[: 🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 14 🌴
14. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత: |
ప్రాణాపానసమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ ||
🌷. తాత్పర్యం :
ప్రాణుల దేహములందలి జఠరాగ్నిని నేను, ప్రాణాపానవాయువులతో కూడి నేను నాలుగు విధములైన ఆహారములను పచనము చేయుచున్నాను.
🌷. భాష్యము :
భుజించిన ఆహారము జీర్ణము చేయుటకు ఉదరమందు అగ్ని కలదని ఆయుర్వేదము ద్వారా మనకు అవగతమగుచున్నది. అట్టి అగ్ని తగినరీతి ప్రజ్వరిల్లినపుడు ఆకలి కలుగును. సరిగా ప్రజ్వలితము కానపుడు ఆకలి కాదు. ఆ విధముగా అగ్ని తగినరీతి ప్రజ్వలితము కానపుడు వైద్యము అవసరమగును. ఉదరమునందలి ఆ అగ్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము.
శ్రీకృష్ణభగవానుడు అగ్నిరూపమున ఉదరమునందు వసించి అన్నిరకములైన ఆహారమును పచనము చేయుచున్నాడని బృహదారాణ్యకోపనిషత్తు(5.9.1) నిర్ధారించుచున్నది (ఆయ మగ్ని: వైశ్వానరో యో(యం అంత:పురుషే యేనేద మన్నం పచ్యతే). అనగా భగవానుడు సర్వవిధ ఆహారపచనము నందు సహాయభూతుడగుచున్నందున భోజన విషయమున జీవుడు స్వతంత్రుడు కాడు. జీర్ణక్రియయందు భగవానుడు తోడ్పడనిదే జీవునకు ఆహారమును భుజింప అవకాశము కలుగదు.
ఈ విధముగా శ్రీకృష్ణుభగవానుడు ఆహారమును సృష్టించుట మరియు ఉదరమున జీర్ణము చేయుట వంటి కార్యముల నొనరించుట చేతనే, మనము జీవితమున అనుభవించగలుగుచున్నాము. ఈ విషయము వేదాంతసూత్రము నందు(1.2.27) కూడా “శబ్దాదిభ్యో(న్త: ప్రతిష్టానాచ్చ” యని స్థిరీకరింపబడినది.
అనగా శ్రీకృష్ణభగవానుడు శబ్దమునందు, దేహమునందు, వాయువు నందేగాక ఉదరమందు జీర్ణకారకశక్తి రూపమును స్థితుడై యున్నాడు. ఇక నాలుగురకముల ఆహారములనగా భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములని భావము. వీటన్నింటిని జీర్ణము చేయువాడు భగవానుడే.
🌹 🌹 🌹 🌹 🌹
🌻 73. మధుసూదనః, मधुसूदनः, Madhusūdanaḥ 🌻
ఓం మధుసూదనాయ నమః | ॐ मधुसूदनाय नमः | OM Madhusūdanāya namaḥ
మధు (నామానమసురం) సూదితవాన్ మధునామముగల అసురుని 'సూదనము' (సంహరించుట) చేసెను.
:: మహాభారతము - భీష్మ పర్వము 67.14 ::
కర్ణమిశ్రోద్భవం చాపి మధునామ మహాఽసురం । బ్రహ్మణోఽపచితిం కుర్వన్ జఘాన పురుషోత్తమ తస్య తాత । వధా దేవ దేవదానవమానవాః । మధుసూదన ఇత్యాహు రృషయశ్చ జనార్ధనమ్ ॥ 16 ॥
పురుషోత్తముడు బ్రహ్మను ఆదరించుచు (బ్రహ్మ ప్రార్థనచే) తన కర్ణములనుండి ఉద్భవిల్లిన మధువను మహా సురుని చంపెను. నాయనా! అతనిని వధించుటవలననే దేవదానవ మానవులును ఋషులును ఈ జనార్ధనుని 'మధుసూదన' అందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Source Sloka
ईशानः प्राणदः प्राणो ज्येष्ठश्श्रेष्ठः प्रजापतिः ।हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ॥ ८ ॥
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠశ్శ్రేష్ఠః ప్రజాపతిః ।హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౮ ॥
Īśānaḥ prāṇadaḥ prāṇo jyeṣṭhaśśreṣṭhaḥ prajāpatiḥ ।Hiraṇyagarbho bhūgarbho mādhavo madhusūdanaḥ ॥ 8 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 74 / Vishnu Sahasranama Contemplation - 74 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 74. ఈశ్వరః, ईश्वरः, Īśvaraḥ 🌻
ఓం ఈశ్వరాయ నమః | ॐ ईश्वराय नमः | OM Īśvarāya namaḥ
సర్వశక్తిమాన్ సర్వశక్తి (అనంతశక్తి) కలవాడు.
:: శ్వేతాశ్వతరోపనిషత్ - షష్ఠోఽధ్యాయః ::
త మీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం ।
పతిం పతీనాం పరమం పరస్త ద్విదామ దేవం భువనేశ మీడ్యమ్ ॥ 7 ॥
ఈశ్వరుని వైవస్వత యమునికంటే గొప్పవానిగను, దేవేంద్రాది దేవతలకంటే శ్రేష్ఠునిగను, ప్రజాపతులందరికంటే శ్రేష్ఠ ప్రజాపతిగను, అక్షర స్వరూపుని కంటే పరునిగను, జ్యోతిస్వరూపునిగను, లోకేశ్వరునిగను, స్తుతింపదగిన వానిగను తెలిసికొన్నామని విద్వాంసులు స్వానుభవముతో చెప్పిరి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:02, 27/10/2020] +91 98494 71690: 🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 17 / Sri Devi Mahatyam - Durga Saptasati - 17 🌹
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 5
🌻. దేవీ దూతసంవాదం - 2 🌻
17-19. సర్వభూతాలలో చేతనా (తెలివి) స్వరూప అయి నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
20–22. సర్వభూతాలలో బుద్ధిస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
23-25. సర్వభూతాలలో నిద్రాస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
26-28. సర్వభూతాలలో క్షుధా (ఆకలి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
29-31. సర్వభూతాలలో ఛాయా (ప్రతిబింబం) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
32–34. సర్వభూతాలలో శక్తిస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
35-37. సర్వభూతాలలో తృష్ణా (దప్పిక) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
38–40. సర్వభూతాలలో క్షాంతి (ఓర్పు) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
41–43. సర్వభూతాలలో జాతి స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
44–46. సర్వభూతాలలో ల (వినమ్రత) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
47–49. సర్వభూతాలలో శాంతిస్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
50–52. సర్వభూతాలలో శ్రద్ధా (ఆసక్తి) స్వరూపయై నిలిచి ఉండే దేవికి పదే పదే నమస్కారాలు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 86 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -16 🌻
ఒక కమ్మరివాని దగ్గరకు వెళ్ళినప్పుడు, ఎలా వుందట? అక్కడ ఒక పెద్ద దాగలి ఉంటుంది. దాగలి అంటే ఆధారముగా పెట్టినటువంటి ఒక ఇనుప ముద్ద. దాని మీద అనేక వస్తువులు తయారౌతూ ఉంటాయి. కానీ, దాగలిలో ఏ మార్పు ఉండదు. దాగలిలో ఏ పరిణామము ఉండదు. దాగలిలో ఏరకమైనటువంటి సంపర్కము ఉండదు. అది ఎప్పుడూ విలక్షణమే.
అంటే, కూటస్థుడు సర్వ సృష్టి యందు అనేక పరిణామములు జరుగుతున్నట్లు కనబడుతున్నప్పటికీ, సర్వ వ్యాపకుడై, సర్వ విలక్షణుడై, సర్వ సాక్షియై ఉన్నందువలన, తాను ఎట్టి పరిణామమును పొందుట లేదు. అట్టి కూటస్థ ప్రతిబింబము అయినటువంటి జ్ఞాత పిండాండము నందు స్వయం కూటస్థ స్వరూపుడైనటువంటి జ్ఞాత పిండాండము నందు, అదే లక్షణములతో, సర్వ విలక్షణముగా, సర్వ సాక్షిగా ఉన్నందువలన, నేను అనునది ఎట్టి పరిణామమును పొందుట లేదు. ఎట్టి కర్మలను చేయడం లేదు.
కానీ ఈ జ్ఞాత, ఆ కూటస్థుడు, పిండాండ సాక్షి అయినటువంటి జ్ఞాత, బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థుడు, ఇరువురు లక్షణరీత్యా సమములు. కాబట్టి, అలా గుర్తెరిగినటువంటి వారు, ఎవరైతే ఉంటారో, వారు బ్రహ్మజ్ఞానులు. వారు బ్రహ్మనిష్ఠులు. వారు బ్రహ్మానుసంధాన పరులు. వారు బ్రహ్మవిదులు. వారు ఆ రకముగా సమస్తమైనటువంటి సృష్టిని కూడా ‘తాను బ్రహ్మమే’ అనే రీతిగా చూచేటటువంటి వారు. ఈ రకముగా ఆత్మను, బ్రహ్మమును ప్రతిపాదిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు.
ఉదాహరణ: కొందరు ఊరేగింపుగా వెళ్ళుచున్నారు, అందులో కొందరు గొడుగులు వైసుకొన్న వారును, కొందరు వేసుకొనని వారును యున్నారు. అయినప్పటికీ గొడుగులు లేని వారును కూడా కలిపి, గొడుగుల ఊరేగింపు వెళ్ళుచున్నదని చెప్పుచున్నాము. అటులనే కర్మఫలము ననుభవించునది జీవాత్మయే అయినప్పటికి సర్వవ్యాపకుడైన పరమాత్మ అంతటా నిండియున్నప్పటికి, పరమాత్మను పొందుటకు శ్రేష్టమైన స్థానము ఈ శరీరములోని హృదయకాశమనబడు బుద్ధి గుహయని చెప్పబడినది.
దీనినే ఛత్రి న్యాయము అంటారు. ఈ ఛత్రీ న్యాయాన్ని ఉపమానంగా ఇక్కడ ఇచ్చారు అన్నమాట. అంటే అర్థం ఏమిటి? మనం రోడ్డుమీద నిలబడి చూస్తున్నాము, అక్కడ ఒక ఊరేగింపు వెళ్తోందట. ఏ ఊరేగింపు అంటే, గొడుగుల ఊరేగింపు వెళ్తోందట. అంటే, అనేక మంది ప్రజలు ఊరేగింపుగా రోడ్డు మీద వెళ్తున్నారు.
వెళ్ళే వాళ్ళల్లో ఎక్కువ భాగం మంది ఆ గొడుగులను వేసుకుని వెళ్తున్నారు. కొంతమంది గొడుగులు వేసుకోకుండా కూడా వెళ్తున్నారు. కానీ ఎక్కువ భాగం మంది గొడుగులు వేసుకుని వెళ్తూ వుండడం కనబడినందువలన, కనపడినటువంటిదే సత్యముగా భావించి, అర్థప్రమాణమును స్వీకరించి, మిగిలిన గొడుగులు వేసుకోనివారిని ప్రధానంగా స్వీకరించక, గొడుగుల ఊరేగింపు జరుగుతున్నది అని స్టేట్మెంట్ [Statement] ఇచ్చారు అని ప్రకటించారు.
ఆ రకంగానే జీవాత్మ, పరమాత్మ ఒకే స్థానంలో ఉన్నప్పటికీ, ప్రధానంగా 90 శాతం మంది జీవులందరూ కూడా కర్మఫలమును ఆశ్రయంగా స్వీకరించి, కర్మచక్రములో పరిభ్రమిస్తూ, తాను కర్మఫల సంగి గా ఉండడం చేత, సుఖభోక్తగా ఉండడం చేత, ఆ సుఖ పిపాసగా ఉండడం చేత, జీవాత్మ కర్మఫలం అనేటటువంటి చక్రంలో తిరిగిపోతూ ఉన్నది.
అట్లా వెళ్తున్నవారినందరినీ జీవులు అంటే, అదే స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రాసంగికమును విస్మరించినట్లు అవుతుంది కాబట్టి. కానీ ఇది సరియైన విధానం కాదు. యథార్థమునకు జీవులే ప్రధానం అని అనుకోవడం తప్పుకదా! సర్వసాక్షి అయినటువంటి పరమాత్మను ప్రధానంగా స్వీకరించినట్లయితే, వాళ్ళు ఆ బుద్ధిగుహ యందు అట్టి పరమాత్మని పొందగలుగుతున్నారు.
బుద్ధిగుహ అనే హృదయస్థానంలో ఉన్నటువంటి, జీవుడు తాను లేనివాడినని గ్రహించి, తాను ప్రతిబింబమని గ్రహించి, తాను నీడవంటి వాడినని గ్రహించి, తన స్వరూప జ్ఞానమైనటువంటి పరమాత్మ స్థానము వైపుకు తిరిగి చూసిన్నట్లైతే తనను తానే పొందుచున్నాడు. తనను తానే గుర్తించుచున్నాడు. తనను తానే అనుభూతమొనర్చుకొనుచున్నాడు.
కాబట్టి, ఈ రకమైనటువంటి ఆంతరిక సాధనను, అంతర్ముఖ ప్రయాణాన్ని మానవులందరూ తప్పక పూర్తి చేయాలి. ఈ బుద్ధి గుహ అనేటటుంవటి హృదయాకాశ స్థానమును తప్పక పొందాలి. గుర్తించాలి. ఆ గుర్తించడం పేరే నిర్వాణ సుఖము. ‘నిర్వాణం’ అనేది ఇదన్నమాట. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 90 / Sri Gajanan Maharaj Life History - 90 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 18వ అధ్యాయము - 4 🌻
ఆరోజు ఆషాఢ శుద్ధ నవమి. వేలకొలది వార్ కార్లు(క్రమంగా దర్శించేవారు పండరపూరు చేరడం ప్రారంభించారు. ఆకాశం మేఘావృతమయి చిన్నగా వానపడుతోంది. పండరపూరు మానవ సముద్రంలా ఉండి, భూమిమీద వైకుంఠంలా కనిపించింది. ప్రదక్షిణకొరకు ఉన్న మందిర ప్రాంగణం అంతా జైజై రామకృష్ణహరి అనే భజనచేస్తున్న భక్తులతో నిండిపోయింది. వాతావరణం అంతా సంతోషంతో నిండిఉంది.
నాధ్, నివృత్తి, ధ్యనేశ్వర్, సవతా, గోరాకుంభర్, శ్రీతుకోబా దేహకర్, సోపాన, ముక్తాబాయి, జనార్ధన్ వంటి యోగుల పల్లకిలు పండరపూరు చేరాయి. భక్తులు వీరికి అభివాదంగా బుక్కా గాలిలో చల్లారు. దీనితో ఆకాశం అంతా బుక్కాతో నిండి దీనిసుగంధం చుట్టూ వ్యాపించింది. పువ్వులూ, తులసి దళాలుకూడా ప్రజలు పల్లకిమీద వేసారు. అటువంటి వాతావరణంలో శ్రీమహారాజు పండరపూరు చేరి, ప్రదక్షిణకు వెళ్ళేదారిలో ఉన్న కుకాజీపాటిల్ ఇంటిలో బసచేసారు. చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు. వీళ్ళని అదుపులో పెట్టేందుకు డజనులకొలది పోలీసులు అక్కడ హాజరు అయి ఉన్నారు.
నిస్సహాయంగా..ఓ విఠలా ఏకాదశి రోజున బాపునా తప్ప మిగిలిన షేగాం ప్రజలు హరిపాటిల్తో కలిసి మందిరానికి వెళ్ళారు. బాపునా స్నానంకోసం వెళ్ళడంతో వెనక వదలబడ్డాడు. స్నానంనుండి తిరిగివచ్చిన అతనికి అందరూ అప్పటికే మందిరానికి వెళ్ళిపోయినట్టు తెలిసింది. అతను కూడా త్వరగ వాళ్ళని అనుసరించేందుకు చూసాడు, కానీ మందిరం చుట్టూ చాలామంది ఉండడంతో పాపం బాపూనాకు ఎటువైపునుండి లోపలికి వెళ్ళడానికి దారిదొరకలేదు.
నిస్సహాయంగా...ఓ విఠలా, ఋషీకేశా నాతో ఇంత అసంతృప్తి ఎందుకు చెందావు. మీదర్శనంనాకు ఎందుకు ఇవ్వడంలేదు ? మీరు సవతామాలికి దర్శనం ఇవ్వడానికి అరణ్ వెళ్ళారు, అలానే ఓ పాండురంగా నన్ను కలవడానికి మందిరం నుండి రండి. అరణ్ అయితే 16 మైళ్ళు దూరంలో ఉంది, కానినేను ఇప్పుడు మీమందిరం దగ్గరలో ఉన్నాను. మిమ్మల్ని ప్రజలు నిస్సహాయులకు సహాయుడవు అని పిలుస్తారు, మరి నన్ను ఎందుకు విస్మరిస్తున్నారు అని మనసులోనే బాపునా ప్రార్ధించాడు. అలా ప్రార్ధించి, ప్రార్ధించి చివరికి నిరాశతో సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చాడు.
రోజంతా కూడా ఏమీ ఆహారం తీసుకోలేదు, పైగా ఈనిరాశ ఇంకా అతనిని పేలగాచేసి కృంగదీసింది. వెళ్ళారు, అలానే ఓరలో ఉన్నాను. మిమ్మలి. అలా ప్రార్ధించి, ప్రాక్టీగాచేసి కృంగదీసింది. విఠలభగవానుని కలవాలన్న ఆయనకోరిక అంతతీవ్రమయినది. దానితో అతనిమనసు నిరంతరంగా మందిరం చుట్టూ తిరుగుతోంది. అందరూ బాపునాను చూసి అత్యంత దురదృష్టవంతుడవని నవ్వడం మొదలు పెట్టారు.
పండరపూరు వచ్చి, మందిరానికి వెళ్ళేబదులు దుకాణాలు దర్శిస్తూ తిరిగి ఉంటాడు అనిఅన్నారు. కొంతమంది అతను దురదృష్టవంతుడు, కపటి అనిఅన్నారు. మరికొంతమంది బాపూనాకు వేదాంతం అంతా తెలుసు కావున అతనికి మందిరానికి వెళ్ళవలసిన అవసరంలేదని వెక్కిరించారు. వేదాంతులు భగవంతుడు తమ మనసులోనే ఉన్నాడు, ఆరాళ్ళలో కాదు అని నమ్ముతారు, మూర్ఖులు మాత్రమే మందిరానికి వెళతారు, బాపునా పండరపూరు వచ్చేబదులు విఠోబాను షేగాం పిలిచి ఉండవలసింది అనిఅన్నారు.
ఈ వేదాంతులు అనుభవం ఏమీలేకుండా, తము పాటించకుండా ఇతరులకు బోధిస్తారు, కనిపిస్తున్న భగవంతుడుని ఆరాధించకుండా ఆత్మజ్ఞానంకలగదని వీరు అర్ధంచేసుకోరు. బాల్యం లేకుండా యవ్వనం పొందగలరా ? ఈవిధమయిన వెక్కిరింతలు అవహేళనలు బాపూనా మీద గురిపెట్టారు. ఎవరూ అతనిని ఈదాడినుండి కాపాడలేదు. అతను ఏవిధమయిన ఆహారం తీసుకోకుండా, నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
శ్రీమహారాజు అతని చుట్టూ జరుగుతున్న తతంగాన్ని చూస్తున్నారు. భగవంతుడు పేదల మరియు నిస్సహాయులను కాపాడేందుకు వస్తాడు. యోగుల సాంగత్యం పొందినవారు అదృష్టవంతులు. బాపూనా విచారించకు రా నేను నీకు రుక్మిణీ రమణుని ఇప్పుడే చూపిస్తాను అని శ్రీమహారాజు అన్నారు. అలా అంటూ శ్రీమహారాజు లేచి నిలుచుని తన కాళ్ళు విరోబాలా ఉంచి, చేతులు నడుంమీద పెట్టారు.
ఈ భంగిమలో మెడలో తులసీదళాలు, పువ్వుల దండతో ఉన్న ఆయనను బాపూనా దర్శించాడు. ఆయన పాదాలకు నమస్కరించి పైకిచూసేసరికి తిరిగి విఠోబా స్థానంలో శ్రీమహారాజు కనిపించారు. ఈవిఠోబా దర్శనానికి బాపూనా అమిత ఆనందం పొందాడు. తరువాత అతను మందిరానికి వెళ్ళినప్పుడు సరిగ్గా శ్రీమహారాజు తనకు చూపించిన, కుకాజీవాడలో చూసిన భంగిమలాంట లలితా చైతన్య విజ్ఞానము - 56, 57 /itha Chaitanya Vijnanam - 56, 57 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
22. సుమేరు మధ్య శ్రుంగస్థ శ్రిమన్నగర నాయిక
చింతామణి గృహాన్తస్త పంచబ్రహ్మాసనస్తిత
🌻 56. 'శ్రీమన్నగరనాయికా' 🌻
నగరమునకు నాయక యని అర్థము. నగరమునకు అర్థము విద్యానగర మనియె. సమస్త విద్యలకు ఏ ప్రదేశమాలయమో, దానిని ప్రాచీన కాలమున నగరమని పిలిచెడివారు. నాగరికులనగ విద్యల యందు నిపుణులని అర్థము.
పూర్వకాలమున విద్యయే సంపదగ
భావించుటచే విద్యలు గల తావును నగర మనిరి. వారణాసి, పాటలీ పుత్రము, ఉజ్జయిని అట్టి నగరములే. భవంతుల ఎత్తును బట్టి, ప్రదేశము వైశాల్యమునుబట్టి, జనాభానుబట్టి ప్రస్తుతము నగరములను నిర్వచించు చున్నారు. ఇది కలి ధర్మము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 57 / Sri Lalitha Chaitanya Vijnanam - 57 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
22. సుమేరు మధ్య శ్రుంగస్థ శ్రిమన్నగర నాయిక
చింతామణి గృహాన్తస్త పంచబ్రహ్మాసనస్తిత
🌻 57. 'చిన్తామణి గృహాంతస్థా' 🌻
చింతామణులచే నిర్మింపబడిన గృహమునందు నివసించునది అని అర్థము. తలచిన కోరికలను తీర్చునట్టిది చింతామణి రత్నము. అట్టి
రత్నములచే నిర్మించబడిన గృహము నందు వసించునది అని అర్థము.
చింతామణి గృహము బ్రహ్మాండము నధిష్ఠించి యుండునని, అందుండియే సమస్త సృష్టి ప్రణాళిక వెలువడునని బ్రహ్మాండ పురాణమున తెలుపబడెను. ఇది కారణముగ చింతామణి గృహమే సమస్త సృష్టికిని, త్రిమూర్తులకును, త్రిశక్తులకును శిరోధార్యముగ భావింతురు. ఆ గృహమున వసించునదియే శ్రీదేవి. మానవ శరీరమందు సహస్రార పద్మము నధిష్ఠించిన మణి గూడ చింతామణియే.
మానవ ప్రజ్ఞకు అది పరమోత్కృష్ట స్థానము. అట్లే సృష్టికి పరమోత్కృష్ట స్థానము చింతామణి గృహము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[06:02, 27/10/2020] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 32 🌹
****************************************************
: అసలు మౌఢ్యమి అంటే ఏమిటి?
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః
గురుగ్రహమే కాని,శుక్ర గ్రహమేకాని సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు.
మౌఢ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు.అందువల్ల మౌఢ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.
శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము. మౌఢ్యమిని "మూఢమి"గా వాడుకభాషలో పిలుస్తారు. ఈమూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు.మూఢమి అంటే చీకటి అని అర్ధం. మూడమి అనేది అన్ని గ్రహాలకు ఉన్నగురు,శుక్ర మౌడ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది.
శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది.సముద్రం ఆటు,పోటులలో మార్పులు వస్తాయి.
శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యథికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి -శృంగార జీవితానికి కారకుడు. జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు.ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయండి.
మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమాము:-
*******
పెళ్ళిచూపులు, వివాహం ,ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, యజ్ఞాలు చేయుట, మంత్రానుష్టానం,విగ్రహా ప్రతిష్టలు, వ్రతాలు, నూతనవధువు ప్రవేశం ,నూతన వాహనము కొనుట,బావులు,బోరింగులు,చెరువులు తవ్వటం,పుట్టువెంట్రుకలకు ,వేదా"విధ్యా"ఆరంభం, చెవులు కుట్టించుట,నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయరాదు.
మౌఢ్యమిలో చేయదగిన పనులు :
*******
జాతకర్మ,జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు,జప,హోమాది శాంతులు ,గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు, సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా,శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును. గర్భిని స్త్రీలు,బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిధులలో అశ్వని,రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.
-- వరలేఖరి.నరసింహశర్మ.
[ ముహూర్తం చూడడం ఎలా?
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః
శ్లో// చక్షుషే జగతాం కర్మసాక్షిణే తేజసాంనిధేః
మూర్తి త్రయ స్వరూపాయ మార్తాండాయ నమోనమః//
మనం ఒక అధికారి దగ్గరికి పనిమీద వెళ్లేటప్పుడు ఆ అధికారి కోపంలో ఉన్నాడా!?, సంతోషంలో ఉన్నాడా!? మొదలైన విషయాలు తెలుసుకుని అతను సంతోషంలో ఉన్నప్పుడు వెళితే మన పని త్వరగా అవుతుంది. అలాగే తెలివైన వారు కాలం యొక్క స్వభావాన్ని తెలుసుకుని మంచి కాలములో తగిన పనులు చేయ తలపెడతారు. అన్నికాలాలూ మనకు జయాన్ని ఇవ్వవు. ఒక సమయంలో ఒకరికి శుభం జరిగితే మరొకరికి కష్టం కలగవచ్చు. మనం పుట్టిన సమయాన్ని బట్టి మనకు మాత్రమే ప్రత్యేకంగా సరిపడు కాలం తెలుసుకోవాలి. మనం పుట్టిన సమయానికి ఉన్న నక్షత్ర,లగ్న ములను బట్టి మనకు/ మనం తలపెట్టిన పనికి సరిపడు నక్షత్ర, లగ్న సమయాలు తెలుసుకుని ముందడుగు వేయడం జయాన్ని కలిగిస్తుంది. కాలం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఋషులు మనకు అందించిన అద్భుత వరం “జ్యోతిష్య శాస్త్రం”. దీని ఆధారంగా మన జీవితంలో జరుగు వివాహము, ఉపనయనము, గృహప్రవేశము మొదలైన కర్మలను ఏ రోజు, ఏ సమయంలో జరుపుకోవచ్చో తెలుసుకొనవచ్చు.
ముహూర్తం చూసే ప్రక్రియలో ముఖ్యంగా ఈ క్రింధి విషయాలు గమనించాల్సి ఉంటుంది.
౧) తారా బలం, ౨) చంద్ర బలం, ౩) లగ్న బలం, ౪) పంచక రహితం, ౫) ఏకవింశతీ మహా దోషాలు
వీటి తో పాటు చివరిగా ఆయా క్రతువులకు పనికి వచ్చే తిథి, వార, నక్షత్రాలనే వాడామా లేదా అనే విషయం కూడా తప్పకుండా నిర్థారించుకోవాలి.
ఉదాహరణకు : మనం అడిగి మరీ పెట్టించుకునే “ఆదివారం” గృహప్రవేశం, ఉపనయనం, వివాహం మొదలైనవాటికి తగిన వారంగా పేర్కొన బడలేదు. బుధ,గురు, శుక్రవారములు చాలా వరకు శుభకార్యములకు మంచివిగా పెద్దలు తెలిపారు. అయితే వారము కన్నా తిథి, తిథికన్నా నక్షత్రము, నక్షత్రముకన్నా లగ్నమూ అత్యంత బలీయములు. కనుక నక్షత్ర, లగ్నములు అనుకూలముగా ఉన్నచో తిథివారములు మధ్యస్థముగా ఉన్ననూ స్వీకరిస్తుంటారు.
ఒక పని ముఖ్యంగా వైదికసంబంధమైన వివాహ గృహప్రవేశాది క్రతువులు చేయతలపెట్టినప్పుడు ఈ విషయాలు అన్నీ గమనించి శుద్ధపరచిన శుభముహూర్తములు గ్రహించాలి. 👈:
👉 చంద్ర బలం:
ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు పరిశీలించవలసిన ముఖ్యమైన విషయాలలో చంద్రబలం ఒకటి. ముహూర్త సమయానికి చంద్రుడు ఉన్న రాశిని బట్టి బలాన్ని నిర్ణయించాలి. ఎవరికొరకు ముహూర్తం చూస్తున్నామో వారి జన్మ రాశినుండి, ముహూర్తం నిర్ణయించదలచిన రోజున చంద్రుడు ఉన్న రాశివరకు లెక్కించాలి.
జన్మ రాశినుండి ముహూర్త సమయ చంద్రరాశి
శుక్ల పక్షంలో : 2-5-9
క్రిష్ణ పక్షంలో : 4-8-12
శుక్లపక్షం, క్రిష్ణ పక్షం రెండిటిలోనూ : 1,3,6,7,10,11 అయితే మంచిది.
అనగా శుక్లపక్షంలో చంద్రుడు 4-8-12 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.
కృష్ణ పక్షంలో చంద్రుడు 2-5-9 స్థానాలలో ఉంటే ఆ ముహూర్తానికి చంద్ర బలం లేనట్లే. మిగతా స్థానాలలో ఎక్కడున్నా మంచిదే.
👉 తారాబలం చూడటం ఎలా?
ముహూర్త నిర్ణయంలో ప్రథానమైనది తారాబలం. ఏ చిన్న ముహూర్తానికైనా మన జన్మ నక్షత్రానికి సరిపోయే నక్షత్రమును మాత్రమే తీసుకోవాలి. జన్మ నక్షత్రం నుండి ముహూర్త సమయానికి ఉన్న నక్షత్రం వరకు లెక్కించగా వచ్చిన సంఖ్యను 9 చే భాగహరించాలి. వచ్చిన శేషాన్ని బట్టి ఫలితం క్రింది విదంగా నిర్ణయించాలి.
1 వస్తే ‘జన్మతార’ అలా వరుసగా....
1) జన్మతార, 2) సంపత్తార, 3) విపత్తార, 4) క్షేమ తార, 5) ప్రత్యక్తార, 6) సాధన తార, 7) నైధన తార, 8) మిత్ర తార, 9) పరమమిత్ర తార.
ఇవేవో అశ్వని, భరణి, కృత్తికల వలే వేరే కొత్త తారలు అనుకోకండి. ఆ 27 నక్షత్రాలకే మన జన్మతారను బట్టి ఈ తొమ్మిది పేర్లు అన్వయించాలి. అంటే ‘విద్యార్థి’ అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరికి కొడుకు, ఒకరికి తమ్ముడు, ఒకరికి భర్త అవుతాడు. అలాగే అశ్వనీ నక్షత్రం ఒకరికి జన్మతార అయితే, మరొకరికి సంపత్తార ( సంపదలు కలిగించే తార ) అవుతుంది. మరొకరికి విపత్తార ( విపత్తులు కలిగించే తార ) అవుతుంది. ఎవరికి ఏమవుతుంది అన్నది వారి జన్మనక్షత్రాన్ని బట్టి నిర్ణయించుకోవాలి.
పైవాటిలో సంపత్తార, క్షేమ తార, సాధన తార, మిత్ర తార, పరమమిత్ర తారలు ( 2,4,6,8, 9 తారలు ) సకల శుభకార్యాలు చేసుకోవడానికి పనికి వస్తాయి. వృత్తి,వ్యాపార సంబంధమైన విషయాలు ‘సంపత్తార’ లోను, ప్రయాణాది కార్యాలు ‘క్షేమతార’ లోను, సాధించి తీరాలనుకునే కార్యాలు ‘సాధనతార’ లోను ప్రారంభించడం మరింత మంచిది.
జన్మతార కొన్ని శుభకార్యాలకు పనికొస్తుంది. కొన్నిటికి పనికి రాదు.
చెవులు కుట్టడం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, నిషేకం, యాగం, పట్టాభిషేకం, వ్యవసాయం, భూసంపాదన మొదలైన వాటికి జన్మతారను గ్రహించ వచ్చు.
ప్రయాణం, పెండ్లి, క్షౌరము, ఔషధ సేవనం, గర్భాదానం, శ్రార్థం, సీమంతం, పుంసవనము మొదలైనవి జన్మనక్షత్రంలో చేయరాదు.
ఉదాహరణ : రేవతి నక్షత్రం జన్మ నక్షత్రం అనుకుంటే, ముహూర్త నిర్ణయంరోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉంది అనుకుంటే, రేవతికి పూర్వాభాద్ర సరిపోతుందో లేదో తెలుసుకోవాలి. అంటే రేవతి నుండి పూర్వాభాద్ర ఎన్నో నక్షత్రమో లెక్క పెట్టాలి. 26 వ నక్షత్రం అవుతుంది. దానిని తొమ్మితో భాగహరించగా శేషం 8 వస్తుంది. అంటే రేవతికి - పూర్వాభాద్ర ఎనిమిదో తార ( మిత్ర తార ) అవుతుంది. అంటే శుభం కనుక ముహూర్తము పనికొస్తుంది.
శేషం సున్నా వస్తే అది తొమ్మిదిగా గుర్తించాలి.
తప్పని సరి పరిస్థితులలో ముహూర్తనిర్ణయం చేయవలసి వస్తే .....
ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయేతు తృతీయకం
తృతీయే పంచమం త్యాజ్యం నైధనం త్రిషువర్జయేత్ !
ప్రథమ నవకం లో ( 1 నుండి 9 తారలలో ) మెట్ట మొదటి తారను,
2 వ నవకం లో ( 10 నుండి 18 తారలలో )మూడవ తారను,
3 వ నవకంలో( 19 నుండి 27 తారలలో ) పంచమ తారను,
ప్రతీ నవకంలో 7 వతారను ఎల్లప్పుడు వదిలి పెట్టవలెను.
అంటే జన్మనక్షత్రము లగాయతు 1, 7, 12, 16, 23 మరియు 25 నక్షత్రాలను ఎల్ల వేళలా శుభకార్యములలో వదిలిపెట్టాలి.
అంటే సాధారణంగా జన్మ నక్షత్రం నుండి 1,3,5,7,10,12,14,16,19,21,23 మరియు 25 నక్షత్రాలను శుభకార్యములలో వదిలిపెట్ట వలసి ఉన్నది. కానీ కావలసిన సమయము లోపల ముహూర్తములు కుదరని పక్షమున 1, 7, 12, 16, 23 మరియు 25 తారలు మాత్రం వదిలి మిగతావి రెండవ ఎంపికగా గ్రహించ వచ్చును.
సేకరణ :
సంస్కారములు - ముహూర్తములు :
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః
మానవుడు జన్మించినప్పటి నుంచి మరణించే వరకు సంష్కారమయమే. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడా వీడిపోయి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది. జీవి గర్భంలో పడింది మొదలు అంత్య సంస్కారం వరకు జరిగే సంస్కారాలు లేదా కర్మలు ధర్మశాస్త్రల్లో 40 వరకు చెప్పబడ్డాయి. గౌతమ స్మృతుల్లో 40 సంష్కారాలను, అంగీరస మహర్షి 25, వ్యాసుడు 16 సంష్కారాలను చెప్పారు. మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా చెబుతుంది.
వివాహము:
ఒక సత్రంలో ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే వివాహము. ముహూర్త వారములు: సోమవారం నిషేధం ఆచారమే కానీ శాస్త్రం కాదు. మంగళవారము నిషేధము. మిగిలిన వారములు గ్రాహ్యమే. నక్షత్రములు: ‘మూల మైత్ర మృగ రోహిణి కరైః పౌష్ణమారుత ఘోత్సరాన్వితైః వీర్య వద్ధిరుడుద్ధిర్ముృగీ దృశాం పాణి పీడన విధిర్విధీయతే’ అని శాస్త్రం. అయితే ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల సమయంలో వివాహం శ్రేష్ఠము అని కొందరు, కాదని కొందరు చెప్పారు. అయితే నాలుగు నక్షత్రములు కూడా ఆచారంలో వున్నవి. అందువలన అశ్వినీ, రోహిణీ, మృగశిర, మఘ, ఉత్తర, హస్త, స్వాతీ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రముల రోజులలో వివాహము మంచిదే.
లగ్నంలో పాపగ్రహములు:
లగ్నాత్ సప్తమంలో పాపగ్రహములు లేకుండా వివాహ సుముహూర్తము చేయాలి. ధనిష్ఠా, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రాలు వివాహమునకు గ్రాహ్యము కాదు అని కొందరి వాదన వున్నది. అది కూడా గ్రంథాధారమే కానీ వాటిల్లో కొందరు మహర్షులు శ్రేష్ఠము అని చెప్పిన కారణంగా అందరూ ఆచరిస్తున్నారు. చిత్తా నక్షత్రం గ్రాహ్యం కాదని వాదన. లగ్నాత్ కేంద్రములు అనే 1,4,7,10 స్థానములలో శుభ గ్రహములు వుండడం దృష్ట్యా వివాహ లగ్నమునకు బలం ఎక్కువ అని చెప్పాలి. లగ్నాత్ 1,4,5,7,9,10 స్థానములలో శుభగ్రహ సంచారం విశేష లాభ ఫలితాలు ఇస్తుంది. అవకాశం వున్నంతవరకు 1,7 స్థానములలో పాపగ్రహములు లేకుండానే నిర్ణయం చేయాలి. శుక్ర గ్రహమునకు పాపగ్రహం సంబంధం లేకుండాను అలాగే చంద్రగ్రహం వున్న నక్షత్రంలో పాపగ్రహం లేకుండాను చేసుకోవాలి. కారణం కళత్ర కారకుడు శుక్రుడు. అలాగే మనఃకారకుడు చంద్రుడు. అలాగే వీలయినంతవరకు గురు బలం అధికంగా వున్న ముహూర్తం నిర్ణయించాలి.
గర్భాదానము:
స్త్రీ, పురుషులు (భార్యభర్తలు) ఇద్దరు కలసి ఒక కొత్త ప్రాణికి జీవం పోయడామే గర్భాదానము. స్త్రీ పురుషుల కలయిక వలన స్త్రీ అండాశయంలో ఏర్పడిన అండంనకు పురుషునిలో ఉత్పత్తి అయిన వీర్యకణం ద్వారా ఫలదీకరణం చెందినట్లయితే స్త్రీ గర్భం దాల్చి నూతన జీవి పుట్టుకకు అవకాశం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల చిత్త వృత్తులు సంతానోత్పత్తి కాలములో ఎలా ఉంటాయో అటువంటి లక్షణాలు కలిగిన శిశువే జన్మిస్తారు. కావున తల్లిదండ్రులు గర్భాదాన సమయమున తాము దేవతలమని, పతి ప్రజాపతి యొక్క అంశ గలవాడని, పత్ని వసుమతి రూపమని తలచి దేవతా చింతనము చేయుచు గర్భాదానము చేయవలెను.
పుంసవనం:
తల్లి గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం.
సీమంతం:
తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేదే సీమంతం. తొలి గర్భదారణ విషయంలో 4, 6, 8 మాసములలో చేయుట శాస్త్ర సమ్మతము. అయితే 5, 7, 9 మాసములలో చేయుట ఆచారము. పుంసవనమునకు అష్టమ శుద్ధి కావలెను. సీమంతమునకు అష్టమ, నవమ శుద్ధులు రెండూ కావాలి. సీమంతర అనివార్య కార్యముల వలన చేయలేనిచో ప్రాయశ్చిత్తముగా గోదానము చేయాలి.
గర్భిణీపతి ధర్మాలు:
భార్య గర్భవతిగా వున్నప్పుడు "గర్భిణీ వాంఛితం ధర్మం తస్యైదద్యాత్ యధోచితం" భార్య కోరిన ఉచితమైన కోరికలు భర్త తీర్చవలెను. విదేశీ ప్రయాణము, చెట్ల నరుకుట, 7వ మాసం నుంచి క్షౌరము, మైధునము, తీర్ధయాత్ర, శ్రాద్ధ భోజనము, నావప్రయాణము, వాస్తుకర్మలు, సముద్ర స్థానము, ప్రేతకర్మలు నిషేధము. గర్భిణీపతి స్వపితృకర్మలు చేయవచ్చును.
బారసాల:
తనని పరిపూర్ణ స్త్రీగా నిరూపించిన తన బంగారు బిడ్డకి అన్ని వేళలా తోడుగా ఉంటూ ప్రతిక్షణం తనదిగా, తన లోకంగా ఉండే చిన్నారి బిడ్డకు తొలుత చేసే ముచ్చటైన వేడుక బారసాల. మంగళ, శనివారములు పనికి రావు. అష్టమి ద్వాదశి, నవమి, అమావాస్య తిధులు పనికిరావు. బారసాల రోజునాయితే ఆ రోజు సాయంత్రం వర్జ దుర్ముహూర్తములు లేకుండా ఊయలల్లో నూతనముగా శిశువును వుంచవచ్చును. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పుబ్బ, విశాఖ, జ్యేష్ట, పు.షా, పుభా, నక్షత్రములు పనికి రావు.
క్షౌరం + పుట్టు వెంట్రుకలు
షష్ఠి, అష్టమి, నవమి, చవతి, చతుర్దశి, అమావాస్య, ద్వాదశి, పాడ్యమి తిధులు పనికి రావు. శుక్ర, మంగళ శనివారములు కూడదు. పుష్య, పునర్వసు, రేవతి, హస్త, శ్రవణ, ధనిష్ఠ, మృగశిర, అశ్వని, చిత్ర, శతభిషం, స్వాతి ఇవి ప్రసస్తములు ఉత్తర తూర్పు దిక్కుగా కూర్చొని క్షౌరం చేయించుకోవాలి. నిత్యంలో సోమ, బుధవార విషయములలో తిధి, నక్షత్రం పట్టింపు లేదు.
అన్నప్రాసన:
మగపిల్లల విషయంలో 6వ మాసం అన్నప్రాసన చేయలి. 5వ మాసం మొదలు బేసి మాసముల యందు ఆడపిల్లల విషయములో అన్నప్రాసన చేయాలి. 6వ నెల 6వ రోజు అనేది కుసంస్కారము. అది దుష్టాచారము. అన్నప్రసనతోనే పిల్లల ఆరోగ్య విషయాలు ఉంటాయి. అందు కోసం మంచి ముహూర్తానికే అన్నప్రసన చేయాలి. అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడం, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్త్రాభాద్ర, రేవతి నక్షత్రములయందు చేయవలెను. ఆది, శని, మంగళవారములు నిషేధం. జన్మలగ్నం, అష్టమ లగ్నం కాకుండగను, దశమస్థానం శుద్ధి ఉన్న లగ్నమున అన్నప్రాసన చేయవలెను.
గర్భధానం:
అశ్వని, భరణి, ఆశ్రేష, మఘ,మూల, జ్యేష్ఠ, రేవతి నక్షత్రముల పూర్తి నిషేధము. జన్మ, నైధన, తారలు కాకూడదు. ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, మృగశిర, హస్త అనూరాధ,శ్రవణం, ధనిష్టం, శతభిషం, రోహిణి స్వాతీ నక్షత్రములు విశేషములు. రెండు పక్షములలోని షష్ఠి అనధ్యయన దినములు ఏకాదశులు , ఆది మంగళ వారములు సంక్రమణ దినములు శ్రాద్ధ దినములు గర్భదానమునకు నిషేధదినములు వివాహం అయిన 16 రోజులలోపు గర్భదానమునకు ముహూర్తమును చూడనవసరం లేదు అనునది అశాస్త్రీయ విషయము. భార్య భర్తల భవిష్య ఆరోగ్య విషయములో గర్భాధాన ముహూర్తం ముఖ్య భూమిక వహిస్తుంది. వ్రతములు ఆచరించు దినములలో సంగమం నిషేధం.
చెవులు కుట్టుట:
జన్మించిన 12వ లేదా 16వ రోజును లేక 6వ, 7వ, 8 నెలలయందైననూ పూర్వాహ్న, మధ్యాహ్న కాలములలో సోమ, బుధ, గురు, శుక్రవారములలో శ్రవణం, అర్ద్ర, హస్త, చిత్త, మృగశిర,రేవతి, ఉత్తర ఉత్తరాషాఢ, ఉత్తరాభాధ్ర, పుష్యమి, పునర్వసు, ధనిష్టయందు కుంభ, వృశ్చిక, సింహ లగ్నములు కాకుండా, అష్టమ శుద్దితో కూడిన లగ్నమునందు చెవులు కుట్టుట మంచిది.
అక్షరాభ్యాసం:
ఉత్తరాయణం శ్రేష్ఠం. హస్త పునర్వసు, స్వాతి, అనూరాధ, అర్ద్ర, రేవతి, అశ్వని, చిత్త, శ్రవణములయందు ఆది, మంగళ, శనివారములు కాకుండాను చరరాశి లగ్నమందు రిక్తతిధులు షష్ఠి, అష్టమి విడిచి అనధ్యయన దినములు కాకుండా అష్టమ శుద్ది కలిగి ఉండే లగ్నమునందు అక్షరాభ్యాసం చేయాలి. కేవలం మధ్యాహ్నం లోపుగా ఉన్న లగ్నమునందు అక్షరాభ్యాసం చేయాలి.
నిష్క్రమణ సంస్కారం
శిశువును తొలిసారిగా ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడమే నిష్కమణ. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ తొలిసారిగా బయటి ప్రపంచంలో అడుగు పెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతి శక్తుల నుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 4వ నెల శిశువు సూర్యునికి చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ‘నిష్క్రమణ సంస్కారం’ అని పిలుస్తారు. శిశువు 4వ నెలలో సూర్యోదయ సమయాన ఈ కార్యాన్ని నిర్వహిస్తారు. గాలి బాగా ఆడే ఇంటి బయట ప్రదేశానికి శిశువును తీసుకెళ్ళి సూర్యుడికి శిశువు శరీరాన్నంతా భక్తి శ్రద్ధలతో చూపించడం జరుగుతుంది. అదే రోజు రాత్రి సమయంలో చంద్రుడికి కూడా శిశువు శరీరం చూపడం జరుగుతుంది.
ఆ తరువాత రోజులలో కూడా కొంతకాలం పాటు శిశువును సూర్యుడికి కొన్ని నిమిషాలు చూపించడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా శిశువు ఆరోగ్యవంతంగా బుద్ధిశాలిగా ఉన్నతి పొందుతాడు.
నామకరణం:
జన్మించిన శివువుకు నామకరణం జరిపించడంలో సంష్కారాల్లో ఒక భాగం. ఒక్కొక్క రాశిలో 9 నక్షత్ర చరణములు ద్వారా ప్రతీ నక్షత్ర చరణమునకూ ఒక అక్షరము చెప్పబడినది. ఆ అక్షరము ఆధారంగా జన్మించినవానికి నామకరణము చేయడమనేది అనాదిగ వస్తున్న సంప్రదాయం. దీని ద్వారా ఒక్కోరాశికి 4 పాదాలుగా చేసి ఆ కాలమును అనుసరించి జన్మించిన బిడ్డకు ఆయా నక్షత్రములలోని 4 అక్షరములలో ఒకటి ముందు వచ్చునట్టుగా నామం నిర్ణయము చేస్తారు.
జాతకర్మకు వాడు నక్షత్రములు, తిధులు, వారములన్నియు నామకరణమునకు కూడా ఉపయోగించవచ్చును. మగపిల్లలకు సరి సంఖ్య అక్షరములతోను, ఆడపిల్లలకు బేసిసంఖ్య అక్షరములతోను నామకరణం చేయాలి. నామకరణ జాతకర్మ రెండును మధ్యాహ్నం 12 గంటల లోపే చేయాలి. లగ్నం నుంచి వ్యయ స్ధానంలో ఏ గ్రహం లేని ముహూర్తం నిర్ణయించవలెను. అలాగే అష్టమ శుద్ది విశేష నామము, దైవసంభంధము మాస సంబంధము ఉండునట్లు రావడం మంచిది. అర్ధం లేని పేర్లు పెట్టుట వలన దోషం ఏర్పడుతుంది.
నూతన వస్త్రధారణ:
ఆది, మంగళ, శనివారములు నూతన వస్త్రధారణ చేయకూడదు. అలాగే షష్టి, ద్వాదశి, నవమి, అమావాస్య తిధులలో నూతన వస్త్రధారణ పనికి రాదు. భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్రలలో నూతన వస్త్ర ధారణ చేయుట మంచిది కాదు. అయితే నిత్యంలో పండుగ రోజులలోనూ వస్త్రధారణ చేయుటకు వర్జ్య దుర్ముహర్తములు లేని సమయంలో చేయ వచ్చును. అంతే కాకుండా నూతనవస్త్రములకు మంగళకరమైన పసుపునకు పెట్టి ధరించవలెను.
ఉపనయనం:
అక్షరాభ్యాసం అంటే లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే, పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు.
తనయుడికి తండ్రి ఉపనయనం చేస్తాడు. తండ్రి దేశాంతరమందుంటే తాత (తండ్రి యొక్క తండ్రి), అతను లేకుంటే తండ్రి సోదరులు వారుకూడా లేకపోతే వటుడి అన్న దానికి అధికారి అవుతాడు. ఒకవేళ అతను కూడా లేకపోతే సగోత్రమునందు జన్మించిన వారు చేయాల్సి ఉంటుంది.
గర్భాష్టమంలోను, 11 ,13వ సంవత్సరంలోనూ కాల ప్రాధాన్యం. కాలతీతం దృష్ట్యా ముహూర్త బలం లేకపోయినా ఉపనయనం చేయవచ్చు. 16 దాటిన బ్రాహ్మణునికి ఉపనయనం మంచిది కాదు. 22 దాటిన క్షత్రియులకు 24 దాటిన వైశ్యులకు ఉపనయనం వివాహం కోసమే గానీ సంస్కారం కోసం కాదు.
వసంత ఋతువు బ్రాహ్మణులకు, గ్రీష్మ ఋతువు క్షత్రియులకు, శరదృతువు వైశ్యులకు ఉపనయనమునకు మంచిది. అయితే వసంత ఋతువు అని వాడిన కారణంగా ఉత్తరాయణమునందు ఉపనయనము చేయుటకు సంకోచము లేదు. అయితే మాఘాది పంచమాసములు విశేషంగా చెప్పిన కారణంగా మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసములందు ఉపనయనము చేయు విషయమై ఆక్షేపణ అనవసరం. అయితే ప్రత్యేకించి మాఘాది పంచమాసాః అని విధించిన కారణంగా పుష్య మాసం, ఆషాఢ మాసం, ఉత్తరాయణంలో కూడుకున్నవి అయినప్పటికి ఆ మాసంలో ఉపనయన వ్రతం చేయరాదు. తదియ, పంచమి, షష్ఠి, సప్తమి తిధులు విశేషము బుధ, గురు, శుక్రవారములు మంచిది. అనూరాధ, హస్త, చిత్త, స్వాతి, శ్రవణం, ధనిష్ట, శతభిషం, రేవతి, ఉత్తర, ఉత్త్రాభాద్ర, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, అశ్వని నక్షత్రములు విశేషములు అష్టమంలోను కేంద్రస్థానములైన 1,4,7,10 స్థానము లందును, పాపగరహములు లేకుండా చూసి ఉపనయనం చేయాలి. రవి వ్యయం నందు ఉండగా ఉపనయనం చేయకూడదు.
జలపూజ:
ప్రసవించిన స్త్రీ జల సమీపమునకు వెళ్ళి జలపూజ చేయాలి. బుధ, గురు, శుక్ర, సోమ వారములయందును శ్రవణం పుష్యమి పునర్వసు, మృగశిర, హస్త, మూలా, అనూరాధలలో ఒక నక్షత్రము నందును శుభ తిథులలో చేయడం మంచిది. వీటికి చైత్ర, పుష్య మాసములు, మూఢమి, అధిక మాసములు వర్జ్యములు.
జాతకర్మ:
ఈ సంస్కారము శిశువు భూమిపైకి వచ్చిన తరువాత చేయునది. జాతకర్మను కొన్ని ప్రాంతాలలో 'బాలసారె' అని అంటారు. జన్మించిన వెంటనే జాతకర్మ చేయాలి. లేదా 11, 12 రోజులలో చేయవలెను. కొన్ని ప్రాంతాలలో యవపు పిండిని, బియ్యపుపిండిని, బంగారముపై రుద్దిన తేనెను, నెయ్యిని, శిశువు నాలుకకు మంత్రోచ్చారణ జరుగుతుండగా తండ్రి రాస్తాడు.
అష్టమి, చవితి, చతుర్దశి, అమావాస్య, షష్టి వంటి తిధులు కాకుండా, మంగళ, శనివారములు కాకుండా అశ్వనీ రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి అనూరాధ, ఉషా, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉ.భా, రేవతి ఈ నక్షత్రముల యందు జాతకర్మ ఆచరించాలి. జాతకర్మ మధ్యాహ్నం 12 గంటల లోపే చేయాలి.
తండ్రియే జాతకర్మ సంస్కారము చేయాలి. దీంతో ఆ శిశువుకు జన్మత సంక్రమించిన బాలారిష్టాది దోషాలు నశిస్తాయి. ఈ సంస్కార నిర్వహణ వలన శిశువునకు దీర్ఘాయిష్యు, జన్మకాలములో సంక్రమించిన "అమంగళ యోగములు" తొలగిపోవును. దుష్ట తిధి వార నక్షత్రములందు జననమైనచో శాంతి, ఆజ్య వీక్షణము, లేనిదే శిశువు ముఖం చూడరాదు. ఆడపిల్ల అయిన 13 వ రోజు, మగపిల్లవాడైన 12 వ రోజు ఊయలలో పడుకుండ బెట్టవలెను.
దత్తత స్వీకారము:
సంతానము లేని వారు దత్తత చేసుకోనె సంప్రదాయం ఉంది. సంతానము లేని వారు వివాహమైన తరువాత 20 ఏళ్ల వరకు సంతానం లేకపోతే, తండ్రి ఆయుష్షు అల్పమైనదని శంక కలవారు ఈ దత్తత చేసుకోవలెను. దత్తత తీసుకొనునప్పుడు, సదరు అబ్బాయి/అమ్మాయి ఆయుష్షు, కీర్తి ప్రతిభ, మొదలగు విషయములు జాతకమున పరిశీలించి యోనికూటమి, నాడికూటమిచూసి స్వగోత్రీకుల, ఇంటి నుంచి దత్తత తీసుకోవాలి.
ఈ దత్తత స్వీకారము, ఉత్తరాయణమున మధ్యాహ్నం 12 గంటల లోపున జరిపించవలెను. ఇందుకు స్వాతి, పునర్వసు, పుష్యమి, రోహిణ, అనూరాధ, హస్త, రేవతి, శ్రవణం, ఉత్తర, ఉత్తరాభాద్ర, నక్షత్రములు ఉత్తమము. చంద్రబలము, తరాబలము, కలిగి శుభగ్రహ వీక్షణ గలిగిన శుభ లగ్నమున ఈ కార్యక్రమము జరిపించ వలెను.
ధాన్యము నిల్వచేయుటకు
సాధారణ, ఉగ్ర, ఆర్ద్ర, ఆశ్రేషలను విడిచి మిగిలిన నక్షత్రముల యందు తుల, మేష, కర్కాటక లగ్నములుగా కాకుండా శుభ సమయం రోజున ఆహారము కొరకు ధాన్యము నిల్వ చేయడం మంచిది. అట్లుగాక వ్యాపారార్ధము ధాన్యము నిల్వచేయుటకు దృవ, పుష్య, విశాఖ, జ్యేష్ఠ, అశ్వనీ, చర నక్షత్రముల యందు నిల్వచేయుట మంచిది. దిమికా శ్రవన, ధనిష్ఠ, శతభిష, విశాఖ, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభద్ర, పుష్య, పునర్వసు, స్వాతి, అశ్వనీ, జ్యేష్ఠల యందు ధనధాన్యములు నిల్వవుంచుటకు ప్రశస్తము.
బాలారిష్టములు:
చంద్రుడు జన్మలగ్నమునందు 8వ ఇంట ఉన్నా, కుజుడు 7వ ఇంట ఉన్నా, రాహువు 9వ ఇంట ఉన్నా, శని లగ్నములో వున్నా, గురువు తృతీయంలో ఉన్నా, రవి పంచమంలో ఉన్నా, శుక్రుడు 6వ ఇంట ఉన్నా, బుధుడు 4వ ఇంట ఉన్నా, కేతువు 4వ ఇంట వున్నా బాలారిష్టములు. ఆయా గ్రహములకు జపధాన హోమములు మొదటి నెలలోనే జరిపించాలి. జనకాలమునకు అష్టమాధిపతి దశ అయినచో బాలారిష్టము అగును.
జన్మ లగ్నములో షష్ఠాధిపతి ఉన్నా, భాగ్యాధిపతి అష్టమ వ్యయంలో ఉన్నా, జన్మ లగ్నాత్ చతుర్ధాతిపతి వ్యయంలో ఉన్నా అరిష్టమే. జనన కాల దశానాధుడు షష్ఠాధిపతి కలసి ఉన్నా జననకాల దశనాధుడు వ్యయాధిపతిలో ఉన్నా బాలారిష్టం అగును. కావున వీటికి శాంతి చేయవలెను. జనకాలమునకు షష్ఠాధిపతి దశ కానీ అంతర్ధశ కానీ అయినచో ఆరోగ్య ప్రాప్తి అధికంగా ఉండును. అష్టమంలో వ్యయాధిపతి ఉండి ఆ వ్యయాధిపతి అంతర్దశ కానీ మహాదశకానీ ఉండటే గనక, ఆ గ్రహమునకు శాంతి చేయాలి. తల్లిదండ్రుల, సోదరుల నక్షత్ర జన్మంలో జననం అయితే ఏకనక్షత్ర జనన శాంతి చేయాలి. కవలలు పుట్టిన యమళ జనన శాంతి, పేగు మెడలో వేసుకొని పుట్టిన నాళవేష్టన జనన శాంతి, విషఘడియ, దుష్ట తిధి వార నక్షత్రములో పుట్టిన గ్రహణంలో పుట్టిన గోముఖప్రసవ శాంతి చేయాలి.
బీజావాపనం:
అశ్వని, హస్త, పుష్యమి, చిత్త,రేవతి, మృగశిర, అనూరాధల యందును, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, స్వాతి, మూల, మఘ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషంలందు విత్తనం చల్లితే ఫలప్రదము. మంగళవారం, శనివారం, ఆదివారం రిక్తతిధులు, పంచపర్వములు, వర్జ్యఘడియలు, ప్రదోషకాలమును విడచి వృషభ, మిధున, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనుర్మీన లగ్నములందు విత్తనము వేయాలి. అంటే రవితో విడువబడు నక్షత్రము మొదలు 3 నక్షత్రములు హానిని కలుగజేయును. తర్వాత 8 వృద్ధిని కలుగచేయును. ఆ తర్వాత 9నక్షత్రములు కర్తకు మృత్యువును, ఆ తర్వాత ఏడు నక్షత్రములు లక్ష్మీప్రధమును కలుగచేయును. ఆశ్రేష నక్షత్రమందును సోమవారమందును, చంద్రుడు లగ్నమందు బలవంతుడై ఉంటే చెరుకు, అరటి, పోక మొక్కలను వేయవలెను. అశ్వనీ యందు, సూర్యుడు లగ్నమునందుండగా కొబ్బరిచెట్లు పాతించాలి. బృహస్పతి లగ్నమందును చంద్రుడు లగ్నాంశమందు ఉండగా తమలపాకుల తోటలు వేయడం మంచిది.
కృషికర్మ:
మృదు, స్థిర, క్షిప్ర, చర, మూల, మఘ నక్షత్రముల యందు మొదటిసారిగా కృషి కర్మ ప్రారంభించాలి. ఆది, మంగళవారములు విడిచి చవితి, షష్ఠి, నవమి, చతుర్ధశి తిధులను దగ్ధతిధుల నుంచి విడచి మిగిలిన తిధి, వార యోగకరణ రోజులయందు కృషి కర్మ ప్రారంభించవలెను. కృషి కర్మ మేష, సింహం కుంభ కర్కట, మకర, తుల యందు ప్రారంభించకూడదు. చంద్ర శుక్రులు బలవంతులై ఉండాలి లగ్నమందు గురువు ఉండగా కృషికర్మలకు యోగ్యము.
అంత్యేష్టి :
మానవుని ఆఖరి యజ్ఞం అంత్యేష్ఠి సంస్కారం. హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. వ్యక్తి తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు(అంత్యేష్టి). చనిపోయిన మనిషి భౌతిక కాయాన్ని కాల్చి (అగ్ని సంస్కారం చేసి), ఆ అస్తికలు మరియు చితా భస్మాన్ని పవిత్ర నదులలో కలపడం
జరుగుతుంది...
సేకరణ:
--(())--
: 🌹. శ్రీమద్భగవద్గీత - 528 / Bhagavad-Gita - 528 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 13 🌴
13. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీ: సర్వా: సోమో భూత్వా రసాత్మక: ||
🌷. తాత్పర్యం :
నేను ప్రతి గ్రహమునందును ప్రవేశింతును. నా శక్తి చేతనే అవి తమ కక్ష్యయందు నిలిచియున్నవి. నేనే చంద్రుడనై సర్వఓషధులకు జీవరసమును సమకూర్చుచున్నాను.
🌷. భాష్యము :
శ్రీకృష్ణభగవానుని శక్తి చేతనే సకలగ్రహములు అంతరిక్షమున నిలిచియున్నవని ఈ శ్లోకము ద్వారా అవగతమగుచున్నది. బ్రహ్మసంహిత యందు చర్చింపబడినట్లు అతడు ప్రతి కణమునందును, ప్రతి గ్రహమునందును, ప్రతి జీవియందును ప్రవేశించును.
ఆ భగవానుని సంపూర్ణాంశయైన పరమాత్మయే గ్రహములందు, విశ్వమునందు, జీవుని యందు, కణమునందు కూడా ప్రవేశించునని దాని యందు తెలుపబడినది. అనగా అతడు ప్రవేశము చేతనే సర్వము తగిన రీతి వ్యక్తమగుచున్నది. ఆత్మ యున్నంతవరకు మనుజుడు నీటిపై తేలగలిగినను, ఆత్మ దేహము నుండి వేరైనంతనే మరణించి నీటియందు మునిగిపోవును.
నీటి యందు క్రుళ్ళిన తరువాత దేహము గడ్డిపోచవలె నీటిపై తేలుననుట సత్యమేయైనను మరణించినంతనే మాత్రము దేహము నీటిలో మునిగిపోవును. అదేవిధముగా గ్రహములన్నియును అంతరిక్షమున తేలుటకు శ్రీకృష్ణ భగవానుని దివ్యశక్తి వాటి యందు ప్రవేశించియుండుటయే కారణము.
🌹 🌹 🌹 🌹 🌹
[5:55 am, 26/10/2020] On Sriram**: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 71/ Vishnu Sahasranama Contemplation - 71🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 71. భూగర్భః, भूगर्भः, Bhūgarbhaḥ 🌻
ఓం భూగర్భాయ నమః | ॐ भूगर्भाय नमः | OM Bhūgarbhāya namaḥ
భూః గర్భే యస్య సః ఎవని గర్భమునందు భూమి ఉండునో అట్టివాడు.
:: పురుష సూక్తం / శ్వేతాశ్వతరోపనిషత్ - తృతీయోఽధ్యాయః ::
సహస్రశీర్షా పురుష స్సహస్రాక్ష స్సహస్రపాత్ ।
స భూమిం విశ్వతో వృత్వాఽత్యతిష్ఠ ద్దశాంగులమ్ ॥ 1 / 14 ॥
ఆ పరమాత్మ సహస్ర శీర్షములు గలవాడు, పూర్ణ పురుషుడు, సహస్ర నేత్రములు గలవాడు. సహస్ర పాదములు గలవాడు. ఆ పరమాత్మ భూమి తనలో కలిగియున్న విశ్వమంతయు వ్యాపించినవాడై అపారమైన భాగమును అధిష్ఠించి యున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
అధ్యాయము 5
🌻. దేవీ దూతసంవాదం - 1 🌻
ఉత్తరచరితము
మహాసరస్వతీ ధ్యానమ్
తన (ఎనిమిది) హస్తకమలాలలో ఘంట, శూలం, నాగలి, శంఖం, రోకలి, చక్రం, ధనుస్సు, బాణాలు ధరించేదీ, మబ్బు అంచున ప్రకాశిస్తుండే చంద్రునితో సమమైన కాంతి కలదీ, పార్వతీదేవి శరీరం నుండి ఉద్భవించినదీ, ముల్లోకాలకూ ఆధారభూతమైనదీ, శుంభుడు మొదలైన దైత్యులను వధించినదీ అయిన అపూర్వయైన మహాసరస్వతిని భజిస్తున్నాను.
1-2. ఋషి పలికెను :
పూర్వకాలంలో శుంభ నిశుంభులు * అనే రక్కసులు తమ బల గర్వాలతో ఇంద్రుని ముల్లోకాలనూ (ఆధిపత్యాన్ని), హవిర్భాగాలను హరించారు.
3. అలాగే ఆ ఇరువురూ సూర్య చంద్ర యమ వరుణ కుబేరుల అధికారాలు కూడా తమ వశం చేసుకున్నారు.
4. వాయువు అధికారాన్ని, అగ్ని కర్మను సైతం వారే నిర్…
[5:55 am, 26/10/2020] On Sriram**: 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 85 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -15 🌻
కాబట్టి, తీర్థ ఆరామ క్షేత్రాదులను దర్శించడం అనేది సంస్కారయుతమైనటువంటి వాటిలో భాగము. నిజానికి నీవు పొందగలిగితే నీ ఆత్మ స్వరూపాన్ని నీ హృదయ స్థానంలోనే, నీ హృదయాకాశములోనే, నీ బుద్ధి గుహలోనే, నీ అంతర్ముఖంలోనే నీవు పొందగలుగుతావు.
అలా పొందగలిగిన వారు, రోజూ జ్యోతిష్టోమాది కర్మలను ఆచరించే వారు, అలాగే పంచాగ్నులను ఒనర్చించేటటువంటి వారు, అలాగే త్రిణాచికేతాగ్నిని - నాచికేతాగ్నిని - రోజుకు మూడు సార్లు చయనం ఒనర్చేటటువంటివారు, ఎటువంటి స్థితిని ఆశ్రయిస్తున్నారో, ఎటువంటి లక్ష్యాన్ని అనుభవిస్తున్నారో, ఎటువంటి లక్ష్యసిద్ధిలో ప్రవేశిస్తున్నారో, వాళ్ళు కూడా ఆ కర్మ ఉపాసనకి లక్ష్యమైనటువంటి ఆత్మానుభూతి ఏదైతే ఉన్నదో, ఆ ఆత్మానుభూతిని, ఆ పరమాత్మ తత్వమునే, ఆ పరబ్రహ్మనిర్ణయమునే నొక్కి ఒక్కాణిస్తున్నారు. స్థిరముగా చెబుతున్నారు.
కాబట్టి, మానవులందరూ ఒకవేళ వేదాధ్యయనపరులైతే నేమో అలా అగ్ని సంచయనము ద్వారా, వాళ్ళు ఆత్మతత్వంలోకి ప్రవేశిస్తారు. అలా వేదాధ్యయనపరులు కాని వారు, తమ చిత్తశుద్ధితో, బుద్ధిగుహయందున్న, హృదయస్థానము నందున్న, స్వస్వరూప జ్ఞానమైన, స్వయం ప్రకాశకమైన ‘నేను’ ను పొందే ప్రయత్నం చేయాలి. అంతేకానీ, నీడ వలె ఉన్నటువంటి జీవాత్మను ఆశ్రయించరాదు అని చెబుతున్నారు.
(జీవాత్మ - పరమాత్మ లిరువురు కర్మ ఫలమును అనుభవించుటకు శరీరంలో ప్రవేశించినటుల చెప్పబడినది. జీవాత్మ మాత్రమే కర్మఫలమును అనుభవించును. ‘శరీరస్థోపి కౌన్తేయ నకరోతి నలిప్యతే’ - అని భగవద్గీతలో కూడా చెప్పినటుల పరమాత్మ కర్మలను ఒనర్చుట లేదు. వాని ఫలమును అనుభవించుట లేదు. అయినప్పటికి ఛత్రి న్యాయమున వారిద్దరూ అనుభవించుచున్నటుల చెప్పబడినది.)
ఇక్కడ మనకందరికి రావల్సిన సందేహం గురించి వ్యక్తీకరిస్తున్నారు. అంటే అర్థం ఏమిటంటే, ఏమండీ, పరమాత్మ సమస్త జీవుల హృదయాంతరాళములో ఉన్నాడన్నప్పుడు, అదే స్థానంలో జీవాత్మ కూడా ఉన్నాడన్నప్పుడు, మరి కర్మానుభవం జీవాత్మకు, పరమాత్మకు కూడా ఉండాలి కదా! అనేటటువంటి సందేహం మీకు రావచ్చు. కానీ, పరమాత్మ సమిష్టి స్వరూపుడు, జీవాత్మ వ్యష్టి స్వరూపుడు. ఇది ఒక శరీరం అనేటటువంటి పరిమితికి మాత్రమే చూడగలిగి అనుభవించ గలిగే పరిమితమైనటువంటి శక్తిగలవాడు జీవాత్మ.
సర్వవ్యాపకమైనటువంటి, సృష్టి యందు అంతటా వ్యాపించి ఉండి, ఏకకాలంలో సాక్షిగా ఉన్నటువంటివాడు పరమాత్మ. పరమాత్మ స్థితియందు ఏక కాలంలో, సర్వ సాక్షిత్వము ఉన్నది, సర్వ కర్తృత్వము ఉన్నది, సర్వ భోక్తృత్వము ఉన్నది. సర్వ హర్తగా కూడా ఉన్నాడు. కాబట్టి పరమాత్మ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడని చెప్పజాలము.
కాని జీవాత్మ ప్రారబ్ద, ఆగామి, సంచిత కర్మలు అనేటటువంటి త్రివిధ కర్మల చేత, కర్మచక్రంలో తిరగుతూ ఉంటాడు. వాని యొక్క సృష్టి స్థితి లయములు శరీరమును పొందడం అనేది ఈ కర్మఫలానుసారము కర్మచక్రమును అనుసరించి జరుగుతూ ఉంటుంది. కానీ, పరమాత్మ సంకల్ప సృష్టిగా సర్వసృష్టిని సృజించగలిగే సామర్థ్యం కలవాడగుట చేత, సర్వకర్త, సర్వభర్త, సర్వహర్త, సర్వభోక్త అయినటువంటి పరమాత్మ సర్వసాక్షి కూడా అయివున్నందున అతనికి కర్మఫలము లేదు.
దీనినే భగవద్గీతలో ‘నకరోతి, నలిప్యతే ’ శరీరములో ఉన్నప్పటికి, ‘శరీర అస్థోపి’ - శరీరము నందు ఉన్నప్పటికీ, ఆత్మ ‘న కరోతి, న లిప్యతే’. పని చేయదు, ఏమి పొందదు. ఏక కాలములో నీలో ఉన్నటువంటి సత్యనేను, యథార్థ నేను ఏదైతే ఉన్నదో, అది ఏమీ చేయుట లేదు. అదేమిటండీ? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్లు కనబడుతున్నారు కదా అంటే, నా యథార్థనేను మాట్లాడటం లేదు. నా చైతన్యనేను మాట్లాడటం లేదు. నా ఆత్మనేను మాట్లాడటం లేదు.
కాబట్టి, వ్యవహారిక నేను వేరుగా ఉన్నది. యథార్థ నేను వేరుగా ఉన్నది. వ్యవహారిక నేనుకు జీవాత్మ అని పేరు. ఏ నేనైతే చలించకుండా స్థిరముగా ఉన్నదొ, పరిణామము లేక ఉన్నదొ దానికి ఆత్మయని పేరు. ఈ రెంటి యొక్క యథార్థ స్వరూప స్వభావ స్థితులలో మనిషి సాధన పూర్వకముగా అర్థము చేసుకోవాలి.
నీలోపలికి నిన్ను నువ్వు అన్వేషించుకుంటూ పోవడం ద్వారా, నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారా, తనను తాను గుర్తెరగడం ద్వారా, సెల్ఫ్ రియలైజేషన్ [self realization] ద్వారా, ఆత్మానుభూతి ద్వారా, కదలని డాగలి మీద అనేక పనిముట్లు తయారైనట్లుగా తయారౌతుంది ఈ ప్రపంచమంతా. ఇది కూటస్థం అంటే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[5**: 🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 89 / Sri Gajanan Maharaj Life History - 89 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. 18వ అధ్యాయము - 3 🌻
శ్రీగజానన్ మహారాజు పవిత్ర పాదాలు తలుచుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఇలా అనుకుంటూ భవ్ చేతులు కట్టుకుని తన రక్షణకువచ్చి ఈవ్యాధినుండి తనని నయంచెయ్యమని శ్రీమహారాజును ప్రార్ధించాడు.
అర్ధరాత్రి, చిట్టచీకటి, నక్కలు అరుస్తున్న సమయంలో, ఒకచక్కని ఎడ్లజోడితో గూడుకల ఒక ఎడ్లబండి డాక్టరు ఇంటికి వచ్చింది. డాక్టరు తన మంచంమీద నుండి ఈవిధంగా బండివచ్చి తన ఇంటిదగ్గర ఆగడం చూడగలిగాడు. ఒక బ్రాహ్మణుడు ఆబండిలోనుండి దిగి డాక్టరు ఇంటి తలుపు కొట్టాడు. అతని సోదరుడు తలుపుతీసి ఆవచ్చిన వ్యక్తిని రాకకు కారణం అడిగాడు.
ఆ బ్రాహ్మణుడు తనపేరు గజ అని షేగాంనుండి తీర్ధం, అంగారుతో భవ్వర్ కొరకు వచ్చానని అన్నాడు. ఇంకా, బాధిస్తున్న ఆ శరగడ్డకు ఈఅంగారు రా…
[5:55 am, 26/10/2020] On Sriram**: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 54, 55 / Sri Lalitha Chaitanya Vijnanam - 54, 55 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
21. సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణ భూషిత
శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ
🌻 54. 'స్వాధీనవల్లభా' 🌻
అధీనుడైన భర్తకలది అని అర్థము. శ్రీదేవి శక్తి స్వరూపిణి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఆమె నుండియే ఉద్భవించును.
త్రిగుణములు, పంచభూతములు ఆమె నుండియే ఉద్భవించును. సమస్త దేవతలకు కూడ ఉద్భవకారిణి శ్రీదేవియే. శివుని నుండి ఆమె ఉద్భవించుట కూడ స్వచ్ఛందమే.
అట్లుద్భవించి, నర్తించి మరల శివునిలో చేరుట ఆమె క్రీడ. అందుచే ఆమె సర్వస్వతంత్రురాలు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 55 / Sri Lalitha Chaitanya Vijnanam - 55 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : …
[5:55 am, 26/10/2020] On Sriram**: 🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 31 🌹
https://mallapragadaramakrishna8.blogspot.com/2020/10/blog-post_25.html
[7:51 am, 26/10/2020] . Mallapragada: నవ్వు ల రేరాజు
రేరాజు వెన్నెలే
వెన్నెల లో బోసినవ్వుల పాప ఆటలే
అరనవ్వు అరవిరిసి
అరవిరిసి నవ్వు శసి
శసివదనుడు మనసు చేరి పాప ఆటలే
నవ్వె సుమనోహరము
మనోహర మమైకము
మమైక మధుర పులకింత పాప ఆటలే
పసిడి నవ్వు ల పాప
పాప మహిమల దీప
దీప మై మాయింట ముత్యాల ఆటలే
వెన్న లాంటి నవ్వులు
నవ్వుల తొ నయనాలు
నయనాల చూపులే ఆనంద మాటలే
ముసిముసి నవ్వల తో
నవ్వుల సందడి తో
సందడి సమయమంత హాయిగా ఆటలే
మెరుపు నవ్వు హరివిల్లు
హరివిల్లు చిరు జల్లు
చిరుజల్లులె మమతలల్లే పాప ఆటలే
చింతలు తీర్చు నవ్వు
నవ్వుతొ కరుగు కొవ్వు
కొవ్వు జివ్వున లాగేటి నవ్వు ఆటలే
ఆనంద శృతి నవ్వే
నవ్వు సరిగమ లవ్వే
లవ్వే ఇల్లంతా సంతోషపు ఆటలే
అలసట తీర్చు నవ్వు
నవ్వు తు మనసు ఇవ్వు
ఇవ్వు ప్రేమానురాగల ప్రేమ ఆటలే
నవ్వే ఔషదము గా
ఔషదము మంత్రముగా
మంత్రపు నవ్వుకాదు సంతోష ఆటలే
*(())**
[7:36 pm, 26/10/2020] . Mallapragada: సమ్మోహనాలు ... శిశువు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
231 . జ్ఞానమ నే నిప్పులు
నిప్పె సూర్య వెలుగులు
వెలుగే హృదయ తలపుల్లొ పుట్టె ధైర్యమ్ము
232 . నిప్పుకు కట్టె ఉండు
ఉండు కర్మకు ఉండు
ఉండు జ్ఞానమనే స్త్రీ సహనపు ధైర్యమే
233 . కట్టె నిప్పె దాహము
దాహమనే దేహము
దేహము ఆకలి నే తీర్చేది ధైర్యమే
234 . ఆనంద దేహమే
దేహమే జ్ఞానమే
జ్ఞాన ఆనందాను భూతిగా ధైర్యమే
235 . కోరికలు వెంటాడు
వెంటాడు మన్మధుడు
మన్మధుడు ఇంద్రియ ప్రవృత్తులు ధైర్యమే
236 . జీవనము తప్పదూ
తప్పదు స్త్రీ పొందూ
పొందు జ్ఞానాగ్నిలో భస్మమగు ధైర్యమే
237 . కాలక్రమ మంతయు
మంతయు దాహమ్ముయు
దాహముతో స్త్రీ పురుష సంగమ ధైర్యమే
238 . శిశువు జన్మ ఉదయం
ఉదయం తో హృదయం
హ్రదయం పంచి పోషణ ధర్మం ధైర్యమే
239 . కలియుగ శిశువు బతుకు
బతుకు కొత్త ఆశకు
ఆశ అనే ఆధునిక సంపద ధైర్యమే
240 . చేసేటి దానమ్ము
దానమ్ము ధర్మమ్ము
ధర్మమ్ము సుతులుగా అండగా ధైర్యమే
--(())--
[7:45 pm, 26/10/2020] On Sriram**: 🌹. గీతోపనిషత్తు - 60 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀 21. నిగ్రహము - అనుగ్రహము - తమను, తమ జీవితమును, తమ కార్యక్రమములను పరిపూర్ణముగ దైవమునకు సమర్పించి, అతని అనుగ్రహము కొరకే జీవించుట కర్మ సంగములేని మార్గము. 🍀
33. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ఙ్ఞానవానపి |
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి || 33 ||
భగవానుడు బుద్ధినికాని, తనను కాని ఆశ్రయించి కర్మమును చేయమని తెలుపుచు మరియొక ముఖ్యాంశమును ఆవిష్కరించు చున్నాడు. ఇది తెలిసినచో దైవమునకు శరణాగతియే మార్గమని, ఇతర మార్గములు పూర్ణశ్రేయోదాయకము కాదని తెలియును. ఇది తెలియుట ముఖ్యము.
ఎంత జ్ఞానవంతుడైనను ప్రకృతిలోని వాడేగదా! త్రిగుణముల కీవలివాడు జీవుడు, ఆవలివాడు దేవుడు. ప్రకృతి నుండి పుట్టిన జీవులు ప్రకృతిని దాటలేరు. తమ ప్రకృతికిలోనై మాత్రమే జీవించగలరు.
జ్ఞానవంతుడైననూ యింతియే సుమా, అని శ్రీ కృష్ణుడు హెచ్చరించుచున్నాడు. కావున ప్రకృతిని దాటుటకు దైవము యొక్క అనుగ్రహము, ప్రకృతి యొక్క కరుణయు ముఖ్యము. రెండునూ ఒకటియే. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు వంటి లోక పాలకులు కూడ ప్రకృతి మాయలో పడినవారే. పొరపాట్లు చేసినవారే. మరల దైవానుగ్రహము చేత, తమ స్థితియందు నిలిచిరి.
ఇక మానవులందలి జ్ఞానులెంత? వారి నిగ్రహమెంత? భగవంతుని అనుగ్రహమునకై ప్రయత్నింపవలెను గాని, నిగ్రహ మార్గము ననుసరించుట కాదు. మనో దేహేంద్రియములు ప్రకృతి యధీనమున నున్నవి. తన యధీనమున యున్నవని భావించు వాడు అవివేకి, అహంకారి. అందువలన చివరకు మిగులునది శరణాగతి మార్గమే.
తమను, తమ జీవితమును, తమ కార్యక్రమములను పరిపూర్ణముగ దైవమునకు సమర్పించి, అతని అనుగ్రహము కొరకే జీవించుట కర్మ సంగములేని మార్గము.
అహంకారమునకు లోబడియే బుద్ధి పనిచేయును. అహంకారము ప్రకృతికి లోబడి యుండును. అనగా గుణములకు లోబడి యుండును. కావున జ్ఞానియైననూ, దైవమునకు శరణమనవలసినదే. మరియొక మార్గము లేదు.
దీనివలన తెలియవలసిన ముఖ్యాంశమేమనగా, సమస్తము నందు దైవచింతన పెంచుకొనుటయే గాని, “కామము పారద్రోలుడు, ఇంద్రియములను నిగ్రహింపుడు, సద్భావములే కలిగి
యుండుడు, సత్ప్రవర్తనమే ఆశ్రయింపుడు” అని నినాదములు చేయుచు, బోధలు చేసినచో అవియన్నియు నిరుపయోగములు.
ప్రకృతి వశులగుటచేత ఎవ్వరునూ నిర్వర్తింపలేరు. దైవము నాశ్రయింపుడు, దైవచింతనము పెంచుకొనుడు, అనురక్తితో భజింపుడు, దైవమును కామింపుడు, ప్రేమింపుడు అను వాక్యములు పై నినాదముల కన్న మిన్నగ పరిష్కార మందించును.(3-33)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[7:45 pm, 26/10/2020] On Sriram**: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 256 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
60. అధ్యాయము - 15
🌻. నందావ్రతము - శివస్తుతి - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మునీ! తరువాత ఒకనాడు నేను నీతో గూడి తండ్రి ప్రక్కన నిలబడియున్న ఆ సతీ దేవిని చూచితిని. ముల్లోకముల సారభూతమైన ప్రకృతి ఆమెయే (1). తండ్రి నీకు, నాకు నమస్కరించి సత్కరించుటను చూచిన సతీదేవి ఆనందముతో లోకలీలను అనుసరించునదై భక్తితో మనలకు నమస్కరించెను (2). ఓ నారదా! మనమిద్దరము దక్షునిచే ఈయబడిన శుభాసనము నందు కూర్చుండి యుంటిమి. అపుడు నమస్కారము చేసి వినయముగా నిలబడియున్న సతిని చూచి నేను ఇట్లంటిని (3). నిన్ను ఎవడు ఏకాంత నిష్ఠతో ప్రేమించుచున్నాడో, ఓ సతీ! ఎవనిని నీవు ప్రేమించుచున్నావో అట్టి సర్వజ్ఞుడుస,జగత్ర్పభువు అగు దేవ దేవుని భర్తగా పొందుము (4).
ఏ ఈశ్వరుడు ఇతర స్త్రీని స్వీకరించలేదో, స్వీకరించుట లేదో, భవిష్యత్తులో స్వీకరించడో ఆతడు నీకు భర్తయగుగాక! ఓ శుభకరీ! నీ భర్తకు సాటి మరియొకరు లేరు (5). నారదా!మనము ఇట్లు పలికి చాలసేపు దక్షుని ఇంటిలో నుండి ఆమెను చూచితిమి. తరువాత దక్షుడు సాగనంపగా స్వస్థానమును పొందితిమి (6). ఆ మాటను విని దక్షుడు మిక్కిలి సంతసించెను. ఆతని చింత తొలగెను. ఆతడు తన కుమార్తెను దగ్గరకు తీసుకొనెను. ఆమె పరమేశ్వరియని ఆతడు ఎరుంగును (7). భక్తవత్సల, స్వేచ్ఛచే ధరింపబడిన మానవాకృతి గలది యగు సతీదేవి ఈ తీరున బాల్యమును అందమగు ఆట పాటలతో గడిపి, కాలక్రమములోబాల్యావస్థను దాటి ఎదిగెను (8).
ఆ సతీదేవి బాల్యమును దాటి ¸°వనములో అడుగిడెను. ఆమె సర్వాయవ సుందరియై యుండెను. ఆమె సన్నని దేహముతో శోభిల్లెను (9). దక్ష ప్రజాపతి ¸°వనములో అడుగిడిన ఆమెను చూచి, ఈమెను శివునకు ఇచ్చి వివాహమును చేయుట ఎట్లాయని ఆలోచించెను (10). ఆమె కూడా అదే కాలములో శివుని భర్తగా పొందవలెనని గోరెను. ఆమె తండ్రి మనస్సును ఎరింగి తల్లి వద్దకు వచ్చెను (11). పరమేశ్వరియగు ఆ సతీదేవి వినయముతో కూడిన మనస్సుగలదై, శివుని ఉద్దేశించి తపస్సునుచేయుటకై తల్లియగు వీరిణిని అనుమతిని గోరెను (12).
దృఢమగు వ్రతముగల సతీదేవి మహేశ్వరుని భర్తగా పొందుట కొరకై తల్లి అనుజ్ఞను పొంది ఇంటియందు ఆయనను ఆరాధించెను (13). ఆమె ఆశ్వయుజమాసములో పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులయందు పులిహోరను, మధురాన్నమును నైవేద్యమిడి శివుని భక్తితో పూజించుచూ గడిపెను (14). కార్తీక చతుర్దశినాడు చక్కగా తయారుచేసిన అప్పములను, పాయసములను నైవేద్యమిడి పరమేశ్వరుని ఆరాధించెను (15). మార్గశీర్ష కృష్ణాష్టమి నాడు నీటితో అభిషేకించి యవధాన్యపు అన్నమును నైవేద్యమిడి సతీదేవి శివుని మరల పాలతో అభిషేకించెను. ఆమె దినములనీ తీరున గడిపెను (16).
పుష్య శుక్ల సప్తమినాడు రాత్రియందు జాగరణము చేసి , ఆ సతి ఉదయము కూరగాయలతో కలిపి వండిన అన్నమును శివునకు నైవేద్యమిడి పూజించెను (17). ఆమె మాఘపూర్ణిమ నాడు రాత్రి యందు జాగరణము చేసి తడి బట్టలతో నదీ తీరముందు శంకరుని పూజించెను (18). ఫాల్గుణ కృష్ణ చతుర్దశి నాడు రాత్రి జాగరణము చేసి నాల్గు యామముల యందు మారేడు దళములతో విశేష పూజలను చేసెను (19). చైత్ర శుక్ల చతుర్దశి నాడు ఆమె రాత్రింబగళ్లు శివుని మోదుగు పుష్పములతో మరియు దమనము అనే సుగంధి పత్రములతో పూజించెను. మరియు ఆ మాసమును శివధ్యానముతో గడిపెను (20).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[7:45 pm, 26/10/2020] On Sriram**: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 144 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 18 🌻
132. అసలు సన్యాసికి ఇటువంటి నియమావళి మన సంప్రదాయంలో ఉంది. సన్యాసి పడుకున్నచోట అన్నం తినకూడదు. అన్నం తిన్నచోట పడుకోకూడదు. అంటే పగలు భోజనంచేసిన ఊళ్ళో రాత్రి నిద్రపోకూడదు. సన్యాసికి కేవలం మనసుమాత్రమే నిలకడగా ఉండాలి, శరీరం నిలకడగా ఉండకూదదు. అంతరంగంలో నిలకడ ఉండాలి.
133. జనపదాల విషయం వచ్చినప్పుడు, గృహస్తులవిషయం వచ్చినప్పుడు, సన్యాసి వాళ్ళ ఇళ్ళల్లో ఉండకుండా ఆశ్రమాన్ని నిర్మించుకుని దూరంగాపోవచ్చు. ఎవరికీ కనబడకుండా ఉండాలి. అందరికీ కనబడేటట్లు మధ్యలో ఉంటే, సన్యాసి అనిపించుకోడు.
జగత్పూజ్యుడు, జగద్గురువు అని ఎవరినయితే మన్నిస్తారో, అలాంటివారికి ఒక వేదన కలుగుతుంది. “నన్ను గురువు అని నమస్కారం చేస్తున్నాడు.
134. ఇతడి నమస్కారానికి నేను అర్హుణ్ణేనా? అతడికి చెప్పవలసినవన్నీ చెప్పానా? ఇతడికి నావలన ఏ ఉపకారమైనా జరిగిందా! నా బోధ సంపూర్ణమయిందా!” అనే వేదన గురువుకు ఉంటుంది. ఎందుకంటే, నమస్కారం స్వీకరించటం సులభమేకాని దానికి ప్రత్యుపకారం చేయటం సులభంకాదు. ఆశీర్వచనం చేయాలి. అదికూడా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేయాలి. ఇందులో శక్తి ఉండాలి, తపస్సు ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. ఇది తేలికయిన విషయమా! నమస్కారం ఎంతో సులభం.
135. ‘ఆ,కా,మా,వై’ – ఆషాదం, కార్తీకము, మాఘము, వైశాఖము – ఈ నాలుగు మసాలలోని పూర్ణిమలన్నీ కూడా పవిత్రమైనవి. చాతుర్మాస్య వ్రతాలని చెసుకుంటారు. చాతుర్మాస్య వ్రతాలు బ్రాహ్మణులకు – సన్యాసులకే కాదు, అందరికీ పవిత్రమయినవి. నేలమీద నిద్రపోవటము, మితాహారము, ధ్యానము, పరమసాత్వికమైన మనోభావాలతో కూడినటువంటి నియమబద్ధమైన జీవనం అవలంబించాలి అటువంటి జీవనంతో ఆ నాలుగుమాసాలు గడపాలి. ‘వైయాసికి’ అంటే వ్యాసుడి భావతం.
136. భాగవతం వ్యాసుడి హృదయం. ఆయన తపస్సు, హరిభక్తి, ఆయనే ప్రకారంగా ఈ సృష్టిని అర్థంచేసుకున్నాడో ఆ పరమార్థం, చరమంగా జీవులకేది క్షేమమని నిర్ణయించాడో ఆ జీవిత పరమార్థం అంతా పిండి ఒకచోట పెట్టి, ‘భాగవతం‘ మనకు ప్రసాదించాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. శివగీత - 99 / The Siva-Gita - 99 🌹*
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
ద్వాదశాధ్యాయము
🌻. ఉపాసనా విధి - 7 🌻
కోటి మధ్యాహ్న సూర్యభం - చంద్ర కోటి సుశీలతమ్ ;
చంద్ర సూర్యాగ్ని నయనం - స్మేర వక్త్ర సరో రుహమ్. 36
ఏకో దేవ స్సర్వ భూతేషు కూఢ
స్సర వ్యాపీ సర్వ భూతంత రాత్మా,
సర్వా ధ్యక్ష స్సర్వ బూతాధి వాస
స్సక్షీ చేతాకేవలో నిర్గునశ్చ. 37
ఏకో వశీ సర్వ భూతాంత రాత్మ
శ్యేకం బీజం నిత్య దాయఃక రోతి,
తంమాం నిత్యం యేను పశ్యంతి ధీరా
సైషాం శాంతి శ్వాశ్వతి నేత రేశామ్. 38
అగ్నిర్య థైకో భువనం ప్రవిష్టో
రూపం రూపం ప్రతి రూపో బభూవ,
ఏక స్తతా సర్వ భూతాంత రాత్మ
న లిప్యతే లోక దు: ఖేన బాహ్య : 39
వేదేహ యో మం పురుషం మహాంత
మాదిత్య వర్ణం తమసః పరస్తాత్,
స ఏవ విద్వానమృతో త్ర భూయా
న్నాన్య: పంథా అయనాయ విద్యతే. 40
కోటి సంఖ్యాక మైన సూర్యులతో సమానమగు కాంతియు కోటి సంఖ్యాకమైన చంద్రులతో సమానమగు శీతలత్వము గల యట్టి సూర్య చంద్రాగ్ని నేత్రములు కల నా ముఖ పద్మమును స్మరించుము.
సమస్త ప్రాణుల యందు న్నట్టి, సర్వ వ్యాపి, సర్వాంత ర్యామియు నైన సర్వేశుడు నిర్గునుడగు సర్వ సాక్షి యోక్కడే అయియున్నాడు. సర్వ భూతంతర్గత మై ప్రదాన భీజమగు నన్ను ధ్యానించు వారికి శాశ్వత మైన ముక్తి లభించును. అన్యులకు లేదు.
అగ్ని యొక్కటే అయినను ఏ ప్రకారము గ భువనములలో అనేకాకార ములైన పదార్ధములలో ప్రవేశించి యనే కాకారాములుగా నగు పడినను నిరాకారము గానే యుండు నట్లు ఒక్కడైన పరమేశ్వరుడు సమస్త భూతములందుయును ప్రవేశించి యున్నను సంసారిక సుఖ దుఖము ల కతీతుడై ప్రత్యేకముగా నుండును.
( నిర్తిప్తుడని తాత్పర్యము ) నన్ను అతి ప్రాచీనుని గాను, మహాత్ముని గాను, సూర్య కాంతిక లాడి ని గాను, నన్ను తెలిసికొనిన యెడల విముక్తిని పొందుదువు. పండితునికి మోక్షమును కింతకంటే మరొక మార్గము లేదు.
హైరన్య గర్భం విదధామి పూర్వం
వేదాంశ్చత స్మై ప్రహినోమి యోహమ్,
తం దేవ మీడ్యం పురుషం పురాణం
నిశ్చిత్య మాం మ్రుత్యుముఖాత్స్ర ముచ్యతే. 41
ఏవం శాన్త్యాది యుక్తస్సన్ - వేత్తిమాం యస్తు తత్వతః ;
నిర్ముక్త దుఃఖ సస్తాన - స్సొంతే మయ్యేవ లీయతే. 42
ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతయాం ద్వాద శో ధ్యాయ:
నన్ను మొదట (ప్రప్రథమున ) బ్రహ్మను పుట్టించి వాడికి వేదములొసగిన వాడిని గాను, పురాణ పురుషుని గాను దేవ వంద్యుని గాను తెల్సి కొనిన వాడు మృత్యువాత బడడు,
శమద మాది గుణములతో కూడుకొనిన వాడై ఈ విధముగా నన్ను తెలిసికొనునో అట్టి వాడు దుఖములనుబరి త్యజించి నాలో నైక్యమందుచున్నాడు .
ఇది పద్మ పురాణాన్తర్గత మగు శివ గీతలో పండ్రెండవ అధ్యాయము సమాప్తము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹