించారు.

📖


మూడో మిస్టరీ ఇండోనేపాల్ సరిహద్దులోని ఒక వింతవృక్షం... ఆసక్తిగా చదువుతోంది శతపత్ర.


నేపాల్ సరిహద్దు ఇవతల దురాంగ్ అనే చోట అటవీ ప్రాంతంలో రహదారికి సమీపంలో వుందా మహావృక్షం. శాఖోప శాఖలుగా విస్తరించిన అ వృక్షరాజం ఏ జాతిదో ఏ కాలంనాటిదో తెలిసినవాళ్ళెవరూ లేరు.


అలాంటి చెట్టు మరొకటి కానరాదు. ఒక విధమైన సువాసనలు వెదజల్లే పూలు పూస్తుందా చెట్టు, ఆకులు ముడతపడి శాఖలకు వేలాడుతున్నట్టుంటాయి. విశేషం ఏమిటంటే... ఆ చెట్టు మీద ఒక్క పక్షి కూడా వాలదు. సమీప వృక్షాల మీద కూడా పక్షులు సంచరించవు.


పొరపాటున బాటసారులు ఎవరయినా తెలీక వెళ్ళి ఆ చెట్టు నీడన అరగంట విశ్రమిస్తే చాలు వారికి పిచ్చి పడుతుంది. శాశ్వతంగా పిచ్చివాళ్ళయిపోతారు.


ఆ మహావృక్షాన్ని నరికివేయాలనిగాని తగులబెట్టాలనిగాని, ఎవరైనా ప్రయత్నిస్తే, హాని చేయాలనుకుంటే, ఆ వెనువెంటనే వారికి ఏదో ఒక చెడు జరుగుతుంది. దాంతో ఆ చెట్టుకు మహిమలున్నాయని భావించిన గిరిజనులు ఆ చెట్టు సమీపంలోకి పోకుండా దూరం నుంచే పూజలు చేసి తమకు హాని చేయవద్దని మొక్కుకుని పోతుంటారు. ఆ చెట్టు గురించి వింటేనే భయపడిపోతారు జనం. ప్రభుత్వం స్పందించి ఆ చెట్టు సమీపంలోకి ఎవరూ వెళ్ళకుండా దాని చుట్టూ బలమైన కంచె ఏర్పాటు చేస్తున్నట్టు రాశాడు రచయిత జాన్ ఉడ్.


నాలుగో వింత గరుడలోయ.


దాన్ని వదిలి అయిదో వింత చదవటం ఆరంభించింది శతపత్ర. అది ఒక శిథిల నగరానికి సంబంధించిన విశేషం. రాజస్థాన్ లోని జైపూర్ పింక్ సిటీగా పేరుగాంచింది.


జైపూర్ నగరానికి సమీపంలోని ఎడారి భూముల్లో భానునగర్ అనే శిథిల నగరం ఉంది. దీన్ని స్థానికులు భానర్ అని కూడా పిలుస్తుంటారు. మూడు శతాబ్దాల క్రితం అది ఒక రాజ్యానికి రాజధానీ నగరం. అది శిథిలం కావటం వెనక ఒక గాధ ప్రచారంలో ఉంది.


సుమారు రెండువందల సంవత్సరాల క్రితం సంగతి... అప్పట్లో భానునగర్ రాకుమారి గొప్ప సౌందర్యవతి. ఆమె అందం చూసి ఒక మంత్రగాడైన సన్యాసి ఆమెనిమోహించాడు. రాకుమారిని తన వద్దకు రప్పించుకోవడా నికి మంత్రించిన అత్తరు సీసాను ఆమెకు కానుకగా పంపించాడు. అప్పుడు సన్యాసి కుతంత్రాన్ని గ్రహించిన రాకుమారి ఆ సీసాను ఒక బండరాతికి విసిరికొట్టింది. మంత్ర ప్రభావంతో ఆ బండరాయి దొర్లుకుంటూ వెళ్ళి మంత్రించిన సన్యాసి మీదేపడి అతడి ప్రాణాలు తీసింది.


చనిపోయే ముందు ఆ సన్యాసి పగతో, కోపంతో భానునగరం శిధిలమైపోతుందని రాకుమారి కన్యగానే మరణిస్తుందనీ శపించాడట. సన్యాసి శాపం కారణంగా మరుసటి ఏడు ఆ ప్రాంతంలో భయంకర మైన క్షామం ఏర్పడింది. తినడానికి తిండి, తాగటానికి నీరులేక ప్రజలు అల్లాడి పోయారు. వింత వ్యాధులు సోకి జనం చనిపోగాసారు. నగరాన్ని కాపాడుకోవాలని రాజుగారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రజలు నగరాన్ని ఖాళీచేసి వెళ్ళిపోయారు.


రాజకుటుంబం కూడా రాచనగరును, నగరాన్ని వదిలేసి మరో నగరానికి వెళ్ళిపోయింది. అయితే మాంత్రికుడైన సన్యాసి శాపం గురించి తెలుసుకున్న రాకుమారులెవరూ రాకుమారి ఎంతటి అందగత్తె అయినా ఆమెను పెళ్ళి చేసుకోవడానికి సాహసించలేకపోయారు.


కన్యగానే మిగిలిపోయిన రాకుమారి చివరికి శిధిలమైన భానునగరానికి వచ్చి అక్కడే ఆత్మహత్య చేసుకుంది. క్లుప్తంగా భానునగర్ చరిత్ర అది.


అయితే అసలు కథ ఆ తర్వాతే మొదలయింది.


రాత్రివేళ నిర్మానుష్యమైన భానునగర్ లోకి ఎవరు వెళ్ళినా తెల్లవారేసరికి శవాలుగా మారిపోసాగారు. రాకుమారి ఆత్మ పిశాచం గా మారి అక్కడ సంచరిస్తూ రాత్రిపూట అక్కడ ఎవరు అడుగుపెట్టినా దారుణంగా చంపేస్తుందని, అక్కడ దయ్యాలు కూడా సంచరిస్తున్నాయని చుట్టుపక్కల అనేక వదంతులు వ్యాపించాయి. దాంతో ఎవరూ అటు వెళ్ళేవారు కాదు.


కాలక్రమంలో ఆ నగరం మొత్తం పూర్తిగా శిథిలమైపోయింది. గతంలో రాచనగరు ఉండేచోట కొన్ని ఆలయాలు పాడైపోయినా చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆ ఆలయాల వెనక నిధులు పాతిపెట్టి వున్నాయని, అవి ఇప్పటికీ అక్కడే ఉన్నాయని జనంలో ఒక ప్రచారం ఉంది. ఆ నిధులను తవ్వి తెచ్చుకో వాలనే ఆశతో శిథిల నగరంలోకి ప్రవేశించిన ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాను చూసేటప్పటికే భానునగర్ పూర్తిగా శిథిలమైందని తన పుస్తకంలో రాశాడు జాన్ ఉడ్.

రాత్రికి అక్కడే ఉండి ఏం జరుగుతుందో చూడాలని అనుకున్నా, స్థానికులు చేసిన హెచ్చరికలతో భయపడి వెనక్కి వచ్చేశానని రాశాడాయన. శిథిలనగరం వద్ద ప్రజల్ని హెచ్చరిస్తూ వేసిన శాసనాల ఫోటోగ్రాఫ్స్ ని కూడా తన పుస్తకంలో పొందుపరిచాడు.


చరిత్రపరంగా చూస్తే అక్బరుకాలం నాటికే భానునగరం ఉంది. అక్బరు వద్ద మంత్రి సైన్యాధ్యక్షుడు రాజామాన్ సింగ్ కి తమ్ముడు అయిన రాజా మాధవ్ సింగ్ అధీనంలో, అతని రాజధానిగా ఉండేది భానునగర్.


రాజా మాన్ సింగ్ తోబుట్టువును అక్బరు వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా వారికి బంధుత్వం కూడా ఉంది. తర్వాతి కాలంలో ఔరంగజేబు తదనంతరం మొగలాయిలు బలహీనపడి రాజ్యం ముక్కలైంది. ఆ సమయంలో భానునగర్ జైసింగ్ అనే రాజు పాలనలోకి వచ్చింది. 18వ శతాబ్దం చివర జరిగిన సంఘటన అది. ఈ జైసింగ్ కాలం లోనే రాకుమారి, సన్యాసి గాధ జరిగిందని అంటారు. తీవ్రమైన క్షామం ఏర్పడి ప్రజలు భానునగరాన్ని ఖాళీ చేసిందీ జైసింగ్ కాలంలోనే.


అయితే ఆ శిథిలనగరంలోకి పొరపాటునో, లేక కావాలనో రాత్రివేళ అడుగుపెట్టినవారు అతిదారుణంగా ఎలా చనిపోతున్నారనే ప్రశ్నకు సమాధానం కనిపెట్టినవాళ్ళు లేరు.


1890లోనే శిథిల నగరం చుట్టూ ప్రభుత్వం కంచె ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు వేలాడదీసినా ఎవరో ఒక్కరు ఆ నగరంలోకి వెళ్ళి బలైపోతున్నారు. ఆ నగర విశేషాలు చదువుతున్న శతపత్రకు తను ఇంటర్ చదువుతున్న రోజులు గుర్తొచ్చాయి.


అప్పట్లో నగరం నుంచి మూడు బస్సుల్లో విద్యార్థులు రాజస్థాన్ టూర్ వెళ్ళారు. ఆ టూర్ లో తనూ ఉంది. పింక్ సిటీ జైపూర్ చూశాక మరునాడు శిధిలమైన భానునగర్ వెళ్ళి చూసి చీకటిపడక ముందే వెనక్కి వచ్చేశారు. అప్పుడు-ఆ నగరం గురించి తను విన్న సమాచారానికి, తన రచనలో జాన్ ఉడ్ చెప్పిందానికి అంతా అతికినట్టుగా సరిపోయింది.


అంటే జాన్ ఉడ్ ఎవరో చెప్పింది విని ఆషామాషీగా ఈ బుక్ రాయలేదు. తాను స్వయంగా దర్శించి ఫోటోలు తీసుకుని సమగ్ర సమాచారం సేకరించి రాశాడు.

🍁

*సశేషం*

**శతపత్ర -20*

జాన్ ఉడ్ చెప్పిన ఆరో వింత నాగభూమికి చెందినది. ప్రస్తుతం నాగాలాండ్ గా పిలుస్తున్న ప్రాంతాన్ని ఆ రోజుల్లో నాగభూమి గా వ్యవహరించేవారు. అక్కడ ప్రతి ఏటా నాగపంచమి రోజున ఒక విశేషం జరుగుతుంది. ఆ రోజున ఎక్కడెక్కడి నుండో అనేక రకాల పాములు బయలుదేరి పవిత్రమైన వాగుగా పిలవబడే చిన్న సెలయేటిని గుంపులు గుంపులుగా దాటి అక్కడి నుండి ఒకే మార్గంలో వరుసలు తీరి మూడుమైళ్ళ దూరం ప్రయాణించి ఒక కొండబిలంలోకి వెళ్ళిపోతాయి.

అలా వెళ్ళినవి వెళ్ళటమేగాని అవి తిరిగి బయటకు రావటం చూసిన వాళ్ళెవరూ లేరు. తెల్లత్రాచు, నల్లత్రాచు, గోధుమవన్నె నాగుపాములు, కొండచిలువలు, దాసరి పాములు, కట్లపాములు, పొడలపాములు, రెండు తలల పాములు ఇలా అనేక జాతుల పాములు ఆ రోజు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు పవిత్రమైన వాగును దాటి నాగకొండగా పిలవబడే ఆ కొండబిలం లోకి వెళ్ళిపోతుంటాయి. కొండ దిగువన నాగలోకం ఉందని స్థానిక గిరిజనుల నమ్మకం.

అ ఒక్కరోజు తప్పితే మిగిలిన సంవత్సరం లో నాగకొండ పరిసరాల్లో ఒక్క పాము కూడా కనిపించదు.

ఈ వింత సంగతి అలా ఉంచితే, ఆ రోజున పొరపాటున పాముల యాత్రకు అడ్డంగా జంతువులుగాని, మనుషులుగాని ఎవరు వెళ్ళినా మహాకోపంతో పాములు దాడిచేసి, కాటువేసి చంపేస్తాయి. ఏటా పాముల బారిన పడి అనేకమంది చనిపోవటం అక్కడ సర్వసాధారణం.

ఏటా నాగపంచమికి నాలుగురోజుల ముందే పవిత్ర వాగునుంచి నాగకొండ వరకు భద్రతాపరంగా కావలి ఏర్పాటు చేసి నాగుల దారిలోకి ఎవరూ పోకుండా చూస్తే మాత్రం ప్రమాదాల్ని నివారించవచ్చు. కాని బ్రిటీష్ ప్రభుత్వం అలాంటి ముందు జాగ్రత్త చర్యలేవీ తీసుకోకపోవటం విచారించతగ్గ విషయం అంటారు జాన్ ఉడ్.

ఇక ఏడవది అయిన ఆఖరి మిస్టరీ ఒక చిన్న దీవికి సంబంధించినది. దక్షిణ భారతంలోని రామేశ్వరం నుంచి శ్రీలంక మధ్యన సముద్రం లో కొన్ని దీవులున్నాయి. ఆ దీవుల్లోని ఒక చిన్నదీవి పేరు రోదనదీవి.

ధనుష్కోటికి కూతవేటు దూరంలోని అందమైన దీవి అది. ఆ దీవి పేరు చెప్తేనే అంతా భయపడతారు. చేపలు పట్టేవారు కూడా ఆ దీవి సమీపంలోకి వెళ్ళరు. కారణం ఏమిటంటే పగలంతా ఆ దీవి నిశ్శబ్దంగా ఉంటుంది. కాని చీకటిపడితే చాలు ఆ దీవి నుంచి అనేక గొంతుకల రోదన విన్పిస్తుంది. గుండెల్ని పిండే ఆ రోదన ధ్వనులు సముద్ర జలాల మీద నిశీధిలో చాలాదూరం విన్పించి గుండెల్లో దడపుట్టస్తాయి.

సముద్ర పిశాచాలు చీకటిపడేసరికి ఆ దీవి మీదకు చేరి అలా విలపిస్తుంటాయని జాలర్ల నమ్మకం. అని నిజంగా రోదనలా లేక గాలి, సముద్ర కెరటాలు బండల్లో సుడి తిరిగి రోదనలు సృష్టిస్తూ మాయ చేస్తున్నాయా అంటే ఖచ్చితంగా చెప్పగలిగినవాళ్ళు లేరు.

గతంలో కొందరు జాలర్లు సాహసించి ఆ రోదనల రహస్యం భేదించాలని రాత్రివేళ పడవల్లో ఆ దీవికి వెళ్ళటం జరిగింది. అలా వెళ్ళిన వాళ్ళలో ఒక్కడు కూడా తిరిగి రాలేదు. పగలు వెళ్ళి చూసినవారికి రాత్రి వేళల్లో వెళ్ళినవారి శవాలు తల తెగి, ప్రేవులు బయటకు వచ్చి బీభత్సంగా కన్పించేవి.

ఇక ఆ తర్వాత పగలు, రాత్రి కూడా ఆ దీవిని చేరటానికి ఎవరూ సాహసించలేదు. ఆ దీవిమీదకు ఎవరూ వెళ్ళరాదని హెచ్చరిస్తూ తీరంలో బోర్డులు కట్టించి చేతులు దులిపేసుకుంది బ్రిటీష్ ప్రభుత్వం. రోదన దీవిమీద మిలటరీతో సర్వే చేయిస్తే విచిత్రమైన రోదనల రహస్యం బయటపడే అవకాశం ఉంది. కాని చిత్తశుద్ధితో బ్రిటీష్ ప్రభుత్వం ఆ దీవి గురించి పట్టించుకోవటం లేదంటాడు రచయిత జాన్ ఉడ్.

అంతవరకూ చదివిన శతపత్ర, ఆలోచనల్లో కూరుకుపోయింది. బయట తెల్లవారిన సంగతి కూడా ఆమెకు తెలియదు. తను చదివి తెలుసుకున్న ఆరు ప్రమాదకరమైన వింతల్లోను శిథిల నగరమైన భానునగర్ ఒక్కటే ఇప్పటికీ ఉంది. మిగిలిన వింతల గురించి ఇప్పుడు ఎవరికీ తెలీదనే అనుకోవాలి. ద్వారకవద్ద సొరంగం గురించి ఇప్పుడు ఎవరికీ తెలీదు. జాన్ ఉడ్ ఈ రచన చేసేనాటికే బ్రిటీష్ ప్రభుత్వం ఆ సొరంగాన్ని మూసేసింది.

అలాగే అస్సాంలోని కొండమీది వజ్రాల బావిని కూడా మూసేశారు. మూడోది నేపాల్ సరిహద్దు సమీపంలోని వింతవృక్షం. అది ఏమైందో తెలిసినవాళ్ళు లేరు.

నాగభూమిలోని నాగులకొండ విషయం తెలీదు. పవిత్రవాగు దాటి నాగపంచమి రోజున పాములు యాత్ర చేసి నాగులకొండ బిలంలోకి వెళ్తున్నాయో లేదో ఖచ్చితంగా తెలీదు. ఇప్పటికీ అలా జరుగుతుంటే మీడియాలో ఆ విశేషాలు వస్తూ వుండాలి. కానీ ఎక్కడా ఆ వార్త లేదు.

ఇక ఆఖరి వింత రోదన దీవి. 1970 ప్రాంతంలో వచ్చిన తుఫాను తరుణంలో ఉప్పెన వచ్చి ధనుష్కోటి దీవి సముద్రంలో మునిగిపోయింది. దానితోపాటు మరికొన్ని దీవులు కూడా నీట మునిగాయి. రోదనదీవి కూడా మునిగిపోయింది. ఆ తర్వాత నుంచి ఎవరూ అక్కడ రోదనలు వినలేదు. చరిత్రలో రోదన దీవి ఒక మిస్టరీగానే మిగిలి పోయింది.
📖

ఆలోచనలు ఆపి తను వదిలేసిన నాలుగో మిస్టరీ గరుడలోయ పేజీల్లోకి వెళ్ళింది శతపత్ర.

ఆ లోయ గురించి ఏం చదవాల్సి వస్తుందో నని ఆమె గుండెలు దడదడలాడాయి. శతపత్ర కనులు కంప్యూటర్ స్క్రీన్ మీద చకచకా పేజీల వెంట పరుగుతీస్తున్నాయి. ఆశ్చర్యంతో ఆమె కనులు మరింతగా విశాలమవుతున్నాయి.

దక్షిణంగా ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో తుంగభద్రా నదీతీరానికి సమీపంగా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో గరుడలోయ ఉన్నట్టుగా వివరించాడు రచయిత జాన్ ఉడ్. తను స్వయంగా గరుడలోయను సందర్శించాడు గాని, లోయలోకి దిగటానికి సాహసించలేక పోయినట్లు, అందుక్కారణం ఆ లోయ గురించి తను విన్న సమాచారమే కారణమంటూ పేర్కొన్నాడతను.

ఆ లోయలో ఏం జరుగుతుందో, అక్కడి విశేషాలేమిటో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు.

అప్పుడప్పుడూ లోయలో నుంచి విచిత్రమైన ఏవో ధ్వనులు వినిపిస్తుంటాయి. లోయలో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలంతో ఎవరైనా ఆ గరుడలోయలో ప్రవేశిస్తే, ఇక తిరిగి రారు. అసలు వాళ్ళు ఏమయ్యారో, బతికున్నారో లేదో కూడా బయటి ప్రపంచానికి తెలీదు.

గరుడలోయ పరిసరాల్లోకి తెలిసినవాళ్ళు ఎవరూ వెళ్ళరు. ఆ ప్రాంతం అడవుల్లో చెంచులు, యానాదులు, బోయలు మొదలైన ఆటవిక జాతుల నివాసాలు ఉన్నాయి. అవన్నీ లోయకు దూరంగా ఉన్నాయి. వేట నిమిత్తం కూడా ఆయా జాతుల యువకులు లోయ ప్రాంతంలోకి వెళ్ళరు. అనాదిగా తమ జాతుల్లో ఆ లోయ గురించి ప్రచారంలో వున్న భయంకరమైన గాథలే అందుక్కారణం. కొందరు చెంచు యువకుల సాయంతో జాన్ ఉడ్ గరుడ లోయను చుట్టూ సంచరించి వచ్చాడు.
ఆ లోయ చాలా పురాతనమైనదని చెప్పే ఆధారాలూ సేకరించాడు. కొన్ని వందల సంవత్సరాలుగా ఆ గరుడలోయ అతి ప్రమాదకరమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది.

శాతవాహనరాజుల కాలంలో ముందుగా ఆ లోయ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. శాతవాహనరాజుల్లో మొదటి వాడు శ్రీముఖ శాతవాహనుడు. ఇతను క్రీస్తుపూర్వం 220 నుండి 198 వరకు దక్షిణ భారతాన్ని పరిపాలించాడు. ఇతనికి పూర్వపు రాజులు శ్రీకాకుళం (కృష్ణాజిల్లా) రాజధానిగా పరిపాలన సాగించారు. శ్రీముఖుడు కృష్ణానదికి ఎగువన అమరావతి నగరాన్ని నిర్మించి, తన రాజధానిగా మార్చుకున్నాడు. ఆయన కాలంలోనే ఎవరూ లోయలోకి పోకుండా తొలిసారిగా అక్కడ శాసనం వేయించాడు.

తర్వాత క్రీస్తుశకం 6వ శతాబ్దంలో శాతవాహన చక్రవర్తి మొదటి పులోమావి గరుడలోయ ప్రాంతాన్ని సందర్శించటం జరిగింది. అతను క్రీస్తు శకం 6వ సంవత్సరం నుండి 41 వరకు అంటే సుమారు 36 సంవత్సరాలు పరిపాలనచేశాడు. ఆయన అధికారంలోకి వచ్చిన సంవత్సరమే కొంకణ ప్రాంతంలో తిరుగుబాటు చెలరేగింది. పులోమావి ఆ ప్రాంతం మీదకు దండెత్తి తిరుగుబాటుదారుల్ని అణచివేశాడు.

అమరావతికి తిరుగు ప్రయాణంలో అనుకోకుండా గరుడలోయ ప్రాంతాలకు రావటం, ఆ ప్రాంతాన్ని పులోమావి సందర్శించటం జరిగింది. అప్పుడే ఆయన ప్రజల సంరక్షణార్థం గరుడలోయను చుట్టూ మూడు ఆమడల దూరం, బలమైన కంచె నిర్మింపజేసి ఎవరూ లోయలోకి పోరాదని శాసనాలు వేయించాడు.

శాతవాహనుల్లో 15వ వాడు పులోమావి. ఇక చోళ చక్రవర్తుల కాలంలోనూ ముఖ్యంగా నన్నైచోళుని కాలంలో, కొంత కాలం గరుడ లోయ పరిసరాల్లో కాపలాదారుల్ని నియమించినట్టుగా అక్కడి కొన్ని శాసనాల మూలంగా తెలుస్తోంది.

కాలగతిలో చదవటానికి వీలుగాకుండా నాశనమైన అనేక శిలాశాసనాల అవశేషాలు అక్కడ కన్పిస్తాయి. అవన్నీ గరుడలోయ ప్రాచీనతని తెలియజేస్తాయి.

రచయిత జాన్ ఉడ్ కాలంనాటికి కంచె పూర్తిగా శిథిలమైపోయి దాని తాలూకు కొన్ని గుర్తులు మాత్రం మిగిలాయి. అనేక శాసనాలూ పాడైపోయాయి. గరుడలోయ పరిసరాలతోపాటు కొన్ని శాసనాల ఫోటోగ్రాఫ్స్ ని కూడా తన రచనలో పొందుపరిచాడు జాన్ ఉడ్.

ఆయన వివరించిన మరో ఆసక్తికరమైన విచిత్రం ఏమిటంటే, తను చూస్తుండగా అనేక గరుడపక్షులు (గ్రద్దలు) లోయ పై భాగాన వలయాకారంగా గాలిలోతిరుగుతూ కనిపించాయట. అవి కాకుండా మరో జాతిపక్షి ఒక్కటి కూడా లోయ మీదుగా ఎగరటం తను చూడలేదట. పొరపాటున కూడా వేరే జాతిపక్షి లోయ మీదుగా వెళ్ళదని, వెంట వచ్చిన చెంచులు చెప్పగా విని జాన్ ఉడ్ ఆశ్చర్యపోయాడట.

బ్రిటీష్ ప్రభుత్వం గరుడలోయ గురించి పట్టించుకోవటం లేదని, ఏటా ఎందరో అమాయకులు అక్కడ బలైపోతున్నారని, తన రచన చివర్లో ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు జాన్ ఉడ్.
📖

అంతా చదివాక కంప్యూటర్ ఆఫ్ చేసి అలాగే కూర్చుండిపోయింది శతపత్ర. దీర్ఘాలోచనలో మునిగిపోయి. నిజంగా ఒక అద్భుతమైన పుస్తకం జాన్ ఉడ్ రచన. తనకు తెలియని గొప్ప వింతల గురించి తెలిసింది. తనను కలవరపెడుతున్న కల వివరాలూ తెలిశాయి. కాని ఎక్కడో ఉన్న గరుడలోయ తన కలలో పదే పదే ఎందుకు
సాక్షాత్కరిస్తుందో బుర్రబద్దలు కొట్టుకున్నా అర్ధం కావటం లేదు. ఇప్పటికీ గరుడలోయ అలాగే ఉండి ఉండవచ్చు. స్వాతంత్య్రం వచ్చాక అందునా నేటియుగంలో ఆ లోయ గురించి పట్టించుకునేవాళ్ళు లేక ప్రస్తుతం ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. కాని తనకే ఆ ప్రాంతం కలలో కనబడటం ఏమిటి? ఆ లోయకి, తనకి సంబంధం ఏమిటి?

ఏ అదృశ్య శక్తి తననిలా ఆందోళనకు గురి చేస్తోంది? ఇది తనను ఎక్కడికి తీసుకు పోతోంది? సమాధానం దొరకని అనేక ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటో కూడా బోధపడడం లేదు.

అలా ఎంతసేపు ఉండిపోయిందో ఆమెకే తెలీదు. అంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడుతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటపడింది.

"అమ్మా శతపత్రా. లేచావా?” బయటి నుంచి నానమ్మ పద్మావతి గొంతు వినిపించింది.

"లేచాను నానమ్మా” అంటూ బదులిచ్చి లేచి వెళ్ళి తలుపు తీసింది శతపత్ర. ఎదురుగా పొగలు చిమ్ముతున్న కాఫీ కప్పుతో నిలబడుంది నానమ్మ.

"టైమ్ ఎనిమిదయిందే అమ్మాయ్. నువ్వు ఇంతసేపు బయటికి రాకుండా ఏం చేస్తున్నావ్?” అడిగిందావిడ.

"మైగాడ్. అప్పుడే ఎనిమిదయిందా! కంప్యూటర్ ముందు కూర్చుంటే టైమ్ తెలీలేదు నానమ్మా. తాతయ్య లేచారా?” కాఫీ కప్పు అందుకుని సిప్ చేస్తూ అడిగింది.

“ఆయనా లేటుగానే లేచారు. ఇందాకే వాకింగ్ కి వెళ్ళారు. టిఫిన్ రెడీ అవుతోంది. త్వరగా రా.”

“సరే నానమ్మ. పది నిముషాల్లో వచ్చేస్తాను.”

నానమ్మ పోబోతూ వెనుతిరిగి "అన్నట్టు ఇంతకుముందే భువనేశ్వర్ నుంచి మీ అమ్మ ఫోన్ చేసిందే. నువ్వింకా లేవలేదనుకొని పిలవలేదు.”

"ఎలా వుంది? అన్నయ్య, వదిన ఎలా ఉన్నారట?” అడిగింది శతపత్ర.

"అంతా బాగానే ఉన్నారు గాని. తనే అక్కడ ఉండలేకపోతోందట. వచ్చేస్తానంటోంది. నీ గురించి మరీ మరీ అడిగింది.”

"సరే నానమ్మా. నేను ఫోన్ చేసి మాట్లాడతాలే” అంటూ ఖాళీ కప్పు ఇచ్చి ఆమెను పంపించేసి తను స్నానానికి బాత్రూమ్ లోకి వెళ్ళిపోయింది.
🍁
*సశేషం*

శతపత్ర -21*
🍁

రచన: సూర్య దేవర  రామ్ మోహనరావు

స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అరగంట తర్వాత బయటికొచ్చింది శతపత్ర. డైనింగ్ రూమ్ లో కెళ్ళి టిఫిన్ చేసి వచ్చి హాల్లో టీవీ ముందు కూచుని ఆన్ చేసింది.

భక్తి ఛానెల్ లో ఎవరో స్వామీజీ ఫోన్ ఇన్ కార్యక్రమంలో సందేహాలకు సమాధానం చెప్తున్నారు.

ఛానెల్ మార్చబోతూ చివరిక్షణంలో ఆగింది శతపత్ర. నిగూఢమైన విషయాలు స్వామీజీ లు బాబాలకు తెలుస్తాయంటారు. ఫోన్ చేసి గరుడలోయ గురించి అయన్ని అడిగితే! మెరుపులా ఆమె మనసులో ఫ్లాషయిందీ ఆలోచన, వెంటనే సెల్ ఫోన్ అందుకుని స్క్రోలింగ్ లో వస్తున్న ఆ ఛానెల్ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసింది.

నాలుగుసార్లు ప్రయత్నించిన తర్వాత లైన్ కలిసింది. స్వామీజీ లైన్ లోకొచ్చారు. "స్వామీ, నా పేరు శతావని” కావాలనే పేరు మార్చి చెప్పింది.

“చెప్పమ్మా. ఏమి నీ సందేహం?” టీవీ స్క్రీన్ మీద స్వామీజీ చిరునవ్వుతో అడిగారు.

"కలలు నిజమవుతాయా స్వామీ?” అడిగింది.

"కలలన్నీ నిజం కావు తల్లీ. ఎక్కడో ఒకటి రెండు నిజమవుతుంటాయి. వాటి గురించి నీకెందుకు చింత?”

"ఒకే కల పదే పదే వస్తుంటే అర్థం ఏమిటి?”

"నీ మనసులో ఏదన్నా బలమైన తీరని కోరిక ఉంటే అది తరచూ కల రూపంలో రావచ్చు. ఇంతకీ నువ్వు ఏం తెలుసుకోవాల నుకుంటున్నావు?"

"నాకు గరుడలోయ గురించిన వివరాలు కావాలి"

స్క్రీన్ మీద స్వామీజీ విచిత్రంగా చూశాడు. మొదటిసారి కొత్తగా ఏదో వింటున్నట్టుగా ఆశ్చర్యపోయారు.

"గరుడపురాణం గురించి అడుగు చెప్తాను. కాని నువ్వు అడిగిన గరుడ లోయ గురించి ఇంతవరకు నేను వినలేదమ్మా” ఆశ్చర్యం లోంచి ఇంకా తేరుకోకుండానే సౌమ్యంగా సమాధానం ఇచ్చారు స్వామీజీ. ఈలోపు ఫోన్ లైన్ కట్టయిపోయింది.

శతపత్రకు కోపం ముంచుకొచ్చింది. సాదా సీదా స్వామీజీలను సంప్రదించి లాభం లేదు. ఆధ్యాత్మికతలో తలపండిన మహాత్ముల్ని అడిగి తెలుసుకోవాలి.

తెలిసిపోయింది గదా అని వెనకాముందూ చూడకుండా నల్లమల అడవుల్లో ఎక్కడో వున్న గరుడ లోయకు వెళ్ళి ప్రమాదాల్లో పడకూడదు.. ముందుగా ఆ లోయలో ఏముందో తెలుసుకోవాలి.

అలా తెలియాలంటే జ్ఞానదృష్టిగల మహాత్ము లకి మాత్రమే సాధ్యం. మానవుల్లో ఆ లోయ లోకి వెళ్ళి చూసి ప్రాణాలతో తిరిగివచ్చిన వాళ్ళు లేరు. కొద్దిరోజులు తను తీర్థయాత్రల సాకుతో దేశసంచారం చేసి మహాత్ముల్ని కలుసుకొని వారి సలహాలు తీసుకోవాలి. ఆ తర్వాతే గరుడ లోయకు ప్రయాణం.

అప్పటికప్పుడు ఒక స్థిరనిర్ణయానికి వచ్చేసింది శతపత్ర. సరే కాని నానమ్మ, తాతయ్యలను ఒప్పించటం ఎలా? కాని అదే రోజు సాయంకాలం మేనమామ ప్రతాపవర్మ రాకతో ఆ సమస్య కూడా తీరిపోయింది.
📖

శతపత్ర చెప్పిందంతా చాలా శ్రద్ధగా, ఆసక్తిగా విన్నాడు మేజర్ ప్రతాపవర్మ. తమ మాటలు ఎవరూ వినకుండా మేడమీద శతపత్ర గదిలోనే కూచున్నారు ఇద్దరూ.

ఏదీ దాచకుండా జరిగిందంతా పూసగుచ్చి నట్టుగా మేనమామకి వివరించింది శతపత్ర. తన చదువు పూర్తయినా ఇండియా తిరిగి రాకపోవడానికి తనకు వస్తున్న కల కారణమని చెప్పింది.

కలలో కనిపించే లోయ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నంలో ఆరు మాసాల పాటు లండన్ లైబ్రరీలో గాలించిన విషయం చెప్పింది. తనకు లభించిన జాన్ ఉడ్ రచన గురించి చెప్పింది. కంప్యూటర్ ఆన్ చేసి జాన్ ఉడ్ పుస్తకాన్ని కూడా చూపించింది.

ప్రతాపవర్మ గరుడలోయ గురించి చదివి తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు. అంతా విన్నాక రిలాక్డ్ గా కూచుని శతపత్ర వంక చూశాడు.

"నమ్మలేకపోతున్నాను. నీకు ఒక కల రావటం ఏమిటి? నువ్వు దాని గురించి ఇంత రిస్కు తీసుకోవడం ఏమిటి? అర్థం గావటంలేదు. కాని నువ్వు అనుకున్నట్లు మీ డాడీ మరణానికి, ఆ కలకు ఎటువంటి సంబంధం లేదు. అదలా ఉంచు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు?” అడిగాడు.

"గరుడలోయకు వెళ్ళాలనుకుంటున్నాను” వెంటనే బదులిచ్చింది, ఎలాంటి సంకోచం లేకుండా.

"ఉహూ.. ఇది సరైన నిర్ణయం కాదు. మీ డాడీ బతికుంటే నిన్ను వెళ్ళనిచ్చేవారు కాదు. ఆడపిల్లవు. నువ్వు ఇంకోసారి బాగా ఆలోచించు" అన్నాడు ప్రతాపవర్మ.

"బాగా ఆలోచించే ఈ నిర్ణయానికొచ్చాను. అయితే ఇప్పుడే అక్కడికివెళ్ళే ఉద్దేశ్యం లేదు. ముందుగా ఆ లోయలోని మిస్టరీ ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.”

"ఎలా తెలుస్తుంది. వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరున్నారు?”

"లేరు నిజమే. కాని సిద్ధులు, మహాత్ములైన వారికి ఆ రహస్యం తెలుసుకోవటం కష్టం కాదు. అలాంటి వారిని వెదుకుతూ కొద్ది రోజులు తీర్ధయాత్రలు చేయాలనుకుంటు న్నాను. కాని నానమ్మ, తాతయ్య అందుకు ఒప్పుకోరు. నువ్వే నచ్చచెప్పి ఒప్పించాలి” అంది.

అయిష్టంగానే తల ఊపాడు ప్రతాపవర్మ.

"సరే. ఆ విషయం నాకు వదిలెయ్యి. కాని వివరాలు తెలిశాక కూడా నువ్వు ఒంటరిగా గరుడలోయకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. అయినా ఎందుకొచ్చిన రిస్కు ఆడపిల్లవు. సాహసాలు మంచిది కాదు. నా మాట విను" నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు.

శతపత్ర చిరునవ్వు నవ్వింది.

"మామయ్యా. నాది సాహసం అనుకో... తెగింపు అనుకో... నేను ఒక నిర్ణయం తీసుకున్నాక, వెనక్కు తగ్గే అలవాటు నాకు లేదు. గరుడలోయకు వెళ్ళటం నా లక్ష్యం. అంతే” అంది స్థిరంగా.

“ఓ.కె. ఇంతగా నువ్వు చెప్పాక నిన్ను నేను ఆపను. కాని ఒంటరిగా ఆ లోయలోకి వెళ్తానంటే నేను ఒప్పుకోను. ఎలాంటి రిస్క్ నైనా ఫేస్ చేయగల సాహసవంతుడయిన ఒక యువకుడు నాకు బాగా తెలుసు. నేను చెప్తే కాదనడు. యునెస్కో తరఫున, ప్రపంచ వారసత్వం హోదా కలిగిన, భారతదేశంలోని పురాతన కట్టడాల పరిరక్షణకు, అలాగే భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రాచీన కట్టడాల రక్షణ, మనుషుల్ని రక్షించడానికి మనదేశంలో ఒక ప్రత్యేక రక్షణ విభాగం ఉంది. అందులో స్పెషల్ ఫీల్డ్ ఆఫీసర్ అతను.

నువ్వు గరుడలోయకు వెళ్ళే ముందు నాకు ఫోన్ చేస్తే, అతన్ని నీకు తోడుగా పంపిస్తాను. ఇక నుంచి నువ్వు నాకు ఫోన్ లో టచ్ లో ఉండాలి. వచ్చేవారం నేను ఆర్మీకి తిరిగి వెళ్ళిపోవలసి వుంది. ఐనా నీ ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు నేను చేస్తాను. అర్థమైందా?”

"థ్యాంక్స్ మావయ్యా. అర్థమైంది"

“మరో మాట. మీ డాడీ షిర్డీ సాయినాధుని భక్తుడు. నువ్వూ ఆయన్ని నమ్ముతున్నావని అనుకుంటాను. నీ తీర్ధయాత్రలు ముందుగా షిర్డీ వెళ్ళి బాబా దర్శనంతో ఆరంభించు. నీ ప్రయత్నం సఫలమవుతుంది. ఉదయం వచ్చి నానమ్మ తాతయ్యలను నేను ఒప్పిస్తాలే. చాలా పొద్దు పోయింది. నేనిక ఇంటికెళ్తాను" అంటూ లేచాడు.
📖

లేచి పోబోతూ ఏదో చెప్పటానికి సందేహించాడు.

"ఏమిటి మామయ్యా?" అడిగింది శతపత్ర.

"ఏం లేదమ్మా. ఒక ముఖ్య విషయం నీతో చెప్పాలి”

"చెప్పండి" అంది శతపత్ర.

"మీ డాడీ మూడేళ్ళ కిందటే వీలునామా రాశాడు. బహుశా మీకెవరికీ ఆ విషయం తెలీదనుకుంటాను.”

“తెలీదు" అంది శతపత్ర.

"ఈ ఇల్లు, కొంత ఆస్తి మీ అమ్మ పేర ఉంచి, మిగిలిన ఆస్తి నీకు, అన్నయ్య ఆదిత్య వర్మకి చెరిసగం చెందేట్టు రాశాడు. నీ పెళ్ళికి ఇబ్బంది లేకుండా నీ పేరన రెండు కోట్ల రూపాయలు బ్యాంకులో ముందే డిపాజిట్ చేసున్నాయి. వాటి తాలూకు పేపర్లు మీ లాయర్ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఈ విషయాలు నీ మనసులోనే ఉంచుకో.
నిజానిజాలు ఎంతవరకో తెలీదుగాని మీ డాడీ హత్య విషయంలో సిబిఐ వాళ్ళ దృష్టి మన ఆదిత్యవర్మ మీద ఉంది. అరెస్టు జరిగినా ఆశ్చర్యం లేదు.

పక్కన బాంబు పేలినట్టుగా ఉలిక్కిపడింది శతపత్ర.

“నో... నేన్నమ్మను. డాడీని హత్య చేయించేంత నీచుడు కాదు అన్నయ్య” అంది దిగ్భ్రాంతి చెందుతూ.

“కాదనే నేను అనుకుంటున్నాను. కాని ఆధారాలు లేనిదే చట్టం అనుమానించదు. అనుమానాలన్నీ నిజాలు కావు. అధికారులు అనుమానించటానికి కారణం ఏమిటో చెప్తాను విను. లోపాయికారిగా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ రోజు ఏం జరిగిందంటే, సరాసరి ఢిల్లీ నుంచి నాన్న- విక్రమవర్మతో పాటు పదిమందితో కూడిన సి.బి.ఐ. బృందం ఒరిస్సా చేరుకుని వారం రోజులయింది.

ఒరిస్సాకు చెందిన కేంద్రమంత్రి మీద వేలకోట్ల రూపాయల కుంభకోణం ఉంది. ఆ కేసు విచారణ నిమిత్తం వచ్చారంతా. ఆ కేంద్రమంత్రి ఒరిస్సా సి. ఎమ్ కి కావలసిన బంధువు. మన ఆదిత్యవర్మ ఒరిస్సా సి. ఎమ్ కి ముఖ్య కార్యదర్శి. ఆలోచించు.

విచారణ జరిగిన వారం రోజులూ నాన్న, విక్రమవర్మ మిగిలిన సబార్డినేట్స్ తో విడిగా నే ఉన్నాడు. కొడుకు ఇంటికి వెళ్ళలేదు. అందరితోనూ ఢిల్లీ వెళ్ళిపోతున్నట్టే చెప్పాడు. కాని చివరిక్షణంలో ఆదిత్యవర్మ ఇంటికి వెళ్ళి కొడుకు, కోడల్ని, మనవల్ని చూసి వాళ్ళతో ఓ గంటసేపు గడిపి బయలుదేరాడు.

కొడుకుతో అబద్ధం చెప్పలేడు కాబట్టి తను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్తున్నట్టుగా నిజమే చెప్పాడు. ఆయన హైదరాబాద్ వస్తున్నట్టుగా ఆదిత్యవర్మకి తప్ప ఒరిస్సాలో ఎవరికీ తెలీదు. సబార్డినేట్స్ కి తన ప్రోగ్రామ్ చెప్పలేదు. వాళ్ళని ఢిల్లీ విమానం ఎక్కించి పంపించాక తను హైదరాబాద్ విమానం ఎక్కాడు.
విమానం దిగి కారులో వస్తుండగా ఇక్కడ హత్య జరిగింది. కాబట్టి ఆయన హైదరాబాద్ కి వస్తున్నట్టుగా ఎవరో శత్రువులకి ఉప్పందించి వుండాలి. అందుకే అధికారులు రెండు కోణాల్లోనూ ఆలోచిస్తున్నారు.

ఒకటి తన తండ్రి షెడ్యూల్ను ఆదిత్యవర్మే లీక్ చేసి ఉండాలి లేదా ఎయిర్ పోర్ట్ లో ఆయన్ని చూసిన శత్రువుల మనిషి ఎవడో ఫోన్ చేసి హత్యకు రంగం సిద్ధం చేయించి ఉండాలి. ప్రధానంగా సి.ఎమ్. ముఖ్య కార్యదర్శి కావటం మూలంగా మనవాణ్ణి అనుమానిస్తున్నారు.

అది నిజం కాకూడదనే కోరుకుందాం. ఈ విషయంలో ప్రస్తుతం మనం మౌనంగా ఉండటం మంచిది. అర్థమైందా?” అంటూ వివరించాడు.

మౌనంగా తల ఊపింది శతపత్ర.

"అన్నయ్య మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది మామయ్యా. వాడికి ఏ పాపం తెలీదనే అనుకుంటున్నాను. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్ష అనుభవిస్తారు. ప్రస్తుతం ఈ విషయంలో నా మనసు పాడుచేసుకోను. నా దృష్టంతా తీర్ధయాత్రలమీదే" అంది.

"ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. ఉదయం వచ్చి నేను తాతయ్య, నానమ్మలతో మాట్లాడి ఒప్పిస్తాను గదా" అంటూ ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు ప్రతాపవర్మ. అప్పటికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది సమయం. శతపత్ర మనసును ప్రశాంత పరుచుకుని డైనింగ్ రూమ్ కి వెళ్ళి భోజనానిక్కూచుంది.

సరిగ్గా అప్పుడే లండన్ నుంచి విశ్వదా ఫోన్ చేసింది. క్రమం తప్పకుండా వారంలో రెండు మూడుసార్లు ఫోన్ చేస్తుంది విశ్వదా.

"ఏం చేస్తున్నావ్?" అడిగింది శతపత్ర.

“ఇప్పుడే భోజనం చేస్తున్నాను. నువ్వు గుర్తొచ్చి ఫోన్ చేశాను” అంది అవతలి నుంచి విశ్వదా.

"నేనూ ఆ పనిలోనే ఉన్నాను" అంది శతపత్ర.

"ఇక్కడ ఇండియాలో రాత్రి ఎనిమిది గంటలంటే అక్కడ లండన్ లో మధ్యాహ్నం రెండుగంటలు. రెండు దేశాల మధ్య టైమ్ వ్యత్యాసం ఉంది. భోజనాలు చేస్తూ కబుర్లలో మునిగిపోయారు స్నేహితురాళ్ళు ఇద్దరూ.
🍁
*సశేషం*


*శతపత్ర -22*
🍁

హైదరాబాద్ నుంచి ఒక భక్తబృందం షిరిడీకి బయలుదేరింది. వారివెంట తనూ బస్ లో బయలుదేరింది శతపత్ర. దారిలో వున్న అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ నాలుగోరోజుకి ఆ బస్సు పుణ్యక్షేత్రమైన షిరిడీకి చేరుకుంది.

శతపత్ర మనసు గజిబిజిగా ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఆమెకి ఇది ఒక గమ్యమంటూ లేని ప్రయాణం. అందుకే తనకు సరైన మార్గం చూపించమని ముందుగా సాయి నాధుని వేడుకునేందుకు షిరిడీకి వచ్చిందామె.

గరుడలోయ విశేషాల గురించి తనకు తెలియపరచగల మహనీయుడు ఎక్కడ దొరుకుతాడా అని దారి పొడవునా అన్వేషిస్తూనే వుంది శతపత్ర. కాని ఆమె అన్వేషణ ఫలించలేదు. సాధారణ సాధు సన్యాసులు, బాబాలు తనకు సాయం చేయలేరని ఆమెకు తెలుసు. సర్వం తెలిసిన సిద్ధయోగులకు మాత్రమే అది సాధ్యం. అలాంటి మహనీయులు ఎక్కడ ఉంటారు? వారిని ఎక్కడని వెతికి పట్టుకోవాలి?

ఈ ప్రయాణ ఏర్పాట్లకు ముందు మేనమామ మేజర్ ప్రతాపవర్మ ఆమె ప్రయాణాన్ని ఆపాలని ఎంతో చెప్పి చూశాడు. "నువ్వు ఆడపిల్లవు. పెళ్ళి చేసుకొని  సంసారంలో స్థిరపడాల్సినదానవు. నీ చదువుకి మంచి ఉద్యోగమే వస్తుంది. పోనీ వ్యాపారంలో స్థిరపడాలన్నా అందుకు అవసరమైన ఆర్థిక వనరులు, తెలివితేటలు నీవద్ద పుష్కలంగా ఉన్నాయి. అవన్నీ వదులుకొని ఇప్పుడి ప్రయాణం అవసరమా? ఐనా అసలు ఆ గరుడలోయ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది తెలుసుకోవటం మూలంగా మనకేమిటి లాభం? వద్దమ్మా. ఆగిపో" అంటూ హితవు పలికాడు.

"లాభం ఉందో లేదో నాకయితే తెలీదు మామయ్యా... ఒకటి కాదు రెండు కాదు అనేక నెలలుగా ఆ గరుడలోయ కలలో నన్ను వెంటాడుతోంది. వేధిస్తోంది... హింసిస్తోంది... తీవ్రమైన ఆందోళనకు లోనుచేస్తోంది. నేను అసలు ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాను. ఇలా ఎంతకాలం..? ఎంతకాలం భరించను?... తెలియాలి. అదేమిటో నాకు తెలియాలి. లోకంలో ఎందరో అమ్మాయిలున్నారు. కాని విచిత్రంగా ఈ కల నాకే ఎందుకు వస్తోంది? నేను దాన్ని మరిచిపోదామని ప్రయత్నించినా అది నన్ను వదలటం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం తెలుసుకోకపోతే జీవితంలో ప్రశాంతంగా బతకలేను మావయ్యా. అందుకే ఈ ప్రయాణం. నన్ను ఆపకండి" అంటూ బయలు దేరింది.
📖

శ్రీశైలం అడవుల్లోను, చిత్రకూట పర్వత గుహల్లోను, హిమాలయాల్లోని బదరీనాథ్ క్షేత్రానికి వెళ్ళే దారిలోను మహనీయులు ఉండే కొన్ని ప్రదేశాల గురించి, కొందరు సాధువులు చెప్పగా వింది శతపత్ర.

ఈ విషయంలో ముందుగా షిరిడీ వచ్చి ఆ తర్వాతే ఎటు వెళ్ళాలో నిశ్చయించుకోవాల నుకుందామె.

తన తండ్రి బ్రతికినంత కాలం నమ్మి కొలిచిన గురువు, దైవం, సాక్షాత్తూ దత్తాత్రేయుని అవతారమైన అవధూత, సిద్ధయోగి శ్రీ సాయినాధుడు తనకు మార్గం చూపే బాధ్యతను ఆయనకే వదిలి ముందుగా ఆయన దర్శనం కోసం షిరిడీకి వచ్చిందామె.
షిరిడీ రాగానే హైదరాబాద్ భక్తబృందం నుండి విడిపోయి ఒక సత్రంలో గది తీసుకుంది.

షిరిడీలో అడుగుపెట్టగానే భువిలో వెలసిన కైలాసం అనిపించింది. తనకే తెలీని భక్తి భావంతో పులకించిపోయింది ఆమె హృదయం. ఆ మరునాడే గురువారం కావటంతో భక్తుల తాకిడి అధికంగా ఉంది. తనకు దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యతను
ఆ సాయినాధునికి విడిచిపెట్టి మూడు రోజులు ప్రశాంతంగా అక్కడే ఉండిపోయింది శతపత్ర. ఉదయం, సాయంత్రం బాబా సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకొనివస్తోంది. ఎటుచూసినా భక్తజన సందోహంతో షిరిడీ వీధులు కిటకిటలాడుతున్నాయి. అక్కడ కులమతభేదాల్లేవు, పేద, గొప్ప అనే తారతమ్యాలు లేవు. ఎటు చూసినా బాబా నామస్మరణే వినిపిస్తోంది. షిరిడీని వదిలి వెళ్ళాలనిపించటంలేదు శతపత్రకు.

అది మూడో రోజు సాయంకాలం.

మరునాడు ఉదయమే బయలుదేరి శ్రీశైలం వెళ్ళిపోవాలనే ఉద్దేశంలో ఉందామె. ఆ రోజు శనివారం. సాయంత్రం హారతివేళకు బాబా దర్శనం చేసుకుని తను బసచేసిన సత్రానికి తిరిగి వస్తోంది.

అప్పుడు జరిగింది ఒక విచిత్రమైన సంఘటన. ఒక మండపం సమీపంలోకి వచ్చేసరికి ఎటునుంచి వచ్చాడో గాని ఒక వృద్ధుడు ఆమె దారికి అడ్డం వచ్చాడు.

ఉలిక్కిపడి తలెత్తి చూసింది శతపత్ర.

తలకు తుండు చుట్టుకుని చేతికర్రతో ఎవరో వృద్ధ రైతులా ఉన్నాడు. ఆజానుబాహుడు. ఆయన ముఖంలో వింత తేజస్సు తొంగి చూస్తోంది. వెన్నెలకన్నా చల్లనైన ఆయన చూపులు ప్రసరించగానే ఒక అనిర్వచనీయ మైన ఆత్మీయానుబంధానికి గురై శతపత్ర పులకించింది. తనకే తెలీని పులకింతతో నమస్కరించింది.

"బిడ్డా... ఆకలిగా ఉంది తల్లీ. తినడానికి ఏమన్నా పెట్టవా?” అనడిగాడాయన.

“అయ్యో... నా వద్ద సాయినాధుని ప్రసాదం మాత్రమే ఉంది. తింటావా తాతయ్యా” అంటూ ఇవ్వబోయింది.

ఆయన అయిష్టంగా తల ఊపాడు. “నాకు ప్రసాదాలకు లోటు లేదు. వేరే ఏదైనా పెట్టు" అన్నాడు.

ఏం చేయాలో పాలుపోలేదు శతపత్రకు. ఎవరో తిక్క తాతలా ఉన్నాడే అనుకుంటూ తన బ్యాగ్ లో చూసింది. అంతక్రితం కొన్న అరటిపళ్ళు కన్పించాయి. వాటిని పైకి తీసి ఇచ్చింది. ఒకే ఒక పండు తీసుకుని ఆత్రంగా తిన్నాడు.

“వస్తాను తాతయ్యా” అంటూ ముందుకు పోబోయింది శతపత్ర.

“ఏం తల్లీ... రావటం నీ ఇష్టమే. వెళ్ళటమూ నీ ఇష్టమేనా?” అన్నాడావృద్ధుడు.

శతపత్రకు అర్థంకాలేదు.. "ఏమంటున్నావ్ తాతయ్యా?" అనడిగింది.

“నన్నేదో అడగాలని వచ్చావ్. సమాధానం పొందకుండానే వెళ్ళిపోతావా?” చేతికర్ర భుజాలకు అడ్డంగా వేసుకుని చమత్కారం గా నవ్వుతూ అడిగాడా వృద్ధుడు.

ఒకింత కలవరపడింది. శతపత్ర. ఏమంటున్నాడీయన? ఎవరీ వృద్ధుడు? పిచ్చివాడా? లేక ఆయన మాటలకు వేరే అర్ధాలు ఉన్నాయా? ఆయన ఎవరో తనకు తెలీదు. అడగాలని వచ్చావంటాడు. సమాధానం పొందకుండా వెళ్ళిపోతావా అంటాడు.
"మీ నాన్న సకుటుంబంగా నా దగ్గరకి రావాలనుకున్నాడు. ఆ కోరిక తీరకుండానే కాలం చేశాడు. నువ్వయినా వచ్చావని నేను ఎంతో సంతోషించాను. తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావ్ వెళ్ళు" అంటూ గిరుక్కున వెనుతిరిగి అలిగి తన దారిన పోబోయాడు ఆ వృద్ధుడు.

అది విని బిత్తరపోయింది శతపత్ర.

తమ కుటుంబం గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. ఎవరో మహనీయుడు కాదుగదా! వడివడిగా వెళ్ళి, ఆయన దారికి అడ్డంగా నిలబడింది.

“నా తప్పులుంటే క్షమించు తాతయ్యా. మీరెవరో తెలుసుకోలేకపోతున్నాను. ఎవరు మీరు?" అనడిగింది శతపత్ర అమాయకంగా.

అప్పుడు కూడా ఆయన పెదవుల మీద అదే చిరునవ్వు పున్నమి వెన్నెల్లా ప్రకాశించింది. "అందరికీ నేను తెలుసు. నేను నీకు తెలీదా? పోన్లే ఫరవాలేదు. అక్కడా ఇక్కడా తిరక్కు నేరుగా నువ్వు షోలాపూర్ వెళ్ళు. అక్కడికి యాభై మైళ్ళ దూరంలో సంస్థాన్ అనే చిన్న ఊరుంది. అక్కల్ కోట మహరాజ్ వారి శిష్య పరంపరలోని వాడైన బాబా చిత్రదేవ్ ఆశ్రమం ఉందక్కడ. ఆయన్ని కలుసుకో. నీ సందేహాలన్నీ తీరిపోతాయి" అన్నాడు.

అడక్కుండానే తనకు మార్గం చూపుతున్న ఆ వృద్ధ రైతు పాదాలకు నమస్కరించింది శతపత్ర.

“దీర్ఘాయుష్మాన్ భవ" అంటూ ఆశీర్వదించి ఆమెను లేపాడాయన.

"ఆ సాయినాథుడే మిమ్మల్ని నావద్దకు పంపినట్టున్నాడు. ఎవరు తాతయ్యా మీరు?" అనడిగింది శతపత్ర కుతూహలంగా.

"పిచ్చితల్లి. నేనెవరో ఇంకా తెలీలేదా? చూడు... నా కళ్ళలోకి సరిగ్గా చూడు..." అన్నాడాయన.

చూసింది శతపత్ర. ఆ కళ్ళలో శతకోటి వెలుగులు చూసి ఉలికిపాటుకు గురయింది. ఆధ్యాత్మికానందోద్వేగానికి లోనైపోయింది. ఆయన కళ్ళలోని దివ్యకాంతుల్లో అనేక రూపాలు కన్పిస్తున్నాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దత్తాత్రేయుడు, శ్రీపాదవల్లభుడు చివరిగా కాలుమీద కాలు వేసుకొని చిద్విలాసంగా కూర్చున్న సాయినాథుడు దర్శనమిచ్చాడు.

అంతే... భక్తి పారవశ్యంతో తెలివి తప్పి దబ్బున కిందపడిపోయింది శతపత్ర. ఉన్నట్టుండి ఆమె పడిపోవడం చూసి పరుగు పరుగున అక్కడికి వచ్చారు కొందరు భక్తులు. ఎవరో వాటర్ బాటిల్ తెచ్చి ఆమె ముఖాన నీళ్ళు చిలకరించారు.

చిన్నగా కళ్ళు తెరిచింది శతపత్ర. కలలోంచి లేచినట్టు లేచి అయోమయంగా చుట్టూ చూసింది. ఎవరెవరో ఆమెని ఏమేమో అడుగుతున్నారు. అవేమీ వినిపించటం లేదామెకు. ఆమె కళ్ళు ఆ వృద్ధుడి కోసం వెదుకుతున్నాయి.

“ఇంతసేపూ ఒక వృద్ధుడు ఇక్కడే నాతో మాట్లాడాడు. ఆయన ఎటు వెళ్ళారు?" అనడిగింది.

“వృద్ధుడా ఎవరూ లేరే” అంది ఒకామె ఆశ్చర్యపోతూ.

“అవును... ఇక్కడ నిలబడి నీలో నువ్వే మాట్లాడుతుంటే, మతి తప్పిందేమో అనుకున్నాము. నీవద్ద ఎవరూ కనబడలేదు" అంది మరొకామె.

"లేదు లేదు... తలపాగా, చేతికర్రతో ఒక ముసలాయన నాతో మాట్లాడాడు. ఆయన్ని మీరెవరూ చూళ్లేదా." అంది షాక్ నుంచి బయటపడుతూ.

చూడలేదని అంతా ముక్తకంఠంతో చెప్పారు.

ఎవరూ చూళ్ళేదు. తనకు మాత్రమే కన్పించాడాయన. ఆయన్ని కలుసుకోవాలని పిచ్చిదానిలా వీధి ఆ చివరి నుంచి ఈ చివరకు పరుగుతీసింది శతపత్ర. ఆయన జాడలేదు. వచ్చింది, తనతో మాట్లాడింది ఎవరో ఇప్పుడు శతపత్రకు స్పష్టంగా అర్థమైపోయింది. తనకు సాయినాథుని దర్శనభాగ్యం దొరికింది. ఆయన తనకి దారి చూపించాడు. ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి? ఆనందభాష్పాలతో ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. తిరిగి బాబా సన్నిధికి వెళ్ళింది. రెండు గంటలు క్యూలో ఉండి సన్నిధానం చేరుకుంది. బాబా సమాధి ముందు సాష్టాంగపడి నమస్కరించింది.

లేచి చూసేసరికి మరో అద్భుతం.

"తనతో మాట్లాడిన వృద్ధుడు చిద్విలాసంగా నవ్వుతూ ఆ సమాధి మీద తనకి దర్శనం ఇచ్చాడు. అలా కొన్ని సెకన్లపాటు కన్పించి ఆశీర్వదిస్తూ చూస్తూండగానే గాలితో పాటు అదృశ్యమయ్యాడు. భక్తి పారవశ్యంతో పులకించిపోతూ మరోమారు నమస్కరించి వెనుతిరిగింది శతపత్ర.

తనెక్కడికి వెళ్ళాలో బాబా సూచించాడు. సాయినాథుని లీలల గురించి ఎందరో ఎన్నో చెప్పగా వింది. ఇప్పుడు తానే స్వయంగా చూసింది. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తను బసచేసిన సత్రానికి తిరిగివచ్చింది శతపత్ర. అప్పటికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది.

ఇక సమయం వృధా చేయదలచుకోలేదు. ఆమె. అప్పటికప్పుడు గది ఖాళీ చేసింది. ఎయిర్ బాగ్ భుజానవేసుకుని బస్టాండ్ కి చేరుకుంది. తను భోంచేయలేదన్న విషయం కూడా ఆమెకు గుర్తులేదు.

ఆమె బస్టాండ్ కి వచ్చేసరికి షోలాపూర్ వెళ్ళే లగ్జరీబస్ ఒకటి అక్కడ బయలుదేరటానికి సిద్ధంగా వుంది.

ఆమె బస్ లో కూచున్న కొద్దిసేపటికే ఆ బస్సు షిరిడీని వదిలి షోలాపూర్ మార్గంలో శరవేగంతో దూసుకుపోనారంభించింది.
🍁
*సశేషం*

శతపత్ర -23*
🍁

తెల్లవారి ఎనిమిది గంటలకు శతపత్రను షోలాపూర్ లో దించిందా బస్సు. అక్కడి నుండి లోకల్ బస్ ఎక్కి సంస్థాన్ గ్రామానికి చేరుకునేసరికి  పదిగంటలైంది సమయం. బస్టాండ్ నుంచి ఆటోలో ఆశ్రమానికి చేరుకుంది. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో చుట్టూ కొండగుట్టలు, పచ్చని వాతావరణం మధ్య ప్రశాంతంగా, ముని వాటికలా ఉంది ఆశ్రమప్రాంతం.

సరిగ్గా పది నలభై నిముషాలకు శతపత్ర, బాబా చిత్రదేవ్ ముందు ఉంది. ఆమె రాక ఆయనకు ముందే తెలిసిపోయిందేమో ఆమె బయటకు వెళ్ళేవరకు ఎవరినీ లోపలకి పంపించవద్దని తన శిష్యులను ముందే ఆదేశించాడు బాబా చిత్రదేవ్. ఆయనకు తన గురించి ఎలా తెలిసిందోనని, శతపత్ర పెద్దగా ఆశ్చర్యపోలేదు.

'మహనీయులకు తెలియని విషయాలు ఉండవుగదా! సుమారు డెబ్బై సంవత్సరాల వయసుంటుంది బాబా చిత్రదేవ్ కి. ఆరడుగుల పొడవున సన్నగా ఉన్నాడు. దేహం బంగారుఛాయతో మెరిసిపోతోంది. ఆయన తలమీది జుట్టు, గడ్డం, మీసాలు వెండితీగల్లా మెరుస్తున్నాయి. నడుం చుట్టూ కావితుండు మాత్రం కట్టుకుని దర్భాసనం మీద పద్మాసనస్థితిలో ఉపనిష్ఠుడై వున్నాడాయన.

“సందేహాలు తీర్చి పంపించమని సాయి నాధుని ఆనతి అయింది తల్లీ. రామ్మా. ఇలా కూర్చో” అంటూ తన ఎదురుగా ఉన్న మరో దర్భాసనం చూపించాడు స్వామి. ఆయన పాదాలకు నమస్కరించి వచ్చి పొందికగా దర్భాసనం మీద కూర్చుంది శతపత్ర.

“చెప్పమ్మా. నీ సమస్య ఏమిటి?" ఎంతో ఆదరపూర్వకంగా అడిగాడు బాబా చిత్రదేవ్.

జరిగిందంతా క్లుప్తంగా ఆయనకు విన్నవించుకుంది శతపత్ర. మౌనంగా విని తలపంకించాడు బాబా చిత్రదేవ్. కనులు మూసుకుని అలాగే చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. ఓపిగ్గా అలాగే కూచుంది శతపత్ర. సుమారు పావుగంట తర్వాత- చిన్నగా రెప్పలు విప్పి ఆమెను వీక్షించారు. ఆయన ఏం చెప్తారోనని ఆత్రంగా ఎదురు చూస్తోంది శతపత్ర.

"గరుడలోయ విశేషాలేమిటి? ఆ లోయ నాకే ఎందుకు కలలోకి వస్తోంది? ఆ లోయలోకి వెళ్ళే ఉద్దేశ్యంలో ఉన్నాను. వెళ్ళమంటారా బాబా?” కుతూహలంగా అడిగింది.

బరువుగా నిట్టూర్చాడు బాబా చిత్రదేవ్.
స్వామి దరహాసం చేశారు. "అర్థమైంది తల్లీ! నీ సమస్య పరిపూర్ణంగా అర్థమైంది. నిన్ను వెళ్ళమనిగాని, వద్దనిగాని నేను చెప్పలేను. అది నీ నిర్ణయం మీద ఆధారపడి వుంది. కాని నీ జాతకరీత్యా అక్కడికి వెళ్ళాల్సిన యోగం నీకు ఉంది. వీటన్నింటికీ మించి అనంతకోటి బ్రహ్మాండనాయకుడు... రాజాధి రాజు... యోగిరాజు.... పరబ్రహ్మ... సచ్చిదానందుడు... సద్గురువు అయిన ఆ సాయినాధుడి ఆశీస్సులు నీకు ఉన్నాయి. లేదంటే వారు నీకు కనిపించి నావరకు పంపేవారు కాదు. సాయినాథుడు నీకు మాత్రమే కనిపించటం నీ సుకృతం తల్లీ... అందుకే ఆ లోయ గురించిన విశేషాలు తెలుసుకునే ముందు నీకు అతిముఖ్యమైన ఇంకో విషయం చెప్పాలి" అన్నారు చిత్రదేవ్. చెప్పమన్నట్టుగా తలూపింది శతపత్ర.

చిన్నగా గొంతు సవరించుకున్నారాయన. “నీవు సాధారణ యువతివి కావు. యమునా దేవి అంశతో జన్మించావు. సహజంగానే నీలో కొన్ని శక్తులు నిక్షిప్తమై వున్నాయి" అన్నారాయన శతపత్రవైపు అబ్బురంగా చూస్తూ....

"యమునాదేవి ఎవరు స్వామీ?" ఎంతో అమాయకంగా ప్రశ్నించింది శతపత్ర. నిజంగానే ఆమెకు తెలీదు.

ఆమె ఎన్నడూ పురాణాలు చదవలేదు. ఆమె సందేహం గ్రహించి వెంటనే బదులిచ్చారు బాబా చిత్రదేవ్-

"యమున సూర్యదేవుని కుమార్తె... నరకాధిపుడు యమధర్మరాజుకి సోదరి. శనీశ్వరునికి అక్క. ప్రస్తుతం గంగానదికి ఉపనదిగా ప్రవహిస్తున్న యమునానది ఈమె ఆవిర్భావమే" అని అన్నారు.

"ఆమెకూ, నాకూ సంబంధం ఏమిటి?" మరోసారి అమాయకంగా ప్రశ్నించింది శతపత్ర.

ఆమెకేమీ అర్థం కావటంలేదు.

"ఆమె అంశతో జన్మించినదానవు. సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? జాతకునిమీద నవగ్రహాల ప్రభావం ఎలా పనిచేస్తుందో, అలాగే, ఇదీను. అరుదుగా జన్మించిన ఇలాంటి వారిమీద ఆయా దేవతల ప్రభావం ఉంటుంది. కొందరు లక్ష్మీదేవి అంశతో జన్మిస్తారు. అలాంటివాళ్ళు పట్టిందల్లా బంగారమవుతుంది. కొందరు జ్యేష్ఠాదేవి అంశతో జన్మిస్తారు. అలాంటి వారు జీవిత కాలమంతా దరిద్రులుగానే ఉంటారు. మరి కొందరు విష్ణు అంశతో, కొందరు శివాంశతో, ఇలా దైవాంశతో జన్మిస్తుంటారు.

నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. దశావతారాల్లో రామావతారానికి ముందే దుష్టశిక్షణ కోసం పరశురామావతారం వచ్చింది. విష్ణు అంశతో కూడిన అవతారం అది. అవతార లక్ష్యం నెరవేరింది. అంతలో రామావతారం వచ్చింది. దశావతారాలో ఏక కాలంలో వచ్చిన అవతారాలు ఇవి రెండే. ఈ అవతారాలు రెండూ ఒకరికొకరు ఎదురుగా తారసపడినప్పుడు రాముని స్పర్శతో పరశురాముడు లోని విష్ణు అంశ, రాముని లో ఐక్యం చెందింది. ఆ తర్వాత పరశు రాముడు ఒక మహర్షిగానే మిగిలిపోయాడు.

అలాగే కృష్ణార్జునులు ఉన్నారు. వారిరువురూ నరనారాయణులు. విష్ణు అంశలోని వాడు అర్జునుడు. అతడికి మరిన్ని శక్తులు సమకూర్చి తన సోదరినిచ్చి వివాహం చేసి బంధుత్వం కూడా కలుపుకున్నాడు కృష్ణుడు. అందుకే ఎవరూ సాధించలేని గొప్ప ఘనకార్యాలు సాధించి మహావీరుడనిపించుకున్నాడు అర్జునుడు.

అదే అర్జునుడు శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత అతడిలోని విష్ణుశక్తులు మొత్తం తొలగిపోగా సాధారణ మానవుడిగా మిగిలిపోయాడు. భారతయుద్ధంలో తన బాణాలతో లక్షలాది సైనికుల్ని హతమార్చిన అర్జునుడు, కృష్ణ నిర్యాణం తర్వాత కొద్దిమంది దొంగలబారి నుండి యాదవుల్ని రక్షింపలేకపోయాడు. కాబట్టి మనిషి కేవలం నిమిత్తమాత్రుడని గ్రహించాలి. ఏదో ఒక కార్యం సాధించవలసి వున్నవాళ్ళే ఇలా దైవాంశతో జన్మిస్తారు. అందులోనూ యమునాదేవి అంశతో ఇలా జన్మించటం చాలా చాలా అరుదైనవిషయం. ఆమె అనుగ్రహం నీమీద సంపూర్ణంగాఉంది. నిన్ను చూస్తే భూతప్రేతాలు పారిపోతాయి” అంటూ వివరించారు బాబా చిత్రదేవ్.

"అవును స్వామీ! అనుభవంలో ఈ విషయం గమనించాను" అంది శతపత్ర ఉద్వేగంలో మునిగిపోతూ.

"ఒక వ్యక్తి ఆధ్యాత్మిక అనుభవాల్ని సొంతం చేసుకోవటం అసాధారణమైన స్థితిని సూచిస్తాయి. అందుకేగా తల్లీ మొదటిసారి షిరిడీ యాత్రలోనే సద్గురువు సందర్శన భాగ్యం లభించింది నీకు... ధన్యం తల్లీ... నీ జన్మ ధన్యమైపోయింది” అన్నారు.

"కాని నేను యమున అంశతో జన్మించటాని కి, గరుడలోయ నా కలలోకి రావటానికి సంబంధం ఏమిటి? ఆ లోయ గురించి స్టడీ చేశాను. దానికి వేల సంవత్సరాల చరిత్ర వుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళెవ్వరూ తిరిగి ప్రాణాలతో రాలేదనటానికి అవసరమైన చారిత్రక ఆధారాలు ఉన్నాయి” అంది శతపత్ర ఆధ్యాత్మికోద్వేగానికి లోనవుతూ.

“మరణం తరువాత జీవితం ఉందా..? అలా తిరిగి వస్తే మరణం తరువాత ఏం జరుగుతుందనేది మనిషి మదిని తొలిచే అనాదిగా ఉన్న ప్రశ్న. దానికి సమాధానం ఆ గరుడ లోయలోనే ఉంది. అది దేవరహస్యం. ఆ దైవరహస్యం మానవ లోకానికి తెలిసి పోతుంది కాబట్టి అక్కడి శక్తులు ఆ లోయ లోకి వెళ్ళిన వాళ్ళని అంతం చేస్తాయి"

"అంతటి నిగూఢ రహస్యమా స్వామీ అది?”

"అవునమ్మా... మొత్తం నీకు వివరించలేను గాని, నీకు అర్ధమయ్యెలా చెప్పే ప్రయత్నం చేస్తాను. స్వర్గం, నరకం అనేవి ఉన్నాయని విన్నావా?'

"ఉన్నాయో లేదో నాకు తెలీదు. కాని ఉన్నాయని విన్నాను. మతం ఏదైనా వీటి ప్రస్తావన మాత్రం ఖచ్చితంగా వుంటుంది."

"మతం అనేది నమ్మకం. ఆ నమ్మకమే మనిషిని శీలవంతుని చేసి ధర్మమార్గంలో నడిపిస్తుంది. స్వర్గాధిపతి ఇంద్రుడు, నరకాధిపతి యమధర్మరాజు. స్వర్గలోకం, నరకలోకంతో పాటు నరకానికి అనుబంధం గా భూమిపైన ఉన్నదే మూడో లోకం. అదే గరుడలోయ. అకాల మృత్యువుతో తమ శరీరాలను కోల్పోయి, అటు స్వర్గానికి పోకుండా, ఇటు నరకానికీ పోకుండా భూమి పైన నిలిచిపోయిన ఆత్మలకు శరణార్థి శిబిరం వంటిది ఈ ఆత్మల లోకం. అదే గరుడలోయ. ఈ వివరణ నీకు చాలునని అనుకుంటాను” అన్నారు బాబా చిత్రదేవ్.

చాలన్నట్టు తల ఊపింది శతపత్ర. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. అయినా ఆమె మనస్సులో ఇంకా సందేహం నివృత్తి కాలేదు.

ఈ రోజుల్లో ఎవరిదగ్గరైనా స్వర్గం, నరకం ప్రసక్తి తీసుకొస్తే అది అంతా ట్రాష్... అలాంటివేమీ లేవని కొట్టిపారేస్తారు. తను మాత్రం ఎలా నమ్మటం?

"స్వామీ! నిజంగా నరకం వుందా? దాన్ని చూసినవాళ్ళు ఉన్నారా?" అనడిగింది శతపత్ర.

“అమ్మా! చూడు, ఇప్పటి మనుషుల్లా మన పూర్వీకులు అబద్దాలకోర్లు కారు. సత్యనిష్ఠా గరిష్ఠులు. ఉన్నవి ఉన్నట్టు చెప్పారు. లేనివి లేనట్టు చెప్పారు. సమాజానికి ఏది మంచో అది మాత్రమే చెప్పారు. నువ్వు అడిగినట్టు నరకాన్ని కళ్ళారా చూసినవాళ్ళున్నారు. అంత ఎందుకు? యమధర్మరాజుతో పోరాడి తెలివిగా తన పతి ప్రాణాల్ని తిరిగి వెనక్కి తెచ్చుకోగలిగింది సతీసావిత్రి ఉందిగా.
🍁
*సశేషం*