హిందూ వివాహ మంత్రములు :
పాణిగ్రహణమ్ :
గృహ్ణామితే సుప్రజాస్త్వాయ హస్తం
మయా పత్వా జరదష్ఠిర్యథా సహ|
భగో అర్యమే పవితా పురంధి ర్మహ్యం త్వాదుర్గార్హపత్యాయ దేవా||
పెద్దల ఆశీస్సులతో మన దాంపత్యజీవితము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో
తులతూగాలని భగవంతుని ప్రార్థిస్తూ
నీ పాణిని అందుకొంటున్నాను.
సుముహూర్తం :
ధ్రువం తే రాజా వరుణో
ధ్రువం దేవో బృహస్పతి
ధ్రువంత ఇంద్ర శ్చాగ్ని
రాష్ట్రం ధారయతాం ధ్రువం.
రాజైన వరుణుడు, దేవతలైన బృహస్పతి,ఇంద్రాగ్నులు
ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు మన ఇరువురిపై
ప్రసరించి మన వివాహబంధం-నూతనోత్తేజాన్ని
పొందుతూ, జీలకర్ర బెల్లంవలె కలిసియుండే
స్థిరత్వాన్ని ఇవ్వాలని ఈ మిశ్రమాన్ని శిరస్సుపై ధరిస్తున్నాము.
మాంగల్యధారణ :
మాంగళ్యంతంతునా నేన
మమ జీవనహేతునా|
కంఠే బధ్నామి సుభగే
త్వం జీవ శరదాం శతమ్
నూరు సంవత్సరాలు మెండైన,నిండైన ఆనందం కోసం,
ఆయురారోగ్యాల కోసం, మంగళప్రదమైన ఈ మాంగల్యాన్ని
నీ కంఠమునందు ధరింపజేయుచున్నాను.
తలంబ్రాలు :
పశవో మే కామః సమృధ్యతామ్
యజ్ఞో మే కామః సమృధ్యతామ్
శ్రీయే మే కామః సమృధ్యతామ్
యశో మే కామః సమృధ్యతామ్
పాడిపంటల అభివృధ్ధి యజ్ఞ యాగాదుల
వృధ్ధి,కీర్తి ప్రతిష్టల అభివృధ్ధి,శుభముల అభివృధ్ధి,
కొరకు ఈ తలంబ్రాలు పోసుకొనుచున్నాము.
👣 సప్తపది👣
సఖా సప్తవదా భవ, సఖయో సప్తపదా
బభూవ,సఖ్యంతే గమేయం,సఖ్యాతే మా
యోషం,సఖ్యా న్మే మా యోష్ఠాః సమాయవః
సంకల్పావహై సంప్రియో రోచిష్ణూ సుమన
స్సమనౌ ఇష మూర్జమభి సంవసనౌ సంనౌ
మౌనాంసి సంప్రతా సము చిత్తాస్వకరమ్
మొదటి అడుగు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని,
రెండవ అడుగు తుష్టిని,పుష్టిని కలిగి కలిసిమెలిసి యుండాలని
మూడవ అడుగు సంపద కలగాలని
నాల్గవ అ
డుగు సుఖసంతోషాలను సమానంగా పంచుకోవాలని
ఐదవ అడుగు సత్ సంతానము పొందాలని
ఆరవ అడుగు కలకాలం కలిసి జీవించాలని
ఏడవ అడుగు జీవితాంతం స్నేహితులుగా జీవించాలని
అగ్ని సాక్షిగా ఈ ఏడడుగులు వేయుచున్నాము.
సేకరణ :
మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
నవ గ్రహముల జననము 👍👌💐
1) సూర్యుడు : శ్రీ కశ్యప బుషికి దక్షుని పుత్రికయగు అదితికిని "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను(ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని
అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని
అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెనుసూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను
సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను
తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెనుయముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను
వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు
2) చంద్రుడు : అత్రి మహర్షి అనసూయల సంతానం
అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను(నందన నామ సంవత్సర కార్తీక శుద్ద చతుర్థశి)సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను
చంద్రుని పుత్రుడు బుధుడు
3) కుజుడు : శివుని నిండి వెలువడిన తేజము పార్వతీ దేవి గ్రహించి గర్భవతి అవగా ఆమే అఆ తేజమును భరింపలేక భూదేవికి ఇచ్చెను ఆమే ఆ తేజమును ధరింపగా "కుజుడు"(అంగారకుడు) జన్మించెను(అక్షయ నామ సంవత్సరం వైశాఖ బహుళ విదియ)రుద్రుని తేజము విష్ణువు సంరక్షణ భూదేవి ఓర్పు లభించినవాడు కనుక గ్రహమండలమున స్థానమునొందెను
4) బుధుడు : సోమునకును రోహిని తారకు బుదుడు జన్మించెను(సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశి)బుదునికి వైరజకిని పురూరవుడు జన్మించెను
5) బృహస్పతి : సురూప ఆంగీరసులకు "బృహస్పతి" జన్మించెను(సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి)ఇతని భార్య "తారాదేవి"
ఇతడిని దేవతలకు గురువుని చేసెను కనుక ఇతడిని
"గురుడు" అనెదరు
6) శుక్రుడు : భృగు ప్రజాపతికిని ఉషనలకు సంతానం
"ఉశనుడు" జన్మించెను(మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి)కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెను
పరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని "శుక్రుడు" అనెదరుఅత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు కనుక రాక్షసులు శుక్రుడిని వారి గురువుగా పొందిరి
నాటి నుండి "శుక్రచార్యునిగా" పెరుపొందెను
గ్రహమండలమున స్థానంపొందెను
7) శని : సూర్యునికి ఛాయ దేవికిని కలిగిన సంతానమే "శని" ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను(వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి)ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు
త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు
గ్రహమండలమున స్థానం పొందెను
8) రాహువు : కశ్యప మహర్షికి సింహికకును "రాహువు" జన్మించెను
ఇతడు రాక్షల లక్షణములు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు(రాక్షస నామ సంవత్సరం కృష్ణ చతుర్థశి)క్షీర సాగర మథనంలొ లబించిన అమృతాన్ని మహావిష్ణువు "మోహిని"అను రూపముతో పంచుతున్నపుడు రాహువు దేవతల రూపం దాల్చి అమృతమును గ్రహించెను సూర్యచంద్రులు చూసి విష్ణువుకి చెప్పగా తన చక్రముతో రాహువు తల ఖండించెను అమృత ప్రభావంతో తల మొండెము జీవముతో ఉండుటచేత పాము శరీరం అతకబడింది
9) కేతువు : విష్ణువుచే ఖండింపబడిన రాహువు శరీరముకు పాము తల తగిలించి కేతువు అని నామం పెట్టిరి
ఇతని భార్య పేరు చిత్రలేఖరాహు కేతువులు ఇరువురు గ్రహమండలమున ఛాయగ్రహములుగా గుర్తింపునొందిరి...
నవ గ్రహ దేవతల జన్మ వృత్తాంతములు చదివిన ఆపదలు తొలిగి మహా యశస్సు పొందెదరు
ఆయుష్యు ఆరోగ్యం సంకల్ప సాఫల్యము కలుగును
నవ గ్రహముల అనుగ్రహము కలిగి సర్వత్రా శుభమగును.
(అని బ్రహ్మ పురాణమందు చెప్పబడెను).

*సప్తపది*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃః*
👣👣👣👣👣👣👣
*సఖాసప్తపదాభవ ....*
*అనగా ఆఇద్దరూ ఏడడుగులు కలసి నడిస్తే మిత్రత్వం కల్గుతుందని శాస్త్రం.*
వరుడు వధువు నడుముపై చేయి వేసి దగ్గరగా తీసుకొని అగ్ని హోత్రమునకు దక్షిణ వైపువున నిలబడి తూర్పు 7 ఉ దిక్కు వైపుగా ఇద్దరూ ముందుగా కుడి అడుగు పెట్టి ఏడడుగులు నడవాలి.
ఒక్కో అడుగుకి ఒక్కొక్క అర్థం వచ్చే మంత్రం చెపుతాడు పురోహితుడు.
*1. మొదటి అడుగు:*
*ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు...*
ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరినీ ఒక్కటి చేయుగాక.
*2. రెండవ అడుగు:*
*'ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు...*
ఈ రెండవ అడుగుతో మనిద్దరకు శక్తి లభించు నట్లు చేయు గాక.
*3. మూడవ అడుగు:*
*'త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు...*
ఈ మూడవ అడుగు వివాహ వ్రత సిద్ధి కొరకు విష్ణువు అనుగ్రహించు గాక.
*4. నాల్గవ అడుగు:*
*చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు...*
ఈ నాలగవ అడుగు మనకు ఆనందమును విష్ణువు కలిగించు గాక.
*5. ఐదవ అడుగు...*
*పంచ పశుభ్యోవిష్ణు త్వా అన్వేతు...*
ఈ ఐదవ అడుగు మనకు పశుసంపదను విష్ణువు కలిగించు గాక.
*6. ఆరవ అడుగు..*
*షృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు...*
ఈ ఆరవ అడుగు ఆరు ఋతువులు మనకు సుఖమునిచ్చుగాక.
*7. ఏడవ అడుగు...*
*సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు...*
ఈ ఏడవ అడుగు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణు అనుగ్రహించు గాక.
*[మూలం.ప్రాచీన తాళ పత్ర నిధులలోని సాంప్రదాయక శాస్త్ర పీఠం. అచార, ధర్మములు - ఆలోచనలు.రచన: బ్రహ్మశ్రీ గుత్తికొండ వేంకటేశ్వర్లు.]*
*సేకరణ:*
*🙏🏿💲💲💲🙏🏿*
*9440483355*
*సుదర్శనం.........*
*_మనల్ని కించపరిచే వాళ్ళు,_*
*_ఎగతాళి చేసేవారు,_*
*_మనచుట్టూ చాలామందే ఉంటారు._*
*_కొంతమంది బహిరంగంగా,_*
*_మరి కొంతమంది చాటుగా,_*
*_మనల్ని విమర్శిస్తుంటారు.._*
*_వాటిని మనం పట్టించుకోనంత కాలం,_*
*_మన దారి సుగమనమే....._*
*_ఎప్పుడైతే వాటిని పట్టించుకుంటావో,_*
*_ఆ క్షణమే నీ పతనానికి పునాది రాయి పడ్డట్టు......_*
*_💲పది మందిలో నలుగురిలా బతకడం కన్నా,_*
*_ఆ పది మంది కోసం,_*
*_నలుగురిని చైతన్యం చేస్తూ,_*
*_బతకడమే నిజమైన మనిషి లక్షణం....._*
*_నెగిటివిటీ మరియు డ్రామా నుండి,_*
*_ఎప్పుడైతే మనం దూరం అవుతామో,_*
*_అప్పుడే మన జీవితంలో,_*
*_అందమైన విషయాలు జరుగుతాయి.._*
💲ఒకరిని ఇష్టపడినప్పుడు
తన తప్పులు కూడా ఒప్పుగానే కనిపిస్తాయి...
కాని, అదే మనిషిని ద్వేషించటమో లేక
దూరం చేయటమో మొదలు పెడితే
తన ఒప్పులు కూడా ఒక్కోసారి తప్పుగానే కనిపిస్తాయి...
ఉన్న మంచితనం కాస్త మరుగున పడిపోతుంది
తేడా తనలో లేదు.
మనం, తనని స్వీకరించే విధానంలో ఉంది...
*వెన్నను మంటపై కాచితే ఏవో శబ్దాలు వినిపిస్తాయి. ఇది నెయ్యిగా మారిన పిదప ఇక ఏ చప్పుడు ఉండదు. అసంపూర్ణంగా జ్ఞానం కలవారు , చర్చలు, వ్యాఖ్యానాలు చేస్తారు. పూర్తిగా తెలిసినవారి నోట ఏ శబ్దం రాదు*
_" 💲యుద్ధంలో వెయ్యి మంది వీరులను సంహరించేవాడికన్నా తన మనస్సును తాను జయించినవాడే నిజమైన వీరుడు "_
మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి. కష్టాలలో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్లాలి
*ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి....*
*నిప్పు కణీకవొలె ని...*
చెడ్డవారితో స్నేహం నిప్పు కణికల వలే కాల్చి మనకు చేటును తెస్తుంది. మంచి వారి స్నేహం మధురంగా ఉండి,మనకు మేలు చేస్తుంది......
*💲ఎరలేని గాలం*
వ్యర్థ ప్రయత్నం అనే అర్థంలో......
గాలానికి ఎరను గుచ్చి వేట ప్రారంభించినప్పుడే చేపలు గాలానికి చిక్కుతాయి. ఎర లేకుండా ఒక్క గాలాన్నే వదిలితే దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు. అలాగే ఒక లక్ష్యాన్ని చేరాలనుకొన్నప్పుడు దానికి తగిన సాధనాలన్నిటినీ సమకూర్చుకొని ముందుకు నడవాలి. అంతేకానీ ఏమీ లేకుండా వెళితే పని జరగదు.....
💗💲💲💲
*ఎవరినైనా 'ఛెళ్లు'మని కొడితే, వాతలు తేలుతాయి. ఎందుకు....*
మన శరీరంలో చెంపపై ఉండే చర్మం మిగతాభాగాలపై ఉండే చర్మంకన్నా మెత్తగా, సున్నితంగా ఉంటుంది. ఎవరినైనా చెంపపై కొడితే చర్మం కింద ఉండే జీవకణాలు తమ నిరోధక శక్తిని కోల్పోయి చిట్లి చెల్లాచెదురవుతాయి. ఆ ప్రభావాన్ని తగ్గించడానికి అక్కడ మామూలుకన్నా అధికంగా తెల్లరక్తకణాలు అవసరమవుతాయి. వాటిని సరఫరా చేసే క్రమంలో ఆ ప్రాంతానికి రక్తప్రసరణ అధికంగా జరుగుతుంది. దీనికి తోడు అక్కడ పగిలిపోయిన కణాలలోని ద్రవం కూడా ఆ రక్తంలో కలవకుండా తెల్లకణాలు నెట్టివేస్తాయి. ఈ ప్రక్రియలో చేతివేళ్లు తీవ్రంగా తాకిన చోట చెంప మీది చర్మం కమిలి వాతలు ఏర్పడతాయి.
*💲అష్టగంధాలు :* కర్పూరం, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, అత్తరు, శ్రీగంధం
*అష్ట దిక్పాలకులు :* - ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు
*అష్టలక్ష్ములు :* - ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సంతాన, ఆది, గజ
*అష్టస్థాన పరీక్ష :* - నాడి, మూత్ర, మల, జిహ్వ (నాలుక), శబ్ద, స్పర్శ, దృక్కు, ఆకృతి ల పరీక్ష
*💲అష్టదోషములు :* 1.చంద్రునిలో కళంకము, 2.హిమగిరియందు మంచు, 3.సముద్రునియందు ఉప్పు,
4.చందన వృక్షములనీడన త్రాచుపాములు, 5.పద్మములకు ముండ్లు, 6.సుందరీమణులకు వృద్దాప్యము, 7.కుచములకు పతనము, 8.విద్యావంతులకు దారిద్రము....
💲లక్ష్యం ఉన్నతమైనది అయితే...
కష్టం నిన్ను బాధించదు
కొండ ఎక్కాలనే సంకల్పం...
ఆయాసాన్ని లెక్కచేయదు
ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకునే క్రమంలో...
ఎదురయ్యే సవాళ్లే పునాదిరాళ్లు.
If the goal is Superior ...
Difficulty does not bother you.
Willingness to climb the hill ...
Does not count fatigue.
In order to acquire a superior personality ...
The challenges encountered are the foundation stones.
*ఎవరితో జీవితాంతం బ్రతకాలో తెలిపేదే ప్రేమ కాదు...*
*ఎవరు లేకుంటే జీవితంలో ఒక్క క్షణం కూడా బ్రతకలేమో తెలిపేదే ప్రేమ....*
*💲జీవితం సులభంగా ఉండదు.. మనమే దృఢంగా ఉండాలి*
*విజయం సంతోషానికి కారణం కాదు.. సంతోషమే విజయానికి కారణం. అందుకే ఏది ఏమయినా సంతోషాన్ని, మన శాంతిని దూరం చేసుకోకండి*
మనం అంటే నమ్మని చోట...
మనమెంత నీతి, నిజాయితీగా ఉన్న వ్యర్థమే... నీటి పై బుడగ లాగా...
💲ఎదుటి వారిని నమ్మాము కాబట్టి, నాలుగు కాలల పాటు కలిసుంటాం.
ఎంత భాద ఉన్న,కోపమున్న విడిపోలేని బంధాల్ని ఏర్పరుచుకోవటం చాలా గొప్ప వ్యక్తిత్వం.
అనుమానం ఆయుష్షుని సైతం తగ్గిస్తుంది.
🤍💲💲💲
మనోజయము ముఖ్యమైనటువంటి సాధన. ఏవండీ? జ్ఞానం ముఖ్యమా? యోగం ముఖ్యమా? ఏవండీ ప్రాణాయామము ముఖ్యమా? యోగాసనాలు ముఖ్యమా? ఏవండీ, సరిగ్గా కూర్చోవడం ముఖ్యమా? శరీరం నిటారుగా పెట్టడం ముఖ్యమా? కనులు మూసుకోవడం ముఖ్యమా? శరీర జపం చేయడం ముఖ్యమా? జపమాలతో జపం చేయడము ముఖ్యమా? పైకి చదువుతూ జపం చేయడం ముఖ్యమా? మానసిక జపం ముఖ్యమా? ఇట్లా అనేక రకాల ప్రశ్నలు మానవులు సాధనల గురించి, ఎన్నో ప్రశ్నలు అన్నీ ఇన్నీ కాదు, ఎన్నో, ఎన్నో సందేహాలు.
💲ఇవన్నీ కూడా ఒకే ఒక్క లక్ష్యంతో ఏర్పరచబడ్డాయి. ఏమిటంటే ‘మనోజయం’. నీ మనస్సును జయించడం అనేటటువంటి పనిని పెట్టుకున్నట్లయితే నువ్వు ఇవన్నీ అందులోనే ఒనగూడిపోతాయి. ఈ సందేహాలు ఏవీ ఉండవు. ఈ సందేహాలు అన్నింటిని ఒకే ఒక ప్రశ్నతో పరిమారుస్తారు. ఏమిటి? మనసు అనే కళ్ళెం నీ స్వాధీనంలో ఉండాలి.
తద్వారా దశేంద్రియములు, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, ప్రాణేంద్రియ, విషయేన్ద్రియ, అంతరేంద్రియ సంఘాతం అంతా కూడా ఐదు ఐదుల ఇరవై ఐదు పిండాండములో ఉన్న ఐదు ఐదుల ఇరవై ఐదు జ్ఞాత స్వాధీనమై ఉండాలి. జ్ఞాత యొక్క ప్రభావం చేతనే, మిగిలిన 24 పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి జ్ఞాతే సత్యస్వరూపుడు. జ్ఞాతే నిత్యస్వరూపుడు, యధార్థ నేను.
నేను తెలుసుకునేవాడను, అన్యము లేదు. అనేటటువంటి, సరైయైనటువంటి నిశ్చయాన్ని, నిర్ణయాన్ని పొందేటట్లుగా, తన గమ్యస్థానమైనటువంటి పరమాత్మ కూటస్థ స్థితికి చేర్చడానికి, ఈ రధాన్ని ఉపయోగించుకోవాలి అనేది, సుస్పష్టముగా రధమును ఉపమానంగా పెట్టి, మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియములను, ప్రాణాన్ని మనస్సుని బుద్ధిని ఉపమానంగా చెప్పి ఇక్కడ శరీరము రధము, ఆత్మ రధికుడు - అనేటటువంటి పద్ధతిని, స్థిరమైనటువంటి నిర్ణయపద్ధతిగా బోధిస్తూ వున్నారు.
💲గుర్రపు కళ్ళెములను దృఢముగా చేతిలో నుంచుకొన జాలని సారధి, రధమును సరిగా గమ్యస్థానమును చేర్చజాలడు. రధమును మిట్టపల్లములలో పోనిచ్చి, కష్టముల పాలగును. అటులనే మనస్సును స్వాధీనములో ఉంచుకొనని వాని ఇంద్రియములు విషయములందు చిక్కుబడి సుఖదుఃఖములు అనుభవించుచు, జనన మరణ రూప సంసారమున మునిగి తేలుచుండును. ఇంద్రియాతీతమైన బ్రహ్మను పొందజాలరు.
ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మనోజయము ఎందుకు ముఖ్యమో మరలా స్పష్టముగా చెబుతున్నారన్నమాట. ఎవరికైతే మనసు స్వాధీనములో ఉండదో, వారి మనస్సు పరి పరి విధములుగా పోతూ ఉంటుంది. కాసేపు ఫలానావి చూద్దామని, ఫలానావి తిందామని, కాసేపు ఫలానావి విందామని, కాసేపు ఫలానా వాటిని ముట్టుకుంటానని, ఫలానా వాటని ఆఘ్రాణిస్తానని... ఈ రకముగా శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాది విషయముల యందు, ఇంద్రియములను పోనిస్తూ, మిట్టపల్లములలో రధం పోతూ ఉందనుకోండి, ఎట్లా పైకి క్రిందకి లేచి పడుతూ ఉంటాడు రధికుడు, ఏ రకంగా ఒత్తిడులకు లోనౌతూ ఉంటాడు, ఏ రకంగా ఎగిరెగిరి పడుతూ ఉంటాడో, ప్రయాణం సరిగ్గా సాగదో ఆ రకంగా ఇంద్రియములు అన్నీ కూడా వాటి యొక్క విషయార్థములందు ప్రవేశించి, సుఖదుఃఖానుభవమును పొందేటప్పుడు, ఈ మిట్టపల్లాలలో రధం వెళుతున్నప్పుడు ఎట్లాగైతే ఎగిరెగిరి పడుతూ ఉన్నాడో, ఆ రకంగా మానవుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాడు.
కారణం ఏమిటంటే, పగ్గములను స్వాధీనంలో ఉంచుకొనలేదు కాబట్టి. రధం దాని ఇష్టం వచ్చినట్లు పోతూ ఉంది కాబట్టి. సరియైన మార్గంలో పోవడం లేదు కాబట్టి. సరియైన లక్ష్యం దిశగా పోవడం లేదు కాబట్టి. సరియైనటువంటి ప్రతిభా పాటవములతో రధమును నడపడం లేదు కాబట్టి. కాబట్టి, తద్వారా జనన మరణ రూప సంసారమునందు చిక్కుకుంటున్నాడు.
💲ఆ రకంగా అసంతృప్తి, సంతృప్తి అనేటటువంటి మూటలను ప్రతినిత్యమూ తయారు చేసుకుని, నిరంతరాయంగా అవస్థాత్రయంలో, ఆ రకమైనటువంటి వాటిని అనుభవిస్తూ, అవస్థాత్రయము, గుణత్రయము, శరీరత్రయము, దేహత్రయము... ఇటువంటి మూడు మూడుగా ఉన్నటువంటి, అనేక త్రిపుటలయందు చరిస్తూ, ఆ రకంగా త్రిపుటులే సత్యమనుకొని, త్రిపుటుల యందు ఉన్న భేద బుద్ధిని పొందుతూ, ఆ భేద బుద్ధి అనేటటువంటి జీవాత్మ ప్రభావములకు కుంగుతూ జనన మరణ సంసార రూపమున పరిభ్రమిస్తూ ఉన్నాడు.
ఇటువంటి వాడు సరిగ్గా మనస్సు అనేటటువంటి కళ్ళెమును చేతిలో వుంచుకొనక పోవడం వలన ఇలా అయ్యాడు. ఎవరైతే ఈ మనోజయాన్ని సాధించి, పరమాత్మ పద్ధతిగా లక్ష్యస్థానమునకు సరిగా రధమును నడుపుతారో, వారు మాత్రమే చేర్చగలుగుతారు....
*💲Now strengthen the witnessing part and do not waste time in restraining your wandering. The mind must think; but slowly and gradually.*
*జీవచ్ఛవంలా పడి ఉండకండి. కాలయాపన పనికిరాదు. శ్రమించడం మొదలుపెడితే అనంతశక్తి మీలో జాగృతమవుతున్నట్లు మీకు అనుభూతి కలుగుతుంది.*
*💲My faith is in the younger generation, the modern generation, out of them will come my workers. They will work out the whole problem, like lions.*
*నేటి తరం వారిపై, ఆధునిక యువత పైనే నాకు విశ్వాసం. వారి నుండే నా కార్యనిర్వాహకులు రాగలరు. సింహాల వలె వారు సమస్య నంతటిని పరిష్కరిస్తారు.*
❤️💲💲💲
*మనస్సున, దేహమున వ్యాధులు ప్రబలి దీనుడైన జీవునకు శ్రీమాత ఆరాధనము దివ్యౌషధము. నిత్యము శ్రద్ధాభక్తులతో శ్రీసూక్త పారాయణము చేయువారికి శ్రీమాతయే వ్యాధి శమనము గావించగలదు. ప్రశస్తమైన శమమును ప్రసాదింప గలదు.*
*కేవలము ఒక్క పిలుపుతో శ్రీమాత పిలుచువాని హృదయం నుండి స్పందించును. సమస్త జగత్తు ఆమె హృదయము నుండియే ఏర్పడినది. ధర్మ పరులకు ప్రకృతి గను, అధర్మపరులకు వికృతి గను శ్రీమాత వారి స్వభావము నుండి వర్తించును.....*
*అల్ప మనస్సు గొప్ప విషయాలను గ్రహించలేదు.*
*"ఎవరు నా కొరకే కర్మలు చేస్తారో, నన్నే పరమ ప్రాప్యంగా విశ్వసిస్తారో నా యందే భక్తిని కలిగి ఉంటారో, సమస్త భౌతిక పదార్థాలయందు ఆసక్తిని విడిచి సర్వప్రాణుల ఎడల ద్వేషభావం లేకుండా ఉంటారో అట్టివారు నన్ను పొందుతున్నారు"*
*మన చుట్టూ కొన్ని పరిమితులను విధించుకుని అవి అలవాట్లుగా మార్చుకుంటూ ఉన్నందున మార్పులు చేసుకునేందుకు భయపడుతూ కార్యసాధనకు సంసిద్ధతను వ్యక్తం చేయలేకపోతున్నాం.*
*💲మనమున్న పరిస్థితులు మెరుగ్గా లేవని తెలిసి ఉన్నా అడుగు ముందుకు వేయలేక పోతున్నాం. అయితే ఒక్కసారి మన అంగీకారాన్ని చూపుతూ మార్పుని ఆహ్వానిస్తే మన ముందు ఒక ప్రపంచం కనిపిస్తుంది. అదే ఆధ్యాత్మిక సామ్రాజ్యం.*
*"నాది"అనే భావనను భగవంతునితో అనుసంధానం చేయగలిగితే జీవితంలోని చిన్న విషయాలు మనలను ఇక ఏ మాత్రం బాధించవు. ఉన్నత చైతన్యపు వీథిలో స్వేచ్ఛావాయువులను ఆస్వాదిస్తూ భగవదాస్వానుభూతిలో మునగగలం.*
*భగవంతునిలో మన ఉనికిని గుర్తించాలి, దాని వలన మనలోని స్వీయబంధనాలు విముక్తి పొందుతాయి. మన హృదయాన్ని, మనస్సుని విస్తరించాలి, దాని వలన మన దృష్టి, భావాలు విశాలమవుతాయి. అల్ప విషయాలు, వ్యర్థ సంభాషణల నుండి మన మనస్సుని తప్పించాలి, దాని వలన సమస్త సార భూతమైన దేవుని యందు మనం నివసించగలం.....*
❣️💲💲💲
_*నువ్వు ఎవరో తెలుసుకుంటే చాలు...అదే మోక్షమార్గం....*_
_*పల్లెవాసులకు అక్షర జ్ఞానం కూడా లేదు. పూజా విధానం ఏది రాదు. భగవంతుని తత్వం ఏమిటో తెలీదు. అలాంటి సాధారణ పామర జనానికి భగవాన్నే నేనెవరో తెలుసుకో అనే మార్గమే..,.. మహాముని [నాయన గారు], మంత్రద్రష్ట, సర్వదేవత ఉపాసకుడు, అనేక దివ్య దర్శనాలు పొందిన ఆ మహానుభావుడు కూడా శాంతికోసం శరణు కోరితే ....ప్రతి వారికి ఉపదేశించేమంత్రం..., మార్గం ఒక్కటే.... అదే 'నేనెవరు' ? అన్న శోధన. అతి సులభమైన మంత్ర జపం, దైవనామస్మరణ వంటి విధానాలు ఉండగా నేనెవరు అనే విచారణ మార్గమే.....ఆ..దారి.....*_
💚💲💲💲
_*వాస్తవ జ్ఞానం సముపార్జించుకుంటే మనం వేదాంత స్వరూపులమే...*_
_*💲మనందిరిలోనూ నిష్కళంకమైన ఆత్మే ఉంది కనుక మనందరం ఆత్మ స్వరూపులమే. ఈ విషయంలో ఏ "శంక" లేకపోతే అంతా శంకరస్వరూపులమే అని గుర్తుపడతాము. వేదాంతం అంటే కొత్తది కాదు. మనం గుర్తించని వాస్తవం. ఆ వాస్తవ జ్ఞానం సముపార్జించుకుంటే మనం వేదాంత స్వరూపులమే అవుతాము. సత్యదృష్టి అలవడితే అది అవాస్తవ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మనలో ఉన్న వస్తువు శివ స్వరూపమన్న సత్యం తెలిస్తే ఇక మనసు, శరీరాల గురించి అవసరానికి మించిన ప్రాధాన్యత ఇవ్వము. మనోభావనగా ఉన్న జీవుడు, దేహం, ప్రపంచం అన్ని అసత్యమే. అంటే ఆధారవస్తువుపై కాకుండా ఈ లోకంపై ఆధారపడి ఏర్పరుచుకున్నవన్నీ అసత్యం !*_
💜💲💲💲
*బ్రహ్మయజ్ఞమును చూసి మానవులు సాధనగా అనుకరించిన యజ్ఞములు అనేకములు ఉన్నవి. నిప్పు, నీరు, గాలి, మనస్సు, బుద్ధి, చిత్తము మున్నగు రూపములుగా పనిచేయుచున్న శక్తులే దేవతలు. వారిని ఉద్దేశించి మనము చేయునది యజ్ఞమని కొందరు దేవయజ్ఞము చేయుచున్నారు. పరిసరములలో గాలి, నీరు మున్నగునవి తన వలన మలినము కాకుండా కాపాడుట, తాను వానిని పరిశుభ్రపరచుట, సుగంధము మున్నగు ప్రశస్తములైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములచే ఇతరుల కొరకై వాతావరణమును ఆరాధించుట ఉత్తమ దేవయజ్ఞము. మరి కొందరు యజ్ఞముతో యజ్ఞమును ఆరాధించుచున్నారు. అనగా జ్ఞానము అను అగ్ని యందు తమకు జ్ఞానములో వెలుగొందిన జ్ఞాన సంపదలను సోదర ప్రజలలో ఉన్న జ్ఞానమునకు కానుక పెట్టుచున్నారు. పవిత్ర గ్రంధములను అధ్యయనం చేయుట, బోధనోపదేశములను చేయుట నిర్మలముగా ఉత్తమ గ్రంధరచనము చేసి పాఠకులలోని యజ్ఞమూర్తికి యజ్ఞముగా సమర్పించుట మున్నగునవి జ్ఞానయజ్ఞమునకు వైఖరులు.*
*కొందరు తమ జ్ఞానమున శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను ఆహుతులుగా ఇంద్రియములు అనబడు అగ్ని జిహ్వల యందు యజ్ఞము చేయుచున్నారు. పరిసరములను అవగతము చేసికొనుట, ఇతరులు చెప్పిన వాక్యములను భక్తితో వినుట, ఇతరుల ఎడల భగవత్భావనతో సంభాషణ చేయుట యజ్ఞం లోని భాగములు. మరికొందరు ధ్యానమును పంచేంద్రియ ప్రవృత్తులను నియమమును అగ్నియందు హోమము చేయుచున్నారు. అనగా తమలోని 'నా' యందు ధ్యాన మార్గమున ఇంద్రియాదులను లీనము చేయుచున్నారు.*
💛💲💲💲
ప్రమాత అనగా జీవుని యందు మానము అనగా చిదాభాసయక్తమైన యంతఃకరణము యొక్క వృత్తి, వికారము,ఉత్పత్తి యగును.ఈ యంతఃకరణ వృత్తి మేయమున అనగా జ్ఞానవిషయమున చేరి జ్ఞానవిషయాకారమును పొందును.అంతేగాక మేయ సంబంధముచే చిదాభాసయందు కూడ మేయ సమానమైన ఆకారమేర్పడును.
విషయములు రెండున్నవి.మట్టితో చేయబడిన కుండయొకటి,బుద్ధితో చేయబడిన కుండ మరియొకటి.మట్టికుండను మనస్సు తెలిసికొనును.బుద్ధి కుండను సాక్షీచైతన్యము చిదాభాసుడు తెలిసికొనును.
💲మలినసత్త్వ ప్రధానమైన ప్రకృతియందు బ్రహ్మము ప్రతిఫలించి జీవుడగుచున్నది. తమః ప్రధానమైన ప్రకృతి యందేర్పడిన సూక్ష్మమహాభూతముల సాత్త్వికాంశలచే అంతఃకరణ మేర్పడుచున్నది.
ఈ అంతఃకరణము నందలి బుద్ధి ద్వారా జీవునకు దౄశ్యమాన ప్రపంచముతో సంబంధమేర్పడును.కనుక అంతఃకరణము స్థూలవస్తువుల యాకారమును పొందుచుండ జీవునియందు సూక్ష్మ వస్తువుల యాకారము గూడ నేర్పడుచుండును.
మనస్సు విషయాకారతను మాత్రము పొంది ఆజ్ఞానమును కలిగించుచుండగా బుద్ధి ఆవిషయమును గూర్చిన అనేకములగు భావనలను కూడ కల్పించి కోరికలను కలిగించు మరొక రూపమును సిద్ధము చేయుచున్నది.
💲కనుక ఈశ్వర సృష్టియైన విషయము మాత్రమే గాక ఆ విషయమును గూర్చిన భావనలచే కోరికలచే నేర్పడు మరొక మానసిక విషయము,జీవసృష్టి ఉన్నదని నిర్ణయము ప్రతి జీవునిలోను ప్రపంచము బీజదశలో నుండి,విత్తనమునుండి అంకురించు చెట్టువలె, అభివ్యక్తమగును.
ఆ విధముగా ప్రతివ్యక్తి అసత్యముగా(వ్యర్థముగా)ప్రపంచమును ఊహించుకొనును. ప్రపంచము ఉదయించదు,అస్తమించదు;ఇది అంతయు భ్రాంతి జెందిన మనస్సుయొక్క ఊహ తప్ప వేరేదియుగాదు.
ప్రతి వ్యక్తిలోను భావనా ప్రపంచముండును.ఒకవ్యక్తి స్వప్నములు ఇతరులకు తెలియనట్లే ఒకని ప్రపంచము అన్యులకు తెలియదు.
💲పిశాచములు,
దేవాంశ సంభూతులు,రాక్షసులు ఉన్నారు.వారందరు భ్రాంతిమయ దేహధారులే.అదే విధముగా మనము గూడకేవలభావనాశక్తివలన జనించి అసత్యమును సత్యమయినట్లు భావించుచున్నాము.
అపరిచ్ఛిన్న చైతన్యములో సృష్టియొక్క ఆవిర్భావము నిజముగా అట్టిదే.మూర్తిమత్వము శూన్యములో కనిపించినను వాస్తవముకాదు.ప్రతివ్యక్తి ఆవిధముగా తన స్వీయప్రపంచమును ఊహించుకొనును.
ఈ సత్యము అనుభవగోచరమయినప్పుడు ఆ విధముగా ఊహించబడిన ప్రపంచము అంతమొందును
💲ఎల్లప్పుడు అత్యుత్తమస్థితి యందుండవలెను.ఈ ప్రపంచమునందు చిక్కుకొనకుము.ఈ ప్రపంచదృశ్యమను చక్రమునకు (సర్వవిషయముల జనన-మరణచక్రమునకు)నాభిగా(కేంద్రముగా)అభిప్రాయములు,ఆలోచనలు లేక భావనలు ఉన్నవి.వీనిని నిరోధించినప్పుడు ప్రపంచదృశ్యము కూడ ఆగును.(నివర్తించును).
ఆలోచనలవలన కలిగిన విక్షేపములు నశించని యెడల, చక్రమును నిరోధించుటకై వ్యక్తి తన సంకల్పశక్తిని ఉపయోగించినచో అది తిరుగుచునే యుండును.
కావున ఉపాయముతో అధికమగు పురుషప్రయత్నమును,బలమును,వివేకమును ఆశ్రయించి సంసారచక్రమునకు నాభి(కేంద్రము)అగు మనస్సును(ఆలోచనలను)
నిరోధింపవలెను.
💓💲💲💲
ఎందుకంటే, అది ఆనందప్రదం. అది సహజముగా ఆనందనిలయం. కాబట్టి,ఒకటి చేయడం ద్వారానో, ఒకటి చెందడం ద్వారానో, ఒకటి చేయకపోవటం ద్వారానో ఇప్పటి వరకూ కలుగుతున్న వన్నీ, సంతోషములు, సుఖదుఃఖములు.
నిజానికి ఆనందములు కావు. కారణ రహితమైనటువంటి సుఖము ఏదైతే ఉందో, అదే, దాని పేరే ఆనంద ప్రతిబింబము. అక్కడ సుఖదుఃఖాలు అనే అలలు లేవు. సాగర గర్భము వలె గంభీరమైనటువంటిది, లోతైనటువంటిది. నిరంతరాయమైనటువంటిది. నిరుపమానమైనటువంటిది.
💲నిశ్చలమైనటు
వంటిది. అటువంటి నిశ్చలము - నీరవత్ స్థితికి చేరుకునేటటువంటి స్థితికి మానవుడు, ఈ అభిమానము అనేటటువంటి తెరను దాటుకుంటూ వెళ్ళాలి. ఈ అభిమానము అనే తెర తొలగించబడాలి. ఈ తెర తొలగించగలిగే శక్తి అమ్మకు ఉన్నది. అమ్మ యొక్క అనుగ్రహం చేత, మానవులందరు ఈ తెర తొలగించబడి, ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందవచ్చు.
ఈశ్వరుడే సర్వజీవులకు తండ్రి. ప్రకృతి తల్లి. కాబట్టి ప్రకృతి యొక్క సహాయంతో, నీ చుట్టుపక్కల ఏర్పడుతున్నటువంటి సాంఘిక, సామాజిక, వైయుక్తిక, వ్యక్తిగత సంఘటనలు అన్నింటిని, ప్రకృతి యొక్క వరదానంగా, ఈశ్వరుడి యొక్క వరదానంగా, ఈశ్వరుని తెలుసుకోవడానికి, ఈశ్వరుని సాక్షాత్కరింప చేసుకోవడానికి మార్గంగా, ఇచ్చినది కాదనక, రానిది కోరక, తన కర్తవ్యాన్ని సేవకుని వలె, ఈశ్వరుని చేతిలో పనిముట్టు వలె, తన కర్తవ్యాన్ని నాలుగు ఆశ్రమ ధర్మాలలో స్పష్టంగా ఎవరైతే నిర్వచించుకుని ధర్మంతో నిర్వహిస్తారో, మోక్ష కాంక్షతో నిర్వహిస్తారో, సామాన్యముగా నిర్వహిస్తారో, విశేషమైనటువంటి లక్షణాలు లేకుండా నిర్వహిస్తారో, మానసికమైనటువంటి పరిణతి, బుద్ధి యొక్క పరిణతి చేత, నిష్కామ కర్మను సిద్ధింప చేసుకుని, ఆ నైష్కర్మ్యసిద్ధి యొక్క బలం చేత, నేను అనేటటువంటి అహంభావనను తొలగించుకుని, ఆ నేను స్థానంలో, ఈశ్వరుడే కర్త, ఈ పిల్లవాడిని ఎవరు చదివించారమ్మా ఇంత బాగా? నేనే చదివించానండి! ఈ పిల్లవాడు ఎలా అయ్యాడమ్మా ఇంత గొప్పవాడు? నా వల్లే అయ్యాడండి! ఈ రకమైనటువంటి కర్తృత్వభావాన్ని త్యజించాలన్నమాట.
ఈ భర్తగారు ఇంత బాగా అవ్వడానికి కారణం ఏమిటమ్మా? అంటే నేనే అయ్యానండీ అని ఏ భార్యా చెప్పదు. నావల్లే ఈయన ఇంతవాడయ్యాడండి, ఆయన చెప్పుకుంటాడు. నా భార్య యొక్క సహకారం చేత, నేను ఇంతవాడిని అయ్యాను. నేను ఈ పనులన్నీ సాధించాను. అట్లాగే భార్యగారు కూడా చెప్పుకుంటారు, నా భర్తగారి యొక్క సహకారం వల్ల నేను ఈ పనులన్నీ చేయగలిగాను. ఇలా నీ గురించి మరొకరు చెప్పుకున్నప్పుడు కూడా నీలో అభిమానము ప్రవేశిస్తుంది.
ప్రశంస ద్వారా కూడా అభిమానము కలుగుతుంది. అయితే సామాన్య రీతిగా ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పొంగక, కుంగక ఉంటారు. ప్రశంస చేత పొంగరు, తెగడ్త చేత కుంగరు. ఓహో! అలాగా? ఈశ్వరానుగ్రహం.
💲అని ఎవరైనా ఒక వేళ ప్రశంసించినప్పటికీ కూడా, ఆ ప్రశంసలన్నీ ఈశ్వరునికి ధారపోస్తారు. కృష్ణార్పణం, దైవార్పణం, ఈశ్వరార్పణం.... అనేటటువంటి పద్ధతిగా జీవిస్తూ ఉంటారు. అప్పుడు ఏమైంది? అప్పుడు వాళ్ళేమీ స్వీకరించడం లేదు. స్వీకరించకపోతే ఎవరి గిఫ్ట్ వారి దగ్గరే ఉంటుంది. కాబట్టి, ఎవరి గిఫ్ట్ వారి దగ్గరే ఉన్నప్పుడు మనల్నేమీ బాధించలేదుగా. మనమేమీ దానిని స్వీకరించలేదు.
అట్లా మానసికంగా భౌతికంగా శరీరభావన నుంచి, దేహభావన నుంచి, కర్తృత్వ భావన నుంచి, భోక్తృత్వ భావన నుంచి, తనను తాను వేరుచేసుకోవడానికి, ఈ సాంఖ్యవిచారణ క్రమాన్ని, ఈ పంచీకరణ యొక్క విధానాన్ని, పంచకోశ విరమణకు, పంచకోశ నిరసనకు ప్రతీ ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలి.....
ఇది ప్రతి నిత్యం చేయవలసినటువంటి సాధన. అనుక్షణం చేయవలసినటువంటి సాధన. ఈ విచారణ క్రమం ఎప్పుడూ జరుగుతూ ఉండాలి.
💘💲💲💲
ఎవరు శాస్త్రోక్తవిధానమును విడిచిపెట్టి శ్రద్ధతో గూడుకొని పూజాదుల నొనర్తురో వారియొక్క స్థితి సాత్త్వికమా, లేక రాజసమా, లేక తామసమా ? ఏది యైయున్నది?
శాస్త్రవిధి నుల్లంఘించి స్వేచ్ఛాచారులై ప్రవర్తించువారికి మోక్షసిద్ధి కలుగదని చెప్పబడినది. అయితే కొందఱు శాస్త్రనిర్దిష్టములగు విధినిషేధములను శ్రమయనితలంచియో, లేక, ఔదాసీన్యము వహించియో, వానినిగూర్చి తెలిసికొనుటకై యత్నింపక, శ్రద్ధతోగూడుకొనినవారై, ఆస్తికబుద్ధి గలిగి దేవతాదులను అర్చించుచుదురు గదా! అట్టివారియొక్క ప్రవృత్తి యెట్టిది? అది సాత్వికమా,రాజసమా, తామసమా......
🤎💲💲💲
*మంత్రోచ్ఛారణ -*
“మననాత్ త్రాయతే ఇతి మంత్ర:” - అనగా మననం చేసేవాడిని రక్షించేది మంత్రం. అదీయూ గురువుల ఉపదేశంతో నేర్చుకుని మననం చేస్తే ఎన్నో బాధలను తీర్చగలదు, ఎన్నో కార్యాలను సఫలం చెయ్యగలదు. కానీ కొందరు వెటకారంగా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా అని ఎద్దేవా చేస్తారు. అసలు మంత్రం, దాని వెనకున్న నిగూడార్ధం గురించి చర్చించుకుని మనకు అనుభవంలో ఏది రాల్చగలదో ముచ్చటించుకుందాం.
ప్రతీ మంత్రంలో ఓంకారం, బీజాక్షరాలు ఒక అమరికతో ఒకొక్క శక్తిని ప్రేరేపణ చేసేవిగా వుంటాయి. ముందుగా ఓంకారం గురించి చూస్తె అది “అ” కార, “ ఉ” కార, “మ” కార సంగమం. ఆకారం ఉచ్చరించినప్పుడు ఆ ఉచ్చరించిన వాణి కడుపు, హృదయం స్థానంలో చలనం గమనించవచ్చు. ఉకార ఉచ్చారణతో గొంతులోను, మరియు గుండె దగ్గర మనం సెన్సేషన్ గమనించవచ్చు. “మ్” అని అంటున్నప్పుడు నాసికా రంధ్రాల నుండి మెదడు వరకు vibration గమనించవచ్చు. ఇది ఎక్కడో ఎందుకు మీరే ఒకసారి ఉచ్చరించి చూడండి , ఆ కదలికలను మీరు ఇప్పుడు చెప్పుకున్న అన్ని ప్రదేశాలలో చలనం గమనించవచ్చును. ఇవి మూడు కలిపి ఓం కారం జపించినప్పుడు కటి ప్రదేశం నుండి మెదడు వరకు, మనకున్న షట్చక్రాలు ఉత్తేజితం అవుతాయి. ఈ ఓం కారానికి frequency 425Hz గా గుర్తించారు. అదే ఓంకార మంత్రోచ్చారణ ఒక క్రమపద్ధతిలో చేసేవారికి binural waves మెదడు లో తయారవుతాయి. దాని వలన ఆల్ఫా(8-13.9Hz), బీటా(14-30Hz) ,టీటా(4-7.9), డెల్టా (0.1-3.9 హజ్)తరంగాలు మెదడులో ఉత్పన్నమవుతాయి. సైంటిస్ట్ లు దీని మీద ప్రయోగాలు చేసి ఓంకార ఉచ్చారాణ ద్వారా ఒకరి మానసిక స్థితి బీటా నుండి డెల్టా వరకు ప్రశాంతత స్థితికి వెళ్తుంది.
మానసిక ఒత్తిడి ఓంకార ఉచ్చారణ ద్వారా తగ్గుతుంది
కేవలం ఓంకార మంత్రోచ్చారణ ద్వారా మానసిక ప్రశాంతత, కాన్సంట్రేషన్ పెరుగుదల, ఎక్కువ ఉత్సాహం, స్ట్రెస్ తగ్గుదల కనబడ్డాయి.
MRI scan ద్వారా మరికొన్ని విషయాలు గమనించారు. దీని ద్వారా ఎపిలేప్సి, డిప్రెషన్ కూడా తగ్గించవచ్చు అని నిర్ధారణకు వచ్చారు.
💲ఇక మనం మిగిలిన మంత్రాల విషయం గురించి చూద్దాం. ప్రతి మంత్రం కొన్ని బీజాక్షరాల సమాహారం. ప్రతీ బీజాక్షరానికి దాని శక్తి వుంటుంది. దానికి తత్సంబంధిత ఒక frequency వుంటుంది. ఈ బీజాక్షరాల క్రమపద్ధతి లో ఉదాత్త, అనుదాత్త స్వరాలతో చదివినప్పుడు ఒక signature ఉత్పన్నమవుతుంది. ఆ మంత్రానికి ఉన్న శక్తి తరంగాల రూపంలో వెలువడుతుంది. తత్సంబంధిత దేవతా స్వరూపానికి అది చేరి రావలసిన ఫలితం ఇప్పిస్తుంది. ఇదెలా కుదురుతుంది అని అనుకుంటే దానికి అర్ధమయ్యే ఒక ఉదాహరణ తీసుకుందాం. దీన్ని మనం పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే మనం ముందు తెలుసుకోవాలంటే మన చుట్టూ మనకు అర్ధం కానీ, ఎన్నో తరంగాలు ఉన్నాయి. ఉదాహరణకు రేడియో లో FM ట్యూన్ చెయ్యాలంటే 88-108 Mhz లో మార్చుకోవాలి. అందునా దానికి లైన్ of sight మాత్రమె ఆ సిగ్నల్ tap చెయ్యగలదు. అందుకే వైజాగ్ FM రేడియో వేరు, విజయవాడ FM రేడియో స్టేషన్ వేరు. ఒకొక్క ఊరిలో ఆ FM సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ని అందుకోవాలంటే దానిని అర్ధం చేసుకునే FM receiver ఉండాలి. ఆ frequency కి మనం ట్యూన్ చేసుకుంటే ఆ కార్యక్రమం మనం వినగలం. అదే AM రేడియో అంటే కొన్ని latitudes వరకు వ్యాపిస్తుంది. అందుకే మనం శ్రీలంక AM రేడియో కూడా వినగలం. అలాగే satellite రేడియో ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్న కార్యక్రమం కూడా వినవచ్చు. వాటికి తత్సంబంధిత receiver తప్పని సరి.
మన ఋషులు, యోగులు ఒకొక్క దేవతకు సంబంధించిన signature కనుగొన్నారు. వారు చెప్పిన పద్ధతిలో సాధన చేస్తే ఆ దేవతా స్వరూపాన్ని మనం అనుసంధానించుకోవచ్చును. సర్వత్రా వ్యాపించి ఉన్న దేవతా శక్తిని ఆ మంత్రాల ద్వారా మనం ఉత్తేజితం చేసుకుంటాం. ఎలాగంటే బయట ఎల
💲Electric pole మీద current వెళ్తూంటుంది, దాన్ని మనం ఒక వైర్ తగిలించుకుని మనం ఇంట్లో పవర్ తెచ్చుకున్నట్టు. ఆ శక్తి తరంగాలు మన చుట్టూ ఉన్నప్పుడు ఆ మంత్రధ్వని ద్వారా ఆ అనంతశక్తిని మనం కొంత మనలోకి తెచ్చుకున్నట్టు. బయటున్న ఎలక్ట్రిక్ pole కొంత ఎత్తులో వుంటుంది. దానికి మన ఇంటినుండి తగిలించాలంటే ఆ వైర్ కి ఇంత అని నిర్దుష్టమైన పొడుగు ఉండాలి, ఆ వచ్చేది 5amperes లేక 15 amps అన్నదాన్ని బట్టి ఆ వైర్ మందం వుంటుంది. అలాగే మనం ఏ కామ్యం కోసం చేస్తున్నామో ఆ కారణాన్ని బట్టి ఒకొక్క మంత్రం అన్ని సార్లు మననం చెయ్యాలని చెప్పబడి వుంది. ఒకే మంత్రం ఒక కామ్యానికైతే 15000 జపం చెప్పబడి వుంటే కొన్నింటికి 64వేలు ఇలా రకరకాలు గా వుంటుంది. ఆ శక్తి మండలం దగ్గర నుండి మనకు ఎంత శక్తి కావలసి వస్తుంది అంత మనకు గురువులు మంత్రజపం చెయ్యమని చెబుతారు. ఎలాగైతే ఒక ఎనర్జీ ఎక్స్పర్ట్ ఒక ఇంటికి ఎంత పవర్ కావాలని చెప్పగలడో, గురువులు మన కామ్యాన్ని బట్టి ఎంత శక్తి మనకవసరమో అన్ని వేల మంత్రజపం చెయ్యాలో చెబుతారు. నమ్మకంతో చేస్తే తప్పక ఫలితం వుంటుంది.
ఇక్కడ మరొక కోణం వుంది. ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ కేవలం మౌఖికంగానే కాదు, మౌనంగా కూడా వారి భావాల ద్వారా జరుగుతుంది. ఇది సైంటిఫిక్ గా కూడా నిరూపింపబడివుంది. వీటిని మనం నిత్యం అనుభవిస్తూనే వుంటాం. చూడండి కొంతమందిని కలవగానే ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. కొందరిని కలవగానే వారినుండి దూరం పోవాలని వుంటుంది. ఒకొక్కరి భావాలు మరొకరితో మాటల్లేకుండానే కలుస్తాయి, వికర్శితం అవుతాయి. ప్రతి ఒక్కరికీ కొంత ఆరా (aura) వుంటుంది. మంత్రజపం ద్వారా మన aura పెంచుకోవచ్చు. అది ఎవరితో వికర్షితమవుతోందో వాటిని సర్దవచ్చు. కేవలం మనలోనే కాదు, ఒక పరిస్థితికి ఎవరెవరితో సంబంధం వుందో దాన్ని ట్యూన్ చెయ్యగల సామర్ధ్య౦ మంత్రజపానికి వుంది.....
🖤💲💲💲
-సృష్టియంతయు ఒక అగ్నికార్యము. అగ్నికార్యమున పొగ, మసి తప్పవు. వాటిని నిత్యము శుభ్రపరచు కొనవలెను. లేనిచో మసి తప్పదు. మసికి మరొక పేరే పాపము. కావున దైవధ్యానము, ఆరాధనము అను నిత్యము చేసుకొనుచు జీవించుట శరణ్యము.....
సామాన్య మానవుడు కావలెనని పాపము చేయడు. కాని స్వభావము బలముగ ఆకర్షించి అతనిచే పాపములను నిర్వర్తించు చుండును. పాపము చేయుచుంటిని అని తెలిసియు అందుండి బయట పడలేడు. దీనికి కారణమేమి.....
💲నిజమునకు భగవంతుడు సమాధానము యిచ్చియే యున్నాడు. తెలిపినను మరచుట మానవ సహజము. మరల తెలుపుట ఉపాధ్యాయుల ధర్మము. సద్గురువు ధర్మము. గుణములు గుణములతో ప్రవర్తించుననియు, ప్రకృతి గుణములచే మోహపడుట సహజమనియు, జ్ఞానులు సైతము గుణాకర్షణము కారణముగ నిగ్రహమును కోల్పోవుదురనియు తెలిపి యున్నాడు. మరల ప్రశ్నించుటచే భగవంతు డిట్లనుచున్నాడు.
గుణములలో మొదటిది రజస్సు. అది యిచ్ఛను కలిగించును. ఆకర్షణను కలిగించును. కోరిక కలిగించును. దీని మరియొక నామమే కామము. కామమును విచక్షణతో నిర్వర్తించు కొనవలెను. విచక్షణకు బుద్ధి యాధారము. మనుష్యుని బుద్ధి కర్మాధీనమై యుండును. కావున అది అక్కరకు రాదు. అందు వలన దైవము బుద్ధి తనయందు స్థిరపడవలెను. దానికి దైవమే శరణ్యము. సరియగు దైవారాధనము మనయందలి దైవబుద్ధి కేంద్రమును మేల్కొల్పును. అది ధర్మమునకై మొగ్గి యుండును. అపుడాకర్షణలు పనిచేయవు.
కావున దైవారాధనమునకు ఫలశ్రుతి బుద్ధి ప్రచోదనము. బుద్ధియందు స్థిరపడినవాడు పూర్ణ విచక్షణ దైవానుగ్రహముగ పొందియుండును. అపుడు రజోగుణ మతనిని స్పృశింపదు. కామము ధర్మయుక్తమై వర్తింపబడుచుండును. మనసు, యింద్రియములు బుద్ధియందు సంయమము చెందగ, బుద్ధి దైవముతో అనుసంధానము చెందుటచే గుణాతీతుడై గుణముల యందు ప్రవర్తించుట జరుగును.
💲ఇట్లు బుద్ధియందు స్థిరపడుటకు బుద్ధి ప్రచోదనమునకై దైవారాధనమును ప్రతినిత్యము నిర్వర్తించవలెను. అనునిత్యము సాగవలెను. అద్దమును ప్రతినిత్యము శుభ్రపరచుకొననిచో దాని పై దుమ్ము చేరును గదా. దీపము వెలిగించినచో కొండె ఏర్పడుచున్నది గదా. అన్నము వండినచో పాత్రకు మసి యగుచున్నది గదా. దంతధావనము, స్నానము చేసినను మరునాటికి శరీరము మలినములను కలిగి యుండును కదా.
సృష్టియంతయు ఒక అగ్నికార్యము. అగ్నికార్యమున పొగ, మసి తప్పవు. వాటిని నిత్యము శుభ్రపరచుకొనవలెను. లేనిచో మసి తప్పదు. మసికి మరొక పేరే పాపము. కావున దైవధ్యానము, ఆరాధనము అను నిత్యము చేసుకొనుచు జీవించుట శరణ్యమని దైవము తెలిపెను. జ్ఞానులకైనను మరియొక మార్గము లేదని తెలిపెను.
💙💲💲💲
. దేవతలని సంతోషపెడతామని కొందరంటూంటారు. దేవతలు మంత్ర స్వరూపులు, వారికి వేరే కరచరణాదులు అవీ ఉండవు. అవయవాలు, కిరీటాలు ఇవన్నీ మనం కల్పించుకుంటాం. ఈ దేవతలకు నిజస్వరూపంలేదు. మరి ఎందుకు వీళ్ళను పూజించడము అంటే, వాళ్ళరూపాలు, వాళ్ళశరీరాలు అన్నీ మంత్రాలే! అంటే మంత్రశరీరులు వాళ్ళు.
. ఇంద్రుడు, వరుణ్డు, ప్రజాపతి, అగ్ని, వాయువు ఎవరు వీళ్ళంతా? పరమేశ్వరుడియొక్క సృష్టి అంతా, ఆయన శరీరమే! మన శరీరంలో ఎలాగయితే కన్ను, ముక్కు, చెవి, వెంట్రుకలు, శిఖ, గోళ్ళు ఇలాంటి అవయవాలన్నీ ఆయా పనులు చేయటానికి ఉన్నాయో; అలాగే, పరమేశ్వర్సృష్టిలో కూడా, ఈ సృష్టిరచనంతా చేసిన తర్వాత దానిని నడిపించటానికై ఆయన అవయవాలుగా ఈ శక్తులు ఏర్పడ్డాయి.
‘పాదౌ పూజయామి, హస్తౌ పూజయామి, ఊరూపూజయామి, జంఘే పూజయామి, జానునీ పూజయామి…’ ఇవన్నీ అంటూ ఉంటాం కదా! దానినే వేదం మంత్ర స్వరూపంలో, ఆహుతుల రూపంలో అనేక కరచరణాది అవయవాలకు – ఈశ్వరుడికి ఉన్నటువంటివాటన్నిటికీ – అంగపూజ చేస్తుంది. ఒకే పరమేశ్వరుడి యొక్క అంగములను (అంటే దేవతలను) ఆరాధించటమనే కార్యంలో నిమగ్నమై, మనం అసలు పరమేశ్వరుడుని మరిచిపోకూడాదు. అదీ ఇక్కడ ఉద్భోధం...
వేదవేదాంగములన్నీ నేర్చుకుని, యజ్ఞములు చేసికూడా పరమార్థం తెలియకపోతే నష్టపోతారు. అందుకని, ఈ దెవతలున్నారు అంటే అర్థం ఏమిటి? ముప్పయి మూడుకోట్ల ఈశ్వరలక్షణములున్నాయి. అవన్నీ సృష్టిలో వ్యాపించి ఉన్నాయి. ఈశ్వరలక్షణాలు అనంతకోటి. వాటినే దేవతలంటాము.
ఉదాహరణకు వాయువు ఉంది. వాయువు అంటే సరిపోయిందా! ఎంతోమంది మరుత్తులున్నారని వేదం చెపుతున్నది.
. మనం పీల్చుకునేదీ గాలే, తుఫానుగా దేశాన్ని ఊడ్చిపెట్టేదికూడా గాలే. అయితే ఈ రెండూ ఒకటేనా! ఆ వాయువుకు వికారలక్షణం అవీ ఉన్నాయి. విభూతి, అభూతి, సుఖము, దుఃఖము అన్నిటికీ హేతువులుగా అనేక లక్షణాలు, కార్యాలు చేయగలశక్తి ఆ వాయువునందున్నాయి.
💲ఆ వాయువును ఉపాసించినప్పుడు అక్కడ దానికి ఎన్ని లక్షణాలున్నాయో అన్ని మంత్రాలతో, అన్ని పేర్లు పెట్టి వేరే వేరే దేవతలుగా కనబడేటట్లుగా వేదం చూపిస్తుంది. “బహిరంగంలో వ్యష్టి అంతా కలిపి, సమిష్టిగా ఏకస్వరూపంగా ఒక తత్త్వాన్ని అంతఃకరణలో భావనచేయాలి.
. ఈ వ్యష్టిపూజ అంతా కూడా – ఇన్ని లక్షణములనూ ఆ పరమేశ్వరుని అంగములుగా ఆరాధించి – అలా భావన చేసినవాడికిమాత్రమే హరితత్త్వం బోధపడి, అది ముక్తికి మార్గమవుతుంది. అది అంతదాకా వచ్చి ఆగిపోతే, మీకొచ్చేది ఏమీ లేదు”
💞💲💲💲
మార్గములో నున్నవారు భూమికలను గురించి వివరింతురు. కాని తమకు ఆవలనున్న భూమికల గురించి చెప్పలేరు.
. ప్రపంచము నుండి నిస్సంగమును పొందినవాడు సాధకుడగును.
. మొదటి భూమిక:---
ఇచ్చట స్థూల ఇంద్రియములు సూక్ష్మ ఇంద్రియములు ఏకకాలమందే పనిచేయును.
💲 భౌతిక చైతన్యముగల ఆత్మ,సూక్ష్మగోళ మందలి మొదటి భూమికలో పాక్షికముగా స్థూల ఇంద్రియములతో సూక్ష్మ సంస్కారములను అనుభవించును.
వినుట:--- వెలుపలి చెవులతో సూక్ష్మ భూమిక యందలి
గంధర్వగానమును వినును.
చూచుట:--- వెలుపలి నేత్రములతో అదే భూమిక యందలి లీలలను చూచును.
ఆఘ్రాణించుట:--- వెలుపలి ముక్కతో, అదే భూమిక యందలి
పరిమళమును వాసన చూచును.
💲అమర గానము భూమికిలన్నింటిలో వేర్వేరుగా వినిపించును.
ఉన్నతతర భూమికల అనుభవములో స్థూల ఇంద్రియముల యొక్క వినుట, చూచుట, ఆఘ్రాణించుట నిరూపయోగము. అచ్చట వినుచున్నది వేరే చెవి, చూచుచున్నది వేరే కన్ను, ఆఘ్రాణించునది వేరే ముక్కు. వెలుపలి ఇంద్రియములైన కన్ను-ముక్కు-చెవులకు ప్రతిరుపముగా అంతర నేత్రము, అంతర నాసికము, అంతర కర్ణము ఉన్నవి.
🧡💲💲💲*చిన్నచిన్న విషయాలు గురించి గొప్పగా ఆలోచించండి. జీవితంలో ఎలా సర్దుకుపోవాలో తెలుసుకోండి. హెచ్చుతగ్గులు లేని భావనను కలిగి ఉండండి. ఇతరుల అదుపులో ఉండకండి. గొప్ప కోరికలను కలిగి ఉండండి. మీరు ఏపనికి తగుదురో ఆ పనిని చేయండి. మంచిని వెతికి దానికి కట్టుబడి ఉండండి. చాలా పదునుగా ఉండండి. పైఎనిమిది గుణగణాలను అలవర్చుకోండి. ఏపని ఎలా చేయాలో తెలిసి చాలా బాగా చేస్తున్నప్పుడు ఎలాంటి దిగులును కలిగి ఉండకండి. గెలుపు నిర్దిష్టతపౖౖె ఆధారపడి ఉన్నప్పుడు తొందరపాటును కలిగి ఉండకండి.*
*💲ప్రయత్నించకుండా అసంభవమైనదన్న సంగతిని విశ్వసించకండి. మంచి ఉద్దేశ్యం మాత్రం చాలని ఎప్పుడూ ఊహించకండి. మీవద్ద పూర్తి వివరాలు వాస్తవాలు లేనంతవరకు మీ స్నేహితుడి గురించి చెడు ఆలోచనను రానివ్వకండి. ఎవరిపట్ల దురుసుతనాన్ని ప్రదర్శించకండి. మాట్లాడే ముందు వినండి. రాసే ముందు ఆలోచించండి. ఖర్చు చేసేముందు సంపాదించండి. పెట్టుబడి పెట్టేముందు ఆరాతీయండి. విమర్శించేముందు నిదానించండి. ప్రార్ధించే ముందు క్షమించండి. పనిని వదిలే ముందు ప్రయత్నించండి.* *పదవీవిరమణ చేసేముందు దానం చేయండి. మీ స్నేహబంధాలను బలపరుచుకునేందుకు తోడ్పడగలవు. బాధ్యతలను నవ్ఞ్వతూ స్వీకరించండి. కొత్తభావాలను* *ఆహ్వానించండి . మంచినడత కల్గియుండాలి. లక్ష్యాలను నిర్ణయించుటకు పనిని ప్రారంభించండి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగివ్ఞండాలి. ఉత్సాహపు విలువ తెలుసుకోండి.* *కోపతాపాలు హద్దులోకి రానివ్వకండి. ఆత్మవిమర్శను మానుకోండి. గృహానికి అందం సామరస్యం, భద్రతవిశ్వాసం, ఆనందం, ప్రేమ, సమృద్ధి బిడ్డలు నియమం సేవ, సౌకర్యం తృప్తిపడే ఉత్సాహాలు, దైవభక్తే ఇంటికి కిరీటం. క్రమం ఇంటికి అందం, అతిధ్యమే ఇంటి గొప్పదనం, సంతృప్తే ఇంటికి వరప్రసాదం. ఉద్దేశపూర్వకంగా ప్రణాళికలను తయారు* *చేసుకొండి. ప్రార్ధన పూర్వకంగా ప్రణాళికలను తయారు చేసుకొండి. సక్రమమైన ఆలోచనలతో ముందుకు సాగండి. విడవకుండా సాధిస్తూ రండి. శ్రేష్టతను సాధించేందుకు తోడ్పడగలవు. చేస్తున్న పనిని ఆనందంగా చేయడానికి కావలిసినంత ఆరోగ్యం, అవసరాలకు కావలిసినంత సంపద, కష్టాలతో పోరాడి గట్టెకడానికి కావలిసినంత బలం, చేసిన తప్పులను ఒప్పుకొని వాటిని వదులు కోవడానికి కావలిసినంత దయ, మంచిని సాధిచేంతవరకు కష్టపడడానికి కావలిసినంత సహనం, మీ పొరుగువారిలో మంచిని చూడడానికి కావలిసినంత ఉదారగుణం ఇతరులకు* *ఉపయోగపడడానికి, సహాయపడడానికి కావలిసినంత ప్రేమ, భగవద్ విషయాలను నిజం చేయడానికి కావలిసినంత* *నమ్మకం భవిష్యత్తుకు సంబంధించిన అన్ని భయాలను పారద్రోలేందుకు కావలిసిన ఆశ ఇవే సంతృప్తికరమైన జీవితపు తొమ్మిది సూత్రాలు. మీ పనిని మీరు ఎంత బాగా చేయగలరో అంత బాగా చేయడం, మీతోటివారితో న్యాయసమ్మతంగా నడుచుకోవడం తగ్గించి పనులను చేపట్టడం, మీరు మనసా, వాచా, కర్మణా అతిఉత్తమమైన దానిని ఆలోచించడం, దృఢ నిశ్చయముతో, నవ్ఞ్వ ముఖంతో సమస్యలతో పోరాడడం, మీరు వినయ విధేేయతలతో సేవ చేస్తూ, పనులను శ్రద్ధచేయగా చేయడం, వీటిని మీరు అనుసరిస్తే గెలుపు మా చెంతే ఉంటుంది. అత్యంత స్వార్ధపూరితమైన మాట ‘నేను దానిని మానండి.*
*💲అత్యంత తృప్తికరమైన మాట ‘మనం అని వాడండి. అత్యంత హానికరమైన మాట ‘అహంకారం దాన్ని వదలండి. అత్యంత శక్తికరమైనమాట జ్ఞానం దాన్ని సంపాదంచుకొండి. అత్యంత నిశ్చయమైనమాట ‘విశ్వాసం దానిని పొందండి. అత్యంత స్నేహశీలమైన మాట చిరునవ్ఞ్వ దానిని ఉంచుకొండి. అత్యంత ఆహ్లాదకరమైనమాట ‘ప్రేమ దానిలోని విలువను పరిగణించండి. అత్యంత ప్రసంశనీయమైన మాట* *విజయం దాన్ని సాధించండి. నిన్నటి తప్పులను సరిదిద్దుకోలేని మనిషి, గెలుపును సాధించిన ప్రతిమనిషికి సహాయం చేసేవారుంటారని భావించే మనిషి, తన మనసును మార్చుకునే ధైర్యంలేని మనిషి, తన అదృష్టం కోసం* *ఎల్లప్పుడూ ఎదురు చూసే వ్యక్తి అది అయ్యేపని కాదు అన్నమాటను తన నాలిక చివర ఉంటుందనుకునే వ్యక్తి, ఏమాత్రం విలువలేని వాటిపై డబ్బును నీళ్లలాగా ఖర్చు చేసే వ్యక్తి తాను భగవంతుడు సహాయం లేకుండా నెగ్గుకొని రాగలను అని భావించడమైనదిగా ఉండకండి. అత్యంత* *ప్రాముఖ్యమైనఆరు మాటలను మీరు జీవితంలో అనుసరించండి.*
*”💲నేను తప్పు చేసానని అంగీకరిస్తున్నాను.*
*ఏడు ముఖ్యమైన మాటలు ‘నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను.*
*నాలుగు ప్రధానమైన పదాలు బహుశానీదే ఒప్పుకావచ్చు. మూడు ముఖ్యమైన మాటలు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను*
*రెండు ముఖ్యమైన మాటలు ‘మీకువందనాలు ఒకేఒక ప్రధానమైనమాట ‘దయచేసి అత్యంత అప్రధానమైనమాట ‘నేను.*
*పిల్లలకు మీ ప్రేమను వారికి ఇవ్వండి అంతేకానీ మీ ఆలోచనలను కాదు వారి* *ఆలోచనలు వారికి ఉండడమే అందుకు కారణం. మీరు వారి శరీరాలను అదుపులో ఉంచవచ్చు. అంతేకాని వారి ఆత్మలను కాదు. కారణం వారి ఆత్మలు రేపటి కోరికల తో నిండి ఉంటాయి. వారి కోరికలను మీకలలో కూడా చూడలేరు. వారిలాగా ఉండ డానికి ప్రయత్నించండి.*
*అంతేగాని మీలాగ వారు ఉండాలని కోరికుంటే కారణం జీవితం వెనక్కుపోదు. మీరు వారి పాలిట ధనస్సులు. మీ పిల్లలు అక్కడి నుండి పంపబడే సజీవ బాణాల లాంటివారు. మీ ఆలోచల్ని గమనిస్తూవుంటే అవే మీమాటలవుతాయి.* *మీమాటల్ని గమనిస్తూ వుంటే అవి నీచేతలవుతాయి.* *మీచేతల్ని గమనిస్తూ వుండు అవే మీ అలవాటులవుతాయి. మీ అలవాట్లను గమనిస్తూ ఉంటే అదే శీలం అవుతుంది. మీ శీలాన్ని గమనిస్తూ వుంటే అదే మీ భవిష్యత్తు. మీ ఆలోచనపట్ల జాగ్రత్త వహించండి. మీ ఆలోచనలను పవిత్రంగా వ్ఞంచుకొండి. మీమాటలను నిజమైన వాటిగా ఉండనివ్వండి.*
*మీ పనులు స్వార్ధరహితంగా ఉండేలా చూడండి. అప్పుడు మీరు అద్భుతాలను చూడగలరు.*
*మీ నిజజీవితం ఆనందంతో* *పొంగిపొర్లుతుంది. తీర్పు యిచ్చేముందు వినగలిగితే మాట్లాడే ముందు ఆలోచించితే మీనాలుకకు కళ్లేం వేయగలిగితే చాడీలకు చెవి వొగ్గకుంగే చెడు ఫిర్యాదులను నమ్మకుంటే బాధలో ఉన్నవారిని ఆదుకుంటే అందరిపట్ల* *ఓపికను ప్రదర్శించగలిగతే అందరికి మంచి చేయగలిగితే అందరిని గౌరవించగలిగితే మీరు అసలు బాధపడవలిసిన అవసరం ఉండదు. ఇతరుల తగాదాల్లో ఇరుక్కొని* *కష్టాలుకొని తెచ్చుకున్నప్పుడు గట్టిగా వుండు, ఇతరులు పుకార్లు* *వ్యాపింపచేస్తున్నప్పుడు మూగగా వుండు. ఇతర వ్యర్ధప్రసంగాలు చేస్తున్నప్పుడు చెవిటిగా వుండు, అదృష్టాన్ని సాధించేందుకు ఇతరులు నిరీక్షిస్తున్నప్పుడు పని చేస్తూ వుండు, ఇతరుల పైకిలాగే వారి కోసం వేటాడుతున్నప్పుడు నీవు నెట్టుకువెళ్ళు, ఇతరులు కలహ ప్రియులుగా, వివాదాస్పదులుగా ఉన్నప్పుడు, నీవు సహనబుద్ధితో వుండు, ఇతరులు తప్పులు చేసి పట్టుబడినప్పుడు నీవు ఉదారంగా వుండు.*
*వీటిని హితకరమైనవిగా భావించాలి. ఎప్పుడూ* *చిరునవ్వులను చిందిస్తూ ఉండండి. ఇతరులు ఏమి చెబుతున్నారో దాన్ని శ్రద్ధగా వినండి. అవతలి వ్యక్తికి ప్రియమైన విషయాన్ని ఎన్నుకొని ఆవిషయంగానే మాట్లాడండి.* *పొగుడుతున్నప్పుడు చాలా ధారాళంగా ఉండండి.* *ఎప్పుడూ విమర్శించకండి. ఇచ్చిన బహుమతి లేదా చెప్పిన మంచిమాటను స్వీకరిస్తున్న దానికి ధన్యవాదాలు తప్పక* *తెలియజేయండి. మీ గురించి చాలా తక్కువగా మాట్లాడండి. ఇంపైన విధంగా వ్యవహరించండి. అవతలివ్యక్తి పేరును సరిగ్గా తెలుసుకుని గుర్తించుకోండి.*
*"నీలో దివ్యత్వము పెరిగేకొద్దీ నీలోవున్న మానవస్వభావ లోపాలు వాటంతట అవే మాయమౌతాయి...!"*
💞💲💲💲
ఆజ్ఞాచక్రాధిష్ఠానదేవత అయిన సిద్ధమాత యొక్క మంత్రానికి శక్తి, బీజము, కీలకము అన్నీ హకార సంకేతంగా ఉంటాయి కాబట్టి ఈమెను హాకినీ అంటారు.
కసుబొమల మధ్య రెండు దళములు గల పద్మమున్నది. ఆ పద్మమునందు హాకినీ దేవత ఉంటుంది. ఆమె చేతులలో జ్ఞానముద్ర, డమరుకము, అక్షమాల, కపాలము ధరించి ఉంటుంది. హాకినీ దేవతకు మూడుకనులు, ఆరు తలలు ఉంటాయి. ఆమెకు హరిద్రాన్నమునందు ప్రీతి ఎక్కువ.....
ఆజ్ఞాచక్రంలో శివాశివులు కోట్లకొలది సూర్యచంద్రులకాంతులతో ప్రకాశిస్తూ ఉంటారు.
💲ఆజ్ఞా చక్రమనబడే రెండుదళములు గల పద్మమందున్న ఓ దేవీ ! మెరుపుతీగవలె కోట్లకొలది సూర్యచంద్రులకాంతులతో ప్రకాశిస్తున్నావు. షట్చక్రనిరూపణంలో “ఆజ్ఞాచక్రము అనేది గురువు యొక్క ఆజ్ఞలు లభించే స్థానము. ఇక్కడ నుంచే శరీరంలోని వివిధ భాగాలకు ఆజ్ఞలు జారీచేయబడతాయి. ఇక్కడ ఓంకారాన్ని ధ్యానించేవాడు జ్ఞాని అవుతాడు. సర్వజ్ఞుడై
సర్వదర్శి అయిన మునీంద్రుడవుతాడు. ఈ చక్రము కర్ణికలో త్రికోణమున్నది. ఈ
త్రికోణంలో ప్రణవానికి ఆధారమైన అకార ఉకారాలుంటాయి. దాని మీద బిందురూపంలో మకారముంటుంది. సంతానోపనిషత్తులో
షషేమాసి నాసాక్షిత్రోత్రాణి భవంతి
ఆరవనెలలో గర్భస్థ శిశువుకు ముక్కు, చెవులు, కనులు మొదలైన అవయవ సౌష్టవం ఏర్పడుతుంది. ఈ నెలలోనే మనస్సుకూడా ఏర్పడుతుంది. అదే ఆరవ అవయవము. అందుచేతనే సిద్ధమాతకు ఆరు తలలుంటాయి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీకి హరిద్రాన్నము మంచి ఆహారము.
💕💲💲💲
*చరిత్రలో మహత్కార్యాలను సాధించిన మహనీయులెందరో ఎన్నో అపజయాలను, విమర్శలను చవిచూశారు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అద్భుతాలు సాధించారు.సాహసాలు,* *సత్కార్యాలు సాధించాలనుకున్నప్పుడు ఇతరులు ఎగతాళి చేసినా, విమర్శించినా వెనకంజ వేయకూడదు. ఏకాగ్రతతో మన పని మనం చేసుకుంటూ ముందుకుసాగాలి. మార్పును అభిలషించాలి. నవ్విన నాపచేను పండుతుందని, మనల్ని అవహేళన చేసినవాళ్లే మన గురించి గొప్పగా చెప్పుకొనే రోజులు వస్తాయని గట్టిగా నమ్మాలి.*
*విమర్శలు కటువుగా ఉంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. అందుకే ఎవరినైనా విమర్శించేటప్పుడు విజ్ఞత పాటించాలి.* *సాధ్యమైనంత వరకు మన విమర్శలు సద్విమర్శలుగా ఉండాలి. అవే మనిషి మానసిక వికాసానికి తోడ్పడతాయి. ఎదుటి వారిని ‘నీవు బాగా పనిచేయడం లేదని అనడం కన్నా- నువ్వు చక్కగా చేస్తున్నావుకాని ఇంకా చక్కగా చేయగలవు’ అని సున్నితంగా సూచనలివ్వాలి అయన విమర్శలు ఎదుటివారు చేస్తున్న పనిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉండాలి. అంతే తప్ప, వారిని తప్పు పడుతున్నట్లుగా ఉండకూడదు.*
*విమానం కనిపెట్టేముందు రైట్ సోదరులు, అమెరికా అధ్యక్షుణ్ని కావాలని ఉందని చిన్నప్పుడే అనుకున్న బిల్క్లింటన్ సైతం ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొని తమతమ రంగాల్లో పరిణతి సాధించారు. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా తనకున్న* *ఆత్మవిశ్వాసమే థామస్ ఆల్వా ఎడిసిన్ను ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టేలా చేసింది.*
*ఇతరుల ఉన్నతిని చూసి కొంతమంది ఈర్ష్యతో రగిలిపోతుంటారు. ఎవరైనా మంచిపని చేస్తే మెచ్చుకునే బదులు విపరీత బుద్ధితో విమర్శించే కుసంస్కారులే ఎక్కువగా కనిపిస్తుంటారు.* *ఒకరి ఉన్నతిని చూసి సహించలేకపోవడం* *మాత్సర్యం. అది లేనప్పుడే ఆత్మతత్వం తెలుస్తుంది.* *కించపరచడమవుతుంది’!*
*ఎదుటివారిని కించపరచేవాళ్లు చేసే పూజలు పూజలు కావు. జీవులను అవమానించే స్వభావం ఉన్నవారు నానాఫల, పుష్పాదుల చేత చేసే పూజలతో దైవం సంతృప్తి చెందే ప్రసక్తే తలెత్తదు.... అంటరానితనం పాటించడం, తోటి మానవుల్ని నీచంగా చూడటం, కులమత* *వైషమ్యాలకు ఆజ్యంపోయడం లాంటి కార్యాలు చేయడం దైవానికి సమ్మతం కావు. ‘సర్వజీవుల్లోనూ....*
*💲ఆత్మస్వరూపు డనైన నన్ను అభేద భావంతో అర్చించడమే నాకు ప్రీతికరం’- ఇది సజీవ జీవకోటిలో ఉన్న దైవాన్ని ఎలా అర్చించాలో కపిలమహర్షి వివరించిన వైనం. తోటివారిలో భగవంతుణ్ని చూసేవారు ఎవరినీ నిందించరు. కటువుగా విమర్శించరు. మంచిసలహాలతో,* *సద్విమర్శలతో ఎదుటివారిని ప్రోత్సహిస్తారు.*
*సద్విమర్శలు మన* *పురోగమనానికి దారిచూపే కాంతిపుంజాలు. మన వికాసానికి తగిన పాఠాలై అవి మార్గదర్శకాలవుతాయి. మన వివేచనను,* *వివేకాన్ని జాగృతం చేస్తాయి. వాటిని స్వీకరించి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను తప్పక సాధిస్తాం......*
*💲ఆదానం హి విసర్గాయ సతాం వారిముచామివ*
మేఘాల మాదిరిగా సజ్జనులు గ్రహించేది త్యాగం చేయడం కోసమే...
*శ్రీనివాసా....*
గంగ మొదలైన తీర్థములలో మునిగినందు వలన కలుగు పుణ్యఫలములు నిన్ను తలచుట వలన కలుగు ఫలములతో సాటిరావు.
💗💲💲💲
అల్ప మనస్సు గొప్ప విషయాలను గ్రహించలేదు.
"ఎవరు నా కొరకే కర్మలు చేస్తారో, నన్నే పరమ ప్రాప్యంగా విశ్వసిస్తారో నా యందే భక్తిని కలిగి ఉంటారో, సమస్త భౌతిక పదార్థాలయందు ఆసక్తిని విడిచి సర్వప్రాణుల ఎడల ద్వేషభావం లేకుండా ఉంటారో అట్టివారు నన్ను పొందుతున్నారు"
మన చుట్టూ కొన్ని పరిమితులను విధించుకుని అవి అలవాట్లుగా మార్చుకుంటూ ఉన్నందున మార్పులు చేసుకునేందుకు భయపడుతూ కార్యసాధనకు సంసిద్ధతను వ్యక్తం చేయలేకపోతున్నాం.
💲మనమున్న పరిస్థితులు మెరుగ్గా లేవని తెలిసి ఉన్నా అడుగు ముందుకు వేయలేక పోతున్నాం. అయితే ఒక్కసారి మన అంగీకారాన్ని చూపుతూ మార్పుని ఆహ్వానిస్తే మన ముందు ఒక ప్రపంచం కనిపిస్తుంది. అదే ఆధ్యాత్మిక సామ్రాజ్యం.
*నాది* అనే భావనను భగవంతునితో అనుసంధానం చేయగలిగితే జీవితంలోని చిన్న విషయాలు మనలను ఇక ఏ మాత్రం బాధించవు. ఉన్నత చైతన్యపు వీథిలో స్వేచ్ఛావాయువులను ఆస్వాదిస్తూ భగవదాస్వానుభూతిలో మునగగలం.
భగవంతునిలో మన ఉనికిని గుర్తించాలి, దాని వలన మనలోని స్వీయబంధనాలు విముక్తి పొందుతాయి. మన హృదయాన్ని, మనస్సుని విస్తరించాలి, దాని వలన మన దృష్టి, భావాలు విశాలమవుతాయి. అల్ప విషయాలు, వ్యర్థ సంభాషణల నుండి మన మనస్సుని తప్పించాలి, దాని వలన సమస్త సార భూతమైన దేవుని యందు మనం నివసించగలం....
💲అన్ని ఉన్నాయన్న
అహంకారం వద్దు. ఎందుకంటే,
రాత్రంతా కష్టపడి విరిసిన పూవ్వుకి కూడా తెలియదు.
తెల్లవారితే దాని పయనం దేవస్థానానికో
లేక, స్మశానానికో.....”
*మీ*
*పండిట్ సుదర్శనం సూరి శ్రీనివాస ఆచార్యులు ఆగమప్రవర*🙏🏿
.,,...
*జ్యోతిష సంబంధ ముఖ్య విషయములు:*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*
*1. గృహసంభంధ విషయాలు*
*గృహసంభంధ విషయాలు*
*గృహప్రవేశము :*
*కాలామృతం ఆధారంగా వైశాఖంలో గృహప్రవేశం గృహపతికి బహుపుత్రంబు, జ్యేష్ఠమాసం శుభప్రదము. ఫాల్గుణమాసం సంపత్కరము, మాఘం ధాన్య ప్రదము. అయితే ఉత్తరాయంలో కుంభంలో రవి ఉండగా తప్పమిగిలిన అన్నియు శ్రేష్ఠములే. బహుగ్రంధకర్తలు కార్తీక, మార్గశిర, శ్రావన మాసములు శ్రేష్ఠములు అని తెలిపిరి.*
*వారములు:*
*ఆదివారము అత్యంత దుఃఖమును* *క్షీణేందువారము (బహుళసప్తమి తర్వాత సోమవారము) కలహమును, పూర్ణేందు వారము సంపదను, మంగళవారము అగ్నిభయమును, బుధవారము ధాన్యమును గురువారము పశుపుత్రులను, శుక్రవారము శుభసౌఖ్యములోను, శనివారము స్థైర్యమును, చోరభయమును కలుగచేయును.*
*నక్షత్రములు :*
*చిత్త, అనూరాధ, ధనిష్ఠ, ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, రేవతి, శతభిషం, రోహిణి, మృగశిర, ఈ నక్షత్రములు ప్రశస్తమైనవి. పుష్యమి మధ్యమము. పునర్వసు, స్రవణం నక్షత్రములలో* *గృహప్రవేశమైన ఆ ఇల్లు అన్యాక్రాంతమగును.* *ఆర్ద్ర, కృత్తిక, అగ్నిభయమును* *కలుగచేయును.*
*లగ్నములు :*
*కర్కాటక లగ్నమునందు గృహప్రవేశము నాశనము,*
*తులాలగ్నమునందు గృహప్రవేశమును వ్యాధిని,*
*మకరలగ్నమునందు* *గృహప్రవేశమును ధాన్య నష్టము,*
*మేషలగ్నము నందు చలనమును కలుగచేయును,*
*వృషభ,సింహ లగ్నములు స్థిరములు* *అయినకారముగా ఆ లగ్నము నందు*
*గృహప్రవేశము మంచిది. మిధున, కన్యా, ధనుర్మీన లగ్నములు గృహ* *ప్రవేశమునకు శుభప్రదమైనవే.*
*విశేషములు :*
*గృహప్రవేశమునకు 4,8,12 స్థానములు శుద్ధిగా ఉండుట విశేషము.*
*4 గృహస్థానము,*
*8 ఆయఃస్థానము,*
*12 వ్యయస్థానము* *అయినకారణముగా ఈ స్థానములు శుద్ధిగా వుండవలెను, 3,6,11 ల *యందు పాపగ్రహములు, 1,2,4,5,7,9,10,11 లలో శుభగ్రహములుండగా గృహప్రవేశము విశేషము.*
ద్వారం ఎత్తుటకు :
పాడ్యమి, విదియ, తదియ, పంచమి, సప్తమి, నవమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పూర్ణిమ తిధుల యందును, సోమ, బుధ, గురు, శుక్ర, వారముల యందును శుభగ్రహ హోరలయందును ద్వారం ఎత్తుటకు మంచిది. శ్లాబ్ విషయమై కూడా అంతే. వర్జ్య, దుర్ముహుర్త, రాహుకాలములు విడచి సూర్యోదయము మొదలు మధ్యాహ్నం లోపల శ్లాబ్ వేయుట ప్రారంభించాలి అలాగే ద్వారం ఎత్తాలి. దీనినికూడా ఆషాడ, భాద్రపద,పుష్యమాసములు పనికిరావు.
నామ నక్షత్ర వినియోగం
సంగ్రామ, వ్యవహారములకు, ధామార్వణం, నగరార్వణం, మంత్రార్వణం విషయములలోను నామ నక్షత్రము చూడవలెను. ధామార్వణం విషయంలో కాలామృతం సంస్కృత వ్యాఖ్యానంలోక్షేత్రార్వణం అని వివరించిన కారణంగా గృహము ఏదిశలో కట్టుకోవాలి. ఆయాది వివరణల విషయంగా నామనక్షత్రం వాడి ముహూర్త విషయంలో జన్మ నక్షత్రం వాడవలెను.
బోరింగ్ లేదా బావి తీయుటకు ముహూర్తం :
హస్త, పుష్యమి, రోహిణి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి, మఘ.... ఈ నక్షత్రాలు శ్రేష్ఠము. ఆది, మంగళ, శనివారములలో తీయుబావులయంధు నీరు ఎక్కువకాలం వుండదు. మీన, మకర, కర్కాటక, వృషభ, కుంభ లగ్నములందును, లగ్నానికి చతుర్థస్థానముకు పాపగ్రహ సంబంధం లేకుండాను చూచుకొని ముహూర్తం చేయవలెను. జలరాసులు
" మత్స్యే కుళిరే మకరే బహోదకం, కుంభేవృషే చార్థజల ప్రమాణం, అళ్యంచ తౌల్యామ్ మిధునేన పాదం శేషేతు రాశఊ జలనాశంచ"
శంఖుస్థాపన చేయుటకు :
మాసములు :
చైత్రమున ధనహాని, వైశాఖం శుభం, జ్యేష్ఠం మరణం, ఆషాఢం పశునాశనం, శ్రావనం భృత్యవృద్ది, భాద్రపదమాసం ప్రజాపీడ, ఆశ్వయుజం కలహప్రధం, కార్తీకం ధనలాభం, మార్గశిరం భయము, పుష్యం అగ్నిభయము, మాఘం అధిక సంపద, ఫాల్గుణం రత్నలాభం.
నక్షత్రములు :
అశ్విని,రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉషా, శ్రవనం ధనిష్ఠ, శతభిషం ఉత్తరాభద్ర,రేవతి.
వారములు:
ఆది, మంగల, శని వారములు నిషేధము. అయితే శని ఆదివారములు వాడుకలో ఉన్నవి.
లగ్నబలం :
వీలైనంతవరకు పాపగ్రహ సంభంధంలేని ఏ లగ్నమైనా, లగ్నము అష్టమముతో పాపగ్రహములు లేని లగ్నము, కుజగురువులు బలంగా వున్న గ్రహములు స్వీకరించాలి.
*స్థలం రిజిష్ట్రర్ చేయించుకోవడానికి:*
*చవితి, షష్ఠి, అష్టమి,* *ద్వాదశి, అమావాస్య తిధులు, భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, మఘ, పూర్వాభాధ్ర నక్షత్రములు, మంగళవారం* *కాకుండాచూచుకొని, స్థలము రిజిస్త్రేషన్ చేయించుకోవాలి. అయితే రిజిష్టర్ చేయించుకొనే* *సమయానికి వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం వుండకూడదు.* *వీలైనంతవరకూ శుభగ్రహ హోరల సమయంలో* *రిజిస్ట్రేషన్* *చేయించుకోవాలి.*
*2.లగ్నము విషయాలు:*
పంచక రహితం
సుమూర్త లగ్నమునకు వున్న తిధి, వార, నక్షత్రము, లగ్న సంఖ్యలను (తిధి సంఖ్య శుద్ధ పాడ్యమి నుండి బహుళ పాడ్యమి నుండి వార సంఖ్య ఆదివారం లగాయతుగాను, అశ్వనీ లగాయతు, నక్షత్ర సంఖ్యను, మేషాదిగా లగ్న సంఖ్యను గ్రహించాలి) కలిపి తొమ్మిది చేత భాగింపగా వచ్చిన శేషము మూడు, అయిదు, ఏడు, తొమ్మిది వచ్చిన శేషము శుభము. ఇవి కాని యెడల "ఏకో మృత్యుర్ద్వ యోర్వహ్నిం; చతుర్ధోరాజపంచకం, షష్ఠచోరః, అష్టరోగః " ఒకటి శేషము ఉన్న మృత్యు పంచకము, రెండు శేషం అయున మృత్యు పచకము. నాలుగు శేషం వున్న రాజ పంచకము, ఆరు శేషం వున్న చోరపంచకము, ఎనిమిది శేషమున్న రోగ పంచకము అగును.
మతాంతరం
లగ్నమును, లగ్న సమయమునకు వున్న తిధికి, వెనుక తిధిని కూడి తొమ్మిదిచే భాగించగా వచ్చు శేషములకు పై ఫలితములే వచ్చును. అయితే మామూలుగా పంచక రహితం చేయగా మృత్యుపంచకం, అగ్ని పంచకం వచ్చిన యెడల వాటికి మతాంతరము చేయ రాదు. కానీ ఈ పంచకము దేశాచార వ్యవస్థను అనుసరిస్తుంది. ఇది కేవలం దక్షిణ దేశస్తులు వాడతారు.
రాజసేవకు, వ్యవహారమునకు రాజ పంచకమును, వాస్తు విషయంలో రాజు, అగ్ని పంచకములు, ప్రయాణమునకు చోరపంచకమును, ఉపనయన, వివాహాది విషయంలో రోగ, మృత్యు పంచకముల సర్వాదా నిషేధములు. వీటి విషయంలో మతాంతరము కూడదు. రాత్రి పూట చోర, రోగపంచకములను, పగలు రాజు, అగ్ని పంచకములను అర్ధరాత్రి యందు మృత్యు పంచకములను వదల వలెను.
ఆదివారం రోగ పంచకమును, శనివారం మృత్యు పంచకమును, మంగళవారం అగ్ని పంచకమును, గురు, సోమ వారములు యందు రాజ్య పంచకమును, బుధ, శుక్ర వారముల యందు చోరపంచకమును గ్రహించి మతాంతరం చేయకూడదు.
లగ్నధృవాంకాః
మేషాది మీన పర్యంతము క్రమంగా 4,5,6, 5,4,3,2,1,0; 1,2,3 సంఖ్యలు ధృవకములగును. ప్రయాణము, వ్యవసాయము వంటి కృషి కర్మలయందు, వాణిజ్యము నందు, తటాకాదుల త్రవ్వకమునకు, శివలింగ ప్రతిష్టకు ధృవకరహితమును చూడవలెను.
లగ్నేషు వర్జ్య సమయాని
మేష, వృషభ, కన్య, ధనూరాశులకు ప్రారంభంలో భుజంగము అనే త్యాజ్య ఘడియలు వుండును. మీనం, మకరం, కర్కాటకం, వృశ్చికములకు అంత్యములో రాహువు అనే త్యాజ్య ఘడియలు వుండును. మిధున, కుంభ, తుల, సింహలగ్నమునకు మధ్యలో జృధ్ర అనే త్యాజ్య ఘడియలు వుండును. అందువలన వీటిని విడచి మిగిలిన లగ్న కాలములో శుభకార్యములు చేసుకొనవచ్చును.
*3.పెండ్లి ముహూర్త విషయాలు.*
*ఏక నక్షత్ర వివాహ విషయము :*
*రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ ఎనిమిది నక్షత్రముల విషయంలో వధూవరులకు ఏక నక్షత్రమైన దోషం లేదు.*
*అశ్వని, భరణి, ఆశ్రేషా, పుబ్బ, స్వాతీ, మూల శతభిషం యివి మధ్యమములు*
*తక్కిన నక్షత్రములు దోషములు.*
అయితే 27 నక్షత్రములలో కూడా ఒకే నక్షత్రము అయినప్పటికీ భిన్న పాదములు అయినచో దోషం లేదు.
*ఏకోధర వివాహము :*
' పుత్రీ పాణీని పీడనాచ్చ పరతస్పువో ద్వివాహశ్శుభో, న్యాఅన్యత్పుత్ర కరగ్రహత్తునక మప్యుద్వాహ ఏవవ్రతత్'
అనే కాలమృత శ్లోకాధారముగా ఏక కాలమందు పుత్ర పుత్రికా వివాహముల విషయములో పుత్రిక వివాహానంతరము పుత్ర వివాహము ముఖ్యమ్ననియు పుత్ర వివాహానంతరము పుత్రికా వివాహమునకు పుత్ర ఉపనయనము అయిన చేయ కూడదనియు పుత్ర ఉపనయనాంతరము పుత్రికా వివాహము శుభకరమనియు పుత్ర వివాహము చేసిన సంవత్సరమ్మునందు ఆరు నెలల పర్యంతము ఏకోదరులకు ఉపనయనాదులు అశుభకరములు. " ఫాల్గుణే చైత్ర మాసేతు పుత్రోద్వాహోపనయనాయనే అబ్ద భేదాత్ర్పకుర్వీత ఋతుత్రయ విడంబన" అనగా ఫాల్గుణ మాసంలో ఒకరికి చైత్రమాసంలో మరొకరికి సంవత్సరము భేధం ఉన్నందున వివాహ, ఉపనయనాదులు చేయ వచ్చును.
*కన్యాదాతల నిర్ణయం :*
*కన్యాదానము చేయు అధికారము తండ్రికి, త్యండ్రి కానిచో* *పితామహుడు, సోదరుడు, పిన తండ్రి, పెత్తండ్రి మెదలగు పితృవంశస్థులు వారు కానిచో స్వగోత్రీకులు కానిచో ఎవరైనను చేయ వచ్చును.*
*కుజదోష నివారణ :*
*పాతాళేపి ధనౌరంధ్రే జామిత్రే చాష్ఠమేకుజే*
*స్థితః కుజః పతింహంతి నచేచ్ఛు భయతేక్షితః*
*ఇందోరప్యుక్త గేహేషు స్థితః భౌమోధవాశనిః*
*పతిహంతాస్త్రియాశ్చైవం వరస్య యది స్త్రీ మృతిః*
*(బృహతృరాశరీరాశాస్త్రం)*
జన్మలగ్నము -
చంద్రలగ్నముల లగాయతు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు వున్నయెడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం ఇరువురికి వున్నను లేక ఇరువురికి లేకున్నను వివాహం చేసుకొనవచ్చును. ఈ దోషం ఒకరికుండి మరొకరికి లేకున్నను వైవాహిక జీవితం కలహ ప్రదంగా వుంటుంది. కుజుడు కలహ ప్రదుడు. శని ఆయుర్దాయ కారకుడు. కావున పైన చెప్పిన విధానంలో శని దోషం కూడా చూడవలెను అని పరాశర మతం " *నచేచ్ఛభయతేక్షితః"* అనివున్న కారణంగా కుజునికి శుభగ్రహముల కలయిక (లేదా) శుభగ్రహ వీక్షణ వున్నచో దోషం వుండదు. కేవలం ఆడవారి జాతకంలో వుంటే మగవారికి ఇబ్బంది. కేవలం మగవారి జాతకంలో వుంటే ఆడవారికి ఇబ్బంది.
*ద్వితీయ స్థితియే భౌమదోషస్తు యుగ్మ కన్యక యోర్వినా! ద్వాదశే భౌమ దోషస్తు వృషతాళిక యోర్వినా! చతుర్ధేభౌమ దోషస్తు మేష వృశ్చికయోర్వినా! సప్తమే భౌమదోషస్తు నక్రకర్కట యోర్వినా! అష్టమే భౌమదోషస్తు ధనుర్మీనద్వయం వినా! కుంభేసింహేన దోషస్స్యాత్ ప్రత్యక్షం దేవ కేరళే ||*
*ద్వితీయ స్థితి కుజదోషం మిధున కన్యలకు లేదు. ద్వాదశ స్థితి కుజదోషం వృషభ తులలకు లేదు. చర్తుర్ధస్థితి కుజదోషం మేషవృశ్చికములకు లేదు. సప్తమ స్థితి కుజదోషం ధనుస్సు, మీనములకు లేదు. కుంభము, సింహముల యందు జననమయినచో కుజదోషం వుండదు. మేష, వృశ్చిక, మకర లగ్నములవిషయంలోను మృగశిర ధనిష్ఠ, చిత్త, నక్షత్రముల విషయంలోను కుజదోషం వుండదు.*
*—:00000000:—*
*నిశ్చితార్ధం :*
నిశ్చితార్ధమునకు పెండ్లితో సమానమైన, సమాన బలమైన ముహూర్తం చూడవలెను. కారణం నిశ్చితార్ధంతోనే వధూవరులు భంధం ప్రారంభం అవుతుంది. అంతేకాకుండ జాతక ప్రభావాలు వారిరువురికి ఒకరి ప్రభావం మరొకరి మీద చూపుతుండి. వివాహమునకు సంభంధించిన తిధి వార నక్షత్ర లగ్నములు చూడవలెను. అయితే నిశ్చితార్దం రోజున గణపతి పూజ చేయవలెను. కావున భోజనానంతరం పూజ పనికి రాదు. కావున ఉదయ సమయంలోనే నిశ్చితార్ధం చేయవలెను.
నూతన వధూవాస *దోషములు :*
*" వివాహాత్ప్రమే పౌషే ఆషాఢే చాధి మాసకే. నసా భర్తృగృహే తిష్ఠే చ్ఛైత్రే పితృగృహే తధా"*
వివాహం అయిన ప్రథమ సంవత్సరం ఆ వధువు అత్తవారింట ఉన్నచో ఆషాఢమాసంలో అత్తగారికి గానీ, అధిక మాసం అందు భర్తకును, పుష్య మాసంలో మామగారికి గానీ గండము. మొదటి సంవత్సరము చైత్ర మాసంలో తండ్రి యింట ఉన్న ఎడల తండ్రికి హాని అని వున్నది కానీ ఈ ఒక్క విషయము ఆచారం లేదు.
*పునర్వివాహము :*
*ప్రమదామృతి వాసరాదితుః పునరుద్వాహ విధిర్వరస్యద విషమే పరివత్సరే శుభోయుగళేచాపి మృతిప్రదోభవేత్"*
*అనగా పూర్వ భార్య మృతి నొందిన దిన ప్రభృతి బేసి సంవత్సరముల యందు పునర్వివాహము చేసుకొనుటకు శుభము. సరిసంవత్సరములందు అశుభము.*
*" తృతీయా మానుషీకన్యా నోద్వాహ్యా మ్రియతేహిసాః విధవా వాభవేత్తస్మాత్ తృతీయేర్కం సముద్వహేత్"*
*మూడవ *వివాహము మనుష్య కన్యకు చేసుకొనుట పనికిరాధు అట్లైనచో* *భార్యకు మృతి కలుగును, విధవ అయిన అగును. కావున తృతీయము అర్క వివాహము చేయునది.*
*పెండ్లి చూపులకు :*
సోమ, మంగళ వారములు కాకుండాను భరణి, కృత్తిక, ఆర్ద్ర, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పుర్వాభద్ర, నక్షత్రములు కాకుండా, వ్యర్జ దుర్ముహర్తములు లేకుండాను, చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి, అమావాస్య కాకుండా శుభగ్రహ హోరాలయందు పగటి సమయమున పెండ్లి చూపులఏర్పాటు చేయవలెను.
పెండ్లి పనులు ప్రారంభించుటకు :
సోమ, మంగళ వారములు విడువవలెను అశ్వని, రోహిణి మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, మూల, ఉషా, శ్రవణం, ధనిష్ట, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతి, నక్షత్రములయందు విదియ, తదియ, పంచమి సప్తమి, దశమి ఏకాదశి, త్రయోదశి, పౌర్ణిమ, బహుళ పాడ్యమి తిధుల యందు, శుభగ్రహ హోరాల యందు వర్జ్యం దుర్ముహర్తం వదలి పెండ్లి పనులు ప్రారంభించాలి.
*వధూప్రవేశము :*
*****************
*" వివాహ మారభ్య వధూప్రవేశో యుగ్మేదినే షోడశవాసంరాంతే"*
*వివాహ దిన ప్రభృతి పదహారు రోజుల లోపల ఎప్పుడైననూ సరిదినముల యందునూతన గృహప్రవేశం చేయవచ్చును.*
వధూ ప్రవేశోనది వాప్రశస్తుః
నూతన వధువు అత్తవారింట అడుగు పెట్టవలెను అంటే పగలు పనికి రాదు. సూర్యాస్తమయాత్ పరం, సూర్యోదయాత్ పూర్వము ప్రసస్తము.
షష్ఠేష్టమేవా దశమే దినేవా వివాహ మారభ్య వధూ ప్రవేశః పంచాంగ శుద్ధంచ దినం వినాపి తిధౌన సద్గోచరకేపికార్యః
అనగా వివాహము అయినది మొదలు ఆరు, ఎనిమిది, పది దినములందు వధువు ప్రవేశించిన ఎడల ఆ దినములు తిధి వారనక్షత్ర యోగకరణములచే శుద్ధము కాకపోయినప్పటికీ శుభ ప్రదముగానే వుంటుంది.
ఒక వేళ మొదటి నెలలో వదూ ప్రవేశం జరగనిచో మెదటి సంవత్సరంలో బేసి నెలలో స్థిర, క్షిప్ర, మృదు, శ్రవణ, ధనిష్ఠ, మూల, మఘ, స్వాతీ, నక్షత్రదినములందు రిక్త తిధులను విడచి నూతన వధూ ప్రవేశం చేయ వలెను.
ఎప్పుడు వధూ ప్రవేశం చేసిననూ వర్జ్య దుర్ముహోర్త కాలములు విడువవలెను.
వివాహ ప్రయత్నం ఎప్పుడు ప్రారంభించాలి?
వివాహము చేయవలెను అని తలచినప్పుడు ఎవరు వివాహ ప్రయత్నములు చేయదలచారో వారికి నక్షత్రం తారాబలం కుదిరిన రోజున, భరణి, కృత్తి, ఆర్ద్ర, పున, పుష్య, ఆశ్రేష, పుబ్బ, చిత్త, విశాఖ, జేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్రలను విడచి, మంగళ, సోమ వారములు కాకుండా, వర్జ్య దుర్ముహూర్తములు లేని సమయంలో గణపతిని ప్రార్ధించి తదుపరి యిష్టదైవమును ప్రార్ధించి వివాహప్రయత్నము చేయ వలెను.
*వివాహం :*
భరణి, కృత్తిక, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభద్ర నక్షత్రములు పనికిరావు. చిత్త పనికి వస్తుంది అని కొందరి వాదన. బుధ, గురు, శుక్ర, శని, ఆది వారములు పనికి వస్తాయి. అయితే అన్ని గ్రంధాలలో శుభగ్రహవారములు అన్ని వున్న కారణముగా క్షీణ చంద్రుడు కాని సమయములో వున్న సోమవారాం పనికి వస్తుంది. "మాసంతే దిన పంచకే పితృతిధౌ" బహుళ ఏకాదశి నుండి అయిదు రోజులు, పితృతిధులు వున్నరోజులలో వివాహం పనికి రాదు. పాపగ్రహ వీక్షణ వున్న సమయంలో సప్తమంలో అష్టమంలో పాపగ్రహములు వున్న లగ్నములు పనికిరావు మాఘ, ఫాల్గుణ, చైత్రం, వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ, ఆశ్వయుజంలో దసరా తర్వాత కార్తికం, మార్గశిరంలో ధనుర్మాసం ముందర వివాహములు చేయుట ఆచారంగా వున్నది. మధ్యాహ్నం 12 లోపల, మరల సూర్యాస్తమయం తర్వాత వివాహం చేయవచ్చు.
వివాహం -ఆబ్దికం :
వివాహమునకు ముందురోజు ఆబ్దికం వున్నచో ఆ ముహుర్తం పనికిరాదు. ఇది కన్యాదాత విషయంలోను వరుడు, వరుని తండ్రి ఆబ్దీకములు పెట్టవలసినవిషయంలో మాత్రమే. వివాహం చేసిన నెలలోపుగా వధూవరుల యిండ్ల వారి పైతలరాలవారి ఆబ్దీకములు రాకుండా చూసుకుని వివాహముహోర్తం నిర్ణయించాలి.
4.వదూవరుల జాతకంలో పరిశీలించవలసిన విషయాలు
*1. ఊర్ధ్వ, అధో, తిర్యజ్మఖ నక్షత్రములు:*
అశ్వని, మృగశిర, పునర్వసు, హస్త, చిత్త, అనూరాధ, , జ్యేష్ఠ, రేవతి యివి తిర్యజ్ముఖ నక్షత్రములు. భరణి, కృత్త్యిక, ఆశ్రేష, పుబ్బ, విశాఖ, మూల, పూర్వాషాఢ, పూర్వాభద్ర యివి అధీముఖములు. రోహిణి, మృగశిర, పుష్యమి, ఉత్తర ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్తరాభాద్ర యివి ఊర్థ్వముఖ నక్షత్రములు.
*2.క్షీణ చంద్ర వివరణ:*
చంద్రుడు, శుక్ల అష్టమి లగాయతు కృష్ణ అష్టమి వరకు పూర్ణ బలవంతుడు. యిది సామాన్య నియమము. యిందలి విశేష పాఠమేమనగా కృష్ణ పక్షంలొ పాడ్యమి నుండి పంచమి వరకు మిక్కిలి పూర్ణుడు. తదాది అయిదు రోజుల మధ్యమం చివరి అయిదు రోజులు అనగా కృష్ణ పక్ష ఏకాదశి నుండి అమావాస్య వరకు చంద్రుడు క్షీణ చంద్రుడు. దీనికి వ్యతిరేకంగా కృష్ణ పక్షం ఊహించవలెను. అనగా శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు క్షీణ చంద్రుడు షష్ఠి ప్రభృతి దశమి వరకు మధ్యం తదుపరి పూర్ణిమ వరకు పూర్ణ చంద్రునిగా పరిగణించాలి. అయితే కృష్ణ పక్షంలోని చివరి అయిదు రోజులు శుభకార్య విషయంగా ప్రాంతీయ ఆచారములను పరిధిలోనికి తీసుకొని నిషేధించుచున్నాము.
*3.గండనక్షత్ర విషయం :*
ఆశ్రేషా, మూల, విశాఖ, జ్యేష్ఠ నక్షత్రములలో జన్మించిన స్త్రీ విషయంలో వివాహం పొంతనలు చూసేటప్పుడు గండనక్షత్రములుగా పరిగణీంచవచ్చును. అయితే అందులో ఆశ్రేష 4వపాదం మూల 1 పాదము, విశాఖ నాల్గవపాదం, జ్యేష్ఠ 4వ పాదం మాత్రమే దోషం గండరరక్ష జనన దోషాన్ని పరిశీలించిన మీదట ఆశ్రేషా, జ్యేష్ఠ నక్షత్రములు చివరి నాలుగు ఘడియలు మాత్రమే దోషమని మూల 1వ పాదంలో ప్రారంభంలో ప్రారంభ నాలుగు ఘడియల కాలమే దోషం అని తోచుచున్నది.
*4.గణకూటమి :*
వివాహ విశేషః పట్టికలో చుపిన ప్రకారం వధూవర నక్షత్రం పరస్పర దేవరాక్షస గన్ములైన అధము. మనుష్య రాక్షస గణముల విషయంలో గ్రహమైత్రి కుదిరిన స్వీకరించవచ్చును దేవ - దేవ; దేవ - మనుష్య; మనుష్య - మనుష్య; రాక్షస - రాక్షస విశేషములు.
*5.గ్రహ మైత్రి :*
నక్షత్ర విశేషములు అనే పట్టికలో నక్షత్రములు పొందిన రాశ్యాధిపుల వివరణ ఇవ్వబడినవి. వాటిని దృష్టిలో వుంచుకొని క్రింద పట్టికద్వారా ఆయా గ్రహముల శతృమిత్రత్వాలు పరిశీలించారు.
రవి : శని, శుక్రులు శత్రువులు. బుధుడు సముడు. చంద్ర, కుజ గురువులు మిత్రులు.చంద్ర : రవి, బుధ మిత్రులు, మిగిలిన వారు సములు.కుజ : రవి, చంద్ర, గురువుల మిత్రులు. బుధుడు శత్రువు, శుక్ర, శని సములు.బుధ : రవి శుక్రులు మిత్రులు, చంద్రుడు శత్రువు, కుజ, గురు, శనులు సమములుగురు : బుధ, శుక్రులు మిత్రులు, చంద్రుడు శత్రువు.కుజ గురు, శనులు సములుగురు : బుధ, శుక్రులు శతృవులు, శని సముడు , రవి, చంద్ర, కుజులు మిత్రులు.శుక్ర : బుధ, శనులు మిత్రులు. కుజ గురులు సములు; రవి, చంద్రులు శత్రువులు.శని : బుధ, శుక్రులు మిత్రులు; గురువు సముడు; రవి, చంద్ర, కుజులు సములు.
వధూవర రాశ్యాధిపులు పరస్పర శతృవులైనచో విడువదగినది.
*6.స్త్రీ దీర్ఘము :*
వధూనక్షత్రం నుండి వరుని నక్షత్రం లెక్కింపగా 9 నక్షత్రముల లోపు వున్నయెడల అధమము. 9 తర్వాత 18 లోపు వున్న మధ్యమము. 18 తర్వాత 27 లోపు వున్న యెడల ఉత్తమము.
గ్రహముల స్వభావములు
శని, రాహు, కేతు, కుజులు క్రూర స్వభావ గ్రహములు. శుక్ర, గురు, బుధ, చంద్రులు సౌమ్య స్వభావ గ్రహములు. అయితే " బుధః పాపాయుతః పాపః క్షీణచంద్రస్తధైవచ" అనగా పాపగ్రహములతో కలసిన బుధుడు పాపగ్రహముగాను, క్షీణ చంద్రుని పాపగ్రహముగాను చెప్పబడినది. కుజ, రవి, గురువులు పురుష స్వభావ గ్రహములు రాహు, చంద్ర, శుక్రులు స్త్రీ స్వభావం కలిగిన గ్రహాలు. శని, బుధ, కేతువులు నపుంసక స్వభావగ్రహములు, గురు, శుక్రులు, బ్రాహ్మణ గ్రహములు; రవి, కుజులు క్షాత్ర గ్రహములు. చంద్ర, బుదులు వైశ్యులు, శని శూద్ర కులాధిపతి.
*7.కుజదోష విచారణ:*
పాతాళేపి ధనౌరంధ్రే జామిత్రే చాష్టమేకుజే
స్ధితః కుజః పతింహంతి నచేచ్చు భయుతేక్షితః
ఇందోరప్యుక్త గేహేషు స్ధితఃఅ భౌమోధవాశనిః
పతిహంత్రౌస్త్రియాశ్చైవం వరస్య యది స్త్రీ మృతిః
(బృహతృరాశరీరాశాస్త్రం)
జన్మలగ్నము- చంద్రలగ్నముల లగాయితు 2,4,7,8,12 రాశుల యందు కుజుడు వున్నఎడల దానిని కుజదోషంగా పరిగణించాలి. ఈ కుజదోషం యిరువురికీ వున్ననూ లేదా యిరువురికీ దోషం లేకున్ననూ వివాహం చేయవచ్చును. ఈ దోషం ఒకరికి వుండి మరొకరికి లేని ఎడల వైవాహిక జీవితం కలహప్రదంగా వుంటుంది. కుజుడు కలహ ప్రదుడు. శని ఆయుర్దాయకారకుడు కావున పైన చెప్పిన విధానంలోనే శనిదోషం కూడా చూడవలెను అని పరాశర మతం. "నచేచ్చభయుతేక్షితః" అని ఉన కారణంగా కుజునికి శుభగ్రహముల కలయిక (లేదా) శుభగ్రహవీక్షణ వునచో దోఆషం వుండదు. కేవలం ఆడవరై జాతకంలో దోషం వుంటే మగవారికి యిబ్బంది. కేవలం మగవారి జాతకంలో వుంటే ఆడవరైకి యిబ్బంది.
ద్వితీయ భౌమరోషస్తు యుగ్న కన్యక యోర్వినా| ద్వాదశే భౌమ దోషస్తు వృషతాళిక యోర్వినా| చతుర్ధే భౌమదోషస్తు మేష వృశ్చికయోర్వినా| సప్తమే భౌమదోషస్తు నక్రకర్కట యోర్వినా| అష్టమే భౌమదోషస్తు ధనుర్మీనద్వయం వినా| కుంభేసింహేన దోషస్స్యాత్ ప్రత్యక్షం దేవ కేరళే|
ద్వితీయ స్ధితి కుజదోషం మిధున కన్యకలకు లేదు. ద్వాదశ స్ధితి కుజదోషం వృషభ తులలకు లేకు. చతుర్ధస్ధితి కుజదోషం మేషవృశ్చికములకు లేకు. సప్తమస్ధితి కుజదోషం మకర కర్కాటకములకు లేదు. అష్టమ స్ధితి కుజదోషం ధనస్సు, మీనములకు లేదు. కుంభము, సింహముల యందు జననమయనలో కుజదోషం వుండదు. మేష, వృశ్చిక, మకర లగ్నముల విషయంలోను మృగశిర ధనిష్ఠ, చిత్త నక్షత్రముల విషయంలోను కుజదోషం వుండదు.
*8.తారాబల ఫలమ్:*
సంపత తార సంపదలను, విపత్ తార కార్య నాశనమును క్షేమతారా క్షేమమును, ప్రత్యక్ తార కార్య నాశనమును సాధన తార కార్య సాధనమును నైధవ తార హీనత్వమును మిత్రతారా సుఖమును, పరమమైత్ర తార సుఖసంపదలను కలుగచేస్తుంది. అయితే అత్యవసర పరిస్థితిలో ప్రథమ నవకములో ప్రత్యక్ తారను విడచి మూడు నవకములలో నైథవ తారను విడచి మిగిలిన నక్షత్రములలో ముహూర్తము చేయవచ్చును.
ఒకవేళ కర్కాటక రాశికి వృషభరాశికి చెందు నక్షత్రములు తారాబల విష్యములో విపత్, ప్రత్యక్ తారలు అయినప్పటికీ శుభకార్యములు చేయవచ్చును. జన్మ నక్షత్రములో నక్షత్రము ప్రారంభమునుండి ఏడు ఘడియలు విపత్తార యందు ప్రారంభ 3 ఘడియలు ప్రత్యక్ నైథవ తారల యందు ప్రారంభ 8 ఘడియలు విడువవలెను. మిగిలిన ఘడియలు గ్రాహ్యము.
*9.తారాబలము:*
జన్మ నక్షత్రము నుండిన లెక్కింపగా వరుసగా ఇరవై ఏడు నక్షత్రములకు జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధవ, మిత్ర, పరమైత్ర అనబడే తొమ్మిది సంజ్ఞలు ఉంటాయి. యివే సంజ్ఞలు మరలా 10వ నక్షత్రమునుండి 18 వరకు మరలా 19 నక్షత్రం నుండి 27 వ నక్షత్రము వరకు ఉంటాయి.
*10.త్రిజ్యేష్ఠ స్వరూపం :*
" అధ్యగర్భప్రసూతాయాః కన్యకాయా పరస్యచ; జ్యేష్ఠమాసే నకుర్విత కదాచిదపి మంగళమ్"
ప్రధమ గర్భంలో జన్మించిన వధూవరుల విషయంలో జ్యేష్ఠమాసంలో వివాహం చేస్తే త్రిజ్యేష్ఠ అవుతుంది. అలాగే ఆ వధూవరులు ఒకరు జ్యేష్ఠమాసంలో జన్మించిన మరొకరు జ్యేష్ఠులైతే వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయ కూడదు. మిగిలిన మాసంలో చేయుటకు అభ్యంతరంలేదు. ఎటువంటి త్రిజ్యేష్ఠా స్వరూపం అయినా జ్యేష్ఠమసంలో మాత్రమే వివాహం నిషేధం మిగిలిన మాసంలో దోషంలేదు.
*11.నక్షత్ర భేధములు:*
అశ్వని, హస్త, పుష్యమి నక్షత్రములు క్షీప్ర ( శీఘ్ర) సంజ్ఞ నక్షత్రములు, మూల, ఆర్ద్ర, జ్యేష్ఠ, ఆశ్రేష నక్షత్రములు దారుణ నక్షత్రములు. చిత్త, రేవతి, మృగశిర, అనూరాధ నక్షత్రములు మృదు (సౌమ్య) నక్షత్రములు. భరణి, మఘ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభద్రలు స్థిర (ధృవ) నక్షత్రములు. భరణి, మఘ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభద్రలు ఉగరనక్షత్రములు. కృత్తిక, విశాఖ సాధారణ నక్Sధత్రములు. స్వాతి, పునర్వసు, శ్రవణం ధనిష్ఠ, శతభిషం నక్షత్రములు చర నక్షత్రములు
*12.నక్షత్ర విచారణ :*
జన్మ నక్షత్రములు తీసుకొన్నతర్వాత వాటి ద్వారా గ్రహమైత్రి, గణకూటమి, యోనికూటమి, రాశికూటమి, స్త్రీ దీర్గము, నాడికూటమి ముఖ్యంగా పరిశీలించాలి. యివి ఆరు కూటములు మహేంద్రకూటమి, వశ్యకూటమి, దినకూటమి, వేదాకూటమి, రజ్జుకూటమి, వర్నకూటమి యివి ఆరు కూటములు సామాస్యకూటములు. సామాన్యకూటములు ఈ పన్నెండు కూటములు కలిపి ద్వాదశ వర్గులు అంటారు. అందు ముఖ్య ఆరు వర్గులను సూక్ష్మంగా పరిశీలించగా
*13.నాడీకూటమి :*
వధూవర నక్షత్రములు యిరువురివీ ఒకే నాడీ నక్షత్రములు కాకూడదు. వేరువేరు నాడులైన విశేషము. నాడీ వివరములు పట్టికలో వున్నవి. పట్టికలో ఇచ్చినవి త్రినాడీ స్వరూపము.
*14.యోని కూటమి :*
పట్టికలో చూపిన నక్షత్ర జంతువులకు పరస్పర శతృత్వం వున్నటువంటివి గో - వ్యాగ్రములు;
అశ్వ - మహిషములు;
గజ –సింహములు ;
కుక్క - లేడి;
పాము -ముంగీస;
కపి -ఎనుములు;
మార్జాల - మూషికములు పరస్పర శతృత్వ జంతువులు కావున అవికాక మిగిలిన నక్షత్రములు స్వీకరించాలి.
*15.రాశికూటమి :*
అమ్మాయి రాశి లగాయతు అబ్బాయి రాశి రెండు, మూడు, నాలుగు, అయిదోది. ఆరు రాశులు కాకపోయినా శుభము. గ్రహమైత్రి కుదిరినప్పుడు రాశికూటమి, నాడీకూటమి, స్త్రీ దీర్ఘములు కుదరకపోయిననూ దోషం వుండదు.
*5.శకున ఫలితములు*
తేనెపట్టు,అరటిగెల, మొండిచేయి - *దిశాఫలితాలు*
తేనెపట్టు :
తూర్పున యజమానికి ధనలాభం, ఆగ్నేయమున అగ్నిభయం, దక్షిణమున మరణము, నైఋతి ధాన్య నాశనము, పడమర మనోపీడ, వాయువ్యం ధననష్టం, ఉత్తరం పుత్రలాభం, ఈశాన్యం బంధుమిత్రలాభం.
అరటిగెల :
తూర్పు శుభం; ఆగ్నేయం శతృవృద్ధి, దక్షిణం బంధుమిత్ర నాశనం, నైఋతి పుత్రలాభం, పడమర విపత్తు, వాయువ్యం నేత్రహాని, ఉత్తరం ఐశ్వర్యం, ఈశాన్యం కీర్తిలాభం
మొండిచేయ్యి :
తూర్పు యజమానికి, నైఋతి పుత్రులకు, వాయువ్యం పశువులకు, ఉత్తరం, ఈశాన్యం భార్యకు కీడు, ఆగ్నేయం అగ్నిభయం, పడమర మరణం కలుగును.
*సేకరణ :*
*--,..........
*పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలు:*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃఃఃఃైైైైైైైైైై
వివాహం ఆలస్యం కావడం ఒకటే కాదు. జాతకాదుల్లో దోషాలు కనపడినప్పుడు ఆ దోషాలు వైవాహిక జీవన ఆనందానికి కూడా లోపం అవుతాయి. వాటిని ముందుగానే గమనించి తగిన నివారణ చర్యలు చిన్నప్పటి నుంచే చేసుకోవడం మంచిది.
వివాహమనేది జీవితంలో అతిముఖ్యమైన ఘట్టం. ఆధ్యాత్మిక శాస్త్రాలనుసరించి అది ఒక సంస్కారం. వ్యక్తిని సంస్కరించడానికి ఉపకరించే ఈ ప్రక్రియ ఆనందప్రదంగానూ, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేదిగాను ఉండాలి.
లగ్నంలో తాను, సప్తమంలో సామాజిక సంబంధాలు ఉంటాయి. చంద్రుడు మనఃకారకుడు కావడం వలన చంద్రుడు ఉన్న స్థానాన్ని పరిశీలించడం జరుగుతుంది. రవి ఆత్మశక్తికి లగ్నం శరీర శక్తికి ప్రాధాన్యం వహించడం వలన ఆ రెండింటిని కూడా పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తుంది. కళత్రకారకుడైన శుక్రగ్రహ స్థితి పరిశీలించడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇక ఏ శుభకార్యానికైనా గురుబలం కావాలి కాబట్టి గురుదృష్టి వీక్షణం గమనించాలి. వివాహ విషయంలో ప్రధానంగా కుజ, శని, రాహు గ్రహ స్థానాలను పరిశీలించాలి. వాటితో పాటుగా జాతకంలో ద్వితీయస్థానం కుటుంబస్థానం, సప్తమం- కళత్రస్థానం, వ్యయస్థానం, పంచమస్థానాలను, గ్రహదృష్టులు గ్రహ యుతులు గమనించాలి. అష్టమం సౌభాగ్యస్థానం, సప్తమం భర్తృస్థానం చూడాలి.
*ఆలస్య వివాహాలు సూత్రాలు :*
*********************
*1. లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి కలిసి లేదా విడివిడిగా 6,8,12 స్థానాల్లో ఉంటే ఆలస్య వివాహం.*
*2. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నా, అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నా, అష్టమాధిపతి సప్తమంలో ఉన్నా వివాహం ఆలస్యం.*
*3. సప్తమాధిపతి రాహు, కేతు నక్షత్రాల్లో ఉన్నా వివాహం ఆలస్యం.*
*4. సహజ సప్తమమైన తులలో నైసర్గిక పాప గ్రహాలుంటే దానికి అనుబంధ రాశులైన కన్య, వృశ్చికాలలో పాప గ్రహాలుంటే వైవాహిక జీవితంలో లోపం.*
*5. లగ్నం నుండి లేదా చంద్రుడి నుండి సప్తమస్థానాన్ని బలమైన పాప గ్రహాలు చూస్తున్న వివాహం జరుగదు, లేదా ఆలస్యమౌతుంది.*
*6. శుక్రుడు ఉన్న రాశ్యాధిపతి నీచలో ఉన్నా లేదా 6,8,12 స్థానాల్లో ఉన్నా ఆలస్య వివాహం.*
*7. శుక్రుడి నుండి సప్తమంలో కుజ, శనులు ఉంటే లేదా కుజ, శనులు పరస్పరం ఎదురెదురుగా ఉంటే ఆలస్య వివాహం.*
*8. శుక్ర, చంద్ర, గురు, రవి గ్రహాలు నీచలో ఉంటే వివాహం ఆలస్యమౌతుంది.*
*9 పాపకర్తరీ మధ్యలో గ్రహాలుంటే దోషం, ఆలస్య వివాహం.*
*10. రవి, శనులు కలిసి సప్తమ స్థానంలో ఉంటే వివాహం ఆలస్యం.*
వివాహం ఆలస్యం కావడం ఒకటే కాదు. జాతకాదుల్లో దోషాలు కనపడినప్పుడు ఆ దోషాలు వైవాహిక జీవన ఆనందానికి కూడా లోపం అవుతాయి. వాటిని ముందుగానే గమనించి తగిన నివారణ చర్యలు చిన్నప్పటి నుంచే చేసుకోవడం మంచిది. శ్లోక పఠనాలు, పారాయణదులతో పాటు, దానం చేయడం అత్యావశ్యకం. వివాహం కావడానికి, వైవాహిక జీవితం ఆనందంగా ఉండడానికి వివాహితులకు కాని అవసరమైన వారికి కాని అలంకరణ వస్తువులు దానం చేయడం, నిమ్మకాయ పులిహోర పంచడం, డ్రైఫ్రూట్స్ పంచడం లాంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఈ నివారణ చర్యలు చేపట్టి సరియైన సమయంలో వివాహం జరిగి ఆనందప్రద జీవితానికి ప్రయత్నం చేయవచ్చు.
............,
*--
*గురువు పాదాలను ఆశ్రయిస్తే చాలు*
లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలను ధరించాడు. వాటిలో రామావతారం ... కృష్ణావతారం పూర్ణావతారాలుగా చెప్పబడుతున్నాయి. అవతార పురుషులైన రాముడు .. కృష్ణుడు ఇద్దరూ కూడా గురుముఖత విద్యలను అభ్యసించినవారే. కొంతమంది భక్తులు తమ ఇష్టదేవతలను గురించి ఆరాధన చేస్తే, ఫలానా గురువును ఆశ్రయించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని సాక్షాత్తు దైవమే చెప్పిన సందర్భాలు వున్నాయి.
గురువు యొక్క స్థానం అంతటి విశేషమైనదిగా .. విశిష్టమైనదిగా కనిపిస్తుంది. అలాంటి గురువులలో ఆదిశంకరాచార్యులు .. రాఘవేంద్రస్వామి .. శ్రీపాద శ్రీవల్లభులు ... నృసింహ సరస్వతి .. అక్కల్ కోటస్వామి ... శిరిడీ సాయిబాబా తదితరులు కనిపిస్తుంటారు. వీళ్లంతా కూడా గురుదైవాలుగా పూజించబడుతున్నారు ... కీర్తించబడుతున్నారు.
ఎవరైతే గురువును విశ్వసిస్తారో వాళ్లకి త్రిమూర్తుల కటాక్షం కూడా లభిస్తుందని చెప్పబడుతోంది. గురువు తన పాదాలను ఆశ్రయించినవారి మనోభీష్టాన్ని బట్టి కొంతమందికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధలుపడుతోన్న వాళ్లకి ఆరోగ్యాన్ని అందిస్తాడు. అలాగే దారిద్ర్యంతో కష్టాలు పడుతున్నవాళ్లకి సంపదలను అనుగ్రహిస్తాడు. అవయవ లోపంతో అవస్థలు పడుతోన్నవాళ్లకి స్పర్శమాత్రం చేతనే వాటిని ప్రసాదిస్తాడు.
జీవితాన్ని అజ్ఞానం ... దారిద్ర్యం .. అనారోగ్యం తీవ్రమైన స్థాయిలో ప్రభావితం చేస్తుంటాయి. అలాంటివాటి బారి నుంచి నిముక్తిని కలిగించేవారిగా గురువులు కనిపిస్తుంటారు. తమని ఆశ్రయించినవారి పరిస్థితిని గ్రహించి, కోరిన వరాలను ప్రసాదిస్తూ వుంటారు.
*-- ప్రాంజలి ప్రభ....*
*భావం గుణములు ఫలితం ::-*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃః*
*1. లగ్నము :-*
(అన్నివిషయాలు, స్వభావం, జీవన విధానం)
*2. ధన స్థానం :-*
(ఆర్థిక విషయాలు, కుటుంబం, వాక్కు)
*3. భ్రాత్రు స్థానం:-*
(సోదరులు, పౌరుషం, ప్రయాణాలు)
*4. మాత్రు స్థానం :-*
(తల్లి, విద్య, స్థిరాస్తులు, వాహనాలు)
*5. పుత్ర స్థానం :-*
(సంతానం, ప్రేమ వ్యవహారాలు, పరీక్షలు)
*6. శత్రు స్థానం :-*
(ఆరోగ్యం, శత్రువులు)
*7. కళత్ర స్థానం :-*
(భార్య, వ్యాపారం, ప్రవాసం)
*8. ఆయు స్థానం :-*
(ఆయువు, ఆపదలు)
*9. భాగ్య స్థానం :-*
(అదృష్టం, తండ్రి, ప్రయాణాలు)
*10. రాజ్య స్థానం :-*
(ఉద్యోగం, కీర్తి)
*11. లాభ స్థానం :-*
(లాభాలు, మిత్రులు )
*12. వ్యయ స్థానం :-*
(ఖర్చులు, దూరప్రయాణాలు, విదేశియానం)
*గ్రహాలకు మిత్ర, శతృ, సమత్వాల పరిశీలన :*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*
శుభ్ర గ్రహములు : గురువు, శుక్రుడు , పూర్ణ చంద్రుడు, బుధుడు(శుభులతో
కలసిన శుభుడు)
పాప గ్రహములు: రవి, కుజ, శని, రాహు, కేతువు, క్షీణ చంద్రుడు,
బుధుడు(పాపులతో కలసిన పాపి).
1) రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు
శత్రువులు.
2) చంద్రునకు - రవి, బుధులు మిత్రులు : మిగిలిన వారు బుధ, గురువు, శని, శుక్రులు సములు, శత్రువులు లేరు.
3) కుజునకు - రవి, చంద్ర, గురువులు మిత్రులు : బుధుడు శత్రువు: శని,
శుక్రులు సములు.
4) బుధునకు - రవి, శుక్రులు మిత్రులు : చంద్రుడు శత్రువు: కుజ, గురు,
శనులు సములు.
5) గురునకు - రవి, చంద్ర కుజులు మిత్రులు : శుక్ర, బుధులు శత్రువులు :
శని సముడు.
6) శుక్రునకు - శని, బుధులు మిత్రులు : కుజ, గురులు సములు: రవి, చంద్రుడు శత్రువులు.
7) శనినకు: శుక్ర, బుధులు మిత్రులు : రవి, చంద్ర, కుజులు శత్రువులు :
గురుడు సముడు.
చంద్రుడికి శత్రువులు లేరు.
గురువు ఎవరికి శత్రువు కాదు.
*కొన్ని అనుమానాలు:*
*1) రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు*
*శత్రువులు.*
*రవి, శనులు పాపులు కదా పాపులు శత్రువులు ఎలా అయ్యారు?*
*బుధుడు పాపులతో కలసిన పాపి, శుబులతో కలసిన శుభుడు - అనగా బుధునికి*
*పూర్ణ శుభత్వం లేదు పూర్ణ పాపత్వం లేదు. అటువంటప్పుడు రవికి బుధుడు*
*ఏవిధముగా శుభుడు?*
*పూర్ణ చంద్రుడు శుభుడు, క్షీణ చంద్రుడు పాపి - వీరికి కూడా పూర్ణ*
*శుభత్వం లేదు పూర్ణ పాపత్వం లేదు.* *అటువంటప్పుడు రవికి మిత్రుడు ఎలా*
*అయ్యాడు?*
*గురువు శుభ గ్రహం, రవి పాప గ్రహం - వీరెలా మిత్రులయ్యారు?*
సత్యాచార్యుని హోరాశాస్త్రమందు గ్రహములకు గల మిత్ర శతృత్వ సంబంధాన్ని ఈ విధంగా తెలియజేశాడు.
*సూత్రం:-* గ్రహములకు తన మూల త్రికోణ రాశి నుండి, ద్వితీయ, ద్వాదశ, పంచమ, నవమాధిపతులు, స్వక్షేత్రం, ఉచ్చ రాశ్యాధిపతులు, ఆయుస్ధానాధిపతి అయిన అష్టమం, చతుర్ధాధిపతియు మిత్రులు. మిగతా స్ధానాధిపతులు శత్రువులు.
2,4,5,8,9,12 స్వ, ఉచ్చ రాశ్యాధిపతులు మిత్రులు, 3, 6,7,10,11 రాశ్యాధిపతులు శత్రువులు. మూల త్రికోణం నుండి లెక్కపెట్టినప్పుడు రెండు భావాలకు ఒక గ్రహం యొక్క ఆధిపత్యం మిత్ర, శత్రువులు అయినప్పుడు సములవుతారు.
పైన చెప్పిన విధంగా గ్రహానికి రెండు మిత్ర స్ధానాధిపతి మిత్రుడు అవుతాడు. పైన చెప్పిన విధంగా గ్రహానికి ఒకటి మిత్ర, శత్రు స్ధానాధిపతి సముడు అవుతున్నాడు. మిత్ర స్ధానాధిపతులు కాకుండా మిగతా వారు శత్రువులు అవుతారు. సూర్య చంద్రులకు ద్వయాధిపత్యం లేదు కనుక వారు ఏక రాశ్యాధిపాతులైనను మిత్రులే అవుతారు.
ఉదా;- రవికి - చం, కు, గురువులు మిత్రులు : బుధుడు సముడు : శని, శుక్రులు శత్రువులు.
సత్యాచార్యుడు చెప్పిన సూత్రం ప్రకారం సూర్యుని మూల త్రికోణ స్ధానం నుండి అనగా సింహరాశి నుండి ద్వాదశాధిపతి చంద్రుడు ఏక రాశ్యాధిపతి కావటం వలన మిత్రుడు అయ్యాడు.
సింహానికి చతుర్ధ రాశి వృశ్చికం, నవమ రాశి మేషం సూర్యునికి ఉచ్చ స్ధానం మేషం. కుజుడు ఈ మూడు స్ధానాలకు అధిపతై ద్విరాశ్యాధిపత్యం వలన సూర్యునికి కుజుడు మిత్రుడు అయ్యాడు.
సింహరాశికి పంచమ స్ధానం ధనస్సు, అష్టమ స్ధానం మీనం. ఈ రాశులకు అధిపతి గురువు. గురువు పై సూత్రం ప్రకారం ఉక్తరాశి ద్వయాధిపతి ఆగుట వలన సూర్యునికి గురువు మిత్రుడు అయ్యాడు.
సింహరాశికి ద్వితీయం కన్య, ఏకాదశ స్ధానం మిధునం. ఈ రెండు రాశులకు అధిపతి బుధుడు. పై సూత్రం ప్రకారం ద్వితీయం ఉక్త స్ధానం, ఏకాదశం ఉక్త స్ధానం కాకపోవటం వలన, ఉక్తైక రాశ్యాధిపతి (మిత్ర,శత్రు) అయిన బుధుడు సూర్యునికి సముడు అయ్యాడు.
సింహారాశికి షష్ఠమ, సప్తమ స్ధానాలు మకర, కుంభాలు. అవి ఉక్త స్ధానాలు కావు కనుక శని సూర్యునికి శత్రువు అవుతాడు.
సింహారాశికి దశమ, తృతీయ స్ధానములు వృషభ, తులలు. అవి ఉక్త స్ధానాలు కావు కనుక ఆ స్ధానానికి అధిపతి అగు శుక్రుడు సూర్యునికి శత్రువు అవుతాడు.
ఈ విధంగా మిగతా గ్రహాలకు మిత్ర, శత్రు, సమత్వాలను గుర్తించవచ్చును.
*సేకరణ:*
*--.*
*కన్యా లగ్నము :*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃఃఃఃైైైైైైైైైైైైైైైైైైైై
*సూర్యుడు :-* కన్యాలగ్నానికి సూర్యుడు ద్వాదశాధిపతి ఔతాడు. వ్యయాధిపతిగా సూర్యుడు కన్యాలగ్నానికి అకరక గ్రహం ఔతాడు. కన్యాలగ్నస్థ సూర్యుడి కారణంగా వ్యక్తి ప్రభావశాలిగా ఉంటాడు. అందమైన, లగ్నస్థ సూర్యుడు ప్రకాశవంతమైన శరీరం ఇస్తాడు. వీరికి దగ్గు, జలుబు, హృదయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. లగ్నస్థ సూర్యుడి కారణంగా వీరికి విదేశీయానం ప్రాప్తించే అవకాశం ఉంది. లగ్నస్థ సూర్యుడు సప్తమ స్థానం మీద దృష్టి ప్రసరిస్తాడు కనుక వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. భాగస్వామ్యం వీరికి అనుకూలించదు. వ్యవసాయం వీరికి అనుకూలిస్తుంది. లగ్నస్థ సూర్యుడికి పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న పరిహారం చేయడం మంచిది.
*చంద్రుడు :-* కన్యాలగ్నానికి చంద్రుడు ఏకాదసాధిపతిగా అకారక గ్రహంగా అశుభఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అందం, కల్పనా శక్తి, ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి దయాగుణం, ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. వీరు జీవితంలో శీఘ్రగతిలో ప్రగతిని సాదిస్తారు. చంద్రుని స్థికారణంగా అస్థిర మనస్తత్వం ఉంటుంది. ల్గ్నం నూడి చంద్రుడు పరిపూర్ణ దృష్టిని సప్తమ స్థానం అయిన మీనం మీద ప్రసరిస్తాడు కనుక గురువు ప్రభావం చేత జీవిత భాగస్వామితో ప్రేమ పూరిత సహకారం లభిస్తుంది. వీరికి అకస్మాత్తుగా లభము కలిగే అవకాశం ఉంది. చంద్రుడికి పాపగ్రహ చేరిక దృష్టి ఉన్న ఎడల శుభ ఫలితము తక్కువగా ఉండును.
*కుజుడు :-* కన్యాగగ్నానికి కుజుడు తృతీయ, షష్టమాధిపతి ఔతాడు. కనుక కుజుడు కన్యాలగ్నానికి అకారక గ్రహంగా అశుభఫలితాలను ఇస్తాడు. లగ్నస్థ కుజుడి కారణంగా
వ్య్కి క్రోధస్వభావం కలిగి ఉగ్రుడై ఉంటాడు. సోదరులతో సఖ్యత ఉంటుంది. తల్లి తండ్రులతో అభిప్రాయభేదాలు ఉంటాయి. లగ్నస్థ కుజుడి కారణంగా తండ్రికి అనారోగ్యం కలుగుతుంది. కుజుడు అష్టమ భావం మీద దృష్టి సారిస్తాడు కనుక శారీరక కష్టములు అనుభవించవలసి ఉంటుంది. లగ్నస్థ కుజుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక వైవాహిక జీవితంలో కష్టాలు ఉంటాయి. జీవిత భాగస్వామి వంచనకు గురి కావచ్చు.
*బుధుడు :-* బుధుడు కన్యా లగ్నానికి లగ్నాధిపతి, దశమాధిపతిగా ప్రముఖ కారక గ్రహముగా ఉంటాడు. లగ్నస్థ బుధుడు స్వస్థానంలో ఉన్నాడు కనుక వ్యక్తి అందం, ఆకర్షణ, ఆరోగ్యం కలిగి ఉంటాడు. కన్యా లగ్నస్థ బుధుడు వ్యక్తికి పరి పూర్ణ ఆత్మవిశ్వాసం, దీర్గాయుషు ఇస్తాడు. వీరి ఆత్మ బలం కారణంగా వ్యక్తి వ్యవసాయ, వ్యాపార రంగాలలో అత్యున్నత ప్రగ్తి సాధిస్తాడు. వీరికి సమాజంలో గౌరవం, ఆదరం లభిస్తుంది. లగ్నస్థ బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి నుండి గుణసంపన్నుడైన జీవిత భాగస్వామి లభిస్తాడు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం సుఖమయముగా, ఆనందమయముగా ఉంటుంది. వీరికి భాగస్వామ్యం లాభిస్తుంది.
*గురువు :-* కన్యాలగ్నానికి గురువు అకారక గ్రహం. కన్యాలగ్నానికి గురువు చతుర్ధ, సప్తమ స్థానాలకు అధిపతి ఔతాడు. లగ్నస్థ గురువు కారణంగా వ్యక్తికి తండ్రి వలన పేరు ప్రతిష్టలు కలుగుతాయి. బంధు మిత్రులతో అభిప్రాయ భేదములు కలుగుతాయి. పుత్రుల నుండి ఆదరణ సహకారం లభిస్తుంది. పిత్రి సంపద వీరికి లభిస్తుంది. గురువు లగ్నం నుండి పంచమ, సప్తమ, నవమ స్థానముల మీద దృష్టిని సారిస్తాడు. కనుక దీర్గాయువు, పుత్రసంతతి, ఖ్యాతి కలుగుతుంది. గురువు పాపగ్రహ చేరిక దృష్టి కలిగి ఉన్న శుభ ఫలితాలు తగ్గుతాయి.
*శుక్రుడు :-* కన్యాలగ్నానికి శుక్రుడు ధనాధిపతిగా, నవమాధిపతిగా కారక గ్రహంగా శుభఫలితాలు ఇస్తాడు. మిత్ర స్థానంలో ఉన్న కన్యా లగ్నస్థ శుక్రుడు వ్యక్తిని ప్రగతి పధంలోకి తీసుకు వెడతాడు. లగ్నస్థ శుక్రుని కారణంగా వ్యక్తి కళాభిరుచి కలిగి ఉంటాడు. వీరికి ధార్మిక భావములు అధికం. వీరికి వ్యవసాయ రంగంలో సాఫల్యం లభిస్తుంది.
ప్రభుత్వం నుండి ప్రభుత్వ రంగం నుండి సహాయసహకారం లభిస్తుంది. లగ్నస్థ శుక్రుడు సప్తమ స్థానమైన మీనం మీద దృష్టి సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి నుండి సహకారం లభిస్తుంది.
*శని :-* కన్యాలగ్నానికి శని పంచమాధిపతిగా, షటమాధిపతిగా ఉండి త్రికోణాధిపత్య గ్రహంగా కారకమై శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నస్థ శని వ్యక్తిని బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రామికుడిగా చేస్తాడు. లగ్నస్థ శని వ్యక్తికి శరీర దారుఢ్యం ఇస్తాడు. వీరి పవారిక జీవితం అశాంతి కరం. సంతానంతో సత్సంబంధాలు ఉం, డక పోవచ్చు. లగ్నస్థ శని తృతీయ, సప్తమ, నవమ స్థానాల మీద దృష్టిని సారిస్తాడు కనుక సోదరులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. జీవిత భాగస్వామి అందం, ఆధ్యాత్మికత కలిగి ఉంటారు.
కాని మొండి తనం, క్రోధ స్వభావం కలిగి ఉంటాడు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.
*రాహువు :-* కన్యాలగ్నమున ఉన్న రాహువు వ్యక్తికి పొడవైన, ఆరోగ్య వంతమైన శరీరం ఇస్తాడు. వీరిలో చతురత్వం స్వార్ధం ఉంటుంది. కనుక వారి కార్యం ఎలాగైనా సాధించుకుంటారు. లగ్న నుండి రాహువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాస్వామితో కలహం అశాంతి కలిగి ఉంటారు. వీరికి భాగస్వామ్యం కలసి రాదు. జీవిత భాగస్వామికి కష్టములు ప్రాప్తించే అవకాశం ఉంటుంది.
*కేతువు :-* కన్యా లగ్నస్థ కేతువు వ్యక్తిని స్వార్ధ పూరితుడిని చేస్తుంది. గూఢాచారిగా సాఫల్యత సాధిస్తారు. వీరికి వాత రోగం, నడుము నొప్పి కలిగే అవకాశం కలుగుతుంది.
లగ్నస్థ కేతువు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామికి రోగపీడను కలిగిస్తుంది. కేతువు శుభ గ్రహ దృష్టి చేరిక కలిగి ఉన్న వైవాహేతర సంబంధాలకు అవకాశం ఉంటుంది.
*సేకరణ:*
*-- వరలేఖరి.నరసింహశర్మ.*
[6:02 pm, 07/10/2020] +91 79810 02699: బాలారిష్టదోషం
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైఃః
12 సంవత్సరములలోపు మరణాన్ని సూచించే యోగాన్ని "బాలారిష్టం" అందురు.
చంద్రాష్టమం చ ధరణీసుత సప్తమం చ
రాహుర్నవంచ శని జన్మ గురుస్తృతీయే
అర్కస్తుపంచ భృగుషట్క బుధశ్చతుర్దే
కేతుర్వ్యయేతు జనితో మరణాయ సద్య:
అనగా... 8లో చంద్రుడు, 7లో కుజుడు, 9లో రాహువు, లగ్నంలో శని,3లో గురుడు, 5లో రవి, 6లో శుక్రుడు, 4లో బుధుడు, 12లో కేతువు బాలారిష్టాలనిస్తారు. కాని, ఆ గ్రహ దశలు జననకాల దశలయితే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దోష గ్రహంపై శుభ గ్రహ దృష్టి ఆ దోషాన్ని తగ్గిస్తుంది.
బాలారిష్ట భంగాలు :
1) లగ్నాధిపతి బలంగా ఉండి శుభ గ్రహ యుతిగాని, దృష్టిగాని కలిగి కేంద్ర స్థితిని పొంది పాప గ్రహ యుతి, దృష్టి లేకుంటే బాలారిష్టం పోతుంది.
2) పూర్ణ చంద్రునిపై శుభ గ్రహ యుతి దృష్టి ఉండి శుభ రాశి, నవాంశలలో గాని, స్వ, ఉచ్చ, మిత్ర వర్గాల్లోగాని ఉంటె బాలారిష్టం పోతుంది.
3) గురు, శుక్ర, బుధులలో ఒకరైనా కేంద్రాలలో పాప సంభందం (యుతి, దృష్టి) లేకుండా ఉంటె బాలారిష్టం పోతుంది.
4) శుక్ల పక్షంలో రాత్రిగాని, కృష్ణ పక్షంలో పగలుగాని జన్మించి చంద్రుడు శుభ గ్రహ దృష్టి కలిగి షష్ట అష్టమ స్థానాల్లో ఉంటె బాలారిష్ట భంగం.
-- వరలేఖరి.నరసింహశర్మ
[6:21 pm, 07/10/2020] +91 79810 02699: కన్యాదానము
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైఃః
సూచన :
మీకు తీరిక ఉన్నప్పుడు మాత్రమే ఈవ్యాసాన్ని పూర్తిగా చదవండి.
మన సనాతన హిందూ వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థమౌతుంది!
మీ
వరలేఖరి.నరసింహశర్మ
**00**
కన్యాదానము
తైత్తరీయ ఉపనిషత్(2.9.4.7)లో
'అథో అర్థో వా ఆత్మనః యత్పత్నీః' అని ఉంది. అంటే 'ఏ పురుషుడైనా తనంత తానుగా సగమే. రెండవ సగం అతని భార్య' అని అర్థం. జీవితంలో అంతటి ప్రధానమైన పాత్రగా స్త్రీని వరుని అర్ధాంగిగా చేసేది వివాహం. ఏ వర్ణమున కావర్ణము వారు వివాహ యోగ్యత వచ్చిన వరునికి యోగ్యమైన వధువును చూడటము, పరస్పర ఆమోదముతో కన్యక తండ్రి కన్యను దానము చేయటము ఆర్షధర్మము. నన్ను అపార్థము చేసుకొనకుంటే ఒక్క మాట. మన వేదమంత్రములలో కన్యను గూర్చి మాత్రమె చెప్పినారు. విధవలు, భర్తను వదలినవారు కన్యలనిపించుకోరు.
వరుడు, వధువు లేకుండా తన వంశాంకురమును పొందలేడు. కావున మీ అమ్మాయిని దానము చేస్తారా అని అర్థించవలసినదే, లేక మా కన్యకను దానముగా గ్రహించుతారా అని వధువు తండ్రి అయినా అడుగవచ్చు అబ్బాయి గుణగణములు నచ్చితే! కొందరు ఈ కన్యాదానము అను మాటను కన్య+ఆదానముగా విభాజించుతారు. అప్పుడు కూడా కన్యకను గ్రహించుట అనే అర్థము. అంటే 'ప్రదానము' వుంటే 'ఆదానము' వుంటుంది. బహుమతి ప్రదానము అంటే బహుమతినిచ్చుట అన్న మాట గుర్తుంటుందనుకొంటాను. దానము వుంటే ఆదాన ప్రదానములు వుంటాయి.
ఒక దానం నిర్వహించవలెననుకుంటే దాత ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయవలసి వుంటుంది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదని శాస్త్రం చెప్తుంది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయము ఒకటి వుంది. గ్రహీత, ఇచ్చేవాని అభిమతము మేరకు ఇచ్చినది పుచ్చుకోవలసినదేకానీ, ఇది కావాలి, అది కావాలి, ఇట్లు కావాలి అట్లు కావాలి అని అడిగే అధికారమునకు అతనికి అర్హత ఉండదు.
కన్యాదాత, అంటే తండ్రి, దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవారు వరుడు, అతని తలిదండ్రులు. సకలసద్గుణ సంశోభితునిగా వరుని తలచుటచేత వారి వంశమును నిలబెట్టుటకు కన్యాదాత అంతవరకు అల్లారుముద్దుగా పెంచిన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తలవంచాలిగదా! మరి గొంతెమ్మ కోరికలు కోరవచ్చునా?
కావున పెళ్లిని ఒక వేడుకగా జరుపదలచితే ఇరువైపులా ఆమోదయోగ్యమైన, దాతకు ఆర్థికముగా ఇబ్బంది కలుగని రీతి లో మెలగవలసివుంటుంది. అవసరమైతే ఆడుకోనవలసికూడా వుంటుంది. అంతేకానీ పెత్తనము చలాయించే అధికారము ఉండదు. ముఖ్యముగా వరుని వైపు పెద్దలు తమ ఇంటికి, అంత వరకూ అల్లారు ముద్దుగా పెంచుకొన్న తమ లక్ష్మిని నిస్వార్థముగా, ఆమె తలిదండ్రులు, పరాయి ఇంటికి పంపుచున్నారు. అంతవరకు అమ్మాయి పేరును అంటిపెట్టుకొనియున్న తమ ఇంటిపేరునే త్యాగము చేయుచున్నారు. అంతకన్నా ఇంకేమీ కావలయునో ఆలోచించడి? ఇంతకు మించిన త్యాగము ఉంటుందా తెలుపండి.
"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించడం కాదు, అసలు నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు, దశరథ మహారాజును అడుగుతారు "మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు "అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్రుడు ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు. ఇది మనము నేర్చుకోవలసినది.
అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు! అసలు ఒక ఇంటి మట్టు మర్యాద ఏమిటో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది. ఇరువైపులా వారిని గూర్చీ తెలుస్తుంది. కుటుంబ సంస్కారాలు బయట పడే సమయము అదే!
తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండి!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకు ఉన్నదానిలో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.
కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.
'సాలంకారం మమ సుతాం కన్యాం దాస్యామి తే ద్విజః
పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం గచ్ఛ స్వాగచ్ఛ మద్గృహమ్'
అంటే 'నీకు సర్వాలంకార భూషిత అయిన మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేయిస్తాము. ఆమె చేతిని గ్రహించి, ధర్మపత్నీ సమేతుడవై, త్రేతాగ్నులతో వెళ్లగలవు. ఇప్పుడు మా ఇంటికి రాగోరుతున్నాం' అని అర్థం. ఈ వినతితో ఆ బ్రహ్మచారి, తన కాశీయాత్రను తాత్కాలికంగా పక్కన పెట్టి వివాహానికి అంగీకరిస్తూ, కల్యాణమండపం వైపు అడుగులు వేస్తాడు. ఇక్కడ అగ్ని యొక్క ప్రస్తాపన వచ్చింది కాబట్టి ఒక్క మాట చెబుతాను. శూద్ర అన్నది ఒక సంపూర్ణ సేవాసహకార వర్గమే కానీ దానికి ఎటువంటి న్యూనత కూడా వేదములలో ఆపాదించబడిలేదు. వారు పనిలోనే పరమాత్మను చూసే వర్గము. వారి కొరకు కూడా వేదమూర్తులగు బ్రాహ్మలు ఎన్నో క్రతువులు చేస్తారు. ముఖ్యముగా శంకరులవారి నాలుగు ఆమ్నాయ పీఠములు ఇటువంటి ఎన్నో కార్యములను నిర్వహిస్తూవుంటాయి. ప్రచారము వారి గుణము కాదు. ఈ విషయమును ఇప్పుడు ఎందుకు చెప్పినానంటే అగ్ని కార్యములు శూద్రులకు వుండవు కానీ వారు కర్తలుగా క్రతువులను చేయించవచ్చు. పై శ్లోకములో తెల్పిన ఈ అగ్ని, దేహములోని అగ్నికి ఆహూతులను అంటే వంటకాలను తయారు చేయుటకు వధువు ఉపయోగిస్తుంది. మనము తినే ఆహారము నియమబద్ధముగా ఉండవలెను. మన శరీరమే పరమాత్ముని నివాసగృహము. అందువల్ల మనము తినే తిండి దేవునికి నైవేద్యముతో సమానము.
ఇక ఈ మంత్రమును గమనించండి.
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాంI
దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషయాII
అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి.
దీని అర్ధం-
"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కుందనము వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత పరమపదప్రాప్తి పొందినట్లు పూర్వులచే విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను"
అని కన్యా దాత అంటారు.
ఇది చతుర్వర్ణములకూ సమానమే! మన వివాహ మంత్రములు ఎంత ఉదాత్తభావములను కలిగి వున్నాయో గమనించండి.
పరమతములలో వివాహములు ఒడంబడికలతో కూడుకొన్న పత్రములు మాత్రమే.
ఇక ఇక్కడ అబ్బాయి తండ్రిగా ముందు దశరథుడు జనకునితో ఏమి చెబుతాడో చూడండి.
ప్రతిగ్రహో దాత్రువశశ్రుతమే తన్మయా పురాI
యథా వక్ష్యసి ధర్మజ్ఞతత్కరిశ్యామహే వయంII
(బాల కాండ 69/14)
దశరథుడు ఆనందముతో “కన్యను ఒసంగుట అన్నది, ఆమెను దానము చేయుచున్న మీ ఆధీనములో వున్నది. మాలో ఏమున్నది? మీరు చెప్పినట్లే తప్పక చేయగలవారము.” ఇది వరుడు శ్రీరామచంద్రుని తండ్రియగు దశరథుడు చెప్పిన మాట. మరి అంతటి మహానీయునిమాట మనకు ఆదర్శము కావలెనుకదా!
అందుకు జవాబుగా మనకు రామాయణము బాలకాండము లోని 73 వ సర్గ సీతా కళ్యాణ వైభోగమును గూర్చి తెలుపుతుంది. అందులోని 26, 27 శ్లోకములు అత్యంత ముఖ్యమైనవి. ప్రతి తండ్రీ తన బిడ్డను ధారా దత్తము చేయునపుడు ఈ రెండు శ్లోకముల నాలుగు పాదములలోని మొదటి మూడు పాదములూ చెప్పితీరవలసిందే!
ఇయం సీతా మమ సుతా సహధర్మ చరీ తవI
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినాII.
పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదాI
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్ రాజా మంత్రంపూతం జాలం తథాII .
కళ్యాణమును సప్తపది అని కూడా అంటారని అందరికీ తెలిసిందే!
జనకుడు సీతను గూర్చి ఏమేమి చెప్పినాడో చూడండి:
1. ఈ సీత ….
2. నా కుమార్తె …
3. నీకు సహధర్మ చరి
4ఈమెను స్వీకరించు … 5నీకు మంగళమగు గాక…. 6. ఈమె చేతిని నీ చేతితో గ్రహించు.
7. పతివ్రతాశిరోమణియైన మహానుభావురాలు, అయిన ఆమె ఎల్లప్పుడూ నిన్ను ఛాయ వలె అనుసరించి నడుస్తుంది.
ఏడు మాటలే మాట్లాడేడు జనకుడు . సప్తపది అది . వివాహం అనేది జీవితాంతం ఉండే స్నేహం . 'సఖ్యం సాప్తపదీనం' అని ఏడు మాటలతో స్నేహితులై పోతారు .
ఇందులోని ప్రతి పదం అసలు ఎందుకు వాడి ఉంటారు మహర్షి అని కనుక మనము యోచించుట మొదలు పెడితే తెలియజేయుటకు నా మేధస్సు చాలదు, ఒకవేళ వుంటే!
ఒక్క విషయము చెప్పి ఈ వ్యాసమును ముగిస్తాను.
~~~~~~
భార్యాభర్తల సంబంధం ఎట్లుండవలెనని మన పెద్దలు నిర్దేశించినారో చూడండి :--
“వివాహ సమయంలో “సప్తపది” అనే తంతులో చదివే మంత్రాలలో
ఒక మంత్రం:
“సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః,
సఖ్యంతే గమేయం, సఖాత్తేమాయోషం, సఖ్యాన్యే మయోష్టా:”
అనగా ఈ ఏడడుగల బంధంతో భార్య, భర్తలమైన మనం ఇకపై
స్నేహితులుగా ఉంటూ పరస్పరం స్నేహ భావాన్ని విడవకుండా
పయనిద్దాం.
ఎంత ఉదాత్తమైనభావన! “ఆపత్స మిత్రం జానీమః ”
కష్టాలలో ఆదుకొను వాడే మిత్రుడు. అట్టి మిత్రభావంతో భార్యాభార్తలు
ఉంటే, వారి మధ్య కలతలు, కార్పణ్యాలు , ఆవేశకావేశాలు,
అసమానతలు లేకుండా నిత్య వసంతంలా వారి జీవితం సాగిపోతంది.
ఇంకా—
“ సంతుష్టో భార్యయా భర్తా భర్తా భార్య తధైవచ/
యస్మిన్నేవ కులేన్నిత్యం కల్యాణం తత్రవైధృవం ” అనగా
భార్య ,భర్తలు పరస్పరం ఒకర్ని ఒకరు గౌరవించుకొంటూ ప్రేమానురాగాలతో సంతుష్టంగా ఉంటారో! ఆ ఇల్లు నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా విలసిల్లుతుంది.
నేను తెలియజేసిన ఈ విషయములు సనాతన ధర్మమును పాటించే ప్రతిఒక్కరికీ సంబంధించినవి. ఇందులో సంకుచితత్వమునకు తావు లేదు.
స్వస్తి.
సేకరణ :
వరలేఖరి.నరసింహశర్మ
🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment