🙏🤝మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు🙏
🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...
🤝‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,
నన్ను ఎవరూ గమనించడం లేదు’
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .
🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .
🤝వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
🤝ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,
🤝వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
🤝దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .
🤝ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
🤝అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .
🤝ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .
🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
🤝అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .
🤝అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .
🤝 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
🤝నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
🤝అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .
🤝ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
🤝ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు 👋.
🚩🙏🙏🙏🚩
--
ప్రియాతి ప్రియమైన అత్తయ్యగారి పాద పద్మములకు ఆపాద మస్తకపు నమస్కారాలు తెలియజేస్తూ, మీ కొత్తకోడలు వ్రాయునది ఏమనగా..
నేను కాపురానికి వస్తున్నప్పుడు మీరు నాకు చెప్పిన అన్నిటిని తు.చ. తప్పకుండా పాటిస్తున్నాను.
కొత్తసంసారం పాలు పొంగినట్టు పొంగి పొర్లాలి అని చెప్పారు. అందుకే రోజుకి రెండు లీటర్ల పాలు పొంగిస్తున్నాను. పొంగి పొర్లగా మిగిలిన పాలతో టీ చేసుకుని తాగుతున్నాం. కాకపోతే రెండు నెలలకే స్టవ్ కమురు కంపు కొట్టటం తో నిన్ననే కొత్త స్టవ్ కొనుక్కొచ్చాను.
పనీ, పాటా నేర్చుకోమన్న మీ మాట మీద గౌరవంతో రోజుకి 5 గంటలు, ఏఆర్ రెహ్మాన్ పాటలు వింటూ ప్రాక్టీస్ చేస్తున్నాను. పాట నేర్చుకోవడం పూర్తి కాగానే పని నేర్చుకోవడం ప్రారంభం చేస్తాను.
మీ అబ్బాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించమని చెప్పారు కదా అందుకే, వారి ఆరోగ్య దృష్ట్యా రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం పెడుతున్నాను.
భర్తని కష్ట పెట్టకూడదు అన్న మీ మాట గుర్తుకొచ్చి ఉదయం మాత్రమే వంట చేయిస్తున్నాను.
చుట్టుపక్కల వారితో జాగ్రత్త అని చెప్పారుగా అత్తయ్యా, అందుకే నిన్న ఎదిరింటావిడ పలకరించబోతే ముఖం మీదే తలుపులు వేసాను. ఆవిడ ముఖం మీరు చేసిన చపాతీలా మాడిపోయింది.
పొదుపు చేయమన్న మీ మాటతో వారానికి ఒక్క డ్రస్ మాత్రమే కొనుకుంటున్నాను. అలాగే రెండు సినిమాలు మాత్రమే చూస్తున్నాం. ఈ నెల పొదుపు చేసిన డబ్బుతో మీ అబ్బాయికి కొత్త కర్చీఫ్ కొనిచ్చాను .
పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు కదా! అందుకే నిన్న వైకుంఠ ఏకాదశి అని పూజ చేసి మీ అబ్బాయి కాళ్ళ మీద కొబ్బరికాయ కొట్టాను. పాపం కాలివేలు చిట్లి రక్తం వస్తే కట్టు కూడా కట్టాను. తొందర్లోనే తగ్గిపోతుంది లెండి.
మీరు ఇంకా నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే వ్రాయగలరు
ఇట్లు
మీ ప్రియమైన
కుమారుని పాద దాసి
మీ కోడలు
No comments:
Post a Comment