Friday, 30 October 2020



*అధ్యాయము 8*

*🌻. రక్తబీజ వధ - 1 🌻*


1-3. ఋషి పలికెను : చండదైత్యుడు వధింపబడి, ముండుడు కూల్పబడి, సైన్యంలో చాలా భాగం నాశనమైన పిదప దైత్యనాథుడూ ప్రతాపశాలి అయిన శుంభుడు కోపంతో పరవశతనొందిన మనస్సుతో అసుర సెన్యాలనన్నింటిని సన్నద్ధమై ఉండమని ఆదేశించాడు.


4. ఇప్పుడు ఎభై ఆర్గురు అసురులు- ఆయుధాలు ఎత్తి సిద్ధంగా పట్టుకొని- తమ బలాలు అన్నిటితో, స్వబలపరివేష్టితులైన ఎనభై నలుగురు "కంబులు”* వెడలిపోవుదురు గాక.


5. “నా ఆజ్ఞను పరిపాలించి కోటివీ ర్యాసుర* కుటుంబాలు ఏభై, ధౌమ కుటుంబాలు నూరూ బయలు వెడలుగాక.


6. “కాలక దౌర్హృదులు. మౌర్యులు, కాలకేయులు – ఈ  అసురులందరూ కూడా నా ఆజ్ఞానువర్తులై వెంటనే యుద్ధసన్నద్ధులై బయలుదేరుతారు గాక.”


7. ఈ ఆజ్ఞలను ఇచ్చి చండశాసనుడు, అసుర నాథుడు అయిన శుంభుడు అనేకసహస్ర సంఖ్యగల మహా సైన్యంతో తాను బయలుదేరాడు.


8. అతిభయంకరమైన ఆ సైన్యపు రాకను చండిక చూసి తన అల్లెత్రాటి టంకారధ్వనితో భూమ్యాకాశాల మధ్య ప్రదేశాన్నంతా నింపివేసింది.


9. అంతట, రాజా! సింహం మహానాదం చేసింది. అంబిక ఆ సింహనాదాలను తన ఘంటానాదంతో ఇంకా వృద్ధిపరిచింది.


10. కాళి తన నోటిని విస్తారంగా తెరిచి, దిక్కులను హుంకార శబ్దాతో నింపి, ధనుష్టంకారం యొక్క, సింహం యొక్క, ఘంట యెక్క నాదాలను వినబడకుండేట్లు చేసింది.


11. ఆ నాదాన్ని విని అసుర సైన్యం రోషంతో (చండికా) దేవిని, సింహాన్ని, కాళిని నాలుగు దిక్కులా చుట్టుముట్టారు. 


12–13. ఓ రాజా! ఆ సమయంలో సురవైరులను నాశనం చేయడానికి, అమరేశ్వరుల శుభం కొరకూ బ్రహ్మవిష్ణుమహేశ్వరుల, కుమారస్వామి, ఇంద్రుని శరీరాల నుండి బహుబలపరాక్రమాలు గల శక్తులు: బయలువెడలి ఆయాదేవతల రూపాలతో శక్తి వద్దకు వచ్చారు.


14. ఏ దేవునిది ఏ రూపమో, అతని భూషణాలు వాహనాలతో ఆ విధంగానే అతని శక్తి అసురులతో యుద్ధం చేయడానికి వచ్చింది.


15. హంసలు పూన్చిన విమానమెక్కి, మాలా కమండలువులతో బ్రహ్మ యొక్క శక్తి వచ్చింది. ఆమె పేరు బ్రహ్మాణి. 


16. ఎద్దు పై ఉత్తమమైన త్రిశూలం ధరించి, పెద్ద సర్పాలను గాజులుగా కలిగి, చంద్రరేఖ విభూషణంగా దాల్చి మాహేశ్వరి వచ్చింది.


17. చేత బల్లెం దాల్చి, చక్కని నెమలిని ఎక్కి, కుమారస్వామి రూపంతో, అంబికా కౌమారి దైత్యులతో యుద్ధానికి వచ్చింది.


18. అలాగే విష్ణుశక్తి గరుడునిపై ఎక్కి, శంఖం, చక్రం, గద, శాస్రం (ధనుస్సు), ఖడ్గం, చేతులలో ధరించి వచ్చింది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 28  / Sri Devi Mahatyam - Durga Saptasati - 28 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 8*

*🌻. రక్తబీజ వధ - 2 🌻*


16. ఎద్దు పై ఉత్తమమైన త్రిశూలం ధరించి, పెద్ద సర్పాలను గాజులుగా కలిగి, చంద్రరేఖ విభూషణంగా దాల్చి మాహేశ్వరి వచ్చింది.


17. చేత బల్లెం దాల్చి, చక్కని నెమలిని ఎక్కి, కుమారస్వామి రూపంతో, అంబికా కౌమారి దైత్యులతో యుద్ధానికి వచ్చింది.


18. అలాగే విష్ణుశక్తి గరుడునిపై ఎక్కి, శంఖం, చక్రం, గద, శాస్రం (ధనుస్సు), ఖడ్గం, చేతులలో ధరించి వచ్చింది.


19. అసమానమైన యజ్ఞవరాహరూపాన్ని దాల్చిన హరి యొక్క శక్తి, వారాహి కూడా అచటికి వచ్చింది.


20. నారసింహి నర-సింహ రూపంతో, నక్షత్రమండలాలు డుల్లిపోవునట్లు జూలు విదుర్చుతూ అచటికి వచ్చింది.


21. అలాగే వేయి కన్నులు గల ఐంద్రి ఇంద్రుని వలే వజ్రాయుధాన్ని చేతబూని శ్రేష్ఠమైన ఏనుగుపై ఎక్కి వచ్చింది.


22. అంతట శివుడు, ఈ దేవశక్తులు తనను పరివేష్టించి ఉండగా (అచటికి వచ్చి) “నా ప్రీతి కొరకు అసురులు శీఘ్రంగా నీ చేత చంపబడుదురు గాక” అని చండికతో చెప్పాడు.


23. అంతట అత్యంత భయంకరి, మిక్కిలి ఉగ్రరూప అయిన చండికా శక్తి నూరు నక్కల వలే అరుస్తూ దేవి శరీరం నుండి వెలువడింది.


24. ఓటమి ఎరుగని (పార్వతీ) దేవి ధూమ (పొగ) వర్ణపు జడలు గల శివునితో ఇలా పలికింది : "ప్రభూ! శుంభ నిశుంభుల వద్దకు నీవు దూతగా వెళ్లు. 


25. "మిక్కిలి పొగరుబోతులైన ఆ శుంభ, నిశుంభాసురులతో, యుద్ధం చేయడానికి అక్కడ చేరిన ఇతర దానవులతో, ఇలాచెప్పు :


26. 'మూల్లోకాలును ఇంద్రునికిని, హవిర్భాగాలు దేవతలకు, లభించు గాక, బ్రతికివుండ గోరితే పాతాళానికి వెళ్ళిపోండి.


27. లేక బలగర్వంతో యుద్ధం చేయ గోరితే, రండి! నా నక్కలు మీ మాంసం తిని తృప్తినొందుగాక.” 


28. దౌత్యానికి శివుడే స్వయంగా నియోగించడం వల్ల ఆ దేవి అప్పటి నుండి “శివదూతి” అని లోకంలో ఖ్యాతి కెక్కింది.


సశేషం....

🌹

*అధ్యాయము 8*

*🌻. రక్తబీజ వధ - 3 🌻*


29. ఆ మహాసురులు శివునిచేత తెలుపబడిన దేవీ వాక్యాలు విని రోషపూరితులై కాత్యాయని* ఉన్న చోటికి వెళ్ళారు.


30. అంతట గర్వకోపపూర్ణులైన ఆ సురవైరులు మొదటనే దేవిపై బాణాలను, బల్లాలను, ఈటెలను కురిపించారు.


31. ఆ ప్రయోగింపబడిన బాణాలను, శూలాలను, బల్లాలను, గండ్రగొడ్డండ్లను ఆమె పూర్తిగా లాగబడిన తన వింటి నుండి వెడలేమహాబాణాలతో అవలీలగా ఛేదించివేసింది.


32. అంతట అతని (శుంభుని) ఎదుటే శత్రువులను శూలపుపోట్లతో చీల్చివేస్తూ, పుట్టైపిడి గల బెత్తంతో మర్దిస్తూ, కాళి చరించింది.


33. బ్రహ్మాణి తాను ఎచటికి పోయినా తన కమండలూదకాలను శత్రువులపై చల్లి వారిని ధైర్య, శౌర్య విహీనులనుగా చేస్తోంది.


34. మాహేశ్వరి త్రిశూలంతో, వైష్ణవి చక్రంతో, కౌమారి బల్లెంతో కోపంగా దైత్యులను పరిమార్చారు.


35. ఐంద్రి ప్రయోగించిన వజ్రాయుధంతో చీల్చబడి దైత్యులు దానవులు నూర్లకొలద్దీ నేలకూలారు. వారి నుండి రక్తపునదులు పారాయి.


36. వారాహియొక్క ముట్టెదెబ్బలవలన ధ్వంసము చేయబడి,

కోరలమొనపోటులవలన గుండెలో గాయపడి, చక్రపు తాకుడువలన చీల్చివేయబడి (అసురులు) పడిపోయిరి.


37. నారసింహి ఆకసమును, దిక్కులను తననాదములతో నిండించుచు, తన గోళ్లతో చీల్పబడిన ఇతర మహాసురులను భక్షించుచు యుద్ధములో సంచరించెను.


38. శివదూతి యొక్క భయంకరములగు అట్టహాసముల (పెద్దనవ్వు) వలన ధైర్యముసడలి అసురులు నేలపై కూలిపడుచుండిరి. ఆ కూలినవారిని ఆమె భక్షించుచుండెను.


39. రోషపూరితలైన మాతృకలు - వివిధోపాయాలతో మహాసురులను ఇలా మర్దించడం చూసి సురవైరి సైనికులు పారిపోయారు.


40. మాతృగణం వల్ల పీడింపబడి దైత్యులు పారిపోవడాన్ని చూసి రక్తబీజమహాసురుడు కుపితుడై యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు.


41. అతని శరీరం నుండి రక్తబిందువు భూమిపై పడినప్పుడల్లా అతనిలాంటి అసురుడొకడు భూమి నుండి లేస్తున్నాడు.


42. ఆ మహాసురుడు గదాహస్తుడై ఇంద్రాణితో పోరాడాడు. ఆమె అంతట తన వజ్రాయుధంతో అతనిని కొట్టింది. 


43. వజ్రాయుధపు దెబ్బవల్ల అతని నుండి వెంటనే రక్తం అతిశయంగా కారింది. ఆ రక్తం నుండి అతని రూపంతో, అతని పరాక్రములైన యుద్ధవీరులు ఉత్పత్తి అవసాగారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 

🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 30  / Sri Devi Mahatyam - Durga Saptasati - 30 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 8*

*🌻. రక్తబీజ వధ - 4 🌻*


44. అతని శరీరం నుండి ఎన్ని రక్తబిందువులు నేలపై పడ్డాయో అంతమంది బలసాహస పరాక్రమాలలో అతని వంటివారు పుట్టారు.


45. అతని రక్తం నుండి ఉత్పత్తియైన వీరులు కూడ మాతృకలతో సమానంగా, అతిభీషణంగా, అత్యుగ్రశస్త్రాలు ప్రయోగిస్తూ పోరాడారు.


46. మళ్ళీ ఆమె వజ్రాయుధపు తాకిడికి అతని శిరస్సుగాయపడి అతని రక్తం ప్రవహించగా, ఆ రక్తం నుండి వేలకొద్ది వీరులు పుట్టారు.


47. ఆ అసురేశ్వరుణ్ణి వైష్ణవి తన చక్రంతో, ఐంద్రి తన గదతో, యుద్ధంలో కొట్టారు. 


48. వైష్ణవియొక్క చక్రంచే చీల్చబడినప్పుడు కారిన రక్తం నుండి పుట్టిన అతని ప్రమాణాలు గల మహాసురసాహస్రంతో జగత్తు నిండిపోయింది.


49. కౌమారి బల్లెంతో, వారాహి ఖడ్గంతో, మాహేశ్వరి త్రిశూలంతో రక్తబీజమహాసురుణ్ణి కొట్టారు. 


50. రక్తబీజుడు కూడా కోపావేశంతో ఆ మాతృకల నందరినీ తన గదతో గట్టిగా కొట్టాడు.


51. శక్తి శూలాది ఆయుధాల వల్ల అతనికి కలిగిన పెక్కుగాయాల నుండి భూమిపై పడ్డ రక్తసమూహం నుండి వందల కొద్దీ అసురులు ఉద్భవించారు.


52. ఆ రక్కసుని రక్తం నుండి ఉద్భవించిన ఆసురులు జగత్తునంతా వ్యాపించారు. అందుచే దేవతలు మహాభీతి చెందారు.


53. విషాదమొందిన దేవతలను చూసి చండిక నవ్వి, కాళితో ఇలా పలికెను : ఓ చాముండా ! నీనోటిని విస్తీర్ణంగా తెరువు!


54. నా బాణాలు తగలడంతో కలిగే రక్తాన్ని, ఆ రక్తబిందువుల నుండి ఉత్పత్తైన మహాసురులను ఆ నోటితో వెంటనే మ్రింగివేయి.


55. “అతని వల్ల పుట్టే మహాసురులను భక్షిస్తూ యుద్ధంలో  సంచరించు. ఈ దైత్యుడు అట్లు రక్త క్షయం వల్ల మరణిస్తాడు.


56. "నీవు ఇలా వారిని భక్షిస్తే క్రొత్త ఉగ్రరాక్షసులు ఉత్పత్తి కారు.” ఆమెకు ఇలా చెప్పి దేవి అతణ్ణి అంతట శూలంతో పొడిచింది.


57. అంతట కాళి రక్తబీజుని నెత్తుటిని తన నోటితో త్రాగేసింది. అతడు అంతట చండికను తన గదతో కొట్టాడు. 


58. ఆ గద దెబ్బవల్ల ఆమెకు అత్యల్పవేదన కూడా కలుగలేదు. కాని, గాయపడిన అతని శరీరం నుండి రక్తం మిక్కుటంగా కారింది.


59-60. అలా కారిన రక్తాన్ని ఎప్పటికప్పుడు చాముండ తన నోటితో మ్రింగుతుండెను. తన నోట్లోని రక్తం వల్ల పుట్టిన మహాసురులను చాముండ మ్రింగుతూ, రక్తబీజుని నెత్తుటిని సైతం త్రాగివేసింది.


61. దేవి శూలంతో, వజ్రాయుధంతో, బాణాలతో, ఖడ్గంతో ఈటెలతో రక్తబీజుణ్ణి కొట్టింది. చాముండ అతని రక్తాన్ని త్రాగివేసింది.


62. రాజా! ఆ రక్తబీజమహాసురుడు అనేక శస్త్రాలతో మిక్కిలి గాయబడి రక్తహీనుడై భూమిపై కూలాడు.


63. రాజా! అంతట దేవతలు మిక్కిలి హర్షం పొందారు, వారి నుండి పుట్టిన మాతృకాగణం రక్తపానోన్మత్తతతో నృత్యం చేసారు.


శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణిమన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లో “రక్తబీజవద" అనే అష్టమాధ్యాయము సమాప్తం.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri 

🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 31  / Sri Devi Mahatyam - Durga Saptasati - 31 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 9*

*🌻. నిశుంభ వధ - 1 🌻*


1-2. రాజు (సురథుడు) పలికెను: మహాత్మా! రక్తబీజవధ విషయంలో దేవి చేసిన మహాకార్యాన్ని గూరించి మీరు ఇప్పుడు నాకు తెలిపింది విచిత్రమైనది.


3. రక్తబీజుడు కూల్పబడిన పిదప మిక్కిలి కుపితులైన శుంభ నిశుంభులు ఏమి చేసారో ఇంకా వినగోరుతున్నాను.

 

4-5. ఋషి పలికెను : రక్తబీజుడు కూల్పబడుటను, యుద్ధంలో ఇతరులు కూడా హతులవడాన్నీ, విని శుంభాసురుడు నిశుంభుడు అపారమైన కోపం పొందారు.


6-7. ఆ మహాసైన్యం తెగటార్చబడడం చూసి రోషపూరితుడై అసుర సేనలలో ముఖ్యులతో నిశుంభుడు వేగంగా యుద్ధానికి వెళ్ళాడు. అతని ముందూ, వెనుక, ప్రక్కల మహాసురులు కోపంతో పెదవులను కొరుకుతూ దేవిని చంపడానికి నడిచారు.


8-9. మాతృకలతో యుద్ధం చేసి, పిదప కోపంతో చండికను వధించడానికి, మహావీర్య సంపన్నుడైన శుంభుడు స్వసైన్యపరివేష్టితుడై బయలుదేరాడు. అంతట దేవికి, శుంభ నిశుంభులకూ మహాయుద్ధం ప్రారంభమయ్యింది. వారు మేఘాల వలే అత్యుగ్రమైన శరవర్షాన్ని ఆమెపై కురిపించారు.


10. చండిక వారుప్రయోగించిన బాణాలను తన బాణ సమూహాన్ని త్వరితంగా త్రుంచివేసి, ఆ అసురేశ్వరుల అంగాలను తన శస్త్ర సమూహంతో కొట్టింది.


11. నిశుంభుడు ఒక పదను గల ఖడ్గాన్ని, మెరుస్తున్న డాలును తీసుకుని దేవి యొక్క ఉత్తమవాహనమైన సింహాన్ని తలపై కొట్టాడు.


12. వాహనాన్ని కొట్టడంతోనే దేవి నిశుంభుని ఆ ఉత్తమ ఖడ్గాన్ని ఒక వాడి బాణంతో త్రుంచివేసి, అతని డాలును, ఎనిమిది చంద్రబింబాలు గల దానిని, కూడా త్రుంచివేసింది.


13. డాలును ఖడ్గాన్ని ఛేదింపబడడంతోనే ఆ అసురుడు బల్లెమొకటి ప్రయోగించాడు. తన మీదికి వస్తున్న ఆ బల్లెమును ఆమె తన చక్రంతో రెండుగా ఖండించింది.


14. పొంగిపొరలుతున్న కినుకతో నిశుంభాసురుడు అంతట ఒక శూలాన్ని తీసుకున్నాడు. అది వస్తుండగా దానిని కూడా దేవి పిడికిడి పోటుతో చూర్ణంచేసింది.


15. అంతట అతడు గదను ఆడిస్తూ చండికపై దానిని విసిరింది. దానిని ఆమె త్రిశూలంతో ముక్కలు చేయగా అది బూడిదైపోయింది.


16. ఆ దానవశ్రేష్ఠుడు అంతట గండ్ర గొడ్డలితో తనమీదికి వస్తుండగా దేవి బాణసమూహాన్ని ప్రయోగించి అతన్ని భూమిపై పడజేసింది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri .

🌹 🌹 🌹 🌹 🌹


*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 33  / Sri Devi Mahatyam - Durga Saptasati - 33 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 9*

*🌻. నిశుంభ వధ - 3 🌻*


29. అప్పుడు నిశుంభుడు తెలివినొంది, (మూర్ఛ తేటి) వింటిని గైకొని దేవిని (చండికను), కాళిని, సింహాన్ని బాణాలతో కొట్టాడు.


30. దితిపుత్రుడైన ఆ రాక్షసేశ్వరుడు పదివేల చేతులు కల్పించి (పదివేల) చక్రాయుధాలతో చండికను కప్పివేసాడు.


31. దుస్సహదుఃఖాలను తొలగించే దుర్గాభగవతి అంతట కుపితయై ఆ చక్రాలను బాణాలను తన బాణాలతో ఛేదించింది.


32. అంతట నిశుంభుడు రాక్షససేనా పరివేష్టుడై, వేగంగా గదను గైకొని చండికను వధించడానికి (ఆమె మీదికి) ఉరికాడు.


33. అతడలా వేగంగా వస్తుండగా, చండిక అతని గదను తన పదునైన ఖడ్గంతో త్రుంచివేసింది. అతడు అంతట శూలాన్ని తీసుకున్నాడు.


34. దేవతలను పీడించే నిశుంభుడు శూలహస్తుడై వస్తుండగా, చండిక వేగంతో ఒక శూలాన్ని ప్రయోగించగా అది అతని హృదయంలో గ్రుచ్చుకొంది.


35. శూలంతో భేదింపబడిన అతని హృదయం నుండి మహాబల శౌర్యసంపన్నుడైన మరొక పురుషుడు "నిలువు” అని పలుకుతూ బయగకు వచ్చాడు.


36. దేవి బిగ్గరగా నవ్వుతూ ఆ వెల్వడిన పురుషుని శిరస్సును తన ఖడ్గంతో ఛేదించింది. అతడంతట నేలకూలాడు.


37. సింహం తన ఉగ్ర కోఱలతో కొందరు అసురుల కంఠాలను పొడిచి వారిని భక్షించింది. కాళి, శివదూతి ఇతరులను భక్షించారు.


38. కౌమారీ బల్లెపుపోట్లతో కొందరు మహాసురులు నశించారు. ఇతరులు బ్రహ్మాణి చల్లిన మంత్రంతో, పవిత్రజలం చేత జయింపబడ్డారు.


39. మరికొందరు మాహేశ్వరి త్రిశూలపు పోటుతో కూలారు. కొందరు వారాహి యొక్క ముట్టెపోట్లతే చూర్ణమయ్యారు.


40. వైష్ణవి యొక్క చక్రంతో కొందరు రక్కసులు తెండెతుండెములుగా తెగిపోయారు. మరికొందరు ఐంద్రి చేతి వ్రేళ్లతో ప్రయోగించబడిన వజ్రాయుధం వల్ల కూలారు.


41. కొందరు అసురులు (తామే) మరణించారి. కొందరు యుద్ధభూమి నుండి పారిపోయారు. ఇతరులును కాళిచే, శివదూతి చే, సింహంచే మ్రింగబడ్డారు. 


శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణి మన్వంతరంలో  “దేవీ మాహాత్మ్యము” లో “నిశుంభవధ” అనే నవమాధ్యాయము సమాప్తం.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Sri .

🌹 🌹 🌹 🌹 🌹


*అధ్యాయము 10*

*🌻. శుంభ వధ - 1 🌻*


1-3. ఋషి పలికెను : ప్రాణసమానుడైన తమ్ముడు నిశుంభుడు వధింపబడడం, సైన్యం రూపుమాప బడడం చూసి శుంభుడు క్రోధంతో ఇట్లనెను : "ఓ దుర్గా! బలగర్వంతో క్రొవ్విన నీవు ఆ గర్వాన్ని (నా వద్ద) చూపకు, ఎంత గొప్పదానవని అనుకున్నా నీవు ఇతరుల బలంపై ఆధారపడి యుద్ధం చేస్తున్నావు.


4-5. దేవి పలికెను : నేను ఈ లోకంలో ఒంటరి దాననే అయి ఉన్నాను. నేను కాక మటెవ్వరు ఉన్నారు? ఓ దుష్టుడా! నాశకులైన వీరు నాలోనికి ప్రవేశించడాన్ని చూడు.


6. అంతట బ్రహ్మాణి మొదలైనవారు (మాతృకలు) అందరూ దేవి శరీరంలో లీనమయ్యారు. అంబిక ఒక్కరిత మాత్రమే ఉంది.


7–8. అంతట దేవి పలికెను : నా శక్తిచే నేనిక్కడ నా నుండి వ్యక్తమైన రూపాల నన్నింటిని నేను మళ్ళీ ఉపసంహరించుకున్నాను. నేను ఒక్కదానిని మాత్రమే నిలిచివున్నాను. యుద్ధంలో స్థిరంగా ఉండు.


9-10. ఋషి పలికెను : ఆ ఇరువురికీ (దేవీశుంభులకు) ఘోర యుద్ధం ప్రారంభించారు. దేవాసురులందరూ చూస్తున్నారు.


11. బాణవర్షం కురిపిస్తూ, వాడి శస్త్రాలను, దారుణాస్త్రాలను ప్రయోగించుకుంటూ, వారిరువురూ మళ్ళీ సర్వలోక భయంకరంగా యద్ధం చేసారు.


12. అంబిక వందల కొద్దీ వేసిన దివ్యాస్త్రాలను ఆ రక్కసుల తేడు వాటికి మారుదెబ్బవైయగల అస్త్రాలతో త్రుంచివేసాడు.


13. అతడు ప్రయోగించిన దివ్యాస్త్రాలను భయంకరంగా హుంకరించడం మొదలైన కార్యాలచే పరమేశ్వరి అవలీలగా ఖండించింది.


14. అంతట ఆ రాక్షసుడు వందల కొద్దీ బాణాలతో దేవిని కప్పివేసాడు. దేవి కినుక పూని తన బాణాలతో అతని వింటిని ఛేదించింది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


*🌹 

Wednesday, 28 October 2020

*దగ్దయోగాలు:*


దగ్ధయోగాలు :- తిథీ వారం కలిస్తే వచ్చే మొత్తం కనక పదమూడు ఐతే అది దగ్ధ యోగం అన్నారు మనవారు. మాయా బజార్ సినిమాలో శంఖు తీర్ధులవారు లెక్క కట్టి "ఇది దగ్ధ యోగం" వివాహం కాదు అని శాస్త్రం చెబుతోంది అంటారు. పదమూడు అంటే 1+3 =4 నాలుగు సంఖ్య జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహువుకు సంకేతం. శనివత్ రాహువు అన్నారు. రాహువు చాయా గ్రహం అయిననూ శని ఇచ్చే ఫలితాలను ఇస్తాడు. రాహువు కారకరత్వంలో చెడును చేసే ఫలితాలు గమనిస్తే పైకి ధైర్యం లోపల పిరికి, భ్రష్టత్వం, ఉద్రేకం, ఉద్వేగం, ఇతరులకు భాద కలిగించునట్లు చేయుట, మానసిక వ్యద, వ్యాదులు, పనులలో అంతారాయాలు మొదలగునవి కలిగిస్తాడు.

ఆ దగ్ధ యోగాలు కలిగించేవి ఈ క్రింద ఇవ్వ బడ్డాయి గమనించండి.

           0000000

*షష్టీ 6 +7 శనివారం.*

*సప్తమీ 7 + 6 శుక్రవారం.*

*అష్టమీ 8 +5 గురువారం.*

*నవమి 9 + 4 బుధవారం.*

*దశమీ 10 +3 మంగళవారం.*

*ఏకాదశి 11+2 సోమవారం.*

*ద్వాదశి 12+1 ఆదివారం.*

          0000000

పైన తెలిపిన రోజులలో ఏ పని మొదలుపెట్టినా జరగదని భావం. షష్టి నాడు మొదలెట్టిన పని కలహంతో ముగుస్తుందిట. అష్టమినాటి పని కష్టాన్ని మిగులుస్తుంది, నవమినాటి పని వ్యయప్రయాసలకే కారణం అంటారు.

 *చిత్రం త్రయోదశినాటి పని దిగ్విజయంగా ముగుస్తుందట.* *పదమూడు వర్జించవలసిందికాదు, రెండు కలిస్తే పదమూడు వర్జనీయమే !*

చవితి, షష్టి, అష్టమి, నవమి, ద్వాదశి తిథులను వదిలేస్తాం గనక వీటితో వచ్చే దగ్ధయోగాలను పట్టించుకోం. ఇక దశమి మంగళవారం, ఏకాదశి సోమవారాలే మనల్ని ఇబ్బంది పెట్టేవి. తిధి, వారాలు కలిసి దోషప్రదమైన దగ్ధయోగాన్నిస్తాయి. నిత్యమూ చేసే పనులకి పంచాంగం చూడక్కరలేదంటారు,కొంత మంది పెద్దలు. ఇవి అత్యంత ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు ఆచరించాల్సి ఉంటుంది.

*షష్టి నాడు వచ్చే శనివారం,*

*సప్తమి నాడు వచ్చే శుక్రవారం,*

*అష్టమి నాడు వచ్చే గురువారం,*

*నవమి నాడు వచ్చే బుధవారం,*

*దశమి నాడు వచ్చే మంగళవారం,*

*ఏకాదశి నాడు వచ్చే సోమవారం.*

*ద్వాదశి నాడు వచ్చే ఆదివారం.*

ఇలా వచ్చినప్పుడు ఏ విధమైన శుభకార్యాలు చేసుకోకూడదు. వీటిని దగ్ధయోగాలు అంటారు. పనుల కోసం ఏ తిథి మంచిది, ఏ తిథి మంచిది కాదు ఇలా తెలుసు కోండి.

*తిధులు వాటి ఫలితాలు:-*

~~~~~~~~~~~~~~


*పాడ్యమి:—* మధ్యాహ్నం తర్వాత జయమవుతాయి, శుభం.

*విదియ:—* ఏపని చేసిన సంతోషాన్ని ఇస్తుంది.

*తదియ:—* సౌక్యం, కార్య సిద్ధి.

*చవితి:—* మధ్యాహ్నం తర్వాత జయమవుతాయి.

*పంచమి:—* ధన ప్రాప్తం, శుభయోగం.

*షష్టి:—* కలహం, రాత్రికి శుభం.

*సప్తమి:—* సౌకర్యం.

*అష్టమి:—* కష్టం.

*నవమి:—* వ్యయ ప్రయాసలు.

*దశమి:—* విజయ ప్రాప్తి.

*ఏకదశి:—* సామాన్య ఫలితములు.

*ద్వాదశి:—* భోజన అనంతరం జయం.

*త్రయోదశి:—* జయం.

*చతుర్దశి:—* రాత్రి కి శుభం.

*పౌర్ణమి:—* సకల శుభకరం.

*అమావాస్య:—*

సాయంత్రం నుండి శుభకరం.

*సేకరణ:*

*-- వరలేఖరి.నరసింహశర్మ.*

,..........


 

Monday, 26 October 2020

stories

[: 🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 14 🌴

14.  అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత: |
ప్రాణాపానసమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ ||

🌷. తాత్పర్యం :
ప్రాణుల దేహములందలి జఠరాగ్నిని నేను, ప్రాణాపానవాయువులతో కూడి నేను నాలుగు విధములైన ఆహారములను పచనము చేయుచున్నాను.

🌷. భాష్యము  :
భుజించిన ఆహారము జీర్ణము చేయుటకు ఉదరమందు అగ్ని కలదని ఆయుర్వేదము ద్వారా మనకు అవగతమగుచున్నది. అట్టి అగ్ని తగినరీతి ప్రజ్వరిల్లినపుడు ఆకలి కలుగును. సరిగా ప్రజ్వలితము కానపుడు ఆకలి కాదు. ఆ విధముగా అగ్ని తగినరీతి ప్రజ్వలితము కానపుడు వైద్యము అవసరమగును. ఉదరమునందలి ఆ అగ్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము.

శ్రీకృష్ణభగవానుడు అగ్నిరూపమున ఉదరమునందు వసించి అన్నిరకములైన ఆహారమును పచనము చేయుచున్నాడని బృహదారాణ్యకోపనిషత్తు(5.9.1) నిర్ధారించుచున్నది (ఆయ మగ్ని: వైశ్వానరో యో(యం అంత:పురుషే యేనేద మన్నం పచ్యతే). అనగా భగవానుడు సర్వవిధ ఆహారపచనము నందు సహాయభూతుడగుచున్నందున భోజన విషయమున జీవుడు స్వతంత్రుడు కాడు. జీర్ణక్రియయందు భగవానుడు తోడ్పడనిదే జీవునకు ఆహారమును భుజింప అవకాశము కలుగదు.

ఈ విధముగా శ్రీకృష్ణుభగవానుడు ఆహారమును సృష్టించుట మరియు ఉదరమున జీర్ణము చేయుట వంటి కార్యముల నొనరించుట చేతనే, మనము జీవితమున అనుభవించగలుగుచున్నాము. ఈ విషయము వేదాంతసూత్రము నందు(1.2.27) కూడా “శబ్దాదిభ్యో(న్త: ప్రతిష్టానాచ్చ” యని స్థిరీకరింపబడినది.

అనగా శ్రీకృష్ణభగవానుడు శబ్దమునందు, దేహమునందు, వాయువు నందేగాక ఉదరమందు జీర్ణకారకశక్తి రూపమును స్థితుడై యున్నాడు. ఇక నాలుగురకముల ఆహారములనగా భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములని భావము. వీటన్నింటిని జీర్ణము చేయువాడు భగవానుడే.
🌹 🌹 🌹 🌹 🌹

🌻 73. మధుసూదనః, मधुसूदनः, Madhusūdanaḥ 🌻

ఓం మధుసూదనాయ నమః | ॐ मधुसूदनाय नमः | OM Madhusūdanāya namaḥ


మధు (నామానమసురం) సూదితవాన్ మధునామముగల అసురుని 'సూదనము' (సంహరించుట) చేసెను.

:: మహాభారతము - భీష్మ పర్వము 67.14 ::

కర్ణమిశ్రోద్భవం చాపి మధునామ మహాఽసురం । బ్రహ్మణోఽపచితిం కుర్వన్ జఘాన పురుషోత్తమ తస్య తాత । వధా దేవ దేవదానవమానవాః । మధుసూదన ఇత్యాహు రృషయశ్చ జనార్ధనమ్ ॥ 16 ॥

పురుషోత్తముడు బ్రహ్మను ఆదరించుచు (బ్రహ్మ ప్రార్థనచే) తన కర్ణములనుండి ఉద్భవిల్లిన మధువను మహా సురుని చంపెను. నాయనా! అతనిని వధించుటవలననే దేవదానవ మానవులును ఋషులును ఈ జనార్ధనుని 'మధుసూదన' అందురు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

Source Sloka
ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥

Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 74 / Vishnu Sahasranama Contemplation - 74 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 74. ఈశ్వరః, ईश्वरः, Īśvaraḥ 🌻

ఓం ఈశ్వరాయ నమః | ॐ ईश्वराय नमः | OM Īśvarāya namaḥ

సర్వశక్తిమాన్ సర్వశక్తి (అనంతశక్తి) కలవాడు.

:: శ్వేతాశ్వతరోపనిషత్ - షష్ఠోఽధ్యాయః ::
త మీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం ।
పతిం పతీనాం పరమం పరస్త ద్విదామ దేవం భువనేశ మీడ్యమ్ ॥ 7 ॥

ఈశ్వరుని వైవస్వత యమునికంటే గొప్పవానిగను, దేవేంద్రాది దేవతలకంటే శ్రేష్ఠునిగను, ప్రజాపతులందరికంటే శ్రేష్ఠ ప్రజాపతిగను, అక్షర స్వరూపుని కంటే పరునిగను, జ్యోతిస్వరూపునిగను, లోకేశ్వరునిగను, స్తుతింపదగిన వానిగను తెలిసికొన్నామని విద్వాంసులు స్వానుభవముతో చెప్పిరి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:02, 27/10/2020] +91 98494 71690: 🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 17  / Sri Devi Mahatyam - Durga Saptasati - 17 🌹
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 5
🌻. దేవీ దూతసంవాదం - 2 🌻

17-19. సర్వభూతాలలో చేతనా (తెలివి) స్వరూప అయి నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

20–22. సర్వభూతాలలో బుద్ధిస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

23-25. సర్వభూతాలలో నిద్రాస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

26-28. సర్వభూతాలలో క్షుధా (ఆకలి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

29-31. సర్వభూతాలలో ఛాయా (ప్రతిబింబం) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

32–34. సర్వభూతాలలో శక్తిస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

35-37. సర్వభూతాలలో తృష్ణా (దప్పిక) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

38–40. సర్వభూతాలలో క్షాంతి (ఓర్పు) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

41–43. సర్వభూతాలలో జాతి స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

44–46. సర్వభూతాలలో ల (వినమ్రత) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

47–49. సర్వభూతాలలో శాంతిస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

50–52. సర్వభూతాలలో శ్రద్ధా (ఆసక్తి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 86 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.   ఆత్మను తెలుసుకొను విధము -16 🌻

ఒక కమ్మరివాని దగ్గరకు వెళ్ళినప్పుడు, ఎలా వుందట? అక్కడ ఒక పెద్ద దాగలి ఉంటుంది. దాగలి అంటే ఆధారముగా పెట్టినటువంటి ఒక ఇనుప ముద్ద. దాని మీద అనేక వస్తువులు తయారౌతూ ఉంటాయి. కానీ, దాగలిలో ఏ మార్పు ఉండదు. దాగలిలో ఏ పరిణామము ఉండదు. దాగలిలో ఏరకమైనటువంటి సంపర్కము ఉండదు. అది ఎప్పుడూ విలక్షణమే.

అంటే, కూటస్థుడు సర్వ సృష్టి యందు అనేక పరిణామములు జరుగుతున్నట్లు కనబడుతున్నప్పటికీ, సర్వ వ్యాపకుడై, సర్వ విలక్షణుడై, సర్వ సాక్షియై ఉన్నందువలన, తాను ఎట్టి పరిణామమును పొందుట లేదు. అట్టి కూటస్థ ప్రతిబింబము అయినటువంటి జ్ఞాత పిండాండము నందు స్వయం కూటస్థ స్వరూపుడైనటువంటి జ్ఞాత పిండాండము నందు, అదే లక్షణములతో, సర్వ విలక్షణముగా, సర్వ సాక్షిగా ఉన్నందువలన, నేను అనునది ఎట్టి పరిణామమును పొందుట లేదు. ఎట్టి కర్మలను చేయడం లేదు.

కానీ ఈ జ్ఞాత, ఆ కూటస్థుడు, పిండాండ సాక్షి అయినటువంటి జ్ఞాత, బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థుడు, ఇరువురు లక్షణరీత్యా సమములు. కాబట్టి, అలా గుర్తెరిగినటువంటి వారు, ఎవరైతే ఉంటారో, వారు బ్రహ్మజ్ఞానులు. వారు బ్రహ్మనిష్ఠులు. వారు బ్రహ్మానుసంధాన పరులు. వారు బ్రహ్మవిదులు. వారు ఆ రకముగా సమస్తమైనటువంటి సృష్టిని కూడా ‘తాను బ్రహ్మమే’ అనే రీతిగా చూచేటటువంటి వారు. ఈ రకముగా ఆత్మను, బ్రహ్మమును ప్రతిపాదిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.

         ఉదాహరణ: కొందరు ఊరేగింపుగా వెళ్ళుచున్నారు, అందులో కొందరు గొడుగులు వైసుకొన్న వారును, కొందరు వేసుకొనని వారును యున్నారు. అయినప్పటికీ గొడుగులు లేని వారును కూడా కలిపి, గొడుగుల ఊరేగింపు వెళ్ళుచున్నదని చెప్పుచున్నాము. అటులనే కర్మఫలము ననుభవించునది జీవాత్మయే అయినప్పటికి సర్వవ్యాపకుడైన పరమాత్మ అంతటా నిండియున్నప్పటికి, పరమాత్మను పొందుటకు శ్రేష్టమైన స్థానము ఈ శరీరములోని హృదయకాశమనబడు బుద్ధి గుహయని చెప్పబడినది.

         దీనినే ఛత్రి న్యాయము అంటారు. ఈ ఛత్రీ న్యాయాన్ని ఉపమానంగా ఇక్కడ ఇచ్చారు అన్నమాట. అంటే అర్థం ఏమిటి? మనం రోడ్డుమీద నిలబడి చూస్తున్నాము, అక్కడ ఒక ఊరేగింపు వెళ్తోందట. ఏ ఊరేగింపు అంటే, గొడుగుల ఊరేగింపు వెళ్తోందట. అంటే, అనేక మంది ప్రజలు ఊరేగింపుగా రోడ్డు మీద వెళ్తున్నారు.

వెళ్ళే వాళ్ళల్లో ఎక్కువ భాగం మంది ఆ గొడుగులను వేసుకుని వెళ్తున్నారు. కొంతమంది గొడుగులు వేసుకోకుండా కూడా వెళ్తున్నారు. కానీ ఎక్కువ భాగం మంది గొడుగులు వేసుకుని వెళ్తూ వుండడం కనబడినందువలన, కనపడినటువంటిదే సత్యముగా భావించి, అర్థప్రమాణమును స్వీకరించి, మిగిలిన గొడుగులు వేసుకోనివారిని ప్రధానంగా స్వీకరించక, గొడుగుల ఊరేగింపు జరుగుతున్నది అని స్టేట్‌మెంట్‌ [Statement] ఇచ్చారు అని ప్రకటించారు.

ఆ రకంగానే జీవాత్మ, పరమాత్మ ఒకే స్థానంలో ఉన్నప్పటికీ, ప్రధానంగా 90 శాతం మంది జీవులందరూ కూడా కర్మఫలమును ఆశ్రయంగా స్వీకరించి, కర్మచక్రములో పరిభ్రమిస్తూ, తాను కర్మఫల సంగి గా ఉండడం చేత, సుఖభోక్తగా ఉండడం చేత, ఆ సుఖ పిపాసగా ఉండడం చేత, జీవాత్మ కర్మఫలం అనేటటువంటి చక్రంలో తిరిగిపోతూ ఉన్నది.

అట్లా వెళ్తున్నవారినందరినీ జీవులు అంటే, అదే స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రాసంగికమును విస్మరించినట్లు అవుతుంది కాబట్టి. కానీ ఇది సరియైన విధానం కాదు. యథార్థమునకు జీవులే ప్రధానం అని అనుకోవడం తప్పుకదా! సర్వసాక్షి అయినటువంటి పరమాత్మను ప్రధానంగా స్వీకరించినట్లయితే, వాళ్ళు ఆ బుద్ధిగుహ యందు అట్టి పరమాత్మని పొందగలుగుతున్నారు.

         బుద్ధిగుహ అనే హృదయస్థానంలో ఉన్నటువంటి, జీవుడు తాను లేనివాడినని గ్రహించి, తాను ప్రతిబింబమని గ్రహించి, తాను నీడవంటి వాడినని గ్రహించి, తన స్వరూప జ్ఞానమైనటువంటి పరమాత్మ స్థానము వైపుకు తిరిగి చూసిన్నట్లైతే తనను తానే పొందుచున్నాడు. తనను తానే గుర్తించుచున్నాడు. తనను తానే అనుభూతమొనర్చుకొనుచున్నాడు.

కాబట్టి, ఈ రకమైనటువంటి ఆంతరిక సాధనను, అంతర్ముఖ ప్రయాణాన్ని మానవులందరూ తప్పక పూర్తి చేయాలి. ఈ బుద్ధి గుహ అనేటటుంవటి హృదయాకాశ స్థానమును తప్పక పొందాలి. గుర్తించాలి. ఆ గుర్తించడం పేరే నిర్వాణ సుఖము. ‘నిర్వాణం’ అనేది ఇదన్నమాట. - విద్యా సాగర్ స్వామి  

సశేషం....
🌹  శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 90 /  Sri Gajanan Maharaj Life History - 90 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 18వ అధ్యాయము - 4 🌻

ఆరోజు ఆషాఢ శుద్ధ నవమి. వేలకొలది వార్ కార్లు(క్రమంగా దర్శించేవారు పండరపూరు చేరడం ప్రారంభించారు. ఆకాశం మేఘావృతమయి చిన్నగా వానపడుతోంది. పండరపూరు మానవ సముద్రంలా ఉండి, భూమిమీద వైకుంఠంలా కనిపించింది. ప్రదక్షిణకొరకు ఉన్న మందిర ప్రాంగణం అంతా జైజై రామకృష్ణహరి అనే భజనచేస్తున్న భక్తులతో నిండిపోయింది. వాతావరణం అంతా సంతోషంతో నిండిఉంది.

నాధ్, నివృత్తి, ధ్యనేశ్వర్, సవతా, గోరాకుంభర్, శ్రీతుకోబా దేహకర్, సోపాన, ముక్తాబాయి, జనార్ధన్ వంటి యోగుల పల్లకిలు పండరపూరు చేరాయి. భక్తులు వీరికి అభివాదంగా బుక్కా గాలిలో చల్లారు. దీనితో ఆకాశం అంతా బుక్కాతో నిండి దీనిసుగంధం చుట్టూ వ్యాపించింది. పువ్వులూ, తులసి దళాలుకూడా ప్రజలు పల్లకిమీద వేసారు. అటువంటి వాతావరణంలో శ్రీమహారాజు పండరపూరు చేరి, ప్రదక్షిణకు వెళ్ళేదారిలో ఉన్న కుకాజీపాటిల్ ఇంటిలో బసచేసారు. చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు. వీళ్ళని అదుపులో పెట్టేందుకు డజనులకొలది పోలీసులు అక్కడ హాజరు అయి ఉన్నారు.

నిస్సహాయంగా..ఓ విఠలా ఏకాదశి రోజున బాపునా తప్ప మిగిలిన షేగాం ప్రజలు హరిపాటిల్తో కలిసి మందిరానికి వెళ్ళారు. బాపునా స్నానంకోసం వెళ్ళడంతో వెనక వదలబడ్డాడు. స్నానంనుండి తిరిగివచ్చిన అతనికి అందరూ అప్పటికే మందిరానికి వెళ్ళిపోయినట్టు తెలిసింది. అతను కూడా త్వరగ వాళ్ళని అనుసరించేందుకు చూసాడు, కానీ మందిరం చుట్టూ చాలామంది ఉండడంతో పాపం బాపూనాకు ఎటువైపునుండి లోపలికి వెళ్ళడానికి దారిదొరకలేదు.

నిస్సహాయంగా...ఓ విఠలా, ఋషీకేశా నాతో ఇంత అసంతృప్తి ఎందుకు చెందావు. మీదర్శనంనాకు ఎందుకు ఇవ్వడంలేదు ? మీరు సవతామాలికి దర్శనం ఇవ్వడానికి అరణ్ వెళ్ళారు, అలానే ఓ పాండురంగా నన్ను కలవడానికి మందిరం నుండి రండి. అరణ్ అయితే 16 మైళ్ళు దూరంలో ఉంది, కానినేను ఇప్పుడు మీమందిరం దగ్గరలో ఉన్నాను. మిమ్మల్ని ప్రజలు నిస్సహాయులకు సహాయుడవు అని పిలుస్తారు, మరి నన్ను ఎందుకు విస్మరిస్తున్నారు అని మనసులోనే బాపునా ప్రార్ధించాడు. అలా ప్రార్ధించి, ప్రార్ధించి చివరికి నిరాశతో సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చాడు.

రోజంతా కూడా ఏమీ ఆహారం తీసుకోలేదు, పైగా ఈనిరాశ ఇంకా అతనిని పేలగాచేసి కృంగదీసింది. వెళ్ళారు, అలానే ఓరలో ఉన్నాను. మిమ్మలి. అలా ప్రార్ధించి, ప్రాక్టీగాచేసి కృంగదీసింది. విఠలభగవానుని కలవాలన్న ఆయనకోరిక అంతతీవ్రమయినది. దానితో అతనిమనసు నిరంతరంగా మందిరం చుట్టూ తిరుగుతోంది. అందరూ బాపునాను చూసి అత్యంత దురదృష్టవంతుడవని నవ్వడం మొదలు పెట్టారు.

పండరపూరు వచ్చి, మందిరానికి వెళ్ళేబదులు దుకాణాలు దర్శిస్తూ తిరిగి ఉంటాడు అనిఅన్నారు. కొంతమంది అతను దురదృష్టవంతుడు, కపటి అనిఅన్నారు. మరికొంతమంది బాపూనాకు వేదాంతం అంతా తెలుసు కావున అతనికి మందిరానికి వెళ్ళవలసిన అవసరంలేదని వెక్కిరించారు. వేదాంతులు భగవంతుడు తమ మనసులోనే ఉన్నాడు, ఆరాళ్ళలో కాదు అని నమ్ముతారు, మూర్ఖులు మాత్రమే మందిరానికి వెళతారు, బాపునా పండరపూరు వచ్చేబదులు విఠోబాను షేగాం పిలిచి ఉండవలసింది అనిఅన్నారు.

ఈ వేదాంతులు అనుభవం ఏమీలేకుండా, తము పాటించకుండా ఇతరులకు బోధిస్తారు, కనిపిస్తున్న భగవంతుడుని ఆరాధించకుండా ఆత్మజ్ఞానంకలగదని వీరు అర్ధంచేసుకోరు. బాల్యం లేకుండా యవ్వనం పొందగలరా ? ఈవిధమయిన వెక్కిరింతలు అవహేళనలు బాపూనా మీద గురిపెట్టారు. ఎవరూ అతనిని ఈదాడినుండి కాపాడలేదు. అతను ఏవిధమయిన ఆహారం తీసుకోకుండా, నిశ్శబ్దంగా కూర్చున్నాడు.

శ్రీమహారాజు అతని చుట్టూ జరుగుతున్న తతంగాన్ని చూస్తున్నారు. భగవంతుడు పేదల మరియు నిస్సహాయులను కాపాడేందుకు వస్తాడు. యోగుల సాంగత్యం పొందినవారు అదృష్టవంతులు. బాపూనా విచారించకు రా నేను నీకు రుక్మిణీ రమణుని ఇప్పుడే చూపిస్తాను అని శ్రీమహారాజు అన్నారు. అలా అంటూ శ్రీమహారాజు లేచి నిలుచుని తన కాళ్ళు విరోబాలా ఉంచి, చేతులు నడుంమీద పెట్టారు.

ఈ భంగిమలో మెడలో తులసీదళాలు, పువ్వుల దండతో ఉన్న ఆయనను బాపూనా దర్శించాడు. ఆయన పాదాలకు నమస్కరించి పైకిచూసేసరికి తిరిగి విఠోబా స్థానంలో శ్రీమహారాజు కనిపించారు. ఈవిఠోబా దర్శనానికి బాపూనా అమిత ఆనందం పొందాడు. తరువాత అతను మందిరానికి వెళ్ళినప్పుడు సరిగ్గా శ్రీమహారాజు తనకు చూపించిన, కుకాజీవాడలో చూసిన భంగిమలాంట లలితా చైతన్య విజ్ఞానము  - 56, 57 /itha Chaitanya Vijnanam  - 56, 57  🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
22. సుమేరు మధ్య శ్రుంగస్థ శ్రిమన్నగర నాయిక
చింతామణి గృహాన్తస్త పంచబ్రహ్మాసనస్తిత

🌻 56. 'శ్రీమన్నగరనాయికా' 🌻

నగరమునకు నాయక యని అర్థము. నగరమునకు అర్థము విద్యానగర మనియె. సమస్త విద్యలకు ఏ ప్రదేశమాలయమో, దానిని ప్రాచీన కాలమున నగరమని పిలిచెడివారు. నాగరికులనగ విద్యల యందు నిపుణులని అర్థము.

పూర్వకాలమున విద్యయే సంపదగ
భావించుటచే విద్యలు గల తావును నగర మనిరి. వారణాసి, పాటలీ పుత్రము, ఉజ్జయిని అట్టి నగరములే. భవంతుల ఎత్తును బట్టి, ప్రదేశము వైశాల్యమునుబట్టి, జనాభానుబట్టి ప్రస్తుతము నగరములను నిర్వచించు చున్నారు. ఇది కలి ధర్మము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 57  / Sri Lalitha Chaitanya Vijnanam  - 57 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
22. సుమేరు మధ్య శ్రుంగస్థ శ్రిమన్నగర నాయిక
చింతామణి గృహాన్తస్త పంచబ్రహ్మాసనస్తిత

🌻 57. 'చిన్తామణి గృహాంతస్థా' 🌻

చింతామణులచే నిర్మింపబడిన గృహమునందు నివసించునది అని అర్థము. తలచిన కోరికలను తీర్చునట్టిది చింతామణి రత్నము. అట్టి
రత్నములచే నిర్మించబడిన గృహము నందు వసించునది అని  అర్థము.

చింతామణి గృహము బ్రహ్మాండము నధిష్ఠించి యుండునని, అందుండియే సమస్త సృష్టి ప్రణాళిక వెలువడునని బ్రహ్మాండ పురాణమున తెలుపబడెను. ఇది కారణముగ చింతామణి గృహమే సమస్త సృష్టికిని, త్రిమూర్తులకును, త్రిశక్తులకును శిరోధార్యముగ భావింతురు. ఆ గృహమున వసించునదియే శ్రీదేవి. మానవ శరీరమందు సహస్రార పద్మము నధిష్ఠించిన మణి గూడ చింతామణియే.

మానవ ప్రజ్ఞకు అది పరమోత్కృష్ట స్థానము. అట్లే సృష్టికి పరమోత్కృష్ట స్థానము చింతామణి గృహము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

[06:02, 27/10/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 32 🌹
 
****************************************************

: అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః

గురుగ్రహమే కాని,శుక్ర గ్రహమేకాని సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు.

మౌఢ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు.అందువల్ల మౌఢ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.

శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము. మౌఢ్యమిని "మూఢమి"గా వాడుకభాషలో పిలుస్తారు. ఈమూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు.మూఢమి అంటే చీకటి అని అర్ధం. మూడమి అనేది అన్ని గ్రహాలకు ఉన్నగురు,శుక్ర మౌడ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది.
శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది.సముద్రం ఆటు,పోటులలో మార్పులు వస్తాయి.
శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యథికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి -శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు.ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.

మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమాము:-
*******

పెళ్ళిచూపులు, వివాహం ,ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్టానం,విగ్రహా ప్రతిష్టలు, వ్రతాలు, నూతనవధువు ప్రవేశం ,నూతన వాహనము కొనుట,బావులు,బోరింగులు,చెరువులు తవ్వటం,పుట్టువెంట్రుకలకు ,వేదా"విధ్యా"ఆరంభం, చెవులు కుట్టించుట,నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయరాదు.

మౌఢ్యమిలో చేయదగిన పనులు :
*******
జాతకర్మ,జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు,జప,హోమాది శాంతులు ,గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు, సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా,శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును. గర్భిని స్త్రీలు,బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిధులలో అశ్వని,రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.

-- వరలేఖరి.నరసింహశర్మ.
[ ముహూర్తం చూడడం ఎలా?
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః

శ్లో// చక్షుషే జగతాం కర్మసాక్షిణే తేజసాంనిధేః
మూర్తి త్రయ స్వరూపాయ మార్తాండాయ నమోనమః//

మనం ఒక అధికారి దగ్గరికి పనిమీద వెళ్లేటప్పుడు ఆ అధికారి కోపంలో ఉన్నాడా!?, సంతోషంలో ఉన్నాడా!? మొదలైన విషయాలు తెలుసుకుని అతను సంతోషంలో ఉన్నప్పుడు వెళితే మన పని త్వరగా అవుతుంది. అలాగే తెలివైన వారు కాలం యొక్క స్వభావాన్ని తెలుసుకుని మంచి కాలములో తగిన పనులు చేయ తలపెడతారు. అన్నికాలాలూ మనకు జయాన్ని ఇవ్వవు. ఒక సమయంలో ఒకరికి శుభం జరిగితే మరొకరికి కష్టం కలగవచ్చు. మనం పుట్టిన సమయాన్ని బట్టి మనకు మాత్రమే ప్రత్యేకంగా సరిపడు కాలం తెలుసుకోవాలి. మనం పుట్టిన సమయానికి ఉన్న నక్షత్ర,లగ్న ములను బట్టి మనకు/ మనం తలపెట్టిన పనికి సరిపడు నక్షత్ర, లగ్న సమయాలు తెలుసుకుని ముందడుగు వేయడం జయాన్ని కలిగిస్తుంది. కాలం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఋషులు మనకు అందించిన అద్భుత వరం “జ్యోతిష్య శాస్త్రం”. దీని ఆధారంగా మన జీవితంలో జరుగు వివాహము, ఉపనయనము, గృహప్రవేశము మొదలైన కర్మలను ఏ రోజు, ఏ సమయంలో జరుపుకోవచ్చో తెలుసుకొనవచ్చు.

ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా ఈ క్రింధి విషయాలు గమనించాల్సి ఉంటుంది.

౧) తారా బలం, ౨) చంద్ర బలం, ౩) లగ్న బలం, ౪) పంచక రహితం, ౫) ఏకవింశతీ మహా దోషాలు
వీటి తో పాటు చివరిగా ఆయా క్రతువులకు పనికి వచ్చే తిథి, వార, నక్షత్రాలనే వాడామా లేదా అనే విషయం కూడా తప్పకుండా నిర్థారించుకోవాలి.
ఉదాహరణకు : మనం అడిగి మరీ పెట్టించుకునే “ఆదివారం” గృహప్రవేశం, ఉపనయనం, వివాహం మొదలైనవాటికి తగిన వారంగా పేర్కొన బడలేదు. బుధ,గురు, శుక్రవారములు చాలా వరకు శుభకార్యములకు మంచివిగా పెద్దలు తెలిపారు. అయితే వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథివారములు మధ్యస్థముగా ఉన్ననూ స్వీకరిస్తుంటారు.
ఒక పని ముఖ్యంగా వైదికసంబంధమైన వివాహ గృహప్రవేశాది క్రతువులు చేయతలపెట్టినప్పుడు ఈ విషయాలు అన్నీ గమనించి శుద్ధపరచిన శుభముహూర్తములు గ్రహించాలి. 👈:

👉 చంద్ర బలం:

ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు పరిశీలించవలసిన ముఖ్యమైన విషయాలలో చంద్రబలం ఒకటి. ముహూర్త సమయానికి చంద్రుడు ఉన్న రాశిని బట్టి బలాన్ని నిర్ణయించాలి. ఎవరికొరకు ముహూర్తం చూస్తున్నామో వారి జన్మ రాశినుండి, ముహూర్తం నిర్ణయించదలచిన రోజున చంద్రుడు ఉన్న రాశివరకు లెక్కించాలి.
జన్మ రాశినుండి ముహూర్త సమయ చంద్రరాశి
శుక్ల పక్షంలో : 2-5-9
క్రిష్ణ పక్షంలో : 4-8-12
శుక్లపక్షం, క్రిష్ణ పక్షం రెండిటిలోనూ : 1,3,6,7,10,11 అయితే మంచిది.
అనగా శుక్లపక్షంలో చంద్రుడు 4-8-12 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.
కృష్ణ పక్షంలో చంద్రుడు 2-5-9 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.

👉 తారాబలం చూడటం ఎలా?

ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం. ఏ చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలి. జన్మ నక్షత్రం నుండి ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలి. వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి.
1 వస్తే ‘జన్మతార’ అలా వరుసగా....
1) జన్మతార, 2) సంపత్తార, 3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార.
ఇవేవో అశ్వని, భరణి, కృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి. ఆ 27 నక్షత్రాలకే మన జన్మతారను బట్టి ఈ తొమ్మిది పేర్లు అన్వయించాలి. అంటే ‘విద్యార్థి’ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త అవుతాడు. అలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితే, మరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుంది. మరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుంది. ఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.
పైవాటిలో సంపత్తార, క్షేమ తార, సాధన తార, మిత్ర తార, పరమమిత్ర తారలు ( 2,4,6,8, 9 తారలు ) సకల శుభకార్యాలు చేసుకోవడానికి పనికి వస్తాయి. వృత్తి,వ్యాపార సంబంధమైన విషయాలు ‘సంపత్తార’ లోను, ప్రయాణాది కార్యాలు ‘క్షేమతార’ లోను, సాధించి తీరాలనుకునే కార్యాలు ‘సాధనతార’ లోను ప్రారంభించడం మరింత మంచిది.
జన్మతార కొన్ని శుభకార్యాలకు పనికొస్తుంది. కొన్నిటికి పనికి రాదు.
చెవులు కుట్టడం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, నిషేకం, యాగం, పట్టాభిషేకం, వ్యవసాయం, భూసంపాదన మొదలైన వాటికి జన్మతారను గ్రహించ వచ్చు.
ప్రయాణం, పెండ్లి, క్షౌరము, ఔషధ సేవనం, గర్భాదానం, శ్రార్థం, సీమంతం, పుంసవనము మొదలైనవి జన్మనక్షత్రంలో చేయరాదు.
ఉదాహరణ : రేవతి నక్షత్రం జన్మ నక్షత్రం అనుకుంటే, ముహూర్త నిర్ణయంరోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది అనుకుంటే, రేవతికి పూర్వాభాద్ర సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. అంటే రేవతి నుండి పూర్వాభాద్ర ఎన్నో నక్షత్రమో లెక్క పెట్టాలి. 26 వ నక్షత్రం అవుతుంది. దానిని తొమ్మితో భాగహరించగా శేషం 8 వస్తుంది. అంటే రేవతికి - పూర్వాభాద్ర ఎనిమిదో తార ( మిత్ర తార ) అవుతుంది. అంటే శుభం కనుక ముహూర్తము పనికొస్తుంది.
శేషం సున్నా వస్తే అది తొమ్మిదిగా గుర్తించాలి.
తప్పని సరి పరిస్థితులలో ముహూర్తనిర్ణయం చేయవలసి వస్తే .....
ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయేతు తృతీయకం
తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషువర్జయేత్ !
ప్రథమ నవకం లో ( 1 నుండి 9 తారలలో ) మెట్ట మొదటి తారను,
2 వ నవకం లో ( 10 నుండి 18 తారలలో )మూడవ తారను,
3 వ నవకంలో( 19 నుండి 27 తారలలో ) పంచమ తారను,
ప్రతీ నవకంలో 7 వతారను ఎల్లప్పుడు వదిలి పెట్టవలెను.
అంటే జన్మనక్షత్రము లగాయతు 1, 7, 12, 16, 23 మరియు 25 నక్షత్రాలను ఎల్ల వేళలా శుభకార్యములలో వదిలిపెట్టాలి.
అంటే సాధారణంగా జన్మ నక్షత్రం నుండి 1,3,5,7,10,12,14,16,19,21,23 మరియు 25 నక్షత్రాలను శుభకార్యములలో వదిలిపెట్ట వలసి ఉన్నది. కానీ కావలసిన సమయము లోపల ముహూర్తములు కుదరని పక్షమున 1, 7, 12, 16, 23 మరియు 25 తారలు మాత్రం వదిలి మిగతావి రెండవ ఎంపికగా గ్రహించ వచ్చును.

సేకరణ :
 

 సంస్కారములు - ముహూర్తములు :
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః

మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు సంష్కారమయమే. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా వీడిపోయి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. జీవి గర్భంలో పడింది మొదలు అంత్య సంస్కారం వరకు జరిగే సంస్కారాలు లేదా కర్మలు ధర్మశాస్త్రల్లో 40 వరకు చెప్పబడ్డాయి. గౌతమ స్మృతుల్లో 40 సంష్కారాలను, అంగీరస మహర్షి 25, వ్యాసుడు 16 సంష్కారాలను చెప్పారు. మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా చెబుతుంది.

వివాహము:

 ఒక సత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే వివాహము. ముహూర్త వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం. అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల రోజులలో వివాహము మంచిదే.

లగ్నంలో పాపగ్రహములు:

 లగ్నాత్ సప్తమంలో పాపగ్రహములు లేకుండా వివాహ సుముహూర్తము చేయాలి. ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రాలు వివాహమునకు గ్రాహ్యము కాదు అని కొందరి వాదన వున్నది. అది కూడా గ్రంథాధారమే కానీ వాటిల్లో కొందరు మహర్షులు శ్రేష్ఠము అని చెప్పిన కారణంగా అందరూ ఆచరిస్తున్నారు. చిత్తా నక్షత్రం గ్రాహ్యం కాదని వాదన. లగ్నాత్ కేంద్రములు అనే 1,4,7,10 స్థానములలో శుభ గ్రహములు వుండడం దృష్ట్యా వివాహ లగ్నమునకు బలం ఎక్కువ అని చెప్పాలి. లగ్నాత్ 1,4,5,7,9,10 స్థానములలో శుభగ్రహ సంచారం విశేష లాభ ఫలితాలు ఇస్తుంది. అవకాశం వున్నంతవరకు 1,7 స్థానములలో పాపగ్రహములు లేకుండానే నిర్ణయం చేయాలి. శుక్ర గ్రహమునకు పాపగ్రహం సంబంధం లేకుండాను అలాగే చంద్రగ్రహం వున్న నక్షత్రంలో పాపగ్రహం లేకుండాను చేసుకోవాలి. కారణం కళత్ర కారకుడు శుక్రుడు. అలాగే మనఃకారకుడు చంద్రుడు. అలాగే వీలయినంతవరకు గురు బలం అధికంగా వున్న ముహూర్తం నిర్ణయించాలి.

గర్భాదానము:
స్త్రీ, పురుషులు (భార్యభర్తలు) ఇద్దరు కలసి ఒక కొత్త ప్రాణికి జీవం పోయడామే గర్భాదానము. స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ అండాశయంలో ఏర్పడిన అండంనకు పురుషునిలో ఉత్పత్తి అయిన వీర్యకణం ద్వారా ఫలదీకరణం చెందినట్లయితే స్త్రీ గర్భం దాల్చి నూతన జీవి పుట్టుకకు అవకాశం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల చిత్త వృత్తులు సంతానోత్పత్తి కాలములో ఎలా ఉంటాయో అటువంటి లక్షణాలు కలిగిన శిశువే జన్మిస్తారు. కావున తల్లిదండ్రులు గర్భాదాన సమయమున తాము దేవతలమని, పతి ప్రజాపతి యొక్క అంశ గలవాడని, పత్ని వసుమతి రూపమని తలచి దేవతా చింతనము చేయుచు గర్భాదానము చేయవలెను.

పుంసవనం:
తల్లి గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం.

సీమంతం:
తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేదే సీమంతం. తొలి గర్భదారణ విషయంలో 4, 6, 8 మాసములలో చేయుట శాస్త్ర సమ్మతము. అయితే 5, 7, 9 మాసములలో చేయుట ఆచారము. పుంసవనమునకు అష్టమ శుద్ధి కావలెను. సీమంతమునకు అష్టమ, నవమ శుద్ధులు రెండూ కావాలి. సీమంతర అనివార్య కార్యముల వలన చేయలేనిచో ప్రాయశ్చిత్తముగా గోదానము చేయాలి.

గర్భిణీపతి ధర్మాలు:
భార్య గర్భవతిగా వున్నప్పుడు "గర్భిణీ వాంఛితం ధర్మం తస్యైదద్యాత్ యధోచితం" భార్య కోరిన ఉచితమైన కోరికలు భర్త తీర్చవలెను. విదేశీ ప్రయాణము, చెట్ల నరుకుట, 7వ మాసం నుంచి క్షౌరము, మైధునము, తీర్ధయాత్ర, శ్రాద్ధ భోజనము, నావప్రయాణము, వాస్తుకర్మలు, సముద్ర స్థానము, ప్రేతకర్మలు నిషేధము. గర్భిణీపతి స్వపితృకర్మలు చేయవచ్చును.

బారసాల:
తనని పరిపూర్ణ స్త్రీగా నిరూపించిన తన బంగారు బిడ్డకి అన్ని వేళలా తోడుగా ఉంటూ ప్రతిక్షణం తనదిగా, తన లోకంగా ఉండే చిన్నారి బిడ్డకు తొలుత చేసే ముచ్చటైన వేడుక బారసాల. మంగళ, శనివారములు పనికి రావు. అష్టమి ద్వాదశి, నవమి, అమావాస్య తిధులు పనికిరావు. బారసాల రోజునాయితే ఆ రోజు సాయంత్రం వర్జ దుర్ముహూర్తములు లేకుండా ఊయలల్లో నూతనముగా శిశువును వుంచవచ్చును. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పుబ్బ, విశాఖ, జ్యేష్ట, పు.షా, పుభా, నక్షత్రములు పనికి రావు.

క్షౌరం + పుట్టు వెంట్రుకలు
షష్ఠి, అష్టమి, నవమి, చవతి, చతుర్దశి, అమావాస్య, ద్వాదశి, పాడ్యమి తిధులు పనికి రావు. శుక్ర, మంగళ శనివారములు కూడదు. పుష్య, పునర్వసు, రేవతి, హస్త, శ్రవణ, ధనిష్ఠ, మృగశిర, అశ్వని, చిత్ర, శతభిషం, స్వాతి ఇవి ప్రసస్తములు ఉత్తర తూర్పు దిక్కుగా కూర్చొని క్షౌరం చేయించుకోవాలి. నిత్యంలో సోమ, బుధవార విషయములలో తిధి, నక్షత్రం పట్టింపు లేదు.

అన్నప్రాసన:
మగపిల్లల విషయంలో 6వ మాసం అన్నప్రాసన చేయలి. 5వ మాసం మొదలు బేసి మాసముల యందు ఆడపిల్లల విషయములో అన్నప్రాసన చేయాలి. 6వ నెల 6వ రోజు అనేది కుసంస్కారము. అది దుష్టాచారము. అన్నప్రసనతోనే పిల్లల ఆరోగ్య విషయాలు ఉంటాయి. అందు కోసం మంచి ముహూర్తానికే అన్నప్రసన చేయాలి. అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడం, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్త్రాభాద్ర, రేవతి నక్షత్రములయందు చేయవలెను. ఆది, శని, మంగళవారములు నిషేధం. జన్మలగ్నం, అష్టమ లగ్నం కాకుండగను, దశమస్థానం శుద్ధి ఉన్న లగ్నమున అన్నప్రాసన చేయవలెను.

గర్భధానం:
అశ్వని, భరణి, ఆశ్రేష, మఘ,మూల, జ్యేష్ఠ, రేవతి నక్షత్రముల పూర్తి నిషేధము. జన్మ, నైధన, తారలు కాకూడదు. ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, మృగశిర, హస్త అనూరాధ,శ్రవణం, ధనిష్టం, శతభిషం, రోహిణి స్వాతీ నక్షత్రములు విశేషములు. రెండు పక్షములలోని షష్ఠి అనధ్యయన దినములు ఏకాదశులు , ఆది మంగళ వారములు సంక్రమణ దినములు శ్రాద్ధ దినములు గర్భదానమునకు నిషేధదినములు వివాహం అయిన 16 రోజులలోపు గర్భదానమునకు ముహూర్తమును చూడనవసరం లేదు అనునది అశాస్త్రీయ విషయము. భార్య భర్తల భవిష్య ఆరోగ్య విషయములో గర్భాధాన ముహూర్తం ముఖ్య భూమిక వహిస్తుంది. వ్రతములు ఆచరించు దినములలో సంగమం నిషేధం.

చెవులు కుట్టుట:
జన్మించిన 12వ లేదా 16వ రోజును లేక 6వ, 7వ, 8 నెలలయందైననూ పూర్వాహ్న, మధ్యాహ్న కాలములలో సోమ, బుధ, గురు, శుక్రవారములలో శ్రవణం, అర్ద్ర, హస్త, చిత్త, మృగశిర,రేవతి, ఉత్తర ఉత్తరాషాఢ, ఉత్తరాభాధ్ర, పుష్యమి, పునర్వసు, ధనిష్టయందు కుంభ, వృశ్చిక, సింహ లగ్నములు కాకుండా, అష్టమ శుద్దితో కూడిన లగ్నమునందు చెవులు కుట్టుట మంచిది.

అక్షరాభ్యాసం:
ఉత్తరాయణం శ్రేష్ఠం. హస్త పునర్వసు, స్వాతి, అనూరాధ, అర్ద్ర, రేవతి, అశ్వని, చిత్త, శ్రవణములయందు ఆది, మంగళ, శనివారములు కాకుండాను చరరాశి లగ్నమందు రిక్తతిధులు షష్ఠి, అష్టమి విడిచి అనధ్యయన దినములు కాకుండా అష్టమ శుద్ది కలిగి ఉండే లగ్నమునందు అక్షరాభ్యాసం చేయాలి. కేవలం మధ్యాహ్నం లోపుగా ఉన్న లగ్నమునందు అక్షరాభ్యాసం చేయాలి.
నిష్క్రమణ సంస్కారం
శిశువును తొలిసారిగా ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడమే నిష్కమణ. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ తొలిసారిగా బయటి ప్రపంచంలో అడుగు పెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతి శక్తుల నుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 4వ నెల శిశువు సూర్యునికి చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ‘నిష్క్రమణ సంస్కారం’ అని పిలుస్తారు. శిశువు 4వ నెలలో సూర్యోదయ సమయాన ఈ కార్యాన్ని నిర్వహిస్తారు. గాలి బాగా ఆడే ఇంటి బయట ప్రదేశానికి శిశువును తీసుకెళ్ళి సూర్యుడికి శిశువు శరీరాన్నంతా భక్తి శ్రద్ధలతో చూపించడం జరుగుతుంది. అదే రోజు రాత్రి సమయంలో చంద్రుడికి కూడా శిశువు శరీరం చూపడం జరుగుతుంది.

ఆ తరువాత రోజులలో కూడా కొంతకాలం పాటు శిశువును సూర్యుడికి కొన్ని నిమిషాలు చూపించడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా శిశువు ఆరోగ్యవంతంగా బుద్ధిశాలిగా ఉన్నతి పొందుతాడు.

నామకరణం:
జన్మించిన శివువుకు నామకరణం జరిపించడంలో సంష్కారాల్లో ఒక భాగం. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర చరణములు ద్వారా ప్రతీ నక్షత్ర చరణమునకూ ఒక అక్షరము చెప్పబడినది. ఆ అక్షరము ఆధారంగా జన్మించినవానికి నామకరణము చేయడమనేది అనాదిగ వస్తున్న సంప్రదాయం. దీని ద్వారా ఒక్కోరాశికి 4 పాదాలుగా చేసి ఆ కాలమును అనుసరించి జన్మించిన బిడ్డకు ఆయా నక్షత్రములలోని 4 అక్షరములలో ఒకటి ముందు వచ్చునట్టుగా నామం నిర్ణయము చేస్తారు.

జాతకర్మకు వాడు నక్షత్రములు, తిధులు, వారములన్నియు నామకరణమునకు కూడా ఉపయోగించవచ్చును. మగపిల్లలకు సరి సంఖ్య అక్షరములతోను, ఆడపిల్లలకు బేసిసంఖ్య అక్షరములతోను నామకరణం చేయాలి. నామకరణ జాతకర్మ రెండును మధ్యాహ్నం 12 గంటల లోపే చేయాలి. లగ్నం నుంచి వ్యయ స్ధానంలో ఏ గ్రహం లేని ముహూర్తం నిర్ణయించవలెను. అలాగే అష్టమ శుద్ది విశేష నామము, దైవసంభంధము మాస సంబంధము ఉండునట్లు రావడం మంచిది. అర్ధం లేని పేర్లు పెట్టుట వలన దోషం ఏర్పడుతుంది.

నూతన వస్త్రధారణ:
ఆది, మంగళ, శనివారములు నూతన వస్త్రధారణ చేయకూడదు. అలాగే షష్టి, ద్వాదశి, నవమి, అమావాస్య తిధులలో నూతన వస్త్రధారణ పనికి రాదు. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్రలలో నూతన వస్త్ర ధారణ చేయుట మంచిది కాదు. అయితే నిత్యంలో పండుగ రోజులలోనూ వస్త్రధారణ చేయుటకు వర్జ్య దుర్ముహర్తములు లేని సమయంలో చేయ వచ్చును. అంతే కాకుండా నూతనవస్త్రములకు మంగళకరమైన పసుపునకు పెట్టి ధరించవలెను.

ఉపనయనం:
అక్షరాభ్యాసం అంటే లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే, పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు.

తనయుడికి తండ్రి ఉపనయనం చేస్తాడు. తండ్రి దేశాంతరమందుంటే తాత (తండ్రి యొక్క తండ్రి), అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపోతే సగోత్రమునందు జన్మించిన వారు చేయాల్సి ఉంటుంది.

గర్భాష్టమంలోను, 11 ,13వ సంవత్సరంలోనూ కాల ప్రాధాన్యం. కాలతీతం దృష్ట్యా ముహూర్త బలం లేకపోయినా ఉపనయనం చేయవచ్చు. 16 దాటిన బ్రాహ్మణునికి ఉపనయనం మంచిది కాదు. 22 దాటిన క్షత్రియులకు 24 దాటిన వైశ్యులకు ఉపనయనం వివాహం కోసమే గానీ సంస్కారం కోసం కాదు.

వసంత ఋతువు బ్రాహ్మణులకు, గ్రీష్మ ఋతువు క్షత్రియులకు, శరదృతువు వైశ్యులకు ఉపనయనమునకు మంచిది. అయితే వసంత ఋతువు అని వాడిన కారణంగా ఉత్తరాయణమునందు ఉపనయనము చేయుటకు సంకోచము లేదు. అయితే మాఘాది పంచమాసములు విశేషంగా చెప్పిన కారణంగా మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసములందు ఉపనయనము చేయు విషయమై ఆక్షేపణ అనవసరం. అయితే ప్రత్యేకించి మాఘాది పంచమాసాః అని విధించిన కారణంగా పుష్య మాసం, ఆషాఢ మాసం, ఉత్తరాయణంలో కూడుకున్నవి అయినప్పటికి ఆ మాసంలో ఉపనయన వ్రతం చేయరాదు. తదియ, పంచమి, షష్ఠి, సప్తమి తిధులు విశేషము బుధ, గురు, శుక్రవారములు మంచిది. అనూరాధ, హస్త, చిత్త, స్వాతి, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి, ఉత్తర, ఉత్త్రాభాద్ర, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, అశ్వని నక్షత్రములు విశేషములు అష్టమంలోను కేంద్రస్థానములైన 1,4,7,10 స్థానము లందును, పాపగరహములు లేకుండా చూసి ఉపనయనం చేయాలి. రవి వ్యయం నందు ఉండగా ఉపనయనం చేయకూడదు.

జలపూజ:
ప్రసవించిన స్త్రీ జల సమీపమునకు వెళ్ళి జలపూజ చేయాలి. బుధ, గురు, శుక్ర, సోమ వారములయందును శ్రవణం పుష్యమి పునర్వసు, మృగశిర, హస్త, మూలా, అనూరాధలలో ఒక నక్షత్రము నందును శుభ తిథులలో చేయడం మంచిది. వీటికి చైత్ర, పుష్య మాసములు, మూఢమి, అధిక మాసములు వర్జ్యములు.

జాతకర్మ:
ఈ సంస్కారము శిశువు భూమిపైకి వచ్చిన తరువాత చేయునది. జాతకర్మను కొన్ని ప్రాంతాలలో 'బాలసారె' అని అంటారు. జన్మించిన వెంటనే జాతకర్మ చేయాలి.  లేదా 11, 12 రోజులలో చేయవలెను.   కొన్ని ప్రాంతాలలో యవపు పిండిని, బియ్యపుపిండిని, బంగారముపై రుద్దిన తేనెను, నెయ్యిని, శిశువు నాలుకకు మంత్రోచ్చారణ జరుగుతుండగా తండ్రి రాస్తాడు.

అష్టమి, చవితి, చతుర్దశి, అమావాస్య, షష్టి వంటి తిధులు కాకుండా, మంగళ, శనివారములు కాకుండా అశ్వనీ రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి అనూరాధ, ఉషా, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉ.భా, రేవతి ఈ నక్షత్రముల యందు జాతకర్మ ఆచరించాలి. జాతకర్మ మధ్యాహ్నం 12 గంటల లోపే చేయాలి.

తండ్రియే జాతకర్మ సంస్కారము చేయాలి. దీంతో ఆ శిశువుకు జన్మత సంక్రమించిన బాలారిష్టాది దోషాలు నశిస్తాయి.  ఈ సంస్కార నిర్వహణ వలన శిశువునకు దీర్ఘాయిష్యు, జన్మకాలములో సంక్రమించిన "అమంగళ యోగములు" తొలగిపోవును.  దుష్ట తిధి వార నక్షత్రములందు జననమైనచో శాంతి, ఆజ్య వీక్షణము, లేనిదే శిశువు ముఖం చూడరాదు.  ఆడపిల్ల అయిన 13 వ రోజు, మగపిల్లవాడైన  12 వ రోజు ఊయలలో పడుకుండ బెట్టవలెను.

దత్తత స్వీకారము:
సంతానము లేని వారు దత్తత చేసుకోనె సంప్రదాయం ఉంది. సంతానము లేని వారు వివాహమైన తరువాత 20 ఏళ్ల వరకు సంతానం లేకపోతే, తండ్రి ఆయుష్షు అల్పమైనదని శంక కలవారు ఈ దత్తత చేసుకోవలెను. దత్తత తీసుకొనునప్పుడు, సదరు అబ్బాయి/అమ్మాయి ఆయుష్షు, కీర్తి ప్రతిభ, మొదలగు విషయములు జాతకమున పరిశీలించి యోనికూటమి, నాడికూటమిచూసి స్వగోత్రీకుల, ఇంటి నుంచి దత్తత తీసుకోవాలి.
ఈ దత్తత స్వీకారము, ఉత్తరాయణమున మధ్యాహ్నం 12 గంటల లోపున జరిపించవలెను. ఇందుకు స్వాతి, పునర్వసు, పుష్యమి, రోహిణ, అనూరాధ, హస్త, రేవతి, శ్రవణం, ఉత్తర, ఉత్తరాభాద్ర, నక్షత్రములు ఉత్తమము. చంద్రబలము, తరాబలము, కలిగి శుభగ్రహ వీక్షణ గలిగిన శుభ లగ్నమున ఈ కార్యక్రమము జరిపించ వలెను.

ధాన్యము నిల్వచేయుటకు
సాధారణ, ఉగ్ర, ఆర్ద్ర, ఆశ్రేషలను విడిచి మిగిలిన నక్షత్రముల యందు తుల, మేష, కర్కాటక లగ్నములుగా కాకుండా శుభ సమయం రోజున ఆహారము కొరకు ధాన్యము నిల్వ చేయడం మంచిది. అట్లుగాక వ్యాపారార్ధము ధాన్యము నిల్వచేయుటకు దృవ, పుష్య, విశాఖ, జ్యేష్ఠ, అశ్వనీ, చర నక్షత్రముల యందు నిల్వచేయుట మంచిది. దిమికా శ్రవన, ధనిష్ఠ, శతభిష, విశాఖ, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, పుష్య, పునర్వసు, స్వాతి, అశ్వనీ, జ్యేష్ఠల యందు ధనధాన్యములు నిల్వవుంచుటకు ప్రశస్తము.

బాలారిష్టములు:
చంద్రుడు జన్మలగ్నమునందు 8వ ఇంట ఉన్నా, కుజుడు 7వ ఇంట ఉన్నా, రాహువు 9వ ఇంట ఉన్నా, శని లగ్నములో వున్నా, గురువు తృతీయంలో ఉన్నా, రవి పంచమంలో ఉన్నా, శుక్రుడు 6వ ఇంట ఉన్నా, బుధుడు 4వ ఇంట ఉన్నా, కేతువు 4వ ఇంట వున్నా బాలారిష్టములు. ఆయా గ్రహములకు జపధాన హోమములు మొదటి నెలలోనే జరిపించాలి. జనకాలమునకు అష్టమాధిపతి దశ అయినచో బాలారిష్టము అగును.

జన్మ లగ్నములో షష్ఠాధిపతి ఉన్నా, భాగ్యాధిపతి అష్టమ వ్యయంలో ఉన్నా, జన్మ లగ్నాత్ చతుర్ధాతిపతి వ్యయంలో ఉన్నా అరిష్టమే. జనన కాల దశానాధుడు షష్ఠాధిపతి కలసి ఉన్నా జననకాల దశనాధుడు వ్యయాధిపతిలో ఉన్నా బాలారిష్టం అగును. కావున వీటికి శాంతి చేయవలెను. జనకాలమునకు షష్ఠాధిపతి దశ కానీ అంతర్ధశ కానీ అయినచో ఆరోగ్య ప్రాప్తి అధికంగా ఉండును. అష్టమంలో వ్యయాధిపతి ఉండి ఆ వ్యయాధిపతి అంతర్దశ కానీ మహాదశకానీ ఉండటే గనక, ఆ గ్రహమునకు శాంతి చేయాలి. తల్లిదండ్రుల, సోదరుల నక్షత్ర జన్మంలో జననం అయితే ఏకనక్షత్ర జనన శాంతి చేయాలి. కవలలు పుట్టిన యమళ జనన శాంతి, పేగు మెడలో వేసుకొని పుట్టిన నాళవేష్టన జనన శాంతి, విషఘడియ, దుష్ట తిధి వార నక్షత్రములో పుట్టిన గ్రహణంలో పుట్టిన గోముఖప్రసవ శాంతి చేయాలి.

బీజావాపనం:
అశ్వని, హస్త, పుష్యమి, చిత్త,రేవతి, మృగశిర, అనూరాధల యందును, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, స్వాతి, మూల, మఘ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషంలందు విత్తనం చల్లితే ఫలప్రదము. మంగళవారం, శనివారం, ఆదివారం రిక్తతిధులు, పంచపర్వములు, వర్జ్యఘడియలు, ప్రదోషకాలమును విడచి వృషభ, మిధున, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనుర్మీన లగ్నములందు విత్తనము వేయాలి. అంటే రవితో విడువబడు నక్షత్రము మొదలు 3 నక్షత్రములు హానిని కలుగజేయును. తర్వాత 8 వృద్ధిని కలుగచేయును. ఆ తర్వాత 9నక్షత్రములు కర్తకు మృత్యువును, ఆ తర్వాత ఏడు నక్షత్రములు లక్ష్మీప్రధమును కలుగచేయును. ఆశ్రేష నక్షత్రమందును సోమవారమందును, చంద్రుడు లగ్నమందు బలవంతుడై ఉంటే చెరుకు, అరటి, పోక మొక్కలను వేయవలెను. అశ్వనీ యందు, సూర్యుడు లగ్నమునందుండగా కొబ్బరిచెట్లు పాతించాలి. బృహస్పతి లగ్నమందును చంద్రుడు లగ్నాంశమందు ఉండగా తమలపాకుల తోటలు వేయడం మంచిది.

కృషికర్మ:
మృదు, స్థిర, క్షిప్ర, చర, మూల, మఘ నక్షత్రముల యందు మొదటిసారిగా కృషి కర్మ ప్రారంభించాలి. ఆది, మంగళవారములు విడిచి చవితి, షష్ఠి, నవమి, చతుర్ధశి తిధులను దగ్ధతిధుల నుంచి విడచి మిగిలిన తిధి, వార యోగకరణ రోజులయందు కృషి కర్మ ప్రారంభించవలెను. కృషి కర్మ మేష, సింహం కుంభ కర్కట, మకర, తుల యందు ప్రారంభించకూడదు. చంద్ర శుక్రులు బలవంతులై ఉండాలి లగ్నమందు గురువు ఉండగా కృషికర్మలకు యోగ్యము.

అంత్యేష్టి :
మానవుని ఆఖరి యజ్ఞం అంత్యేష్ఠి సంస్కారం. హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. వ్యక్తి తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు(అంత్యేష్టి). చనిపోయిన మనిషి భౌతిక కాయాన్ని కాల్చి (అగ్ని సంస్కారం చేసి), ఆ అస్తికలు మరియు చితా భస్మాన్ని పవిత్ర నదులలో కలపడం
జరుగుతుంది...

సేకరణ:
--(())--

: 🌹. శ్రీమద్భగవద్గీత - 528  / Bhagavad-Gita - 528 🌹

🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 13 🌴

13.  గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీ: సర్వా: సోమో భూత్వా రసాత్మక: ||

🌷. తాత్పర్యం :
నేను ప్రతి గ్రహమునందును ప్రవేశింతును. నా శక్తి చేతనే అవి తమ కక్ష్యయందు నిలిచియున్నవి. నేనే చంద్రుడనై సర్వఓషధులకు జీవరసమును సమకూర్చుచున్నాను.

🌷. భాష్యము  :
శ్రీకృష్ణభగవానుని శక్తి చేతనే సకలగ్రహములు అంతరిక్షమున నిలిచియున్నవని ఈ శ్లోకము ద్వారా అవగతమగుచున్నది. బ్రహ్మసంహిత యందు చర్చింపబడినట్లు అతడు ప్రతి కణమునందును, ప్రతి గ్రహమునందును, ప్రతి జీవియందును ప్రవేశించును.

ఆ భగవానుని సంపూర్ణాంశయైన పరమాత్మయే గ్రహములందు, విశ్వమునందు, జీవుని యందు, కణమునందు కూడా ప్రవేశించునని దాని యందు తెలుపబడినది. అనగా అతడు ప్రవేశము చేతనే సర్వము తగిన రీతి వ్యక్తమగుచున్నది. ఆత్మ యున్నంతవరకు మనుజుడు నీటిపై తేలగలిగినను, ఆత్మ దేహము నుండి వేరైనంతనే మరణించి నీటియందు మునిగిపోవును.

నీటి యందు క్రుళ్ళిన తరువాత దేహము గడ్డిపోచవలె నీటిపై తేలుననుట సత్యమేయైనను మరణించినంతనే మాత్రము దేహము నీటిలో మునిగిపోవును. అదేవిధముగా గ్రహములన్నియును అంతరిక్షమున తేలుటకు శ్రీకృష్ణ భగవానుని దివ్యశక్తి వాటి యందు ప్రవేశించియుండుటయే కారణము.
🌹 🌹 🌹 🌹 🌹

[5:55 am, 26/10/2020] On Sriram**: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 71/ Vishnu Sahasranama Contemplation - 71🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 71. భూగర్భః, भूगर्भः, Bhūgarbhaḥ 🌻

ఓం భూగర్భాయ నమః | ॐ भूगर्भाय नमः | OM Bhūgarbhāya namaḥ

భూః గర్భే యస్య సః ఎవని గర్భమునందు భూమి ఉండునో అట్టివాడు.

:: పురుష సూక్తం / శ్వేతాశ్వతరోపనిషత్ - తృతీయోఽధ్యాయః ::
సహస్రశీర్షా పురుష స్సహస్రాక్ష స్సహస్రపాత్ ।
స భూమిం విశ్వతో వృత్వాఽత్యతిష్ఠ ద్దశాంగులమ్ ॥ 1 / 14 ॥

ఆ పరమాత్మ సహస్ర శీర్షములు గలవాడు, పూర్ణ పురుషుడు, సహస్ర నేత్రములు గలవాడు. సహస్ర పాదములు గలవాడు. ఆ పరమాత్మ భూమి తనలో కలిగియున్న విశ్వమంతయు వ్యాపించినవాడై అపారమైన భాగమును అధిష్ఠించి యున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


అధ్యాయము 5
🌻. దేవీ దూతసంవాదం - 1 🌻

ఉత్తరచరితము
మహాసరస్వతీ ధ్యానమ్

తన (ఎనిమిది) హస్తకమలాలలో ఘంట, శూలం, నాగలి, శంఖం, రోకలి, చక్రం, ధనుస్సు, బాణాలు ధరించేదీ, మబ్బు అంచున ప్రకాశిస్తుండే చంద్రునితో సమమైన కాంతి కలదీ, పార్వతీదేవి శరీరం నుండి ఉద్భవించినదీ, ముల్లోకాలకూ ఆధారభూతమైనదీ, శుంభుడు మొదలైన దైత్యులను వధించినదీ అయిన అపూర్వయైన మహాసరస్వతిని భజిస్తున్నాను.

1-2. ఋషి పలికెను :
పూర్వకాలంలో శుంభ నిశుంభులు * అనే రక్కసులు తమ బల గర్వాలతో ఇంద్రుని ముల్లోకాలనూ (ఆధిపత్యాన్ని), హవిర్భాగాలను హరించారు.

3. అలాగే ఆ ఇరువురూ సూర్య చంద్ర యమ వరుణ కుబేరుల అధికారాలు కూడా తమ వశం చేసుకున్నారు.

4. వాయువు అధికారాన్ని, అగ్ని కర్మను సైతం వారే నిర్…
[5:55 am, 26/10/2020] On Sriram**: 🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 85 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.   ఆత్మను తెలుసుకొను విధము -15 🌻

కాబట్టి, తీర్థ ఆరామ క్షేత్రాదులను దర్శించడం అనేది సంస్కారయుతమైనటువంటి వాటిలో భాగము. నిజానికి నీవు పొందగలిగితే నీ ఆత్మ స్వరూపాన్ని నీ హృదయ స్థానంలోనే, నీ హృదయాకాశములోనే, నీ బుద్ధి గుహలోనే, నీ అంతర్ముఖంలోనే నీవు పొందగలుగుతావు.

అలా పొందగలిగిన వారు, రోజూ జ్యోతిష్టోమాది కర్మలను ఆచరించే వారు, అలాగే పంచాగ్నులను ఒనర్చించేటటువంటి వారు, అలాగే త్రిణాచికేతాగ్నిని - నాచికేతాగ్నిని - రోజుకు మూడు సార్లు చయనం ఒనర్చేటటువంటివారు, ఎటువంటి స్థితిని ఆశ్రయిస్తున్నారో, ఎటువంటి లక్ష్యాన్ని అనుభవిస్తున్నారో, ఎటువంటి లక్ష్యసిద్ధిలో ప్రవేశిస్తున్నారో, వాళ్ళు కూడా ఆ కర్మ ఉపాసనకి లక్ష్యమైనటువంటి ఆత్మానుభూతి ఏదైతే ఉన్నదో, ఆ ఆత్మానుభూతిని, ఆ పరమాత్మ తత్వమునే, ఆ పరబ్రహ్మనిర్ణయమునే నొక్కి ఒక్కాణిస్తున్నారు. స్థిరముగా చెబుతున్నారు.

 కాబట్టి, మానవులందరూ ఒకవేళ వేదాధ్యయనపరులైతే నేమో అలా అగ్ని సంచయనము ద్వారా, వాళ్ళు ఆత్మతత్వంలోకి ప్రవేశిస్తారు. అలా వేదాధ్యయనపరులు కాని వారు, తమ చిత్తశుద్ధితో, బుద్ధిగుహయందున్న, హృదయస్థానము నందున్న, స్వస్వరూప జ్ఞానమైన, స్వయం ప్రకాశకమైన ‘నేను’ ను పొందే ప్రయత్నం చేయాలి. అంతేకానీ, నీడ వలె ఉన్నటువంటి జీవాత్మను ఆశ్రయించరాదు అని చెబుతున్నారు.

          (జీవాత్మ - పరమాత్మ లిరువురు కర్మ ఫలమును అనుభవించుటకు శరీరంలో ప్రవేశించినటుల చెప్పబడినది. జీవాత్మ మాత్రమే కర్మఫలమును అనుభవించును. ‘శరీరస్థోపి కౌన్తేయ నకరోతి నలిప్యతే’ - అని భగవద్గీతలో కూడా చెప్పినటుల పరమాత్మ కర్మలను ఒనర్చుట లేదు. వాని ఫలమును అనుభవించుట లేదు. అయినప్పటికి ఛత్రి న్యాయమున వారిద్దరూ అనుభవించుచున్నటుల చెప్పబడినది.)

         ఇక్కడ మనకందరికి రావల్సిన సందేహం గురించి వ్యక్తీకరిస్తున్నారు. అంటే అర్థం ఏమిటంటే, ఏమండీ, పరమాత్మ సమస్త జీవుల హృదయాంతరాళములో ఉన్నాడన్నప్పుడు, అదే స్థానంలో జీవాత్మ కూడా ఉన్నాడన్నప్పుడు, మరి కర్మానుభవం జీవాత్మకు, పరమాత్మకు కూడా ఉండాలి కదా! అనేటటువంటి సందేహం మీకు రావచ్చు. కానీ, పరమాత్మ సమిష్టి స్వరూపుడు, జీవాత్మ వ్యష్టి స్వరూపుడు. ఇది ఒక శరీరం అనేటటువంటి పరిమితికి మాత్రమే చూడగలిగి అనుభవించ గలిగే పరిమితమైనటువంటి శక్తిగలవాడు జీవాత్మ.

 సర్వవ్యాపకమైనటువంటి, సృష్టి యందు అంతటా వ్యాపించి ఉండి, ఏకకాలంలో సాక్షిగా ఉన్నటువంటివాడు పరమాత్మ. పరమాత్మ స్థితియందు ఏక కాలంలో, సర్వ సాక్షిత్వము ఉన్నది, సర్వ కర్తృత్వము ఉన్నది, సర్వ భోక్తృత్వము ఉన్నది. సర్వ హర్తగా కూడా ఉన్నాడు. కాబట్టి పరమాత్మ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడని చెప్పజాలము.

         కాని జీవాత్మ ప్రారబ్ద, ఆగామి, సంచిత కర్మలు అనేటటువంటి త్రివిధ కర్మల చేత, కర్మచక్రంలో తిరగుతూ ఉంటాడు. వాని యొక్క సృష్టి స్థితి లయములు శరీరమును పొందడం అనేది ఈ కర్మఫలానుసారము కర్మచక్రమును అనుసరించి జరుగుతూ ఉంటుంది. కానీ, పరమాత్మ సంకల్ప సృష్టిగా సర్వసృష్టిని సృజించగలిగే సామర్థ్యం కలవాడగుట చేత, సర్వకర్త, సర్వభర్త, సర్వహర్త, సర్వభోక్త అయినటువంటి పరమాత్మ సర్వసాక్షి కూడా అయివున్నందున అతనికి కర్మఫలము లేదు.

దీనినే భగవద్గీతలో ‘నకరోతి, నలిప్యతే ’ శరీరములో ఉన్నప్పటికి, ‘శరీర అస్థోపి’ - శరీరము నందు ఉన్నప్పటికీ, ఆత్మ ‘న కరోతి, న లిప్యతే’. పని చేయదు, ఏమి పొందదు. ఏక కాలములో నీలో ఉన్నటువంటి సత్యనేను, యథార్థ నేను ఏదైతే ఉన్నదో, అది ఏమీ చేయుట లేదు. అదేమిటండీ? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్లు కనబడుతున్నారు కదా అంటే, నా యథార్థనేను మాట్లాడటం లేదు. నా చైతన్యనేను మాట్లాడటం లేదు. నా ఆత్మనేను మాట్లాడటం లేదు.

కాబట్టి, వ్యవహారిక నేను వేరుగా ఉన్నది. యథార్థ నేను వేరుగా ఉన్నది. వ్యవహారిక నేనుకు జీవాత్మ అని పేరు. ఏ నేనైతే చలించకుండా స్థిరముగా ఉన్నదొ, పరిణామము లేక ఉన్నదొ దానికి ఆత్మయని పేరు. ఈ రెంటి యొక్క యథార్థ స్వరూప స్వభావ స్థితులలో మనిషి సాధన పూర్వకముగా అర్థము చేసుకోవాలి.

నీలోపలికి నిన్ను నువ్వు అన్వేషించుకుంటూ పోవడం ద్వారా, నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారా, తనను తాను గుర్తెరగడం ద్వారా, సెల్ఫ్‌ రియలైజేషన్‌ [self realization] ద్వారా, ఆత్మానుభూతి ద్వారా, కదలని డాగలి మీద అనేక పనిముట్లు తయారైనట్లుగా తయారౌతుంది ఈ ప్రపంచమంతా. ఇది కూటస్థం అంటే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[5**: 🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 89 /  Sri Gajanan Maharaj Life History - 89 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 18వ అధ్యాయము - 3 🌻

శ్రీగజానన్ మహారాజు పవిత్ర పాదాలు తలుచుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఇలా అనుకుంటూ భవ్ చేతులు కట్టుకుని తన రక్షణకువచ్చి ఈవ్యాధినుండి తనని నయంచెయ్యమని శ్రీమహారాజును ప్రార్ధించాడు.

అర్ధరాత్రి, చిట్టచీకటి, నక్కలు అరుస్తున్న సమయంలో, ఒకచక్కని ఎడ్లజోడితో గూడుకల ఒక ఎడ్లబండి డాక్టరు ఇంటికి వచ్చింది. డాక్టరు తన మంచంమీద నుండి ఈవిధంగా బండివచ్చి తన ఇంటిదగ్గర ఆగడం చూడగలిగాడు. ఒక బ్రాహ్మణుడు ఆబండిలోనుండి దిగి డాక్టరు ఇంటి తలుపు కొట్టాడు. అతని సోదరుడు తలుపుతీసి ఆవచ్చిన వ్యక్తిని రాకకు కారణం అడిగాడు.

ఆ బ్రాహ్మణుడు తనపేరు గజ అని షేగాంనుండి తీర్ధం, అంగారుతో భవ్వర్ కొరకు వచ్చానని అన్నాడు. ఇంకా, బాధిస్తున్న ఆ శరగడ్డకు ఈఅంగారు రా…
[5:55 am, 26/10/2020] On Sriram**: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 54, 55  / Sri Lalitha Chaitanya Vijnanam  - 54, 55 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
21. సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణ భూషిత
శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ

🌻 54. 'స్వాధీనవల్లభా' 🌻

అధీనుడైన భర్తకలది అని అర్థము. శ్రీదేవి శక్తి స్వరూపిణి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఆమె నుండియే ఉద్భవించును.

త్రిగుణములు, పంచభూతములు ఆమె నుండియే ఉద్భవించును. సమస్త దేవతలకు కూడ ఉద్భవకారిణి శ్రీదేవియే. శివుని నుండి ఆమె ఉద్భవించుట కూడ స్వచ్ఛందమే.

అట్లుద్భవించి, నర్తించి మరల శివునిలో చేరుట ఆమె క్రీడ. అందుచే ఆమె సర్వస్వతంత్రురాలు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 55  / Sri Lalitha Chaitanya Vijnanam  - 55 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : …
[5:55 am, 26/10/2020] On Sriram**: 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 31 🌹
https://mallapragadaramakrishna8.blogspot.com/2020/10/blog-post_25.html
[7:51 am, 26/10/2020] . Mallapragada: నవ్వు ల రేరాజు
రేరాజు వెన్నెలే
వెన్నెల లో బోసినవ్వుల  పాప ఆటలే

అరనవ్వు అరవిరిసి
అరవిరిసి నవ్వు శసి
శసివదనుడు మనసు చేరి పాప ఆటలే

నవ్వె సుమనోహరము
మనోహర మమైకము
మమైక మధుర పులకింత పాప ఆటలే

పసిడి నవ్వు ల పాప
పాప మహిమల దీప
దీప మై మాయింట ముత్యాల ఆటలే

వెన్న లాంటి నవ్వులు
నవ్వుల తొ నయనాలు
నయనాల చూపులే ఆనంద మాటలే

ముసిముసి నవ్వల తో
నవ్వుల సందడి తో
సందడి సమయమంత హాయిగా ఆటలే

మెరుపు నవ్వు హరివిల్లు
హరివిల్లు చిరు జల్లు
చిరుజల్లులె మమతలల్లే పాప ఆటలే

చింతలు తీర్చు నవ్వు
నవ్వుతొ కరుగు కొవ్వు
కొవ్వు జివ్వున లాగేటి నవ్వు ఆటలే

ఆనంద శృతి నవ్వే
నవ్వు సరిగమ లవ్వే
లవ్వే ఇల్లంతా సంతోషపు ఆటలే

అలసట తీర్చు నవ్వు
నవ్వు తు మనసు ఇవ్వు
ఇవ్వు ప్రేమానురాగల ప్రేమ ఆటలే

నవ్వే ఔషదము గా
ఔషదము మంత్రముగా
మంత్రపు నవ్వుకాదు సంతోష ఆటలే

*(())**
[7:36 pm, 26/10/2020] . Mallapragada: సమ్మోహనాలు ... శిశువు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
 
231 . జ్ఞానమ నే నిప్పులు
నిప్పె సూర్య వెలుగులు
వెలుగే హృదయ తలపుల్లొ పుట్టె ధైర్యమ్ము

232 . నిప్పుకు కట్టె ఉండు
ఉండు కర్మకు ఉండు  
ఉండు జ్ఞానమనే స్త్రీ సహనపు ధైర్యమే

233 . కట్టె నిప్పె దాహము   
దాహమనే దేహము    
దేహము ఆకలి నే తీర్చేది ధైర్యమే  

234 . ఆనంద దేహమే
దేహమే జ్ఞానమే  
జ్ఞాన ఆనందాను భూతిగా ధైర్యమే  

235 . కోరికలు వెంటాడు
వెంటాడు మన్మధుడు
మన్మధుడు ఇంద్రియ ప్రవృత్తులు ధైర్యమే

236 . జీవనము తప్పదూ
తప్పదు స్త్రీ పొందూ
పొందు జ్ఞానాగ్నిలో భస్మమగు ధైర్యమే

237 . కాలక్రమ మంతయు
మంతయు దాహమ్ముయు
దాహముతో స్త్రీ పురుష సంగమ ధైర్యమే    

238 . శిశువు జన్మ ఉదయం
ఉదయం తో హృదయం
హ్రదయం పంచి పోషణ ధర్మం ధైర్యమే
 
239 . కలియుగ శిశువు బతుకు
బతుకు కొత్త ఆశకు
ఆశ అనే ఆధునిక సంపద ధైర్యమే

240 . చేసేటి దానమ్ము
దానమ్ము ధర్మమ్ము
ధర్మమ్ము సుతులుగా అండగా ధైర్యమే

--(())--
[7:45 pm, 26/10/2020] On Sriram**: 🌹. గీతోపనిషత్తు  - 60 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀 21. నిగ్రహము - అనుగ్రహము - తమను, తమ జీవితమును, తమ కార్యక్రమములను పరిపూర్ణముగ దైవమునకు సమర్పించి, అతని అనుగ్రహము కొరకే జీవించుట కర్మ సంగములేని మార్గము. 🍀  

33. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ఙ్ఞానవానపి |
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి || 33 ||

భగవానుడు బుద్ధినికాని, తనను కాని ఆశ్రయించి కర్మమును చేయమని తెలుపుచు మరియొక ముఖ్యాంశమును ఆవిష్కరించు చున్నాడు. ఇది తెలిసినచో దైవమునకు శరణాగతియే మార్గమని, ఇతర మార్గములు పూర్ణశ్రేయోదాయకము కాదని తెలియును. ఇది తెలియుట ముఖ్యము.

ఎంత జ్ఞానవంతుడైనను ప్రకృతిలోని వాడేగదా! త్రిగుణముల కీవలివాడు జీవుడు, ఆవలివాడు దేవుడు. ప్రకృతి నుండి పుట్టిన జీవులు ప్రకృతిని దాటలేరు. తమ ప్రకృతికిలోనై మాత్రమే జీవించగలరు.

జ్ఞానవంతుడైననూ యింతియే సుమా, అని శ్రీ కృష్ణుడు హెచ్చరించుచున్నాడు. కావున ప్రకృతిని దాటుటకు దైవము యొక్క అనుగ్రహము, ప్రకృతి యొక్క కరుణయు ముఖ్యము. రెండునూ ఒకటియే. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు వంటి లోక పాలకులు కూడ ప్రకృతి మాయలో పడినవారే. పొరపాట్లు చేసినవారే. మరల దైవానుగ్రహము చేత, తమ స్థితియందు నిలిచిరి.

ఇక మానవులందలి జ్ఞానులెంత? వారి నిగ్రహమెంత? భగవంతుని అనుగ్రహమునకై ప్రయత్నింపవలెను గాని, నిగ్రహ మార్గము ననుసరించుట కాదు. మనో దేహేంద్రియములు ప్రకృతి యధీనమున నున్నవి. తన యధీనమున యున్నవని భావించు వాడు అవివేకి, అహంకారి. అందువలన చివరకు మిగులునది శరణాగతి మార్గమే.

తమను, తమ జీవితమును, తమ కార్యక్రమములను పరిపూర్ణముగ దైవమునకు సమర్పించి, అతని అనుగ్రహము కొరకే జీవించుట కర్మ సంగములేని మార్గము.

అహంకారమునకు లోబడియే బుద్ధి పనిచేయును. అహంకారము ప్రకృతికి లోబడి యుండును. అనగా గుణములకు లోబడి యుండును. కావున జ్ఞానియైననూ, దైవమునకు శరణమనవలసినదే. మరియొక మార్గము లేదు.

దీనివలన తెలియవలసిన ముఖ్యాంశమేమనగా, సమస్తము నందు దైవచింతన పెంచుకొనుటయే గాని, “కామము పారద్రోలుడు, ఇంద్రియములను నిగ్రహింపుడు, సద్భావములే కలిగి
యుండుడు, సత్ప్రవర్తనమే ఆశ్రయింపుడు” అని నినాదములు చేయుచు, బోధలు చేసినచో అవియన్నియు నిరుపయోగములు.

ప్రకృతి వశులగుటచేత ఎవ్వరునూ నిర్వర్తింపలేరు. దైవము నాశ్రయింపుడు, దైవచింతనము పెంచుకొనుడు, అనురక్తితో భజింపుడు, దైవమును కామింపుడు, ప్రేమింపుడు అను వాక్యములు పై నినాదముల కన్న మిన్నగ పరిష్కార మందించును.(3-33)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[7:45 pm, 26/10/2020] On Sriram**: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 256 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴
60. అధ్యాయము - 15

🌻. నందావ్రతము - శివస్తుతి - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! తరువాత ఒకనాడు నేను నీతో గూడి తండ్రి ప్రక్కన నిలబడియున్న ఆ సతీ దేవిని చూచితిని. ముల్లోకముల సారభూతమైన ప్రకృతి ఆమెయే (1). తండ్రి నీకు, నాకు నమస్కరించి సత్కరించుటను చూచిన సతీదేవి ఆనందముతో లోకలీలను అనుసరించునదై భక్తితో మనలకు నమస్కరించెను (2). ఓ నారదా! మనమిద్దరము దక్షునిచే ఈయబడిన శుభాసనము నందు కూర్చుండి యుంటిమి. అపుడు నమస్కారము చేసి వినయముగా నిలబడియున్న సతిని చూచి నేను ఇట్లంటిని (3). నిన్ను ఎవడు ఏకాంత నిష్ఠతో ప్రేమించుచున్నాడో, ఓ సతీ! ఎవనిని నీవు ప్రేమించుచున్నావో అట్టి సర్వజ్ఞుడుస,జగత్ర్పభువు అగు దేవ దేవుని భర్తగా పొందుము (4).

ఏ ఈశ్వరుడు ఇతర స్త్రీని స్వీకరించలేదో, స్వీకరించుట లేదో, భవిష్యత్తులో స్వీకరించడో ఆతడు నీకు భర్తయగుగాక! ఓ శుభకరీ! నీ భర్తకు సాటి మరియొకరు లేరు (5). నారదా!మనము ఇట్లు పలికి చాలసేపు దక్షుని ఇంటిలో నుండి ఆమెను చూచితిమి. తరువాత దక్షుడు సాగనంపగా స్వస్థానమును పొందితిమి (6). ఆ మాటను విని దక్షుడు మిక్కిలి సంతసించెను. ఆతని చింత తొలగెను. ఆతడు తన కుమార్తెను దగ్గరకు తీసుకొనెను. ఆమె పరమేశ్వరియని ఆతడు ఎరుంగును (7). భక్తవత్సల, స్వేచ్ఛచే ధరింపబడిన మానవాకృతి గలది యగు సతీదేవి ఈ తీరున బాల్యమును అందమగు ఆట పాటలతో గడిపి, కాలక్రమములోబాల్యావస్థను దాటి ఎదిగెను (8).

ఆ సతీదేవి బాల్యమును దాటి ¸°వనములో అడుగిడెను. ఆమె సర్వాయవ సుందరియై యుండెను. ఆమె సన్నని దేహముతో శోభిల్లెను (9). దక్ష ప్రజాపతి ¸°వనములో అడుగిడిన ఆమెను చూచి, ఈమెను శివునకు ఇచ్చి వివాహమును చేయుట ఎట్లాయని ఆలోచించెను (10). ఆమె కూడా అదే కాలములో శివుని భర్తగా పొందవలెనని గోరెను. ఆమె తండ్రి మనస్సును ఎరింగి తల్లి వద్దకు వచ్చెను (11). పరమేశ్వరియగు ఆ సతీదేవి వినయముతో కూడిన మనస్సుగలదై, శివుని ఉద్దేశించి తపస్సునుచేయుటకై తల్లియగు వీరిణిని అనుమతిని గోరెను (12).

దృఢమగు వ్రతముగల సతీదేవి మహేశ్వరుని భర్తగా పొందుట కొరకై తల్లి అనుజ్ఞను పొంది ఇంటియందు ఆయనను ఆరాధించెను (13). ఆమె ఆశ్వయుజమాసములో పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులయందు పులిహోరను, మధురాన్నమును నైవేద్యమిడి శివుని భక్తితో పూజించుచూ గడిపెను (14). కార్తీక చతుర్దశినాడు చక్కగా తయారుచేసిన అప్పములను, పాయసములను నైవేద్యమిడి పరమేశ్వరుని ఆరాధించెను (15). మార్గశీర్ష కృష్ణాష్టమి నాడు నీటితో అభిషేకించి యవధాన్యపు అన్నమును నైవేద్యమిడి సతీదేవి శివుని మరల పాలతో అభిషేకించెను. ఆమె దినములనీ తీరున గడిపెను (16).

పుష్య శుక్ల సప్తమినాడు రాత్రియందు జాగరణము చేసి , ఆ సతి ఉదయము కూరగాయలతో కలిపి వండిన అన్నమును శివునకు నైవేద్యమిడి పూజించెను (17). ఆమె మాఘపూర్ణిమ నాడు రాత్రి యందు జాగరణము చేసి తడి బట్టలతో నదీ తీరముందు శంకరుని పూజించెను (18). ఫాల్గుణ కృష్ణ చతుర్దశి నాడు రాత్రి జాగరణము చేసి నాల్గు యామముల యందు మారేడు దళములతో విశేష పూజలను చేసెను (19). చైత్ర శుక్ల చతుర్దశి నాడు ఆమె రాత్రింబగళ్లు శివుని మోదుగు పుష్పములతో మరియు దమనము అనే సుగంధి పత్రములతో పూజించెను. మరియు ఆ మాసమును శివధ్యానముతో గడిపెను (20).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[7:45 pm, 26/10/2020] On Sriram**: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 144 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నారద మహర్షి  - 18 🌻

132. అసలు సన్యాసికి ఇటువంటి నియమావళి మన సంప్రదాయంలో ఉంది. సన్యాసి పడుకున్నచోట అన్నం తినకూడదు. అన్నం తిన్నచోట పడుకోకూడదు. అంటే పగలు భోజనంచేసిన ఊళ్ళో రాత్రి నిద్రపోకూడదు. సన్యాసికి కేవలం మనసుమాత్రమే నిలకడగా ఉండాలి, శరీరం నిలకడగా ఉండకూదదు. అంతరంగంలో నిలకడ ఉండాలి.

133. జనపదాల విషయం వచ్చినప్పుడు, గృహస్తులవిషయం వచ్చినప్పుడు, సన్యాసి వాళ్ళ ఇళ్ళల్లో ఉండకుండా ఆశ్రమాన్ని నిర్మించుకుని దూరంగాపోవచ్చు. ఎవరికీ కనబడకుండా ఉండాలి. అందరికీ కనబడేటట్లు మధ్యలో ఉంటే, సన్యాసి అనిపించుకోడు.
జగత్పూజ్యుడు, జగద్గురువు అని ఎవరినయితే మన్నిస్తారో, అలాంటివారికి ఒక వేదన కలుగుతుంది. “నన్ను గురువు అని నమస్కారం చేస్తున్నాడు.

134. ఇతడి నమస్కారానికి నేను అర్హుణ్ణేనా? అతడికి చెప్పవలసినవన్నీ చెప్పానా? ఇతడికి నావలన ఏ ఉపకారమైనా జరిగిందా! నా బోధ సంపూర్ణమయిందా!” అనే వేదన గురువుకు ఉంటుంది. ఎందుకంటే, నమస్కారం స్వీకరించటం సులభమేకాని దానికి ప్రత్యుపకారం చేయటం సులభంకాదు. ఆశీర్వచనం చేయాలి. అదికూడా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేయాలి. ఇందులో శక్తి ఉండాలి, తపస్సు ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. ఇది తేలికయిన విషయమా! నమస్కారం ఎంతో సులభం.

135. ‘ఆ,కా,మా,వై’ – ఆషాదం, కార్తీకము, మాఘము, వైశాఖము – ఈ నాలుగు మసాలలోని పూర్ణిమలన్నీ కూడా పవిత్రమైనవి. చాతుర్మాస్య వ్రతాలని చెసుకుంటారు. చాతుర్మాస్య వ్రతాలు బ్రాహ్మణులకు – సన్యాసులకే కాదు, అందరికీ పవిత్రమయినవి. నేలమీద నిద్రపోవటము, మితాహారము, ధ్యానము, పరమసాత్వికమైన మనోభావాలతో కూడినటువంటి నియమబద్ధమైన జీవనం అవలంబించాలి అటువంటి జీవనంతో ఆ నాలుగుమాసాలు గడపాలి. ‘వైయాసికి’ అంటే వ్యాసుడి భావతం.

136. భాగవతం వ్యాసుడి హృదయం. ఆయన తపస్సు, హరిభక్తి, ఆయనే ప్రకారంగా ఈ సృష్టిని అర్థంచేసుకున్నాడో ఆ పరమార్థం, చరమంగా జీవులకేది క్షేమమని నిర్ణయించాడో ఆ జీవిత పరమార్థం అంతా పిండి ఒకచోట పెట్టి, ‘భాగవతం‘ మనకు ప్రసాదించాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శివగీత  - 99  / The Siva-Gita - 99 🌹*
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వాదశాధ్యాయము
🌻. ఉపాసనా విధి  - 7 🌻

కోటి మధ్యాహ్న సూర్యభం - చంద్ర కోటి సుశీలతమ్ ;
చంద్ర సూర్యాగ్ని నయనం - స్మేర వక్త్ర సరో రుహమ్. 36
ఏకో దేవ స్సర్వ  భూతేషు కూఢ
స్సర వ్యాపీ సర్వ భూతంత రాత్మా,
సర్వా ధ్యక్ష స్సర్వ బూతాధి వాస
స్సక్షీ చేతాకేవలో నిర్గునశ్చ. 37
ఏకో వశీ సర్వ భూతాంత రాత్మ
శ్యేకం బీజం నిత్య దాయఃక రోతి,
తంమాం నిత్యం యేను పశ్యంతి ధీరా
సైషాం శాంతి శ్వాశ్వతి నేత రేశామ్. 38
అగ్నిర్య థైకో  భువనం  ప్రవిష్టో
రూపం రూపం ప్రతి రూపో బభూవ,
ఏక స్తతా సర్వ భూతాంత రాత్మ
న లిప్యతే లోక దు: ఖేన బాహ్య : 39
వేదేహ యో మం పురుషం మహాంత
మాదిత్య వర్ణం తమసః పరస్తాత్,
స ఏవ విద్వానమృతో త్ర భూయా
న్నాన్య: పంథా అయనాయ విద్యతే. 40

కోటి సంఖ్యాక మైన సూర్యులతో సమానమగు కాంతియు  కోటి సంఖ్యాకమైన చంద్రులతో సమానమగు శీతలత్వము గల యట్టి సూర్య చంద్రాగ్ని నేత్రములు కల నా ముఖ పద్మమును  స్మరించుము.

సమస్త ప్రాణుల యందు న్నట్టి, సర్వ వ్యాపి, సర్వాంత ర్యామియు  నైన సర్వేశుడు నిర్గునుడగు సర్వ సాక్షి యోక్కడే  అయియున్నాడు.  సర్వ భూతంతర్గత మై ప్రదాన భీజమగు నన్ను ధ్యానించు వారికి  శాశ్వత మైన ముక్తి లభించును. అన్యులకు  లేదు.

అగ్ని యొక్కటే అయినను ఏ ప్రకారము గ  భువనములలో  అనేకాకార ములైన పదార్ధములలో ప్రవేశించి యనే కాకారాములుగా  నగు పడినను నిరాకారము గానే యుండు నట్లు ఒక్కడైన పరమేశ్వరుడు సమస్త భూతములందుయును  ప్రవేశించి యున్నను సంసారిక సుఖ దుఖము ల కతీతుడై ప్రత్యేకముగా నుండును.

( నిర్తిప్తుడని తాత్పర్యము ) నన్ను అతి ప్రాచీనుని గాను,  మహాత్ముని గాను, సూర్య కాంతిక లాడి ని గాను,  నన్ను తెలిసికొనిన యెడల విముక్తిని పొందుదువు.  పండితునికి మోక్షమును కింతకంటే మరొక మార్గము లేదు.

హైరన్య గర్భం విదధామి పూర్వం
వేదాంశ్చత స్మై ప్రహినోమి యోహమ్,
తం దేవ మీడ్యం పురుషం  పురాణం
నిశ్చిత్య మాం మ్రుత్యుముఖాత్స్ర ముచ్యతే. 41
ఏవం శాన్త్యాది యుక్తస్సన్ - వేత్తిమాం యస్తు  తత్వతః ;
నిర్ముక్త  దుఃఖ సస్తాన - స్సొంతే మయ్యేవ లీయతే. 42
ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతయాం ద్వాద శో ధ్యాయ:

నన్ను మొదట (ప్రప్రథమున ) బ్రహ్మను పుట్టించి వాడికి  వేదములొసగిన వాడిని గాను, పురాణ పురుషుని గాను దేవ  వంద్యుని గాను తెల్సి కొనిన వాడు మృత్యువాత బడడు,
 శమద మాది గుణములతో కూడుకొనిన వాడై ఈ విధముగా  నన్ను తెలిసికొనునో అట్టి వాడు దుఖములనుబరి త్యజించి  నాలో నైక్యమందుచున్నాడు .

ఇది పద్మ పురాణాన్తర్గత మగు శివ గీతలో పండ్రెండవ  అధ్యాయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹  

Monday, 12 October 2020

stories

******

పరమాచార్య ప్రసాద మహిమ

పరమాచార్య స్వామివారి భక్తుడైన శ్రీ జయరామన్ చెన్నై పశ్చిమ మాంబళంకు చెందిన గొప్ప భక్తుడు మరియు స్వామివారికి ఎంతో సేవ చేసుకున్నవారు. వారి కుటుంబం మొత్తం మహాస్వామివారికి మరియు కామకోటి మఠానికి విధేయులు. పశ్చిమ మాంబళంలో ఉన్న శంకర మఠం భూమి విరాళం కోసం వీరు ఎంతగానో సహాయం చేశారు.

ఒకసారి మహాస్వామివారు ఆంధ్రదేశంలోని సుబ్బనాయుడు ఖండ్రిగ అనే గ్రామంలో మకాం చేస్తున్నారు. అప్పుడు జయరామన్ తన భార్య పట్టమ్మాళ్, కుమార్తె నాగలక్ష్మి, అల్లుడు వాసుదేవన్, మనవడు చంద్రశేఖరన్ తో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. మహాస్వామివారు ఆ పిల్లవాడు చంద్రశేఖరన్ ను ప్రేమతో దగ్గరకు పిలిచి, అతని వివరాలు, చదువు గురించి అడిగారు. స్వామివారు ఆ పిల్లవానికి బోలెడంత పటికబెల్లం ముక్కలు ఇచ్చి నీ వద్దనే ఉంచుకో అని చెప్పి ఆశీర్వదించారు. చేతుల్లో ప్రసాదాన్ని గట్టిగా పట్టుకుని బయటకు వచ్చాడు.

బయట పచ్చిక బయళ్ళు ఉండడంతో, అందులో ఆడుకోవడం మొదలుపెట్టాడు. దగ్గర్లోనే పెద్ద మెట్లబావి ఉంది. ఆడుకుంటూ అజాగ్రత్తతో అందులోకి పడిపోయాడు. అక్కడ బావి ఉన్నట్టు బయటివారికి కనపడదు. బావి ఎక్కువ లోతు ఉండి ఎక్కువ నీళ్లతో ఉంది. ఆ పిల్లవాడి తండ్రి వాసు, పిల్లాడి కోసం అంతా వెతుకుతూ బావి వద్దకు వచ్చాడు. బావిలోనికి వెళ్లడానికి మెట్లు ఉండడం గమనించాడు. పిల్లాడి చొక్కా మెట్ల వద్ద ఇరుక్కుని ఉండడం గమనించాడు.

ఆత్రంగా మెట్లు దిగి ఏమిటా అని చూస్తే అది తన కుమారుడే. గట్టిగా అరుస్తూ పిల్లాణ్ణి పైకెత్తాడు. అక్కడ ఉన్నవారందరూ పరిగెత్తుకుని వచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ పిల్లాణ్ణి పైకి తీసుకునివచ్చి, ఎడ్లబండి చక్రంపై పడుకోబెట్టి కడుపులో ఉన్న నీటిని బయటకు తీశారు. పిల్లవాడికి స్మృతి వచ్చిన వెంటనే పరమాచార్య స్వామి వారి వద్దకు తీసుకువెళ్ళి జరిగిన విషయం తెలిపారు. స్వామివారు ఆశీర్వదించి, “పిల్లవాని చేతిలో ఏముంది?” అని అడిగారు.

అప్పుడు గమనించారు అందరూ పిల్లవాడు పిడికిలి మూసుకునివుండడం. స్వామివారు ఆశీర్వదించి ఇచ్చిన పటికబెల్లం పిల్లవాని చేతిలో ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. పరమాచార్య ప్రసాదం గురించిన మహిమను ఏమని వర్ణించగలం! ఆ పిల్లవానికి ఉన్న గండాన్ని స్వామివారు ప్రసాదంగా ఇచ్చిన పటికబెల్లం తీసేసింది. ఆ పిల్లవాడు పెద్దవాడై మంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, స్వామివారి ఆశీస్సుల వల్ల జీవితంగా స్థిరపడ్డాడు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
 

********

దీర్ఘాయుష్మాన్ భవ అంటే?

చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శనానికి నలుగురైదుగురు పండితులు వచ్చారు. స్వామి వారికి సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామి వారు భక్తులతో మట్లాడుతూ, ఆ కూర్చున్న పండితులనుద్దేశించి ఇలా అడిగారు.

“భక్తులు నాకు నమస్కరిస్తే, నేను వారిని “నారాయణ నారాయణ” అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్తులు ఏమని అశీర్వదిస్తారు?”

మేము ‘దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య’ అని అశీర్వదిస్తాము అదే సంప్రదాయము” అని అన్నారు.

”అంటే ఏమిటి?” అని మహాస్వామి వారు ప్రశ్నించారు.

”చాలాకాలం సౌఖ్యంగా ఉండు” అని దీని అర్థం.

మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్న వేసారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామి వారు కొద్ది సేపు మౌనంగా ఉండి, “మీరందరూ చెప్పిన అర్థం తప్పు” అన్నారు.

పండితులు ప్రశ్నార్థకంగా చూసారు. వాళ్ళందరూ పెద్ద విధ్వాంసులు. సంస్కృత…

 *******

నమస్కారం చేసే విధానం
ఆధ్యాత్మికత అందిస్తున్న సంస్కారం
నమస్కారం అనేది మన సంస్కృతి, సంప్రదాయాలకు అనాదిగా ప్రతీకగా నిలుస్తోంది. ఇది ఒక గౌరవసూచకం.

తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేయాలి.

మంచి నమస్కారం ఎలా ఉండాలంటే , మనసునిండా గౌరవాన్ని నింపుకుని, వినయం,  విధేయత ఉట్టిపడేలా అవతలివారి హృదయాన్ని తాకాలి. అందుకే నమస్కారానిది హృదయం  భాష.

సత్ప్రవర్తన అలవడాలంటే చెడును విస్మరించాలి. వినయపూర్వకంగా  "నమస్కారం లేదా నమస్తే" అని అనాలి. చూడగానే మనమేమిటో ఎదుటి వారికి తెలియదు.  వినయాన్ని చాటుకోవాలంటే నమస్కారాన్ని అవతలి వారి హృదయాన్ని సుతారంగా  తాకేలా గౌరవంగా చేయాలి.

🙏 శివకేశవులకు నమస్కరించేటపుడు తలనుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి  నమస్కరించాలి.(శివకేశవుల్లో ఏ భేదంలేదని చాటడానికి ఇది గుర్తు)

🙏హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు..

🙏గురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి .

🙏తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి.

🙏తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి.

🙏యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి.

నమస్కారంలోని అంతర్గతం ....

హిందూ సంస్కృతిలో నమస్కారం   విశిష్ట ప్రక్ధియ. ఒకరికొకరు ఎదురైతే  రెండు చేతులు జోడించి హృదయ
 స్థానం దగ్గర ఉంచి నమస్కారం  చెప్పడం   హిందువు అలవాటు  .  మామూలుగా  చూస్తే నమస్కారం చేయడం  అంటే  ఎదుటి వ్యక్తికి గౌరవం  ఇవ్వడం  నమస్కారం అన్న పదం  సంస్కృతం  నుంచి వచ్చింది .
 సంస్కృతానికి చెందిన నమః  అనే  పదం నుంచి  నమస్కారం  అన్న. పదం  ఏర్పడిననది ..  సంస్కృతంలో నమః
 అంటే విధేయత. ప్రకటించామని  అర్ధం ..
 మనషులందరిలోనూ దైవత్వము  ఉంటుందని  హిందువులు నమ్ముతారు ...
 దీనినే ఆత్మ అంటారు  . నమస్కారం పెట్టడం  అంటే  ఒక వ్యక్తిలో  ఉన్న ఆత్మ ఎదుటి  వ్యక్తిలోని ఆత్మను
 గుర్తించి దానికి విధేయత ప్రకటించడం ..
 ఇది అధ్యాత్మిక పరమైన వివరణ ..
 శాస్త్రీయంగా చూస్తే నమస్కారం  చేసేటప్పుడు  రెండు చేతుల వేలి కోసలు ఒకదానికొకటి  తాకుతాయి  మనం చేతి వెళ్ల కొనలకు  కళ్ళు చెవి మెదడులతో సంబంధం  ఉంటుంది.  నమస్కారం  చేసేటప్పుడు
 చేసేటప్పుడు  వేలి కొనలు పరస్పరం  ఒత్తుకోవడం  వల్ల కళ్ళు చెవి మెదడు  కేంద్రాలు ఉత్తేజమవుతాయి  దాంతో
 కళ్ళ ఎదుట ఉన్న వ్యక్తిని  మెదడు ఎక్కువ -
 కాలం  గుర్తు పెట్టుకోవడం . వాళ్ళ మాటల్ని చెవి గుర్తుంచుకోవడం.  జరుగుతుంది ..
 అంటే మనం ఎవరికైనా చేతులు జోడించి -
 నమస్కారం పెడితే  వాళ్ళు మనకి  ఎక్కువ కాలం గుర్తుండిపోతారని అర్థము  ..
 నమస్కారం పెట్టేటపుడు మనం   ఎదుటి వాళ్ళను ముట్టుకోనవసరంలేదు  దానివల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు  సోకె ప్రమాదం ఉండదు.  భౌతిక సంబంధం లేకపోవడంవల్ల.  ఇద్దరి మధ్య సానుకూల శక్తుల అదాన
 ప్రదానం జరుగుతుంది. ఒకరినొకరు ముట్టుకోకపోవడం వల్ల  ఒకరి నుంచి చెడు భావనలు  మరొకరిలోకి  చొరబడే అవకాశము కూడ. ఉండదు. నమస్కారం అన్నది సత్యగునమైనది . అవకాశం ఉన్నంతవరకు  ఎదుటి వ్యక్తికి -  మంచి మనస్సు తో  చేతులు జోడించి నమస్కంరించడం   మంచిది  ....

నమస్కారం  మంచి  సంస్కారం  దీన్ని మనం   అందరం  పాటిదాం . ఎదుట వారికి   నమస్కరించటం  తో  మన  విలువ  పెరుగుతుంది . ఈ సాంప్రదాయాన్ని  మనం  పాటిస్తూ , మన  పిల్లలకు  నేర్పిద్దాం .లోకాన్ సమస్తాన్ శుఖినోభవంతూ ఎందరో మహానుభావులు అందరికి వందనములు నేను కొన్ని కధలు వ్రాయటం జరిగినది ౨౦౧౨ నుండి అవి అన్ని పోస్టు చేయ దలిచాను, నా కథలపై మీ అభిప్రాయాలు తెలపండి మీరు వ్రాసినా తెలపండి  ప్రాంజలి ప్రభ అందరికొరకు జ్ఞానాన్ని పంచాలని ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికం ఆశయంతో ౧౧ బ్లాగుల్లో నిక్షిప్తం గదా ఉన్నవి పోష్టు చేస్తున్నాను చదవండి -- చదవమని చెప్పండి ... తెలుగుభాషను బతికించండి నచ్ఛితే షేర్ చేసి స్నేహాన్ని పెంచుకోండి      
సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి ... ఓం శాంతి .. ఓం శాంతి
 

 అత్యవసర చికిత్స

కుంభకోణ మఠంలో చంద్రమౌళీశ్వర పూజ పూర్తైన తరువాత, పరమాచార్య స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

శ్రీమఠంతో సంబంధం ఉన్న ఒక రైతు ఆత్రుతగా స్వామివారి వద్దకు పరిగెత్తుకుని వచ్చి, స్వామివారి పాదాలపై పడి విలపించసాగాడు, “నా కుమారుణ్ణి కాపాడండి దేవుడా!” అని.

ఏమి జరిగిందో కనుక్కోమని సహాయకునికి చెప్పారు స్వామివారు.

ఆ రైతుకి ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ పిల్లవాడు ఆహారం తింటున్నప్పుడు, ఒక పాము అతని శరీరంపై పాకి వెళ్లిపోవడం వల్ల భయంతో మూర్చిల్లాడు. పాము కరిచిందో లేదో తెలియడంలేదు. సాధారణంగా పాము కాటుని మంత్రంతో పోగొట్టే ఒక పధ్ధతి ఉంది. కాని ఆ మంత్రం తెలిసిన వారు దగ్గరలో ఎవరూ లేరు.

“సామి మాత్రమే వాణ్ణి కాపాడాలి . . .”


మహాస్వామివారు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. “ఆ పిల్లవాని నుదురుపై పూయండి”.

“సరే సామి”

“మీ ఇంట్లో శీకాయ పుడి ఉందా?”

“ఉంది సామి” అని తలూపాడు.

“పిల్లవాని పెదాలు వేరుచేసి, కొద్దిగా శీకాయ పొడి వేసి చిన్నగా రుద్దండి. చేదుగా ఉందని పిల్లవాడు ఉమ్మివేస్తే, పాము కరవలేదని అర్థం. తీయగా ఉన్నదని లోపలి తీసుకుంటే, పాము కరచిందని అర్థం. దాని ప్రకారంగా చికిత్స చెయ్యాలి. వెళ్లి పిల్లవాడికి శేకాయ పొడి ఇవ్వు”


ఆ రైతు పరుగున ఇంటికి వెళ్లి స్వామివారు చెప్పినట్టుగా చేశాడు. శీకాయ పొడిని నోటిలో వెయ్యగానే, “చేదు, చేదు” అని ఉమ్మేశాడు. పాము కరవలేదని ఆ రైతు చాలా సంతోషపడ్డాడు.


పరిస్థితి చక్కబడిన తరువాత ఆ రైతు కుటుంబంతో సహా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆ రితు భార్యతో స్వామివారు, “ప్రతి రోజూ ఇంటిలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించు” అని చెప్పారు.

--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం





 శుక్లామ్బరధరం వర్సెస్ కాఫీ

☕☕

కాంచి  మహా పెరియవర్ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మంచి హాస్య ప్రియులు.  ఒకరోజు తన శిష్యుని పిలిచి,
"సంధ్యా వందనం అయిందా? శుక్లాం బరధరం అయిందా? "అనిఅడిగారు.

వెంటనే ఆ శిష్యుడు అయిందని తల ఆడించాడు.
దానికి మహా పెరియవర్ అతనితో "శుక్లాం బరధరం చెప్పావా అని అడగలేదు. అయిందా అని అడిగాను " అన్నారు.

శిష్యుని కి ఏమీ అర్థం కాలేదు. పెరియవర్ ఏమని అడిగారు? ఈ పదాలకు వున్న  భేదాలేవీ బోధపడక పరితపించాడు. అతనికి సందేహంగాను వుంది. .......
కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిన తరువాత,

మహా పెరియవర్  అతనితో "శుక్లాం బరధరం "చెప్పు చూద్దాం అన్నారు.....
పెరియవర్ చెప్పమన్న వెంటనే,"శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే "అని శిష్యుడు చెప్పాడు.......

శిష్యుడు   చెప్పింది విన్న మహాపెరియవర్ " దీనికి అర్థం తెలుసా? "అని అడిగారు. "తెలుసు "అని బదులు చెప్పిన శిష్యుడు, తెల్లని మనసు, యేనుగులా నల్లని రంగు, నాలుగు చేతులు,ప్రకాశమయిన ముఖం, అందరూ తలచి చూసేలా చేయు ఆకారం వున్న వినాయకుని స్మరిస్తే ఏవిధమైన ఆటంకాలు, బాధలూ వుండవని చెప్పాడు. .....
అరే !సరిగ్గా చెప్పావే,దానికి ఇంకో అర్థం వుంది, అది నీకు తెలుసా? అని చెప్పి,నవ్వారు.
శుక్లాం అంటే తెల్లనిది. అంటే పాలు. విష్ణుం అంటే నలుపు అది డికాషన్. శశి వర్ణం అంటే నలుపు తెలుపు కలిసినది. అంటే "కాఫీ". చతుర్బుజం అంటే నాలుగు చేతులు. అంటే, భార్యవి రెండు
చేతులు, కాఫీ ఇవ్వగానే అందుకునే భర్తవి రెండు చేతులు కలిసి నాలుగు చేతులు.
"ధ్యాయేత్ అంటే తలిచే తలపులు. అంటే అలాకాఫీ ఇవ్వడాన్ని మనసులో తలవగానే
"ప్రసన్న వదనం "ముఖం వికసిస్తుంది ఆసమయంలో. "సర్వ విఘ్నోప శాంతయే "అంటే అన్ని వేదనలూ పోగొట్టేది. అనగా కాఫీ  త్రాగితే వేదనలుతీరి, మనసు శాంతమవుతుందని అర్థం. ....
"శుక్లాం బరధరం అయిందా "అన్న ప్రశ్నలో , కాఫీ త్రాగటం అయ్యిందా? అన్న అర్ధం దానిలో ఇమిడి వుంది.
అని తెలుసుకున్న శిష్యులు మైమరచి నవ్వనారంభించారు.  

కంచి పెరియవర్ చిరునవ్వులు చిలకరించారు. 🙏🙏

--(())--

 యాండీ ఈ సంగత్తెలుసా మీకు ... ???

కాకినాడ కోటయ్య కాజా ఫేమ్ " కోటయ్య " గారు అసలు కాకినాడాయన కాదంట .

మా గుంటూరాయనంట .
తెనాలి తాలూకా , చిన్న పరిమి గ్రామంలో పుట్టారంట .

ఇదిగో ఇది చదవండి .
చంద్రమౌళీ దాసు గారు పంపించారు .
భలే ఇంటరెస్టింగా ఉంది ఆయన విజయ గాధ .

                       🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కాకినాడ కోటయ్య కాజ!!

కథానిక!

1857 సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న కాలం.  ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తూ భరతమాత స్వేచ్చా వాయువులకోసం భారతవీరులు కరవాలాలు ఝళిపిస్తున్నారు  . ఆదే కాలంలో భారతదేశం అద్భుత ప్రతిభావంతులకు జన్మనిస్తున్న సమయం కూడా. తెలుగు వీరుల గడ్డ గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చిన్నపరిమి గ్రామంలో వ్యవసాయదారుల కుటుంబం ఓ ప్రతిభావంతుడుకి జన్మనిచ్చింది.అతడే చిట్టిపెద్ది కోటయ్య .చిన్ననాటి నుండి కోటయ్యను  తండ్రి తన కూడా పొలానికి తీసుకుపోవాలని ఆరాటపడేవాడు. పొలం పని అస్సలు ఇష్టం ఉండేది కాదు కోటయ్యకు . పదేళ్ళ వయస్సుకే  కోటయ్యలో నూతన ఆలోచనలు గజి బిజి చేయసాగాయి. అమ్మ పిండివంటలు చేస్తున్నప్పుడల్లా ఎంతో సంబర పడిపోయేవాడు.తనూ కూడా ఉండలు ఒత్తుతూనో , గరెటెలతో వండినవి పెనం నుండి దించుతుంటేనో  చెప్పలేని ఆనందం కలిగేది కోటయ్యకు.
 పొలం పనికి కోటయ్య రావటంలేదని ఆరోజు పెద్ద రాద్దాంతం చేసాడు కోటయ్య తండ్రి. పొలం పని ఇష్టంలేని కోటయ్య పదేళ్ళవయస్సులో అర్దరాత్రి ఇంటినుండి పారిపోయేడు. కన్నవారు కోటయ్య కోసం వెతకని ఊరులేదూ వెతకని చోటూ లేదు .కోటయ్య పోయి పోయి తిరుపతి చేరుకున్నాడు. ఎలా బ్రతకాలో బ్రతకడానికి ఏంచెయ్యాలో తెలియని వయస్సు కోటయ్యది. దూరంగా ఏడుకొండలు కనిపిస్తున్నాయి. అమ్మ ఏడుకొండలవాడా అంటూ పూజలు చేయడం గుర్తుకు వచ్చింది. ఇంతలో తన ముందర నుండి భక్తులగుంపు " ఏడుకొండలవాడా  వెంకటరమణా "  అంటూ కొండ ఎక్కడం చూసాడు.తను కూడా" ఏడుకొండలవాడా వెంకటరమణా " అంటూ  నడవడం మొదలెట్టాడు కోటయ్య . కొంత సేపటికి తిరుపతి కొండ ఎక్కలేక ఓ చెట్టు క్రింద కూలబడిపోయాడు. ఓ ప్రక్క ఆకలి దంచేస్తుంది . ఇంతలో ఓ భక్తుల బృందం కొండ దిగుతుంది. అందులో  ఓ ముసలావిడ అలసిపోయి ఆకలితో దిగులుగా కూర్చున్న కోటయ్య దగ్గరకు వచ్చి చేతిలో తిరుపతి లడ్డు పెట్టింది. గబా గబా సగం తినేసాడు. అబ్బ ఎంత రుచిగా వుందో అనేలోపు లడ్డూతీపిలోని మాధుర్యానికి కోటయ్య  కనులు మెల్లగా మూతలు పడ్డాయి. కనులు తెరచి చూసే సరికి చెన్నపట్టణం అంటే ఇప్పుడు చెన్నై నగరం లో మంచం మీద పడుకుని ఉన్నాడు. వంటపాత్రల చప్పుడుకు మెలకువ వచ్చి గబ గబా మంచం దిగి గది బయటకు వచ్చి చూసాడు. అక్కడ చాలా మంది పనివాళ్ళు రకరకాల మిఠాయిలు చేస్తూ ఉన్నారు. అక్కడ కుర్చీలో జేరబడి వినసకర్ర విసురుకుంటూ ఉన్న బామ్మ కనబడింది. ఆ బామ్మే తనకు చేతిలో లడ్డు పెట్టిన బామ్మ అని గుర్తు పట్టాడు కోటయ్య . బామ్మ  కోటయ్యను చూడగానే లేచి దగ్గరకు వచ్చింది. "ఏం నాయనా ఇప్పటికి కళ్ళు తెరచావా. నీకు లడ్డూ పెట్టగానే తింటూనే  నిద్రపోయావు. నువు ఎవరో ఏంటో ఎవరిబిడ్డవో తెలియదు .అందుకే అక్కడ నిన్ను వదిలేయలేక తీసుకువచ్చాను మా ఇంటికి" అంటూ కోటయ్యకు గాలి విసురుతూ చెపుతుంది. కోటయ్యకు మెల్లగా అర్దమయ్యింది. బామ్మగారి బుగ్గన ముద్దుపెట్టాడు. బామ్మగారి మనస్సు వెన్నలా కరిగిపోయింది. తన వృత్తాంతమంతా చెప్పాడు బామ్మగారికి. "పాలుగారే ఉన్నావు నిన్ను కొడతాడా మీ నాన్న  వద్దులే అక్కడకు పోవద్దు ఇదిగో మా మిఠాయి దుకాణంలో రకరకాల వంటలు నేర్చుకుంటూ ఇక్కడే ఉండిపో" అంది. కోటయ్యకు బామ్మగారి ప్రేమాభిమానాలు మిఠాయి దుకాణం ఎంతో నచ్చేసింది. కోటయ్య నెల తిరిగేలోపే అన్ని రకారకాల మిఠాయిలు వండటం నేర్చేసుకున్నాడు. పన్నెండేళ్ళు గిర్రున తిరిగాయి. ఇరవై రెండేళ్ళు వచ్చేసరికి చిట్టిపెద్ది కోటయ్యకు ఇంటి వైపు మనసు లాగింది. అమ్మా  నాన్నలను చూడాలనిపించింది. మెల్లగా బామ్మ దగ్గరకు పోయి " మా ఇంటికి వెళతాను" అని బామ్మతో చెప్పాడు. బామ్మకు దుఖః ఆగలేదు కోటయ్య పట్ల ప్రేమ పెంచుకుంది మరి. బామ్మ కన్నీళ్ళు తుడుచుకుని "వెళ్ళు కోటయ్య మీ అమ్మ నీకోసం ఎంత ఏడుస్తుందో ఎంత బెంగ పెట్టుకుందో" అంటూ  గబగబా లోపలికి వెళ్ళి డబ్బుల మూట ఇచ్చి దీవించి పంపింది.
  చెన్నపట్టణం మద్రాసుగా మారింది. మద్రాసు నగరం నుండి తెనాలి చేరి తన ఊరు చిన్నపరిమి చేరుకున్నాడు. ఇంటి ముందుకు వెళ్ళి "అమ్మా ! నాన్నా !" అని పిలిచాడు కోటయ్య. ఎన్నాళ్ళగానో  ఆ పిలుపుకోసమే ఎదురు చూస్తున్న కోటయ్య తల్లిదండ్రులు గబగబా బయటకు వచ్చి నూనూగు మీసాల కోటయ్యను చూసి గుర్తుపట్టి  కౌగిలించుకుని ముద్దాడుతూ తనివితీరా ఏడ్చారు.క్షమించమని తండ్రి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అమ్మా నాన్నల కాళ్ళకు నమస్కరించి లోపలికి నడిచాడు కోటయ్య.
     1888  గాంధీ ఇంగ్లాండు నగరం బారేట్ల చదవడానికి ఓడమీద వెళుతున్న సమయం.
కోటయ్యకు తల్లిదండ్రులు అనసూయతో పెండ్లి జరిపించారు. కోటయ్య తెనాలిలో మిఠాయి దుకాణం తెరిచాడు. అనతికాలంలోనే మంచి మిఠాయి దుకాణంగా పేరుతెచ్చుకుంది. అయితే ప్రతిభావంతులు ఎప్పుడూ చేతులు కట్టుకు కూర్చోరు. తన పనిలో గొప్పదనం కోసం  నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కోటయ్య మనస్సు నూతన ఆవిష్కరణకు ప్రయత్నిస్తుంది. ఒక రోజు పిండితో కుస్తీ పడుతున్న కోటయ్యను చూసి భార్య ఏం  చేస్తున్నారండి అంది. "అనసూయ మనం అమ్మే తినుబండారాలు అందరి దగ్గరా దొరికేవే నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి అందుకు ఓ కొత్తరకం వంటకు ప్రయత్నిస్తున్నాను" అన్నాడు కోటయ్య "అసలు మీ ఆలోచన ఏంటో చెప్పవచ్చుకదా " " ఏం లేదు అనసూయ కొరికితే పాకం కారాలి కాని చూస్తుంటే  లోపల పాకం ఉన్నట్టు కనబడకూడదు నొక్కితే గట్టిగా ఉండాలి" అన్నాడు కోటయ్య.   "ఏంటి ఏంటి విడ్డూరంగా ఉందే "బుగ్గలు నొక్కుకుంటూ కళ్ళు పెద్దవి చేసి కోటయ్య ప్రక్కన పీట వేసుకు కూర్చుంది అనసూయ.
"ఏలా చేస్తారు మరి"  "ఏం చేస్తానంటే  ఇదిగో మైదా పిండి  కేజి తీసుకున్నాను దీనికి  ఓ వంద గ్రాములు పచ్చి సెనగపిండి కలుపుతాను."
"మైదాలో సెనగపిండా బలేగుందండి"  "అనసూయ నిన్న నువు తయారుచేసిన గుమగుమలాడే నెయ్యి తీసుకురా" అన్నాడు కోటయ్య. అనసూయ లేడిలా వంటగదిలోకి పరిగెత్తి నెయ్యి డబ్బా తెచ్చింది. కోటయ్య అందుకుంటూ  ఇందులో వందగ్రాముల నెయ్యి వేస్తాను. వేసి ఇదిగో నెయ్యితో పిండిని పాలిష్ చేసినట్టు కలుతాను అంటూ ఓ పదినిమిషాలు
నెయ్యిని మొత్తం పిండికి పట్టించాడు.
"ఆ తరువాత ఏం చేస్తారు"  ఆతృతగా అడిగింది అనసూయ. "వంటసోడా ఓ  ఇరవై గ్రాములు వేస్తాను". "నాకు తెలుసు వంటసోడా వేస్తే పొంగుతాయి కదా" అన్నది అనసూయ . "ఆ అవును అందుకే వేస్తాను .  వేపినప్పుడు కరకరలాడడానికి కాస్త డాల్డ కూడా కలుపుతాను."  "మీ బుర్రే బుర్రండీ" మెచ్చుకుంటూ సాయంచేస్తుంది కోటయ్యకు భార్య అనసూయ. "కాస్త ఇత్తడి చెంబు తీసుకుని  నీళ్ళుపొయ్యి "అన్నాడు . అనసూయ  పిండిలో నీళ్ళు పోసింది. "ఇప్పుడు పిండిని కలిపి కలిపి ముద్దలా చేస్తాను చెయడమే కాదు ఓ అరగంటసేపు ముద్దను ఎత్తి కుదేస్తాను" అంటూ పళ్ళెం కేసి బాదడం మొదలెట్టాడు కోటయ్య .  ఇలా చేస్తున్నాడే కాని అలా వండాలని కోటయ్యకూ తెలియదు ప్రయత్నిస్తూన్నాడంతే. కోటయ్యకు చేతులు నొప్పి పుట్టాయి. అనసూయ  కోటయ్య అలసిపోవడం చూసి "పైకి లేవండి బాదింది చాలుగాని చేతులు కడుక్కొని భోంచేయండి అంది." కోటయ్య అవస్దను చూస్తూ . వంటగదిలోకి వెళ్ళి భోజనం పళ్ళెం తెచ్చి పీటమీద పెట్టింది. కలిపిన పిండి ముద్దను ప్రక్కన పెట్టి  దానిపై గుడ్డను కప్పాడు కోటయ్య. కోటయ్యకు తెలియదు అలా కొంత సేపు  పిండిముద్దను ఉంచితే చక్కగా మృదువుగా అవుతుందని.
"భోజనం చేస్తున్నాడు గాని కోటయ్య "తరువాత ఏంచేయాలి ? అని అనుకుంటుంటే   ఒక్కసారిగా పొలమారింది కోటయ్యకు. అనసూయ కోటయ్యకు మంచి నీళ్ళ చెంబు అందిస్తూ "  నాకు తెలుసు మన కాకినాడ చూట్టాలే తలుచుకుంటున్నారు. మొన్న దీపావళికి వచ్చినప్పుడు నాతో చెప్పారు.  కాకినాడ లో మంచి మిఠాయి దుకాణం  ఏదీ లేదు మీరు అక్కడకు వచ్చేయవచ్చు కదా . తెనాలి బాగా చిన్నఊరు  కాకినాడ అయితే వ్యాపారం పెద్దదవుతుందని " అంటూ చుట్టాలు సలహ ఇవ్వడం గుర్తు చేసుకుంది. చేయి కడుగుకుంటూ కోటయ్య "నాకు అలాగే అనిపిస్తుంది అనసూయ మద్రాసు లో చూసాను కదా  ఎంత పెద్దనగరమైతే వ్యాపారం అంత పెద్దగా సాగుతుంది  వెళదాము గాని ముందు మనకంటూ ఓ ప్రత్యేకమైన వంటకం ఉండాలి. నేను అనుకున్న వంటకం  బాగా వస్తే రేపే ప్రయాణం " అన్నాడు కోటయ్య. "ఇంకెందుకు ఆలస్యం మొదలెట్టండి" అంది అనసూయ సంతోషపడుతూ పిండి ముద్దను పీటపై వేసుకున్నాడు" ఏంచెయ్యాలి ఇప్పుడూ  చేసేది ఏదైనా నేతి వంటకమే ఉండాలి అలాగే చేతిలో ఇమడాలి అంటే వ్రేలంత పొడవుంటే చాలు  అనుకుని ఒక్కసారిగా వచ్చిన ఆలోచనతో  "అనసూయ  ముందు పొయ్యి వెలిగించి పెనం మీద కళాయి పెట్టి నెయ్యి మరిగించు" అన్నాడు. అదేంటండి నెయ్యంతా మరిగిస్తే రేపు వంటలకో అంది"  అనసూయ ." మాట్లాడకు మన దశ తిరగబోతుంది బ్రహ్మండమైన ఆలోచన వచ్చింది." అంటూ కోటయ్య పిండిని సన్నని గొట్టంలా చేసి ముక్కలు ముక్కలుగా ఇనపరేకు తో కోసాడు. ఇంతలో కళాయిలో నెయ్యి వేడెక్కింది. కోటయ్య పిండి ముక్క తీసుకుని వేలితో ఓ నొక్కు నొక్కి అప్పడాలు వత్తే కర్రతో అదిమి ఆ పిండి ముక్కను మరిగే నెయ్యిలో వేసాడు అంతే బుడగలా పొంగింది. కోటయ్య అనుకున్నది వచ్ఛేసింది. భార్య అనసూయ "ఇదేంటండి గొట్టంలా వుంది అంది. " "అవును గొట్టాలే " గబగబా ఓ యాబై గొట్టాలు తయారు చేసాడు కోటయ్య. " అనసూయ బంగారు రంగులో వచ్చేక గరిటే బెట్టి గొట్టాలు పళ్ళెంలోకి తీసేయ్ " అన్నాడు  . అనసూయ కంగారుపడుతూ గొట్టాలను కళాయినుండి తీసే పళ్ళెంలో వేసింది.. "అదేంటండి అప్పుడే దించేయమన్నారు." " చెపుతాను గాని  నువ్వు  
కేజి పంచదార తీసుకుని దానికి సమానమైన నీరు పోసి పంచదార పాకం పట్టు " అన్నాడు.  అనసూయ కోటయ్య చెప్పినట్టే పంచదార పాకం పట్టింది. ఇంతలో కోటయ్య గొట్టాలు అన్నీ ఒకేసారి  మరలా నెయ్యికళాయిలో వేసి గరెటెతో తిప్పుతూ గొట్టాలను ఎగరేస్తూ ఉన్నాడు. "అనసూయ అదేంటండి అలా ఎగరేస్తున్నారు మతిగాని పోయిందా" అంది కోటయ్య చేసేది అర్దంకాక . " నాకు మతి పోలేదోయ్  ఎందుకు ఎగరేస్తున్నానంటే గొట్టాలు గలగల శబ్దం చేసేవరకూ వేపాలని"   
 "బాగానే ఉంది కాని పాకం వేడి తగ్గిపోతుంది"  అంది అనసూయ.
"తగ్గితేనే మంచిది అనసూయ గొట్టాలు వేడిగా పాకం వేడితక్కువగా ఉంటే గొట్టాలలొకి పాకం ఎక్కువ పడుతుంది" అన్నాడు కోటయ్య.
భర్త కోటయ్య అనుకున్నది సాధించినట్టే ఉన్నాడనిపించింది అనసూయకు.
"అనసూయ రాత్రి నువు పడుకున్నాక జార అని తయారు చేసాను అది బయట అరుగుమీద ఉంది పట్టుకురా" అన్నాడు. ఇదెప్పుడు చేసాడు రాత్రంతా నిద్రపోలేదన్నమాట అనుకుంటూ భర్త ప్రయత్నానికి తనవంతు సాయం అందిస్తూ ఉంది అనసూయ. గరెటెలో మైదాపిండితో చేసిన గొట్టాలు గలగలలాడుతున్నాయ్  కోటయ్య ముఖం ఆనందంతో విప్పారింది. గొట్టాలను పంచదారపాకంలో వేసి జారతో ఓ నిమిషం నొక్కి బయటకు తీసాడు చిట్టిపెద్ది కోటయ్య.
     భార్య అనసూయ ముఖం చిన్నబోయింది . గొట్టం గొట్టంలాగే వుంది  ఏంవుంది ఇందులో అనుకుంది. కోటయ్య భార్యకు ఓ గొట్టం ఇచ్చి తినమన్నాడు. భర్త శ్రమను చూసి వద్దనలేక వంటకం సరిగా రాలేదు పాపం అనుకుంటూ  గొట్టాన్ని పళ్ళమధ్య పెట్టి కొరికింది అంతే ఒక్కసారిగా నోటినిండా పాకం జలజలా కారింది. అనసూయ ఆశ్చర్యానికి అంతులేదు  .కోటయ్య అనుకున్నది సాధించాడు. బయటకు మామూలుగా గట్టిగా కనిపిస్తుంది గొట్టం కాని నిండా పాకమే. పాకం గొట్టం లోపలికి ఎలా వెళ్ళిందో ఎవరికీ తెలియదు. బలే వంటకం."ఏమండీ దీనికి ఏం పేరు పెడతారు ? "  అని అడిగింది. "అనసూయ దీనికి " కాజ "అని పేరు పెడతాను. "గొట్టం కాజా అంటారా" " లేదు ఇది కాకినాడ కాజా " అని ప్రసిద్ది చెందుతుంది అన్నాడు కోటయ్య . భర్త ఉద్దేశ్యం అర్దమయ్యింది కాకినాడలో అమ్మడం మొదలు పెడతారన్నమాట అని అనుకుంది అనసూయ.  భర్తను మురిపెంగా చూస్తూ "ఏమండి మీరు తయారు చేసిన ఈవంటకం వందేళ్ళపాటు ప్రపంచ ప్రసిద్ది చెందుతుంది "అంటూ భర్త కోటయ్య నుదిటికి పట్టిన చెమటను పైట చెంగుతో తుడిసింది అనసూయ.
1891 గాంధీ ఇంగ్లాండులో బారెట్ల పట్టాపుచ్చుకుని  మూడేళ్ళ తరువాత తిరిగి భారతదేశంలో అడుగు పెట్టాడు.  1891  కాకినాడ కోటయ్య కాజా  దుకాణం తెరవడానికి కాకినాడ మెయిన్ రోడ్డులో అడుగు పెట్టాడు  మన కోటయ్య.

--(())--

సాష్టాంగ నమస్కారం 09=11=2020
సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటి? సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి..? ఆ సాష్టాంగ నమస్కారం యొక్క విధి విధానాలను తెలుసు కొందామా..*_

_**మనం నమస్కారాలను అనేక విధాలుగా చేస్తూ ఉంటాము. రెండు చేతులను జోడించి హృదయం దగ్గర ఉంచుకొని ఆ దేవుడికి చేసే నమస్కారం ఒకటి. రెండు చేతులను పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ చేసే ఆ సూర్య భగవానుడికి, గోవిందా గోవిందా అంటూ గోవింద నామస్మరణ చేస్తూ ఆ వేంకటేశ్వరునికి చేసే నమస్కారం మరొకటి. అలాగే గుడిలో దేవుని ముందు బోర్లా పడుకుని చేసే నమస్కారాన్ని సాష్టాంగ నమస్కారం అంటారు. ఈ సాష్టాంగ నమస్కారాన్నే మరో పేరుతో అష్టాంగ నమస్కారం అని అంటారు. సాష్టాంగ నమస్కారము, అష్టాంగ నమస్కారము అంటే అర్థం ఏమిటంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో కలిపి నమస్కారము చేయుట అని అర్ధము..*_

_**అష్టాంగాలు అంటే :-*_

_**ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...*_

_**వీటి అర్థాలను ఒకసారి పరిశీలిస్తే "ఉరసా" అంటే తొడలు, "శిరసా" అంటే తల, "దృష్ట్యా" అనగా కళ్ళు, "మనసా" అనగా హృదయం, "వచసా" అనగా నోరు, "పద్భ్యాం" అనగా పాదములు, "కరాభ్యాం" అనగా చేతులు,"కర్ణాభ్యాం" అంటే చెవులు.*_

_**ఇలా "ఎనిమిది అంగములతో కూడి కలిపి ఈ నమస్కారం చేయాలి. అందుకే ఈ నమస్కారాన్నే "అష్టాంగ, సాష్టాంగ నమస్కారం అంటారు.*_

_**అలా ఎందుకు చేయాలంటే మానవుడు సహజంగా ఈ ఎనిమిది అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..*_

_**ముఖ్యంగా మనందరమూ తెలుసు కోవలసిన విషయం ఏమిటంటే దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ద్వారానికి ధ్వజ స్తంభానికి మధ్యలో వుండి చేయాలి.*_

_*1) ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.*_

_*2) శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.*_

_*3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.*_

_*4) మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.*_

_*5) వచసా నమస్కారం అంటేవాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి. అంటే "ఓం నమః శివాయ" అని అంటూ నమస్కారం చేయాలి.*_

_*6) పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.*_

_*7) కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.*_

_*8) జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి...*_

_**అయితే స్త్రీలు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం అనేది మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, మోకాళ్ళు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.*_

_**పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.*_

_**నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేయడం వల్ల పొందుతారని శాస్త్రవచనం. కాబట్టి మిత్రులారా ! ఇప్పుడు సాష్టాంగ నమస్కారానికి అర్థం, నమస్కారం ఎలా చేయాలో తెలుసుకొన్నారు కాబట్టి ఇక ముందు నుండి ఆ విధంగా నమస్కారం చేస్తూ ఆ భగవంతుడి కృపకు పాత్రులౌతారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.*_

_
 

నేటి కధ   09-11-2020  
బాల్య స్నేహితుడు...💕💕
 💙💚🧡

నిజామాబాద్ పెళ్లికి వచ్చాం...
ఊళ్ళో లలిత మహల్ థియేటర్లో ప్రభాస్ "బాహుబలి" సినిమా ఆడుతోంది.

మా ఆవిడ సినిమాకి వెళదామంటే..
సరే అని  వెళ్ళాం.టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే..
ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపి గాడు నన్ను గుర్తు పట్టాడు. పలకరించుకున్నాక,
మా ఆవిడకి పరిచయం చేశాను. ఖిల్లా నిజామాబాద్ కాలేజ్ ఇంటర్లో క్లాస్మెట్ అని..!

హాల్లో కూర్చున్నాక అడిగింది.. "అదేమిటండి మీ క్లాస్మెట్ అంటున్నారు.....
ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం.." అంది.

"ఏమో చదువు అయ్యాక, ఇప్పుడే గదా కలిసింది" అన్నాను.
వాడిల్లు చిన్నప్పుడు మా వీధిలోనే...
చాలా అల్లరి వెధవ....
సినిమాల పిచ్చి ఎక్కువ...
ప్రతి రోజు పేపర్ తిరగెయ్యటం,
ఏ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో చూడటం...
ప్రతీ సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట చూసేయ్యటం...
సినిమా హాల్స్ కేబిన్ దగ్గరకి వెళ్ళి తెగి పోయిన ఫిల్మ్ ముక్కలు ఏరు కోవటం..
ఇదే పని.
అప్పుడప్పుడు వాడి డబ్బులుతో నేల టిక్కెట్ కి  నన్ను కూడా తీసుకెళ్లేవాడు...
"ఎందుకురా" అంటే..
"ఒక్కడిని అయితే బెంచ్ టికెట్ తీసుకునేవాడిని..
నువ్వూ వస్తే 2నేల టికెట్స్..
అంతే గదరా.."
అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా...!
"మా పెద్దోళ్ళు,
వాడితో తిరిగితే ఎక్కడ  చెడి పోతామో అని వాడితో ఆడనిచ్చే వారు కాదు.
చివరకు వాళ్ళు చెప్పినట్టే, వీడు లైఫ్ లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలడ్డాడు" అన్నాను.
"మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోడులా ఉన్నాడు....
లేపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకి ఎందుకు తీసుకెళుతాడు..
అయినా మీరు మటుకు చేసేది ఏమైనా పెద్ద ఉద్యోగమా ఏంటి....
ఇప్పటి వరకు కనీసం ఓ స్కూటర్ కూడా కొనలేదు" అంటూ దెప్పింది.

నాకు ఉక్రోషం వచ్చి "ఎలా చూసినా వాడికంటే బెటరే కదా" అన్నాను.

ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన..
ఆ కుర్రోడికి డబ్బులు ఇవ్వబోతుంటే..
"వద్దు సార్" అని వెళ్లి పోయాడు.

ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ..
"నిజంగా మీ ఫ్రెండ్ మంచోడు అండీ..
మీరే సరిగ్గా పలకరించ లేదు..
పోజు కొడుతూ మాట్లాడారు." అన్నది.

"కాదులే...
వాడి పొజిషన్ ఇప్పుడు బాగా లేదు కదా..
నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాననుకో...
రేపు ఎప్పుడైనా అప్పు అడిగితే...
అదో తలనొప్పి మళ్లీ..!" అన్నాను సాలోచనగా.

"అతను ఏ పొజిషన్ లో ఉన్నా..
బాల్య స్నేహితుడు బాల్య స్నేహితుడే..!* అంది.

"కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థాంక్స్ చెప్పండి" అంది నిశ్చయంగా..

సినిమా అయిపోయింది..

మా ఆవిడ పోరు పడలేక..
ఎంట్రన్స్ దగ్గర సిబ్బందిని,
వాడి గురించి వాకబు చేస్తే...
అతను పై ఫ్లోర్ లోని  ఒక రూమ్ లోకి  తీసుకెళ్లాడు.

పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూమ్...
ఒక సోఫాలో గోపి గాడు కూర్చుని ఉంటే....
హాల్ మేనేజర్ ఆరోజు కలెక్షన్స్ లెక్కలు చెబుతున్నాడు...
ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంట...
మేము లోపలికి వెళ్లగానే...
లేచి బయటకు వెళ్లిపోయారు.

గోపి గాడు మమ్మల్ని చూడగానే రారా..
రారా..
అంటూ ఇద్దర్ని కూర్చో బెట్టి, కాఫీ తెప్పించాడు.
ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని.!

మొదట్లో 16mm ప్రొజెక్టర్ తో  ఊర్లలో పండగలకి పబ్బాలకి సినిమాలాడించి,
ఈ స్టేజీకి ఎదిగాడుట.
ఇంకా హైదరాబాద్ లో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట. కొత్త సినిమాలు జిల్లాల వారిగా కొంటాడుట..! అలా తను ఎదిగిన క్రమాన్ని చెప్పుకొచ్చాడు.

"ఎలా వచ్చార్రా.." అని అడిగితే..
"ఆటోలో" అని చెప్పా.

డ్రైవర్ని పిలిచి,
వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు.

దారిలో మా ఆవిడ.. "ఇలా ఇంకెప్పుడూ,
ఎవర్నీ తక్కువ అంచనా వేయకండి....
ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను..."
అంది చిరు కోపంగా.!!

👉మాట : "*మన కళ్ళకు కనబడేవన్నీ నిజాలు కాదు...

మనం చేసేదే గొప్ప పని కాదు...
మనం సంపాదించినదే ఎక్కు
వ కాదు...
ఎదుటివాడిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించు...
వాడు మన కన్నా గొప్పవాడే.."👈
--(())--

 

--(())--

 సత్సాంగత్యం
                 ➖➖➖✍️

ఒకసారి ఒక వేటగాడు వేటకు వెళ్ళాడు,    ఎర దొరకలేదు, అలసిపోయి ఒక చెట్టు     కింద పడుకున్నాడు.

గాలి వేగం ఎక్కువగా ఉండి కొమ్మల కదలిక కారణంగా చెట్టు నీడ తక్కువ అవుతోంది. అప్పుడే అక్కడ నుండి ఒక అందమైన హంస ఎగురుతూ ఆ పేదవాడు కలత చెందుతున్నాడని అతని పై ఎండ వస్తోంది అని గమనించి ఆ చెట్టు యొక్క కొమ్మపై రెక్కలు తెరచి కూర్చుంది.

వేటగాడు ఆ హంస యొక్క నీడలో హాయిగా నిద్రపోయేలా చేసింది.

కొంత సమయం తరువాత వేటగాడు నిద్రిస్తున్నప్పుడు,
 ఒక కాకి వచ్చి అదే కొమ్మపై కూర్చుని, ఇటు అటు చూసి ఎటువంటి ఆలోచన లేకుండా, అతని మీద రెట్ట వేసి ఎగిరిపోయింది.

అప్పుడు ఆ వేటగాడు లేచి ఇటు అటు కోపంగా చూసి వెంటనే విల్లు తీసి ఎదురుగా కనిపించిన హంసను చంపేసాడు.
హంస కింద పడి చనిపోతూ, ఇలా అన్నది...
నేను నీకు సేవ చేస్తున్నాను, నీకు నీడ ఇస్తున్నాను, నీవు నన్ను చంపావు.. ఇందులో నా తప్పు ఏమిటి.. అని.
అప్పుడు వేటగాడు ఇలా అన్నాడు...

నీవు ఉన్నత కుటుంబంలో జన్మించావు, నీ ఆలోచనలు నీ శరీరంలాగే అందంగా ఉన్నాయి, నీ ఆచారాలు స్వచ్ఛమైనవి, నాకు సేవ చేయాలనే మంచి ఉద్దేశ్యంతోనే ఉన్నావు. కానీ నీవు ఒక్క పొరపాటు చేసావు, కాకి వచ్చి నీతో కూర్చున్నప్పుడు, వెంటనే నీవు ఎగిరిపోయి ఉండాల్సింది. ఆ దుష్ట కాకి సాంగత్యం క్షణ కాలమే అయినా నిన్ను మరణ ద్వారం వద్దకు తీసుకువెళ్ళింది.
అందుకే మన పూర్వీకులు, పెద్దలు ఎల్లప్పుడూ చెపుతుంటారు మంచి సత్సాంగత్యం లోనే వుండమని..
                
   లోకా సమస్తా సుఖినోభవన్తు!

--(())--

నీవు ఎవరవు? ఎవరి వాడివి? ఎక్కడి నుండి వచ్చావు? విచారణ - యదార్ధం
భార్యాభర్తలు అన్యోన్యంగా, అనురాగంగా ఉంటారు. అలా ఉండాల్సిందే. అయితే వారి మధ్య ఉండవలసిన బంధం యొక్క అసలు తత్త్వం తెలిసి ఉంటే వారి బంధం అందంగాను, అద్భుతంగా ఉంటుంది. అలా తెలుసుకోలేక పోతే దుఃఖమయం అవుతుంది.
కళ్ళు అందంగా కనిపించాలని కాటుక పెట్టుకున్నారు. అది సరైనది కాకపోతే అందం సంగతి ఎలా ఉన్నా కళ్లు పోయే ప్రమాదం ఉంటుంది.
అలాగే భార్యాభర్తల మధ్యగల బంధం యొక్క యదార్థస్థితిని తెలుసుకోలేకపోతే సుఖం కోసం చేసుకున్న వివాహం దుఃఖంతో అంతమవుతుంది.
భార్యాభర్తలు కలసి ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాని ఇలా కలిసి ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య కొంచెం ఎడం ఉండాలి. ఒకరికొకరు పూర్తిగా అతుక్కుపోతే, ఒకరు లేకపోతే మరొకరు బ్రతుకలేని పరిస్థితిని తెచ్చిపెట్టుకుంటే అది ఇద్దరిలోను ఎవరో ఒకరికి భరించలేని దుఃఖ కారణమవుతుంది. కనుక తత్త్వాన్ని విచారించాలి.
1. కాతేకాంతః :- నీ భార్య ఎవరు? ఇప్పుడు నీ భార్య అనబడే స్త్రీ వివాహానికి ముందు ఒకరి కుమార్తె. ఆమె పుట్టుకలోగాని, పెరగటంలోగాని నీకే ప్రమేయమూ లేదు. ఆమె ఎక్కడో పుట్టింది. నీవు ఎక్కడో పుట్టావు. అయినా పెళ్ళితో మీ ఇద్దరకూ ముడిపెట్టటం జరిగింది. పోనీ ఇప్పుడు ఇద్దరూ కలిసి ప్రయాణిస్తారు గదా! చివరిదాకా ఇలా కలిసే ప్రయాణిస్తారా? అదేం లేదు. ఈ ప్రయాణంలో ఎవరో ఒకరు ముందుగా దిగిపోతారు. ఆ రెండవ వారు ఒంటరి ప్రయాణం సాగించాలి. అంటే జన్మించటం ఒక్కసారి జరగలేదు. వెళ్ళిపోవటం కూడా ఒక్కసారిగా జరగటం లేదు. ఈ మధ్యలో మాత్రం కొంతకాలం విడిగాను, కొంతకాలం కలసి మెలసి జీవిస్తారు అంతే.
ఇదంతా రైలు ప్రయాణం లాంటిది. ఒక ప్రయాణీకుడు మద్రాసులో రైలెక్కాడు. కొంతదూరం ప్రయాణించి నెల్లూరు రాగానే మరొక ప్రయాణీకుడు ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. లోకాభిరామాయణంతో ప్రారంభమై -, రాజకీయాలు, సినిమాలు, వేదాంతం అన్నీ మాట్లాడుకున్నారు. ఎంతో ఆత్మీయులయ్యారు. మొదటి ప్రయాణీకుడు చీరాల రాగానే దిగిపోయాడు. రెండవ ప్రయాణీకుడు మొదటివాణ్ణి విడిచి ఒంటరిగా, దీనంగా ప్రయాణించి విజయవాడలో దిగిపోయాడు. ఇంతే వారి మధ్య సంబంధం.
భార్యాభర్తల సంబంధం కూడా ఇట్టిదే. అందుకే తత్త్వవిచారణ చేసి ఈ బంధం ఎట్టిదో సరియైన అవగాహన చేసుకోవాలి. అప్పుడే నీవు ఎలా ప్రవర్తించాలో సరిగ్గా తెలుస్తుంది.
2. కస్తే పుత్రః :- అలాగే నీకుమారుడెవరు? అని కూడా విచారించు. పుట్టిన దగ్గర నుండి అతడు నీకెంతో ప్రేమాస్పదుడైన కుమారుడు. మరి అంతకుముందు? అతడు నీ భార్య గర్భంలో పిండం. అంతకు ముందో! అతడు నీలో బీజరూపం! ఆ బీజం ఎలా వచ్చింది? నీవు తిన్న ఆహారం ద్వారా నీలో తయారైంది? మరి ఆ ఆహారం ఎక్కడి నుండి వచ్చింది? భూమిలో నుండి వచ్చింది. అంటే మట్టి అనేక మార్పులు చెంది, ఆహారంగా మారి, ఆ ఆహారం నీలో బీజంగా మారి, ఆ బీజం నీ భార్య గర్భంలో ప్రవేశించి పిండంగా మారి, అది వృద్ధి చెంది శిశువుగా వ్యక్తమైంది. అంటే మట్టి యొక్క చివరి రూపమే నీ కుమారుడన్నమాట. మరి నీవెవరు? నీవూ అంతే. కాకపోతే ఆ బిడ్డకన్నా కాలంలో నీవు ముందున్నావు. నీవు కూడా మట్టి యొక్క ఆఖరి రూపమే.
ఈ లెక్కన చూస్తే కదులుతున్న ఒక పెద్ద మట్టిముద్ద మరొక చిన్న మట్టిముద్దను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది, ప్రేమను పెంచుకుంటుంది. విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు విలవిలలాడి పోతుంటుంది. దూరంగా ఉండి ఈ రెండు మట్టిముద్దల నాటకాన్ని మనం తమాషాగా చూస్తున్నాం అనుకోండి. నవ్వకుండా ఉండలేం. కాని అదే నాటకంలో మనం పాత్రధారులమై ఎంతో సీరియస్ గా ఆ మట్టిముద్దల పాత్రలను పోషిస్తున్నాం. ఇదే భ్రమ, ఇదే మాయ, ఇదే అజ్ఞానం. ఉన్నది ఉన్నట్లుగ చూడలేక 'నాది - నాది' అని భ్రమలో పడి కొట్టుకుపోతుంటాం. ఎంత చిత్రం? అందుకే ఈ సంసారం అతి విచిత్రం, తమాషా అయినట్టిది.
ఇంతకీ ఈ సంసార బంధంలో చిక్కుకు పోయిన నీవెవరు? ఎవరి వాడవు? ఎక్కడి నుండి వచ్చావు? ఈ విచారణ ముఖ్యమైనది.
వేదాంతంలో నేనెవరు? అని విచారణ చేయటమే మానవజీవిత సార్థక్యానికి ఏకైక ఉపాయం. సమస్త దుఃఖాలకు అజ్ఞానానికి అంతం ఈ నేనెవరు? అనే విచారణయేనని భగవాన్ రమణ మహర్షుల వారి ఉపదేశం.
నేనెవరు? నేను ఈ శరీరమా? కాదు. ఇదొక గృహం లాంటిది. జడమైనది. ఇందులో కూర్చుని నేను నా పనులను నిర్వర్తించు కుంటున్నాను. మరి నేను మనోబుద్ధులా? కాదు. అవి నేను పనిచేయటానికి ఉపయోగించుకొనే పనిముట్లు మాత్రమే. అవీ జడమే. వాటిని నేను ఉపయోగించుకుంటున్నాను. మరైతే నేనెవరు? దేహంలో కూర్చొని, మనోబుద్ధులను ఉపయోగించుకొని పనిచేసే జీవుడను. అయితే జీవుడనైన నేను ఎవరికి చెందిన వాడను? ఎక్కణ్ణించి వచ్చాను? నేను నిజంగా అంతటా వ్యాపించియున్న పరమాత్మకు చెందినవాడను. నేనువచ్చింది అక్కణ్ణించే. మరి ఎక్కడకు వెళ్ళాలి? ఆ పరమాత్మ వద్దకే. పరమాత్మ నుండి వచ్చిన జీవుడు కొంతకాలం ఈ జీవన నాటకరంగంలో సుఖదుఃఖాలు అనుభవించి చివరకు ఆ పరమాత్మలో చేరిపోవాలి. అప్పుడే పరమశాంతి, శాశ్వతానందం. 

--(())--

 sekarana   

మట్టి మనిషి - దేవసేన పెద్దినేని
వర్షం వచ్చేటట్లుంది . మబ్బు నల్ల బడింది. పగలు గుమ్మం దాటకుండానే రాత్రి చొరబడింది .చినుకులు మొదలయ్యాయి . మంచి మట్టి వాసన . చాలా బాగుంది .వర్షం కూడా బాల్యం లాంటిదే .ఎదిగితే బావుండదు . ఆ వాసనని ఆస్వాదిస్తూ అక్కడే కూర్చుండి పోయాను .
అదేమిటో మట్టి వాసన వచ్చినప్పుడల్లా , బాల్యం కూడా తన వాసనలతో వచ్చి నా ముందు వాలిపోతుంది . చేతులు చాపి చినుకుల మథ్య గుండ్రంగా తిరిగిన ఙ్ఞాపకం . పందిరి పైన పడే గమ్మత్తైన చినుకుల శబ్దం ఙ్ఞాపకం
నాకు కనపడని ఇంద్రథనస్సుని తమ్ముడికి
చూపిన ఙ్ఞాపకం .ఇన్ని ఙ్ఞాపకాల నడుమ మా బసవడి ఙ్ఞాపకం .
ఇక్కడ బసవడి గురించి చెప్పాలని నా ఉద్దేశ్యం కాదు .బసవడి లాంటి మనుష్యుల గురించి చెప్పాలని నా ఉద్దేశ్యం.
బసవడంటే ఒకరకంగా నాన్నకి ఆత్మ బంథువే .నాన్న వృత్తి పరంగా ప్రభుత్వోద్యోగే అయినా రైతుగానే మా ఊర్లో గుర్తింపు .అలా ఉండటమే ఆయనకిష్టం .పొలం వెళ్ళేటప్పుడు ఆయన వేషథారణ రైతులాగే ఉండేది.పొలం చూసుకోవడానికి బసవడుండే వాడు . నాకు ఊహ తెలిసినప్పటి నుండీ ఉన్నాడు .నాన్నదీ , బసవడిదీ ఇంచుమించు ఒకేవయస్సు .
మంచి చేవదేలిన నల్లమాను కొయ్యతో చెక్కిన నిలువెత్తు బొమ్మలా ఉండే వాడు .మోకాళ్ళవరకు ముదురు నీలం రంగు నిక్కరు , చెమటకు తడిసి వంటికి అతుక్కు పోయిన పాత బనియన్ తో బలంగా ఉండేవాడు .
సాయంకాలమైతే ఇంటికి వచ్చేవాడు పొలం సంగతులన్నీ చెప్పటానికి.
నాన్న , బసవడు ఆరుబయట కూర్చుని మాట్లాడుకోవడం ఇప్పటికీ నా కళ్ళముందు దృశ్యమై మెదుల్తుంది . నాన్న వాలుకుర్చీ లో కూర్చుని , బసవడు నేలమీద దొంతుక కూర్చుని రెండు చేతులను నిటారుగా మోకాళ్ళకు ఆన్చి కూర్చునేవాడు .అలా కూర్చున్నప్పుడు అతను చాలా ఠీవిగా ఉండేవాడు .జుట్టు రాగి రంగు లో ఉండేది .నేను నాన్న ఒళ్ళో కూర్చుని అతన్ని గమనిస్తూ ఉండేదాన్ని . అతని కాలి వేళ్ళు రెండు జట్లుగా విడిపోయి ఉండేవి .బొటన వేలు ఒక్కటే ఒక జట్టు , మిగతా నాలుగూ ఒక జట్టు అన్నట్టు ఉండేవి .రెండింటి మథ్యా ఖాళీ ఉండేది .
ఒక్కొక్కసారి బసవడు వచ్చేటప్పుడు
పై కండువలో తంపటేసిన వేరుశనగ కాయలు తెచ్చి నాన్నకి ఒలిచి పెడుతూ ఊరి సంగతులకి ,కట్టుకథలు జోడించి చెప్పి నవ్విస్తుంటే వాళ్ళిద్దరూ నాకు ఎదిగిన పసి వాళ్ళై కనిపించేవాళ్ళు .బసవడు నవ్వుతూ ఉంటే నల్లమబ్బు నవ్వు తున్నట్టుండేది . అప్పుడు అతని దగ్గర మట్టి వాసన వచ్చేది .
నాన్న ఒడి లో ఉన్నప్పుడు నేనామాట అడిగితే మా అమ్మ పొలం లో పన్జేస్తున్నప్పుడు పుట్టానంట అందుకే నాతో పాటూ మట్టివాసన పుట్టింది అనేవాడు .
అతను భార్యా బిడ్డల దగ్గర కంటే పొలం లోనే ఎక్కువ గడిపేవాడు .చెట్టు చెట్టు తో మాట్లాడేవాడు .నాన్న అంటుండే వాడు "పొలం దేహమైతే బసవడు దానికి ఆత్మ లాంటి వాడు "అని .పండగొచ్చిందంటే చాలు ,మాతోపాటూ కొత్త బట్టలు వేసుకుని నాన్నకి చూపిస్తూ తెగ సంబరపడి పోయే వాడు .అప్పుడప్పుడూ నాన్నతో పరాచికాలాడేవాడు .
ప్రతి భోగి పండుగ కి సరుగుడు చెత్త , తాటాకులు తెచ్చి భోగి మంటేసేవాడు . అప్పుడు బసవడి ముఖం లో చెప్పలేనంత ఆనందం .ఆ ఆనందం లో ,భోగి వెలుగులో వేకువజామునే వచ్చేసిన సూర్యుడులా ఉండే వాడు .
మా ఊర్లో ఎవరింట్లో వేడుక జరిగినా మా బసవడికే హైరానా ఎక్కువ. ఎవరికి తేలు కుట్టినా తేలు మంత్రం బసవడిదే .ఆ మంత్రం వేస్తున్నప్పుడు బసవడినే చూస్తుండి పోయేదాన్ని .కళ్ళు మూసుకుని ఏదో తనలో తను చిన్నగా ఏదో మాట్లాడుతండేవాడు .అప్పుడతను యోగిలా ఉండేవాడు .
కాలం వాళ్ళిద్దరికీ ముసలితనపు ముసుగు వేసింది .బసవడి రాగి రంగు జుట్టు అలానే ఉంది నాన్న జుట్టు ముగ్గు బుట్టైంది .నాన్న ఎప్పటిలానే వాలుకుర్చీ లో బసవడు మాత్రం చిన్నగట్టు మీద కూర్చునే వాడు .ఎప్పటిలానే పొలం కబుర్లు ,ఊరు కబుర్లు , పరాచికాలు .
"ఇది వరకటిలా ఎప్పుడూ పొలం లోనే ఉండొద్దు "అనేవాడు నాన్న .ఆ మాటకు బసవడు పొలంలా అనిపించదు అమ్మ లా అనిపిస్తుంది అనేవాడు .ఇప్పుడు ఇదివరకటిలా ఇంటికి రాలేకపోతున్నాడు . నాన్న పొలం వెళ్ళలేకపోతున్నాడు .
ఒకరోజు నేను తీసుకెళ్ళాను . బసవడు కనపడ లేదు . ఏచెట్టు మొదట్లోనో ఉండి ఉంటాడు అంటూ వస్తున్నాడు నాన్న నా వెనుకగా .నా కాలికి ఏదో తగిలినట్లై ముందుకు తూలి పడబోయి నిలదొక్కుకుని ముందుకు చూశాను . ఒక్కసారిగా గుండె పగిలినట్లైంది .బసవడు బోర్లాపడి పోయున్నాడు నిర్జీవంగా .మాట రాలేదు .మట్టి వాసన మట్టిలో కలిసినట్లనిపించింది . నా భుజం మీద నాన్న చెయ్యి పడింది , నిలబడటానికి ఆసరాకోసం .కాసేపు ఆగి వెనక్కి తిరిగి చూశాను .నాన్న చూపు బసవడి మీది నుండి పొలం వైపుకు మళ్ళించి ఇక మిగిలింది దేహం మాత్రమే అంటున్నాడు .
బంథాల్లోనే పుట్టి , బంథాల్లోనే పెరిగి చివరికి వాటిని కాలరాస్తున్న ఈ రోజుల్లో , మట్టిలోనే పుట్టి , మట్టితోనే మెలిగి , మట్టిలోనే కలిసిన బసవడి లాంటి వాళ్ళు
అప్పుడప్పుడు మనఙ్ఞాపకాల నెమరువేతల్లో కూడా మట్టివాసనతోనే ఉంటారు .
బసవడి లాంటి వాళ్ళ ఙ్ఞాపకం ఎప్పటికీ కనుకొలకుల్లో మిగిలిపోయే అశ్రు బిందువు లాంటిది .ఒక్కసారిగా మొహం మీదికి వేగంగా వీచిన చల్లగాలి నన్ను ఈ లోకం లోకి తీసుకొచ్చింది . ఆకాశంలోకి చూశాను . ఇదాకటి నల్లమబ్బు లేదు .ఎక్కడికో కదిలి వెళ్ళింది .

--(())--








🌹🙏 ( పతంజలి మహర్షి )🙏🌹
👉యోగ సూత్రములు 195 మొత్తం
.
పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (సమాధి పాదము) సాధన పాదము

జ్ఞానము. :
1. అథ యోగానుశాసనము.. . .
(అథ యోగ అను శాసనమ్) - యోగసాధన విధానము తెలుసుకొనుటకు ఇది సమయము (సాధకునిజీవితంలో తగిన సమయము)
2. యోగశ్చిత్త వృత్తి నిరోధః
(యోగః చిత్తవృత్తి నిరోధః) - యోగము అంటే చిత్తవృత్తులను నిరోధించడం.
నిరోధము అంటే యోగసాధనకి అంతరాయమైన చిత్తవృత్తులను గుర్తించి, వాటిప్రభావములకు లోను కాకుండా యోగసాధన కొనసాగించడం.
3.తదా ద్రష్టుస్స్వరూపేఽవస్థానమ్
(తదా ద్రష్టుః స్వరూపే అవస్థానమ్) - ఆ విధంగా చిత్తవృత్తులను అధిగమించగలిగినవాడు యోగస్థితిలో తనను తాను దర్శించగలడు.
4. వృత్తి సారూప్యమిత
(వృత్తి సారూప్యమ్ ఇతరత్ర) - ఇతరులు ఆ చిత్తవృత్తులే తాము అనుకుంటూ వాటిప్రభావాలకి లోనై, ప్రవర్తిస్తారు.
5. వృత్తయః పంచతయ్యః క్లిష్టాఽక్లిష్టాః
(వృత్తయః పంచతయ్యః క్లిష్టాః అక్లిష్టాః) - ఈ చిత్తవృత్తులు ఐదు విధములు. తేలికగా అధిగమించగలిగినవి కొన్ని. శ్రమతో కూడినవి కొన్ని.
6. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయః
అవి - సత్యము, సత్యము అనిపించే అసత్యము, భ్రాంతి (ఊహాజనితము), నిద్ర, స్మృతి
7. ప్రత్యాక్షానుమానాఽగమాః ప్రమాణాని
(ప్రత్యక్ష అనుమాన ఆగమాః ప్రమాణాని) - ప్రమాణములు ప్రత్యక్షముగా చూచినవి (తెలుసుకొన్నవి), తర్కముద్వారా తెలుసుకొన్నవి, పరంపరానుగతముగా శాస్త్రములలో సత్యముగా అంగీకరించబడినవి.
8. విపర్యయో మిథ్యాజ్ఞానమతద్రూపప్రతిష్ఠమ్.
(విపర్యయః మిథ్యా జ్ఞానమ్ అతత్ రూప ప్రతిష్టమ్) - అసత్యమును సత్యమని భ్రమ పడడం విపర్యయము.
9. శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యః వికల్పః
(శబ్ద జ్ఞాన అనుపాతీ వస్తుశూన్యః వికల్పః) - వస్తువు శబ్దము ఆలంబనగా రూపాన్ని సంతరించుకుంటున్నది. వస్తువు లేకపోతే పదానికి అర్థం లేదు. వస్తువు శూన్యమయినప్పుడు (లేనప్పుడు) శబ్దమునే వస్తువు అనుకోడం వికల్పం.
10. అభావప్రత్యయాఽలంబనా వృత్తిర్నిద్రా.
(అభావ ప్రత్యయ ఆలంబనా వృత్తిః నిద్రా) - పరిసరములను గమనించకుండా తామసప్రవృత్తిలో ఉండడం (జడభరతునివలె) నిద్ర.
11. అనుభూతవిషయాఽసంప్రమోషః స్మృతిః
(అనుభూత విషయాః అసమ్ప్రమోషః స్మృతిః) - అనుభూతమయిన విషయములు మనసుపై వేసిన ముద్రలే స్మృతులు లేక వాసనలు.
12. అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధః
(అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధః) - ఈ వృత్తులను నివృత్తి చేయడం (అదుపులో ఉంచడం) అభ్యాసమువలన వైరాగ్యమువలన సాధ్యం.
13. తత్ర స్థితౌ యత్నాభ్యాసః
(తత్ర స్థితౌ యత్నః అభ్యాసః) - ఆ స్థితి ప్రయత్నమువలన సాధ్యం.
14. స తు దీర్ఘకాలనైరంతర్య సత్కారాఽసేవితో దృఢభూమిః
(స తు దీర్ఘకాల నైరంతర్య సత్కారః ఆసేవితః దృఢభూమిః) - ఆ సాధన దీర్ఘ కాలము అంతరాయాలు లేకుండానూ భక్తిప్రమత్తులతోనూ కొనసాగించినప్పుడు మాత్రమే సుస్థిరంగా సాగుతుంది.
15. దృష్టాఽనుశ్రవిక విషయవితృష్ణస్య వశీకారసంజ్ఞా వైరాగ్యం
(దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యమ్) - తాను చూస్తున్నవి, పరంపరానుగతంగా వింటున్నవి అయిన విషయాలలో ఇచ్ఛ లేకపోవడమే వైరాగ్యం (వైరాగ్యానికి చిహ్నం).
16. తత్పరం పురుషఖ్యాతేర్గుణవైతృష్ణ్యమ్.
(తత్ పరం పురుష¬ ఖ్యాతే గుణ వైతృష్ణ్యమ్) - త్రిగుణాలలో (సత్వ, తమస్సు, రజస్సు) విముఖుడయిన సాధకునికి పరమ పురుషునిగూర్చి కలిగిన జ్ఞానమే పరమోత్తమ జ్ఞానము.
17. వితర్క విచారాఽనందాస్మితాస్వరూపానుగమాత్ సంప్రజ్ఞాతః
(వితర్క విచార ఆనంద అస్మితా స్వరూప అనుగమాత్ సంప్రజ్ఞాతః) - తర్కం, నిశిత పరిశీలన, బ్రహ్మానందము, అహమిక (అస్మిత) – ఈ నాలుగు పద్ధతులు ప్రజ్ఞతో కూడిన సమాధికి మార్గములు. ఈ పద్ధతిలో సాధించిన స్థితి సబీజసమాధి. ఈ స్థితిలో "నేను సమాధిస్థితిని పొందేను" అన్న ఎఱుక ఉంది.
18. విరామప్రత్యయాభ్యాసపూర్వస్సంస్కారశేషోఽన్యః
(విరామ ప్రత్యయ అభ్యాసపూర్వః సంస్కారశేషః అన్యః) - ఎఱుకతో ప్రయత్నం చేస్తూ ఇతర సంస్కారాలను (చిత్తవృత్తులను) వెనుకకి మళ్ళించి సాధన చేయడం మరొక పద్ధతి.
19. భవప్రత్యయో విదేహ ప్రకృతిలయానామ్
(భవ ప్రత్యయః వి దేహ ప్రకృతి లయానామ్) - ప్రకృతిలో లయమయినవారికి, విదేహులకు (స్థూలశరీరము నశించినతరవాత మిగిలిన సంస్కారశేషము) మరు జన్మలో సమాధిస్థితి లభిస్తుంది. (ఈ సమాధిస్థితి వెనకటిజన్మలో సమాధి కంటే పైస్థాయి అయినా, సంపూర్ణ సమాధి కాదు.)
20. శ్రద్ధావీర్యస్మృతిసమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషామ్
(శ్రద్ధా వీర్య స్మృతి సమాధి ప్రజ్ఞా పూర్వకః ఇతరేషామ్) - తదితరులు శ్రద్ధ, తేజస్సు, తపోబలం, స్మృతులు, జ్ఞానముద్వారా క్రమంగా సమాధి స్థితి సాధించగలుగుతారు.
21. తీవ్రసంవేగామాసన్నః
(తీవ్ర సంవేగానాం ఆసన్నః) - తదేకదృష్టితో నిష్ఠతో సాధన చేసేవారికి సంప్రజ్ఞత త్వరితగతిని సిద్ధిస్తుంది.
22. మృదు మధ్యాధిమాత్రత్వాత్ తతోఽపి విశేషః
(మృదు మధ్య అధిమాత్రత్వాత్ తతః అపి విశేషః) - ఆ సాధన మూడు స్థాయిలలో సాగవచ్చు – అచంచల దీక్షతో, మధ్యమస్థాయిలో, లేదా అతి సాధారణస్థాయిలో.
23. ఈశ్వర ప్రణిధానాద్వా
(ఈశ్వర ప్రణిధానాత్ వా) - ఈశ్వరునియందు తదేకనిష్ఠ నిలిపి ధ్యానించడం ద్వారా కూడా చేయవచ్చు.
24. క్లేశకర్మవిపాకాఽశాయైరపరామృష్ట పురుషవిశేష ఈశ్వరః
(క్లేశ కర్మవిపాక ఆశాయై అపరామృష్టః పురుష విశేష ఈశ్వరః) - దుఃఖము, కర్మఫలములు, పూర్వజన్మలో సంతరించుకున్న స్మృతులతాలూకు ఛాయలు – వీటి అన్నిటికీ అతీతుడయిన పరమపురుషుడే ఈశ్వరుడు.
25. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం
(తత్ర నిర్ అతిశయం సర్వజ్ఞ బీజమ్) - ఆ పరమపురుషునిలో సంపూర్ణ జ్ఞానబీజము ప్రతిష్ఠమై ఉన్నది.
26. పూర్వేషమపి గురుః కాలేనానవచ్ఛేదాత్
(పూర్వేషాం అపి గురుః కాలేన అనవచ్ఛేదాత్) - ఆ పరమపురుషునికి ఏ ఒక్క కాలానికి చెందనివాడు. అంటే పరంపరానుగతంగా వస్తున్న గురువులందరికీ కూడా ఆయనే గురువు.
27. తస్య వాచకః ప్రణవః
- ఓంకారము ఈశ్వరునికి సంజ్ఞాపూర్వకమైన శబ్దము.
28. తజ్జపస్తదర్థభావనమ్.
(తత్ జపః తత్ అర్థ భావనమ్) ఈశ్వరభావమునందు దృష్టి నిలిపి ఆ ఓంకారమును సదా జపించాలి.
29. తతః ప్రత్యక్చేతనాధిగమోఽప్యంతరాయాభావశ్చ
(తతః ప్రత్యక్ చేతన అధిగమః అపి అంతరాయ అభావః చ) - ఆ జపముద్వారా సాధకునిచేతన అంతర్ముఖమయి ఆటంకాలను అధిగమించగలదు.
30. వ్యాధి స్త్యాన సంశయ ప్రమాదాలస్య అవిరతి భ్రాంతిదర్శనాలబ్ధభూమికత్వ అనవస్థిత్వాని చిత్తవిక్షేపాస్తే అంతరాయాః
(వ్యాధి స్త్యాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతిదర్శన అలబ్ధభూమికత్వ అనవస్థిత్వాని చిత్తవిక్షేపాః తే అంతరాయాః) - వ్యాధి, తామసం (కాలయాపన), సంశయం, నిర్లక్ష్యం లేక అలసత్వం, భోగలాలసత, అవాస్తవాన్ని వాస్తవంగా భ్రమించడం, యోగసాధన ఏకోన్ముఖంగా కొనసాగించలేకపోవడం, స్థిరత్వం లోపించడం – ఇవన్నీ యోగసాధనకి ఆటంకాలు.
31. దుఃఖ దౌర్మనస్యాంగమేజయత్వశ్వాసప్రశ్వాసా విక్షేప సహభువః
( దుఃఖ దౌర్మనస్య అంగమేజయత్వ శ్వాస ప్రశ్వాసాః విక్షేపసహ భువః) - దుఃఖము, నిస్పృహ (నిరాశ), శరీరంలో వణుకు, క్రమబద్ధం కాని ఉచ్ఛ్వాసనిశ్వాసాలు – ఇవి మనసుని నిలకడ లేకుండా చేస్తాయి.
32. తత్ప్రతిషేధార్థం ఏకతత్త్వాభ్యాసః
(తత్ ప్రతిషేధ అర్థం ఏక తత్త్వ అభ్యాసః) వీటిని అధిగమించి ధ్యానం కొనసాగించడానికి సాధకుడు ఒక పద్ధతిని ఎంచుకుని ఆ పద్ధతిలో దృఢచిత్తంతో సాధన కొనసాగించాలి.
33. మైత్రీ కరుణా ముదితోపేక్షాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం భావనాతః చిత్తప్రసాదనమ్.
(మైత్రీ కరుణా ముదిత ఉపేక్షాణాం సుఖ దుఃఖ పుణ్య అపుణ్య విషయాణాం భావనాతః చిత్త ప్రసాదనమ్) - సుఖదుఃఖాలు, పాపపుణ్యాలవిషయంలో ఉదాసీనతతోనూ, స్నేహం, కరుణ, ప్రసన్నతవంటి సుగుణాలతోనూ ఉంటే చిత్తము ప్రశాంతమయి యోగసాధన సాగుతుంది.
34. ప్రచ్ఛర్దన విధారణాభ్యాం వా ప్రాణస్య
- ఉచ్ఛ్వాసనిశ్వాసాలను నియంత్రించి కూడా చిత్తమును అదుపులో ఉంచుకొనవచ్చు.
35. విషయవతీ వా ప్రవృత్తిరుత్పన్నా మనసః స్థితినిబంధినీ
(విషయవతీ వా ప్రవృత్తిః ఉత్పన్నా మనసః స్థితినిబంధినీ) - ఇంద్రియాలద్వారా పొందే అనుభవాలలో ఒకదానిపై చిత్తము స్థిరంగా నిలపడంద్వారా కూడా అన్య విషయాలనుండి దృష్టి మరలి చిత్తము స్థిరము కాగలదు.
36. విశోకా వా జ్యోతిష్మతీ
- దుఃఖానికి అతీతమైన అంతర్జ్యోతిమీద దృష్టి నిలపడానికి ప్రయత్నించడం మరో పద్ధతి.
37. వీతరాగ విషయం వా చిత్తమ్
- మమతానురాగములను వదులుకోడంద్వారా కూడా స్థిరచిత్తము కలుగుతుంది.
38. స్వప్న నిద్రా జ్ఞానాఽలంబనం వా
(స్వప్న నిద్రా జ్ఞాన ఆలంబనమ్ వా) - స్వప్నములు లేని గాఢనిద్రద్వారా లేదా నిద్రలో వచ్చిన కలలను విశ్లేషించుకోవడంద్వారా కూడా చిత్తశాంతిని పొందవచ్చు.
39. యథాఽభిమత ధ్యానాద్వా
(యథా అభిమత ధ్యానాత్ వా) - ఎవరికి వారు తమకి అనుకూలమైన పద్ధతిలో చిత్తమును దృఢపరుచుకొనవచ్చు.
40. పరమాణు పరమ మహత్వాంతఽస్య వశీకారః
(పరమ అణు పరమ మహత్వ అంతః అస్య వశీకారః) - ఆ అభ్యాసమువలన సాధకునికి అణువునించి బ్రహ్మాండంవరకూ సమస్తమూ స్వాధీనము కాగలదు. అంటే చిత్తవృత్తుల ప్రభావమునుండి తప్పుకుని, సాధన కొనసాగించగలడు.
41. క్షీణవృత్తేరభిజాతస్యేవ మణేః గృహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్థ్స తదఞ్జనతా సమాపత్తిః
(క్షీణ వృత్తేః అభిజాతస్య ఇవ మణేః గృహీతృ గ్రహణ గ్రాహ్యేషు తత్థ్స తత్ అఞ్జనతా సమాపత్తిః) - అవాంతరములయిన చిత్తవృత్తులు పరిహరించినతరువాత – గ్రహించినవాడు, గ్రహణశక్తి, ఆ గ్రహణానికి కేంద్రమైన వస్తువు – ఈ మూడు అంశాలను సమస్థితిలో దర్శించగలుగుతాడు. స్వచ్ఛమైన మణిపూస ఏ వస్తువుమీద ఉంచితే ఆ వస్తువు రంగును ప్రతిఫలించినట్టు సాధకుడి చిత్తము పరమాత్మస్వరూపాన్ని గ్రహించడానికి సిద్ధముగా ఉంటుంది.
42. తత్ర శబ్దార్థ జ్ఞానవికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః
(తత్ర శబ్ద అర్థ జ్ఞాన వికల్పైః సంకీర్ణా సవితర్కా సమాపత్తిః) - సమాపత్తి అంటే శబ్దము, అర్థము, వస్తువు – ఈ మూడింటిని గూర్చి తర్కించుకొను సమయంలో గల మానసిక స్థితి.
43. స్మృతిపరిశుద్ధౌ స్వరూపశూన్యేవ అర్థమాత్రనిర్భాసా నిర్వితర్కా
(స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యా ఇవ అర్థమాత్ర నిర్భాసా నిర్వితర్కా) - సాధనద్వారా చిత్తము పరిశుద్ధమైన అనంతరం వస్తురూపం, అర్థం, శబ్దాలకు సంబంధించిన తర్కం కూడా ముగుస్తుంది.
44. ఏతయైవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మవిషయా వ్యాఖ్యాతా
(ఏతయా ఏవ సవిచారా నిర్విచారా చ సూక్ష్మవిషయా వ్యాఖ్యాతా) ఇంతవరకూ పై సూత్రాలద్వారా సవిచార సమాధి, నిర్విచార సమాధి, తద్వారా సూక్ష్మవిషయానికి సంబంధించిన జ్ఞాన సముపార్జన వివరించడం జరిగింది.
45. సూక్ష్మవిషయత్వం చ అలింగపర్యవసానం.
ఆ సూక్ష్మవిషయంగురించిన అవగాహనద్వారా ఆ సూక్ష్మవిషయానికి మించిన రూపము లేని ఉత్కృష్ట పరమపురుషుడు ధ్యేయము కాగలడు.
46. తా ఏవ సబీజః సమాధిః
- ఇది బీజముతో కూడిన సమాధి. ఈ సాధనలో సాధకుడు సూక్ష్మవిషయాలను అధిగమించినా సాధకుడి చిత్తములో ఒక రూపము (బీజము) ఆలంబనముగా ఉంటుంది.
47. నిర్విచార వైశారద్యే అధ్యాత్మప్రసాదః
- ఈ నిర్విచారస్థితి పొందిన అనంతరం సాధకుడికి అధ్యాత్మికజ్ఞానం కలుగుతుంది.
48. ఋతంభరా తత్ర ప్రజ్ఞా
- సాధకుని చిత్తము పరమోత్కృష్టమైన ఋతము (సత్)తో నిండిపోతుంది.
49. శ్రుతానుమానప్రజ్ఞాభ్యాం అన్యవిషయా విశేషార్థత్వాత్
(శ్రుత అనుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయా విశేషార్థత్వాత్) - పై సాధనలవలన పొందిన బ్రహ్మానందము - అనుశ్రుతంగా అభ్యసించినది, తర్కంద్వారా గ్రహించినది, తనకు తానుగా అవగాహన చేసుకొన్నది – స్థిరమైనదీ, సమతౌల్యము సాధించినదీ అవుతుంది.
50. తజ్జ సంస్కారోఽన్యసంస్కార ప్రతిబంధీ
(తత్ జః సంస్కారః అన్య సంస్కార ప్రతిబంధీ) - ఆ తరవాత పొందిన ఆత్మజ్ఞానము సాధకునికి గల పూర్వ ప్రవృత్తులను, స్మృతులను నిరోధిస్తుంది. అయితే ఇప్పుడు కూడా సాధకునికి తానొక జ్ఞానమును పొందేను అన్న స్పృహ అంతర్గతంగా ఉంటుంది.
51. తస్యాపి నిరోధే సర్వన్నిరోధాన్నిర్బీజస్సమాధిః
(తస్య అపి నిరోధే సర్వనిరోధాన్నిర్బీజః సమాధిః) ఆ జ్ఞానమును నిరోధించినతరవాత పొందిన స్థితి నిర్బీజసమాధి.
పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (సమాధి పాదము) సాధన పాదము →
జ్ఞానము. :
మూస:పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము.
 .
← సమాధి పాదము పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (సాధన పాదము) విభూతి పాదము →
ఈ అభ్యాసాలను ఆచరించడంద్వారా ఇంద్రియములను సంపూర్ణంగా జయించగలడు. :
1. తపస్స్వాధ్యాయేశ్వరప్రణిధానాని క్రియాయోగః
(తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాని క్రియాయోగః) - యోగసాధన మూడు భాగాలు. అవి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరునియందు మనస్సును లగ్నము చేయడం.
2. సమాధిభావనార్థః క్లేశతనుకరణార్థశ్చ
(సమాధి భావన అర్థః క్లేశ తను కరణ అర్థః చ) - ఈ క్రియాయోగం ఆచరించడం క్లేశములను నశింపజేసి సమాధిస్థితి పొందడానికి.
3. అవిద్యాఽస్మితారాగద్వేషాభినివేశాః పంచక్లేశాః
(అవిద్యా అస్మితా రాగ ద్వేష అభినివేశాః పంచ క్లేశాః) - క్లేశములు ఐదు. అవి అజ్ఞానం, అస్మిత (అహమిక), రాగము, ద్వేషము, అభినివేశము (జీవితేచ్ఛ, మరణభయం).
4. అవిద్యాక్షేత్రముత్తరేషాం ప్రసుప్తతనువిచ్ఛిన్నోదారాణామ్
(అవిద్యా క్షేత్రమ్ ఉత్తరేషాం ప్రసుప్త తను విచ్ఛిన్న ఉదారాణామ్) - అవిద్య మిగతా నాలుగు క్లేశములకు హేతువు. క్లేశములు అంతర్లీనమయి ఉంటాయి. లేదా క్షీణిస్తూనో వృద్ధి పొందుతూనో ఉంటాయి.
5. అనిత్యాశుచి దుఃఖానాత్మసు నిత్యశుచీ సుఖాఽత్మ ఖ్యాతిరవిద్యా
(అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచీ సుఖ ఆత్మ ఖ్యాతిః అవిద్యా) - అనిత్యమైనదానిని నిత్యము అనీ, అశుద్ధమైనదానిని పరిశుద్ధమైనది అనీ, దుఃఖమును సుఖమనీ భ్రమించడమే అవిద్య.
6. దృగ్దర్శనశక్త్యోరేకాత్మతేవాస్మితా
(దృక్ దర్శన శక్త్యోః ఏక ఆత్మతా ఇవ అస్మితా) - దృక్కుని (సాధారణ బుద్ధిని) దర్శనశక్తిగా గుర్తించడం అస్మిత.
7. సుఖానుశయీ రాగః
(సుఖ అనుశయీ రాగః) - మమత్వము సుఖమును కలిగిస్తుంది.
8. దుఃఖానుశయీ ద్వేషః
(దుఃఖ అనుశయీ ద్వేషః) - ద్వేషము దుఃఖమును కలిగిస్తుంది.
9. స్వరసవాహీ విదుషోఽపి తథాఽఽరూఢోఽభినివేశః
(స్వరసవాహీ విదుషః అపి తథా ఆరూఢః అభినివేశః) - పండితులలో సైతం జీవితేచ్ఛ, మరణభయం అజ్ఞానమువల్లనే అభివృద్ధి చెందుతాయి.
10. తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః
(తే ప్రతి ప్రసవ హేయాః సూక్ష్మాః) - ఈ విషయముల (రాగద్వేషాలు, అహం, అభినివేశం) మూలములను గుర్తించి, వాటిని ప్రతిఘటించి నివర్తింపచేయాలి.
11. ధ్యానహేయాస్తద్వృత్తయః
(ధ్యాన హేయాః తత్ వృత్తయః) - క్లేశములను ధ్యానముతో నివర్తింపచేయాలి.
12. క్లేశమూలః కర్మాశయో దృష్టాదృష్టజన్మవేదనీయాః
(క్లేశ మూలః కర్మ ఆశయః దృష్ట అదృష్ట జన్మ వేదనీయాః) - క్లేశములు (రాగద్వేషాలు, అభినివేశము) ప్రస్తుత జన్మలోనూ భావి జన్మలలోనూ కర్మలవలన కలుగుతాయి. కర్మలకు మూలము అస్మిత. క్లేశములవలన కర్మలూ, కర్మలవలన క్లేశములు పునరావృతము అవుతూ మళ్ళీ మళ్లీ జన్మించడానికి కారణం అవుతాయి.
13. సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః
(సతి మూలే తత్ విపాకః జాతి ఆయుః భోగాః) - ఒక జన్మలో జీవి చేసిన కర్మలయొక్క ఫలములను అనుసరించి మరుజన్మలో జాతి, ఆయుష్షు, ఇతర భోగములు కలుగుతాయి.
14. తే హ్లాదపరితాపఫలాః పుణ్యాపుణ్య హేతుత్వాత్
(తే హ్లాద పరితాప ఫలాః పుణ్య అపుణ్య హేతుత్వాత్) - ఒక జన్మలో చేసిన పుణ్యపాపాలను అనుసరించి మరుజన్మలో సుఖదుఃఖాలు అనుభవము అవుతాయి.
15. పరిణామతాపసంస్కారదుఃఖైర్గుణవృత్తివిరోధాచ్చ దుఃఖమేవ సర్వం వివేకినః
(పరిణామ తాప సంస్కార దుఃఖైః గుణ వృత్తి విరోధాత్ చ దుఃఖమ్ ఏవ సర్వమ్ వివేకినః) - అనవరతమూ మారే పరిస్థితులు, భౌతిక సుఖాలు, సాత్త్విక తామస రాజస గుణాలు – వీటివలన కలిగే పరస్పర విరుద్ధ అనుభవాలూ - అన్నిటినీ వివేకవంతుడు దుఃఖభాజనముగా పరిగణిస్తాడు.
16. హేయమ్ దుఃఖమనాగతమ్ .
(హేయమ్ దుఃఖమ్ అనాగతమ్) - భావి జన్మలలో కలగనున్న దుఃఖములను ప్రస్తుత జన్మలో ఉపసంహరించుకోవాలి.
17. ద్రష్టృదృశ్యయోః సంయోగో హేయహేతుః
(ద్రష్టృ దృశ్యయోః సంయోగః హేయ హేతుః) - ద్రష్ట (చూచేవాడు) తనకీ దృశ్యమునకూ (దృశ్యమాన ప్రపంచం) మధ్య విభేదము లేదన్న భావన ఉపసంహరించవలసి ఉంది.
18. ప్రకాశక్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యమ్.
(ప్రకాశ క్రియా స్థితిశీలం భూత ఇంద్రియాత్మకం భోగ అపవర్గార్థం దృశ్యమ్) - దృశ్యముయొక్క గుణములు కాంతి, ఆచరణ (క్రియాశీలత), స్థిరత్వము. సాధకుడు ఇంద్రియములద్వారా కలిగిన అనుభవాలను గుర్తించి, వాటినుండి తన దృష్టిని యోగసాధనవైపు మళ్ళించడమే దృశ్యముయొక్క ప్రయోజనము.
19. విశేషావిశేష లింగమాత్రాలింగాని గుణపర్వాణి
(విశేష అవిశేష లింగమాత్ర అలింగాని గుణ పర్వాణి) - ఈ గుణాలు నాలుగు విధాలుగా చెప్పుకోవచ్చు – ప్రత్యేకత కలిగినవి, సాధారణమైనవి, సూచనప్రాయమైనవి, సూచనప్రాయంగానైనా ఏమీ చెప్పనివి.
20. ద్రష్టా దృశిమాత్రః శుద్ధోఽపి ప్రత్యయానుపశ్యః
(ద్రష్టా దృశి మాత్రః శుద్ధః అపి ప్రత్యయ అనుపశ్యః) ద్రష్ట (ఆత్మ) స్వతస్సిద్ధంగా పరిశుద్ధము అయినా దృశ్యమును ఇంద్రియాలద్వారా చూడడం జరుగుతుంది.
21. తదర్థ ఏవ దృశ్యస్యాత్మా
(తత్ అర్థః ఏవ దృశ్యస్య ఆత్మా) - ద్రష్ట ఏర్పడినది దృశ్యముయొక్క అనుభవంకోసం మాత్రమే.
22. కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్
(కృత అర్థం ప్రతి నష్టమ్ అపి అనష్టమ్ తత్ అన్య సాధారణత్వాత్) - అది గ్రహించినవారికి దృశ్యము కనిపించకుండా పోతుంది. కానీ ఆ అవగాహన లేనివారికి మాత్రం ఆ దృశ్యం కనిపిస్తూనే ఉంటుంది.
23. స్వస్వామిశక్త్యోః స్వరూపలబ్ధిహేతుస్సంయోగః
(స్వ స్వామి శక్త్యోః స్వరూప ఉపలబ్ధి హేతుః సంయోగః) - ఆత్మ ప్రకృతి, దృశ్యము పురుషుడు. ప్రకృతి ధ్యేయము ఆత్మజ్ఞానం. పురుషుని ధ్యేయం సంయోగముద్వారా ఆ రెంటి స్వరూపాలను తెలివిడి చేయడం.
24. తస్య హేతురవిద్యా
(తస్య హేతుః అవిద్యా) - ప్రకృతి పురుషుల సంయోగానికి కారణం అవిద్య.
25. తదభావాత్ సంయోగాభావో హానం తద్దృశేః కైవల్యమ్
(తత్ అభావాత్ సంయోగ అభావః హానమ్ తత్ దృశేః కైవల్యమ్) - అవిద్య నశించినతరవాత సంయోగం అంతమవుతుంది. అదే విముక్తి. దృశ్యమాన ప్రపంచంనుండి విడివడగలగడమే కైవల్యము. (నాల్గవ అధ్యాయములో విపులముగా వివరించబడింది).
26. వివేకఖ్యాతిరవిప్లవా హానోపాయః
(వివేక ఖ్యాతిః అతిః అవిప్లవా హాన ఉపాయః) - అవిద్యను తొలగించగల సాధనము విచారణ. దానిని నిరవధికంగా స్పష్టంగా నిర్దుష్టంగా కొనసాగించాలి.
27. తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రజ్ఞా
- అవిద్యను నాశనము చేసి ప్రజ్ఞ సాధించడానికి ఏడు పద్ధతులు ఉన్నాయి. (ఆ ఏడు పద్ధతులు - నిత్యానిత్య వస్తు వివేకజ్ఞానం, సమస్త దుఃఖనివారణ, పరిపూర్ణజ్ఞానప్రాప్తి, కర్తవ్య త్యాగబుద్ధి, స్వాతంత్ర్యం, చిత్తస్వాధీనం, నిరాశ్రయమైన జ్ఞానం.)
28. యోగాంగానుష్ఠానాదశుద్ధిక్షయే జ్ఞానదీప్తిరవివేకఖ్యాతేః
(యోగ అంగ అనుష్ఠానాత్ అశుద్ధి క్షయే జ్ఞాన దీప్తిః అవివేక ఖ్యాతేః) - యోగాంగములు అనుష్ఠించడంవల్ల అవిద్య నశించి జ్ఞానదీపం ప్రకాశిస్తుంది.
29. యమనియమాఽసనప్రాణాయామప్రత్యాహారధారణధ్యానసమాధయోఽష్టావంగాని
(యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయః అష్టౌ అంగాని) - యోగసాధనలో ఎనిమిది అంగములు ఉన్నాయి. అవి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, నిశ్చల ధ్యానము, అనవరత ధ్యానము, సమాధి.
30. అహింసాసత్యమస్తేయబ్రహ్మచర్యాపరిగ్రహా యమాః
(అహింసా సత్యమ్ అస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహా యమాః) - యమములు ఐదు. అవి అహింస, సత్యము, చోరబుద్ధి లేకుండుట, బ్రహ్మచర్యం, పరుల సొమ్ము స్వీకరించకుండుట.
31. జాతిదేశకాలసమయానవచ్ఛిన్నాః సార్వభౌమా మహావ్రతమ్
(జాతి దేశ కాల సమయ అనవచ్ఛిన్నాః సార్వభౌమః మహా వ్రతమ్) - కులం, స్థలం, కాలం, పరిస్థితులవల్ల కలిగే అవధులను లెక్క చేయకుండా నియమాలను ఆచరించడమే మహా వ్రతము.
32. శౌచసంతోషతపః స్వాధ్యాయేశ్వరప్రణిధానాని నియమాః
(శౌచ సంతోష తపః స్వాధ్యాయ ఈశ్వరప్రణిధానాని నియమాః) - నియమములు ఐదు. అవి పరిశుభ్రత (మనస్సు, శరీరము), ఆనందము, తపస్సు, స్వాధ్యాయము, భగవంతునియందు చిత్తము లగ్నము చేయడం.
33. వితర్కబాధనే ప్రతిపక్షభావనమ్
(వితర్క బాధనే ప్రతి పక్ష భావనమ్) - బాధించే తలపులను వాటికి వ్యతిరేకమైన భావాలతో తొలగించుకోవాలి.
34. వితర్కా హింసాదయః కృతకారితానుమోదితా లోభక్రోధమోహపూర్వకా
మృదుమధ్యాధిమాత్రాదుఃఖాజ్ఞానానంతఫలా ఇతి ప్రతిపక్షభావనమ్.
(వితర్కా హింస ఆదయః కృత కారిత అనుమోదితః లోభ క్రోధ మోహ పూర్వకః మృదు మధ్య అధిమాత్రః దుఃఖ అజ్ఞాన అనంత ఫల ఇతి ప్రతిపక్ష భావనమ్) - యోగసాధనకి ప్రతిబంధకమైన హింసవంటి చర్యలు – స్వయంకృతం గానీ ఇతరుల చర్యలవల్ల గానీ సంభవిస్తాయి. కోపము, లోభము లేదా మోహము ఇత్యాదులవల్ల కలుగవచ్చు. అవి ఏ స్థాయిలోనైనా - మహోధృతంగానో, ఓ మోస్తరుగానో, సాధారణస్థాయిలో -సాధకునిచర్యగా పరిణమించవచ్చు. అందుచేత ఆ యా ప్రవృత్తులను వాటికి తగిన వ్యతిరేక భావనలతో అరికట్టాలి.
35. అహింసాప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః
(అహింస అప్రతిష్ఠాయాం తత్ సన్నిధౌ వైర త్యాగః) అహింసాప్రవృత్తిని గట్టి పట్టుదలతో నిలకడగా పాటించినవాని సమీపంలో వైరభావాలు నిలువవు.
36. సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్
(సత్య ప్రతిష్ఠాయాం క్రియాఫల ఆశ్రయత్వమ్) నిత్య సత్యవ్రతుని కర్మలు సత్ఫలితాలను ఇస్తాయి.
37. అస్తేయప్రతిష్ఠాయాం సర్వరత్నోపస్థానమ్.
(అస్తేయ ప్రతిష్ఠాయాం సర్వ రత్న ఉపస్థానమ్) చోరబుద్ధిని జయించినవానికి సకల సంపదలు సమకూరుతాయి.
38. బ్రహ్మచర్యప్రతిష్ఠాయాం వీర్యలాభః
(బ్రహ్మచర్య ప్రతిష్ఠాయాం వీర్య లాభః) దృఢచిత్తంతో బ్రహ్మచర్యదీక్ష పూనినవానికి శారీరక, మానసిక దారుఢ్యము కలుగుతుంది.
39. అపరిగ్రహస్థైర్యే జన్మకథంతాసంబోధః
(అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంతా సంబోధః) పరులసొమ్ము స్థిరచిత్తముతో తిరస్కరించినవాడు జన్మవృత్తాంతమునుగురించి తెలుసుకొనగలడు.
40. శౌచాత్ స్వాంగజుగుప్సా పరైరసంసర్గః
(శౌచాత్ స్వ అంగ జుగుప్సా పరైః అసంసర్గః) పరిశుభ్రతను పాటించడంవలన తన శరీరము అంటే రోత, ఇతరులతో సంపర్కము విషయంలో వైముఖ్యం సిద్ధిస్తాయి.
41. సత్త్వశుద్ధిసౌమనస్యైకాగ్ర ఇంద్రియజయాత్సమదర్శనయోగ్యత్వాని చ
(సత్త్వ శుద్ధి సౌమనస్య ఏకాగ్ర ఇంద్రియ జయాత్ సమ దర్శన యోగ్యత్వాని చ) మనసు నిర్మలముగా ఉంచుకున్న సాధకుడు సాత్వికగుణము, మంచితనము, ఏకాగ్రత, ఇంద్రియనిగ్రహము, ఆత్మదర్శనము పొందగలడు.
42. సంతోషాదనుత్తమసుఖలాభః
(సంతోషాత్ అనుత్తమ సుఖ లాభః) - నిత్య సంతుష్టునికి అత్యుత్తమైన ఆనందము సిద్ధిస్తుంది.
43. కాయేంద్రియసిద్ధిరశుద్ధిక్షయాత్తపసః
(కాయ ఇంద్రియ సిద్ధిః క్షయాత్ తపసః) - తపోనిష్ఠ శరీరాన్నీ ఇంద్రియములనూ అంటి ఉన్న మాలిన్యమును తొలగిస్తుంది.
44. స్వాధ్యాయాదిష్టదేవతా సంప్రయోగః
(స్వాధ్యాయాత్ ఇష్ట దేవతా సంప్రయోగః) - స్వాధ్యాయమువలన ఇష్టదేవతలను చేరగలుగుతాడు.
45. సమాధిసిద్ధిః ఈశ్వరప్రణిధానాత్
ఈశ్వరునియందు చిత్తము లగ్నము చేయడంవలన సమాధి సిద్ధిస్తుంది.
46. స్థిరసుఖామాసనం
(స్థిర సుఖమ్ ఆసనమ్) - స్థిరంగానూ ఇబ్బంది కాని విధంగానూ కూర్చోడం ముఖ్యం.
47. ప్రయత్నశైథిల్యానంతసమాపత్తిభ్యామ్
(ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యామ్) - అది సమాధిస్థితి చేరుకోడానికి సహాయకారి అవుతుంది.
48. తతో ద్వంద్వానభిఘాతః
(తతః ద్వంద్వ అనభిఘాతః) - ఆ పైన సుఖదుఃఖాలు, శీతోష్ణాలవంటి ద్వంద్వములు బాధించవు.
49. తస్మిన్ సతి శ్వాసప్రశ్వాసయోర్గతివిచ్ఛేదః ప్రాణాయామః
(తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోః గతి విచ్ఛేదః ప్రాణాయామః) - ఊపిరి పీల్చి ఉంచడం, వదలి ఉంచడం (పూరక, రేచక క్రియలు) యోగసాధనకు నిర్ణీతమైన పద్ధతిలో చేయడం ప్రాణాయామము.
50. బాహ్యాభ్యంతరస్తంభవృత్తిః దేశకాలసంఖ్యాభిః పరిదృష్టో దీర్ఘసూక్ష్మః
(బాహ్య అభ్యంతర స్తంభ వృత్తిః దేశ కాల సంఖ్యాభిః పరిదృష్టః దీర్ఘ సూక్ష్మః) - ఊపిరి పీల్చి ఆస్థితిలో ఉండడం (పూరక),ఊపిరి వదలి ఆ స్థితిలో ఉండడం (రేచక) రెండు పద్ధతులు. అలా ఊపిరి బిగబట్టి గానీ బయటికి వదలి గానీ ఎంతసేపు నిలపడం అన్నది సాధకుని సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అలాగే రోజుకి ఎన్నిసార్లు చేయడం అన్నది కూడా సాధకుడు నిర్ణయించుకోవాలి.
51. బాహ్యాంతరవిషయాఽక్షేపీ చతుర్థః
(బాహ్య అంతర విషయ ఆక్షేపీ చతుర్థః) - ఈ ప్రాణాయామము నాలుగు స్థాయిలలో ఉంటుంది.
52. తతః క్షీయతే ప్రకాశాఽవరణమ్
(తతః క్షీయతే ప్రకాశ ఆవరణమ్) - అది అంతర్జ్యోతిని ఆవరించిన అంధకారాన్ని నశింపచేస్తుంది.
53. ధారణాసు చ యోగ్యతా మనసః
- ఈ అష్టాంగములను ఆచరించడంద్వారా సాధకుడు పరమపురుషుని చేరడానికి తగిన యోగ్యత, సామర్ధ్యము పొందగలడు.
54. స్వవిషయాసంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవేంద్రియాణాం ప్రత్యాహారః
(స్వవిషయ అసంప్రయోగే చిత్తస్య స్వరూప అనుకారః ఇవ ఇంద్రియాణాం ప్రత్యాహరః) - ఇంద్రియప్రవృత్తులను (చూడడం, వినడం వంటివి) వాటికి లక్ష్యాలు అయిన వస్తువులనుండి నివర్తింపజేయడమే ప్రత్యాహారం.
55. తతః పరమా వశ్యతేంద్రియాణాం
(తతః పరమా వశ్యతా ఇంద్రియాణామ్) - ఈ అభ్యాసాలను ఆచరించడంద్వారా ఇంద్రియములను సంపూర్ణంగా జయించగలడు.
← సమాధి పాదము పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (సాధన పాదము) విభూతి పాదము →
ఈ అభ్యాసాలను ఆచరించడంద్వారా ఇంద్రియములను సంపూర్ణంగా జయించగలడు. :
మూస:పతంజలి యోగ సూత్రములు
.
 ← సాధన పాదము పతంజలి యోగ సూత్రములు - తెలుగు అనువాదము (విభూతి పాదము) కైవల్య పాదము →
జ్ఞానము. :
1. దేశబంధశ్చిత్తస్య ధారణా
(దేశ బంధః చిత్తస్య ధారణా) - చిత్తమును ఒకే ఒక్క స్థానములో నిశ్చలంగా ఉంచడం ధారణ.
2. తత్ర ప్రత్యయైకతానతా ధ్యానమ్
(తత్ర ప్రత్యయ ఏకతానతా ధ్యానమ్) - ధ్యానానికి కేంద్రమైన వస్తువుమీద అచంచలంగా ఏకాగ్రతతో దృష్టి నిలపడం ధ్యానము.
3. తదేవార్థమాత్రానిర్భాసమ్ స్వరూపశూన్యమివ సమాధిః
(తత్ ఏవ అర్థ మాత్రా నిర్భాసమ్ స్వరూప శూన్యమ్ ఇవ సమాధిః) - ధ్యానం సాఫల్యమైతే సాధకునికి స్థూలశరీరానికీ సమస్త ప్రపంచానికీ అతీతమైనదీ, తనలో అంతర్లీనంగా ఉన్నదీ అయిన అంతర్జ్యోతి కనిపిస్తుంది. అదే సమాధి.
4. త్రయమేకత్ర సంయమః
(త్రయమ్ ఏకత్ర సంయమః) - ఈ మూడింటినీ కలిసికట్టుగా (ధారణ, ధ్యానము, సమాధి) సంయమము అంటారు.
5. తజ్జయాత్ ప్రజ్ఞాఽఽలోకః
(తత్ జయాత్ ప్రజ్ఞా ఆలోకః) - సంయమము చేస్తే ప్రజ్ఞ కలుగుతుంది.
6. తస్య భూమిషు వినియోగః
- ఆ ప్రజ్ఞను క్రమపద్ధతిలో వినియోగించుకోవాలి.
7. త్రయమంతరంగమ్ పూర్వేభ్యః
(త్రయమ్ అంతరంగమ్ పూర్వేభ్యః) - సాధన పాదం 29వ సూత్రంలో ప్రస్తావించిన ఐదు విధాలకి (యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారము) భిన్నంగా ఈ మూడూ (ధ్యానం, ధారణ, సమాధి) అంతరంగానికి సంబంధించినవి.
8. తదపి బహిరంగమ్ నిర్బీజస్య
(తత్ అపి బహిరంగమ్ నిర్బీజస్య) - అష్టాంగాలలో యమ, నియమ మొదలైన ఐదు స్థితులకంటె సంయమం ఉత్తమమే అయినా అది ప్రాథమిక దశలో బహిరంగ సాధనగా ఉంటుంది.
9. వ్యుత్థాననిరోధసంస్కారయోరభిభవప్రాదుర్భావౌ నిరోధక్షణచిత్తాన్వయో నిరోధపరిణామః
(వ్యుత్థాన నిరోధ సంస్కారయోః అభిభవ ప్రాదుర్భావౌ నిరోధ క్షమ చిత్త అన్వయః నిరోధ పరిణామః) - ప్రారంభదశలో కింది స్థాయిలో చిత్తవృత్తులను అదుపులో ఉంచడానికి నిరోధక చిత్తవృత్తులు పుడతాయి. సాధకుడు వాటిని కూడా తొలగించుకోవాలి. ఈ చిత్తవృత్తులు పుట్టడం, వాటిని నిరోధించడం – ఈ నిరోధకపరిణామాన్ని సాధకుడు గుర్తించడం సాధనలో ఒక పరిణామదశ.
10. తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్
(తస్య ప్రశాంత వాహితా సంస్కారాత్) - ఆ సాధనతో ధ్యానం ఏకోన్ముఖంగా సాగి ఆధ్యాత్మికమైన ప్రశాంతత లభిస్తుంది సాధకునికి.
11. సర్వార్థతైకాగ్రతయోః క్షయోదయౌ చిత్తస్య సమాధి పరిణామః
(సర్వార్థతః ఏకాగ్రతయోః క్షయ ఉదయౌ చిత్తస్య సమాధి పరిణామః) - చిత్తవృత్తులు కలగడం, వాటిని నిరోధించడం, నిరోధిస్తున్నానన్న స్పృహ సాధకునికి కలగడంచేత ఇతర ఆలోచనలన్నీ తొలగి ఏకాగ్రత సాధిస్తాడు. చిత్తము సమాధిస్థితి చేరువ అవుతుంది.
12. తతః పునః శాంతోదితౌ తుల్యప్రత్యయౌ చిత్తస్యైకాగ్రతాపరిణామః
(తతః పునః శాంత ఉదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రతా పరిణామః) - ఆవిధంగా చిత్తవృత్తులు పుట్టడం గిట్టడం సమాన స్థాయిలో (హెచ్చుతగ్గులు లేకుండా) జరిగినప్పుడు ఆ స్థితికి ఏకాగ్రతా పరిణామం అని పేరు.
13. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థాపరిణామా వ్యాఖ్యాతాః
(ఏతేన భూత ఇంద్రియేషు ధర్మ లక్షణ అవస్థా పరిణామాః వ్యాఖ్యాతాః) - చిత్తము యొక్క పరిణామము వివరించినతరవాత, ఆ పరిమాణానికి ఇంద్రియముల ధర్మము (తత్వము), లక్షణములు, అవస్థలతో (పరిస్థితి) గల సంబంధాన్ని వివరిస్తున్నారు.
14. శాంతోదితావ్యపదేశ్యధర్మానుపాతీ ధర్మీ
(శాంత ఉదిత అవ్యపదేశ్య ధర్మ అనుపాతీ ధర్మీ) - ధర్మము అంతర్లీనంగానో అవ్యక్తంగానో వ్యక్తంగానో ప్రతి జీవిలోనూ ఉండడం సర్వసాధారణం.
15. క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతుః
(క్రమ అన్యత్వం పరిణామ అన్యత్వే హేతుః) - పరిణామంలో తేడాలకి కారణం పరిణామ క్రమం (చిత్తము ఒక దశనుండి మరొక దశకి పరిణమించే క్రమం)
16. పరిణామత్రయసంయమాదతీతానాగతజ్ఞానమ్
(పరిణామ త్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానమ్) - ఈ ధర్మ, లక్షణ, అవస్థలను (పరిణామత్రయం) స్వాధీనం చేసుకున్న సాధకునికి గత, భావి జన్మలగురించిన జ్ఞానం కలుగుతుంది.
17. శబ్దార్థప్రత్యాయానామితరేతరాధ్యాసాత్సంకరః
తత్ప్రవిభాగ సంయమాత్సర్వభూత రుతజ్ఞానమ్
(శబ్ద అర్థ ప్రత్యాయానామ్ ఇతర ఇతర అధ్యాసాత్ సంకరః తత్ ప్రవిభాగ సంయమాత్ సర్వ భూత రుత జ్ఞానమ్) - శబ్దం (పదము), అర్థం, వాటికి మూలమైన వస్తువు – సాధారణంగా ఒకదానితో ఒకటి కలిసిపోయి అయోమయం కలిగిస్తాయి. సంయమంతో వీటిని విడదీసి స్వాధీనం చేసుకుంటే సమస్త జీవుల భాషను అర్థం చేసుకోడం సాధ్యం.
18. సంస్కారసాక్షాత్కరణాత్పూర్వజాతిజ్ఞానమ్
(సంస్కార సాక్షాత్ కరణాత్ పూర్వ జాతి జ్ఞానమ్) - సంస్కారంమూలంగా (పైన వివరించిన మూడు స్థాయీభావాలను అర్థం చేసుకోడంవలన) పూర్వజన్మగురించిన జ్ఞానము కలుగుతుంది.
19. ప్రత్యయస్య పరచిత్తజ్ఞానమ్
(ప్రత్యయస్య పర చిత్త జ్ఞానమ్) - ఇతరచిత్తములతో సంయమంద్వారా వారి చిత్తముయొక్క స్వభావం గ్రహించగలరు.
20. న చ తత్సాలంబనమ్ తస్యావిషయీభూతత్వాత్వ్
(న చ తత్ సాలంబనమ్ తస్య అవిషయీ భూతత్వాత్) - అయితే ఆ జ్ఞానము కేవలము చిత్తస్వభావానికి సంబంధించినదే కా?

--(())__