Om sri raam - sri maatrenama:
ఒకొక్క గుడికి ఒక్కో ప్రత్యేకత.
మన పూర్వీకులు గొప్ప సివిల్ ఇంజనీర్ లు.
పూర్వకాలంలో దేవాలయాలు ( కోవెలలు,గుడులు) నిర్మీంచేటప్పుడు ఒక ప్రత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించేవారు.
అయితే ఒక్కొక్క కోవెలకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉండేది.
ఉదాహరణకు కొన్ని చూద్దాం.
1.ఉత్సవవిగ్రహం లేకుండా మూలవిగ్రహమే బయటకు మాడవీధులకు వచ్చేది చిదంబరం నటరాజస్వామి.
2.కుంబకోణంలో ఐరావతేశ్వరస్వామి గుడి తారాశురం అనే గ్రామంలో వుంది.అక్కడశిల్పకళా చాతుర్యం చాలా గొప్పగా చెక్కబడివుంది.
ఒక స్తంభము నుంచి చూస్తె వాలిసుగ్రీవులు యుద్ధం మట్టుకే తెలుసుతుంది
,కొంచం దూరంలో ఇంకొక స్తంబములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు
చెక్కబడివుంది.ఇందులో గొప్ప ఏమిటి అంటే మోదటి స్థంబము నుంచి చూస్తె
శ్రీరాముడు కనపడడు కాని రెండవ స్తంబము నుంచి చూస్తె వాలిసుగ్రీవుల యుద్దము
చాల బాగా తెలుస్తుంది.
3.ధర్మపురి(తమిళనాడు)
మల్లికార్జునస్వామీ
కోవెలలోన వంగామంటపం అంటే తొమ్మిదిస్తంభముల మంటపం అన్నమాట.ఇందులో రెండు
స్థంబములు భూమిపై ఆనకుండా గాలిలో వేలాడుతున్నట్టుగా ఉంటాయి .
4.కరూర్(కోయంబత్తూర్)
సమీపంలోని కుళిత్తలై అనే ఊరిలో
కదంబ వననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒకే మండపములో ప్రతిష్ట గావించబడి వున్నాయి.
5.గరుడుడు నాలుగుకరములతో( చేతులతో) అందులో రెంటిలో శంఖచక్రములతో దర్శనము
ఇచ్చేది కుంబకోణం ప్రక్కన వేల్లియంగుడి అనే గ్రామ దెవాలయంలోమాత్రమే.
6.కుంభకోణంలో నాచ్చియార్కోవిల్ అనే స్థలంలో విష్ణుగుడి వుంది.అక్కడ
గరుడవాహనం రాతితో చేసినది స్వామీ సన్నిధిలో ఉంది అది నలుగురు మోసే బరువు
వుంటుంది.
కాని క్రమంగా ఒక్కొక్క ప్రాకారందాటి బయటకు వస్తుంటే రానురాను
8,16,32 అలా బయటవీదిలోకి వచ్చేటప్పటికి 64 మంది మోసే అంత బరువు అయిపోతుంది
మరి స్వామీగుడిలోనికి పోతున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ
వుంటుంది ఇక బయటవీధికి వచ్చేటప్పటికి గరుడవిగ్రహమునకు చెమటపట్టడం కూడా
ఒకవిచిత్రమే.
7.చెన్నైసమీపంలో శ్రీపెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల వారి గుడి వుంది అక్కడ మూలస్థానంలో విగ్రహం రాతిది కాదు
పంచలోహవిగ్రహము కాదు కేవలం
కుంకుమపువ్వు పచ్చకర్పూరం మూలికలతో చేసినది.
ఆశ్చర్యం కదా.
8.తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథస్వామి
దేవాలయంలో ఒకబిల్వచెట్టు స్థలవృక్షం గా వుంది.ఆ చెట్టులో కాచే బిల్వకాయలు
లింగాకారంలో వుంటాయి.
9.కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో
ఈశ్వరుని గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదువర్ణములుగా మారుతూ వుంటుంది
అందుకే ఆ కోవేలని పంచవర్నేశ్వరుడు కోవెల అని పిలుస్తారు.
10.విరుదునగర్ ప్రక్కనా ధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుని కోవెలలో నందికి కొమ్ములు చెవులు వుండవు.
11.ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒకపెద్ద ఆంజనేయ విగ్రహం వుంది.దీని
ప్రత్యేకత ఆంజనేయ విగ్రహం కనులు భద్రాచల శ్రీరామసన్నిధిలో శ్రీరాముని
పాదములు ఒకే ఎత్తులో వుండడం.
12.వేలూర్ సమీపంలో విరించిపురం అనే
వూరి కోవెలలో ఒకస్థంభములో అర్ధచంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు,ఆరునుండి
పంన్నెండు వరకు అంకెలు చెక్కబడి వున్నది .
పైన వుండే పల్లము నుండి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.
గడియారం చూసుకొఖ్ఖర లేదు.
13.చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి
కోవెలలో మూలవిగ్రహం శిరస్సునుంచి నడుమువరకు మానవఆకారం నడుమునుంచి
పాదములవరకు మత్స్యఆకారంలో వుంటుంది.
14,ధర్మపురి(తమిళనాడు)పక్కన పదుహారు అంటే పదిమైళ్ళదూరంలో అభీష్టవరదస్వామీ అనే విష్ణుగుడిలో నవగ్రహములు స్త్రీ రూపముతో ఉంటారు.
ఇలా మనకు తెలియని , తెలిసినా పట్టించు కోకుండా గొప్పగా చెప్పుకోనివి ఇంకా
ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమవిధానంగా కట్టిన దేవాలయాలు వున్నాయి.
_*
🌞పంచతంత్ర కథలు-6
🌞*_
చూశాడటు చిత్రగ్రీవుడు. చూస్తూనే ఏదో ఆలోచన తట్టిన వాడై పావురాలతో ఇలా అన్నాడు.‘‘ఇప్పుడు ఈ క్షణం ఇక్కణ్ణుంచి మనందరం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అందరం ఒక్కసారిగా పైకెగరాలి. వలతో పాటుగా ఎగరాలి. ఎగిరితే బోయ నుంచి మనం తప్పించుకోగలం. దీన్నే ఐకమత్యం అంటారు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. ఏమంటారు’’‘‘నువ్వెలా చెబితే అలాగే’’ అన్నాయి పావురాలు.‘‘నేను ఒకటి రెండు మూడు అంటాను. మూడనగానే అంద రూ పైకి లేవాలి’’‘‘లేస్తాం’’‘‘అయితే సరే! ఒకటి రెండు మూడు’’ అంటూనే అందరితో పాటుగా పైకి లేచాడు చిత్రగ్రీవుడు. వలతో పాటుగా పావురాలన్నీ పైకి లేచాయి. ఆకాశంలో ఎగరసాగాయి. పావురాలతో పాటుగా తన వల కూడా ఎగిరిపోవడాన్ని చూస్తూ బోయ ఆశ్చర్యపోయాడు. పావురాలు పోతే పోయాయి. తన వల దొరికితే చాలను కున్నాడు. ‘ఉష్ ఉష్! ఏయ్ ఏయ్’ అంటూ కేకలేశాడు. పావురాలను చూస్తూ కింద పరుగుదీశాడు. పరగుదీసి పరుగుదీసి అలసిపోయేడే తప్ప, అతనికి పావురాలు చిక్కలేదు. వల కూడా దక్కలేదు. దాంతో బోయ తల పట్టుకుని ఇంటి దారి పట్టాడు.


చూశాడటు చిత్రగ్రీవుడు. చూస్తూనే ఏదో ఆలోచన తట్టిన వాడై పావురాలతో ఇలా అన్నాడు.‘‘ఇప్పుడు ఈ క్షణం ఇక్కణ్ణుంచి మనందరం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అందరం ఒక్కసారిగా పైకెగరాలి. వలతో పాటుగా ఎగరాలి. ఎగిరితే బోయ నుంచి మనం తప్పించుకోగలం. దీన్నే ఐకమత్యం అంటారు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. ఏమంటారు’’‘‘నువ్వెలా చెబితే అలాగే’’ అన్నాయి పావురాలు.‘‘నేను ఒకటి రెండు మూడు అంటాను. మూడనగానే అంద రూ పైకి లేవాలి’’‘‘లేస్తాం’’‘‘అయితే సరే! ఒకటి రెండు మూడు’’ అంటూనే అందరితో పాటుగా పైకి లేచాడు చిత్రగ్రీవుడు. వలతో పాటుగా పావురాలన్నీ పైకి లేచాయి. ఆకాశంలో ఎగరసాగాయి. పావురాలతో పాటుగా తన వల కూడా ఎగిరిపోవడాన్ని చూస్తూ బోయ ఆశ్చర్యపోయాడు. పావురాలు పోతే పోయాయి. తన వల దొరికితే చాలను కున్నాడు. ‘ఉష్ ఉష్! ఏయ్ ఏయ్’ అంటూ కేకలేశాడు. పావురాలను చూస్తూ కింద పరుగుదీశాడు. పరగుదీసి పరుగుదీసి అలసిపోయేడే తప్ప, అతనికి పావురాలు చిక్కలేదు. వల కూడా దక్కలేదు. దాంతో బోయ తల పట్టుకుని ఇంటి దారి పట్టాడు.
_*
✍మరికొంతబాగము రేపు తెలుసుకుందాము*_
✍


_*


చిత్రగ్రీవుడు చెప్పిన మేరకు పావురాలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి.వలతో పాటుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. జరిగిందంతా మొదటి నుంచీ గమనిస్తున్న లఘపతనకుడు అనే కాకి, ఈ పావురాలు ఎక్కడికివెళ్తున్నాయి? వల నుంచి ఎలా తప్పించుకుంటాయి? ఇదేదో చూడదగ్గదే అనుకుని అది కూడా ఆకాశంలోకెగిరి, పావురాలను అనుసరించింది.‘‘ఇలా ఎంత దూరం ఎగరాలి? ఎక్కడికని ఎగరాలి’’ చిత్రగ్రీవుణ్ణిప్రశ్నించాయి పావురాలు.‘‘గండకీనది వరకూ ఎగరాలి. దాని ఒడ్డున విచిత్రవనమనే అడవి ఉంది. అక్కడికి మనం చేరు కోవాలి.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘అక్కడికి ఎందుకు’’ అడిగింది ఓ పావురం.‘‘ఎందుకంటే...అక్కడ నా మిత్రుడు ఉన్నాడు. హిరణ్యకుడు అని ఎలుకల రాజతను. అతను మనల్ని కాపాడతాడు. లోకంలో తల్లీ, తండ్రీ, స్నేహితుడూ ఈ ముగ్గురే కాపాడతారు. మిగిలిన వారు కాపాడ గలిగే అవకాశం ఉందికాని, వారికి మనతో అవసరం ఉండాలి. ఉంటేనే కాపాడతారు. లేకపోతే కాపాడరు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘నిజమే’’ అన్నాయి పావురాలు.‘‘హిరణ్యకుణ్ణి కలిస్తే, అతను ఈ వలను కొరికి ముక ్కలు చేస్తాడు. మనం అప్పుడు తప్పించుకోవచ్చు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘అయితే ఇంకేం! పదండి, పదండి.’’ అన్నాయి పావురాలు. ఎగరడంలో వేగాన్ని పెంచాయి. వారిని వెన్నంటి వస్తున్న లఘుపతనకుడు కూడా వేగాన్ని పెంచాడు. గండకీనది కనిపించింది. విచిత్రవనం కూడా కనిపించింది. ఒక్కసారిగా పావురాలన్నీ కిందికి దిగాయి. హిరణ్యకుడి కలుగు దగ్గర వాలాయి. రెక్కల టపటపలూ, పావురాల గోలకి కలుగులోని హిరణ్యకుడు ప్రమాదమేదో ముంచుకొచ్చిందని భయపడ్డాడు. కలుగులోనికి మరింతగా వెనక్కి జరిగాడు. కూడదీసుకుని కూడదీసుకుని కలుగు ముందుకు వచ్చాడు చిత్రగ్రీవుడు.‘‘మిత్రమా’’ అని పిలిచాడు.
పరిచయమయిన గొంతులా అనిపించి కొంచెం ముందుకు వచ్చాడు హిరణ్యకుడు.‘‘నేను మిత్రమా! నీ మిత్రుణ్ణి. చిత్రగ్రీవుణ్ణి. నీ సహాయం కోరి వచ్చాను. దయచేసి బయటికి రా’’ అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మాట పూర్తికానే లేదు. ఆనందంగా కలుగులోంచి బయటకు వచ్చాడు హిరణ్యకుడు. చిత్రగీవుణ్ణి చూసి ఆనందించాడు.‘‘ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మిత్రమా! నిన్ను చూడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది.’’ అన్నాడు. అంతలోనే మిత్రుడు వలలో చిక్కుకుని ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.‘‘ఇదేమిటిది? వలలో చిక్కుకున్నావు’’ అనడిగాడు. సమాధానం చెప్పే లోపే చిత్రగ్రీవుణ్ణి వల నుండి తప్పించేందుకు ప్రయత్నించాడు. వలను కొరకసాగాడు.‘‘ఆగాగు! నన్ను విడిపించడం కాదు, ముందు నావాళ్ళను విడిపించు. తర్వాత నన్ను విడిపించవచ్చు’’ అన్నాడు చిత్రగ్రీవుడు. రాజుగా తోటి వారిని కాపాడడం ప్రథమ కర్తవ్యం అనుకున్నాడతను.‘‘పూర్వజన్మలో ఏ పాపం చేశామో! అందరం ఇలా వలలో చిక్కున్నాం. పాపం, పుణ్యం కాదుగాని, బుద్ధిగా ప్ర
వర్తించలేకపోయాం. ఫలితంగా శిక్ష అనుభవిస్తున్నాం’’ అన్నాడు చిత్రగ్రీవుడు. వల కొరక్కుండా ఆలోచిస్తోన్న హిరణ్యకుణ్ణి చూశాడు.
_*
✍మరికొంతబాగము రేపు తెలుసుకుందాము
✍*_


No comments:
Post a Comment