Wednesday, 7 October 2020

*🌻. ఆత్మను తెలుసుకొను విధము -01 🌻

 *🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 71 🌹*

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 

📚. ప్రసాద్ భరద్వాజ.../Mallapragada Sri Devi Rama Krishna (10-10-2020)


*🌻.   ఆత్మను తెలుసుకొను విధము -01 🌻*

ఇప్పుడు ఆత్మను తెలుసుకొను విధము చెప్పబడుచున్నది.

        పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిమాణముగల శ్యామాదికము కంటెను మిక్కలి సూక్ష్మమైనది. మహత్‌ పరిమాణము గల ఆకాశాదికము కంటే మిక్కిలి మహత్తరమైనది. సర్వవ్యాపకమగుట చేత పిపీలికాది బ్రహ్మపర్యంతము వ్యాపించి ఉన్నది.

అందుచేత అణువుకంటే అణువుగాను, మహత్తుకంటే మహత్తుగాను ఉన్నది. మరియు ప్రాణుల బుద్ధి గుహయందు లేక హృదయాకాశమునందు ఈ ఆత్మ ఉన్నది. అట్టి ఆత్మను తన హృదయాకాశమున సాక్షాత్కారము చేసికొనటకు ఆ క్రతువు అనగా నిష్కామ కర్మలను ఆచరించువాడు కాంచుచున్నాడు. 

ఎందుచేత ననగా వేద విహిత కర్మలను ఫలాపేక్షలేక, ఆచరించువాని చిత్తము నిర్మలమగును. ఎప్పుడు ఇంద్రియములు, మనస్సు నిర్మలమగునో అప్పుడు వాని బుద్ధియూ ప్రసన్నముగా నుండును. బాహ్యవిషయముల నుండి మరలిన బుద్ధి మాత్రమే పరమాత్మ మహిమను తెలిసికొనును. ఇట్లు తెలుసుకొనిన వాని శోకము నశించును, ఆత్మానందము అనుభవించును.

        ఆత్మ యొక్క విధానమును తెలుసుకోవటానికి, ఆత్మను తెలుసుకొనే విధానాన్ని విస్తారంగా చెప్పేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు యమధర్మరాజు గారు నచికేతుని ద్వారా. పరమాత్మ మిక్కిలి సూక్ష్మ పరిమాణముగల శ్యామాదికము కంటెను మిక్కిలి సూక్ష్మమైనది. ‘శ్యామాదికము’ - అనే ఉపమానము వేశారు ఇక్కడ. ‘శ్యామాకాశ్చమే’ - అని నమకం, చమకం అనే రుద్రంలో వస్తుంది. 

అంటే, అర్థం ఏమిటంటే జడ చేతన సృష్టిలో, జడ సృష్టి అయినటువంటి వృక్షములు ప్రథమ విత్తనము. దాని పేరు శ్యామకము అని పేరు, శ్యామాకాశ్చమే.. మరొక వాచ్యార్థంలో శ్యామకము అంటే ‘చామదుంపలు’ అని కూడా అర్థం. అంటే ప్రథమముగా ఏర్పడినటువంటి దుంప ఏదైతే ఉందో, ఏదైతే మరల మరల పుట్టడానికి అనుకూలమైనటువంటి అవకాశం ఇచ్చేటటువంటి విత్తనం ఏదైతే ఉందో, ఆ విత్తనం కంటే కూడా మిక్కిలి సూక్ష్మమైనటువంటిది. 

మర్రి విత్తనంలో మర్రిచెట్టు దాగి వుంది. మర్రి విత్తనం ఆవగింజ అంత వుంది. కానీ మర్రి చెట్టు మహావృక్షం. మరి ఈ ఆవగంజంత ఉన్నటువంటి విత్తనం లోపల, అంత పెద్ద మర్రి చెట్టు ప్రావిర్భవింప చేయగలిగేటటువంటి శక్తి ఆ విత్తనంలో ఇమడ్చబడివుంది.

        కాబట్టి పదార్థము కంటే శక్తి సూక్ష్మమైనది. శక్తి కంటే ఆధారభూతమైనటువంటి చైతన్యము సూక్ష్మము. చైతన్యము కంటే ఆత్మ సూక్ష్మము. ఆత్మ కంటే పరమాత్మ మిక్కిలి సూక్ష్మమైనది.

కాబట్టి, ఈ రకంగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటటువంటి స్థాయీ భేదములతో... ఇది వివరించ పూన బడుతుంది. ఎంత సూక్ష్మ తరమైతే, అంత వ్యాపక ధర్మాన్ని కలిగి వుంటుంది. ఈ అంశాన్ని మనము వైజ్ఞానిక శాస్త్రంలో కూడా నిరూపించాము.

        ఉదాహరణ: ఎక్స్‌ రే కిరణాలు మన కంటికి కపపడవు. సూర్యకాంతి మన కంటికి కనబడుతున్నట్లుగా తోస్తున్నది. కానీ ఎక్స్‌ రే కిరణాలు కనపడవు. అందువలననే మనిషి ద్వారా అవి ప్రసరింపబడి ఆ ఎక్స్‌ రే ఫిల్మ్‌ తయారౌతుంది. 

అంటే, కంటికి కనపడనటువంటి సూక్ష్మతర, సూక్ష్మతమ... ఆల్ఫా, బీటా, గామా ఇలా చాలా కిరణాలు వున్నాయి. చాలా వలయాలు కూడా వున్నాయి. చాలా తరంగ దైర్ఘ్యాలు కూడా వున్నాయి. ఈ తరంగముల యొక్క, ఈ కిరణముల యొక్క పౌనఃపుణ్యము [frequency] వలన మనము ఎంతగా లోపలికి చొచ్చుకుపోతూ ఉంటామో అంతగా వ్యాపక ధర్మం కూడా వుంది. 

కాబట్టి ఎలక్ట్రో మేగ్నటిక్‌ ఫీల్డు ని గనక మనం అంటే విద్యుదైస్కాంత తరంగ దైర్ఘ్యములను కనుక మనం ఫ్రీక్వెన్సీ ని గనక మనం డీ-కోడ్‌ చేసినట్లయితే, ఈ సృష్టి యందంతటా వ్యాపకమైనటువంటిది ఆ విద్యుదయస్కాంత తరంగములే. కాబట్టి, ఒక సత్యాన్ని తెలుసుకోవాలి. 

ఎంతగా స్థూలమైతే, అంతగా పరిమితించబడిపోతున్నావు. ఎంతగా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అవుతూ ఉంటావో అంతగా వ్యాపకత్వాన్ని కలిగివుంటావు.

“తనను అన్నిటి యందునూ, అన్నిటిని యందునూ తనను దర్శించగలగినటువంటి ధీరుడు ఎవడో వాడు ఆత్మ నిష్ఠుడు” మరియు ప్రాణుల బుద్ధి గుహయందు లేక హృదయాకాశమునందు ఇది వున్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిశోధన. మానవులందరూ కూడా బుద్ధి యొక్క గుహ ఎక్కడ ఉన్నదో అదే హృదయస్థానము. అట్టి హృదయము నందు మరల ఆకాశ స్థానము వున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

 గ్రామ కంఠం : గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అం టారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.

అసైన్డ్‌భూమి : భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.

ఆయకట్టు : ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.

బంజరు భూమి (బంచరామి) : గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.

అగ్రహారం : పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.

దేవళ్‌ ఇనాం : దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.

అడంగల్‌ (పహాణీ) : గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.

తరి : సాగు భూమి

ఖుష్కీ : మెట్ట ప్రాంతం

గెట్టు : పొలం హద్దు

కౌల్దార్‌ : భూమిని కౌలుకు తీసకునేవాడు

కమతం : భూమి విస్తీర్ణం

ఇలాకా : ప్రాంతం

ఇనాం : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి

బాలోతా ఇనాం : భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి

సర్ఫేఖాస్‌ : నిజాం నవాబు సొంత భూమి

సీలింగ్‌ : భూ గరిష్ఠ పరిమితి

సర్వే నంబర్‌ : భూముల గుర్తింపు కోసం కేటాయించేది

నక్షా : భూముల వివరాలు తెలిపే చిత్రపటం

కబ్జాదార్‌ : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి

ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) : భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.

ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌ : దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.

బందోబస్తు : వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.

బీ మెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.

పోరంబోకు : భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.

ఫైసల్‌ పట్టీ : బదిలీ రిజిస్టర్‌

చౌఫస్లా : ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.

డైగ్లాట్‌ : తెలుగు, ఇంగ్లిఫ్‌ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.

విరాసత్‌/ఫౌతి : భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.

కాస్తు : సాగు చేయడం

మింజుములే : మొత్తం భూమి.

మార్ట్‌గేజ్‌ : రుణం కోసం భూమిని కుదవపెట్టడం.

మోకా : క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).

పట్టాదారు పాస్‌ పుస్తకం : రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.

టైటిల్‌ డీడ్‌ : భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.

ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) : భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.

ఆర్‌ఎస్సార్‌ : రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.

పర్మినెంట్‌ రిజిస్టర్‌ : సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.

సేత్వార్‌ : రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.

సాదాబైనామా : భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.

దస్తావేజు : భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.

ఎకరం : భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.

అబి : వానకాలం పంట

ఆబాది : గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు

అసైన్‌మెంట్‌ : ప్రత్యేకంగాకేటాయంచిన భూమి

శిఖం : చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం

బేవార్స్‌ : హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.

దో ఫసల్‌ : రెండు పంటలు పండే భూమి

ఫసలీ : జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.

నాలా : వ్యవసాయేతర భూమి

ఇస్తిఫా భూమి : పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి

ఇనాం దస్తర్‌దాన్‌ : పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి

ఖాస్రాపహానీ : ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.

గైరాన్‌ : సామాజిక పోరంబోకు

యేక్‌రార్‌నామా : ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం.....
ఇది UP లోని నైమిషారణ్యం లోని చక్ర తీర్థం...మీరు నీళ్ళల్లోకి దిగితే మీ ప్రమేయం లేకుండానే చక్రం లాగా తిరుగుతారు....ఇది బ్రహ్మ సృష్టి

 

No comments:

Post a Comment