Monday, 15 December 2025

 సర్వం విష్ణుమయం జగత్

                  (1వ. భాగం)

గడచిన కార్తీక మాసంలో శివ తత్వము, శివ స్త్రోత్ర పఠనము, శివ మహాత్మ్యం గురించి యధా శక్తి ముచ్చటించు కున్నాము. ఇప్పుడు ధనుర్ మాసంలో విష్ణు తత్వాన్ని, విష్ణు క్షేత్రాల గురించి మరియు విష్ణు స్తోత్రాలు, కీర్తనల గురించి తెలుసుకుందుకు ప్రయత్నం చేద్దాము.

(ఇందులో ఒక్క విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఉండేది పరబ్రహ్మ ఒక్కడే, శివుడన్నా, విష్ణువన్నా, శక్తన్నా, గణపతన్నా, సూర్యనారాయణుడన్నా. కానీ భక్తుని కోరిక మీద ఆతను కోరిన రూపంలో అభివ్యక్త మవడమే అసలు సత్యం. అందుకేఆధ్యాత్మిక ఐక్యతకు సంబంధించి స్వామి వివేకానంద కేంద్ర బోధనలలో ఒకటి "ఏకం సత్ విప్రా బహుధా వదంతి", దీని అర్థం " సత్యం ఒకటే; జ్ఞానులు దానిని అనేక పేర్లతో పిలుస్తారు ." ఈ లోతైన ప్రకటన వేదాంత బహుత్వవాదం యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది, విభిన్న మత మరియు తాత్వికతను వివరిస్తుంది. ఈ ధోరణిని సమన్వయ పరచడానికే శంకర భగవత్పాదులు పంచాయతనం అనే పద్ధతిని ప్రవేశపెట్టారు.)


సూర్యనారాయణమూర్తి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణందాకా సంచరించే అతి పవిత్ర మైన మాసమే ధనుర్మాసం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం…

మేష, సింహ, ధనుస్సు రాశులు ధర్మ క్షేత్రాలుగా

వృషభ, కన్య, మకర రాశులు అర్థ క్షేత్రాలుగా

మిథున, తుల, కుంభ రాశులు కామక్షేత్రాలుగా

కర్కాటక, వృశ్చిక, మీన రాశులు మోక్ష క్షేత్రరాలుగా ప్రసిద్ధికెక్కాయి.

అందున ధనూరాశికి దేవగురువైన బృహస్పతి అధిపతి, ఆయనకు చాలా బలో పేతమైన మూల త్రికోణస్థానం ధనూరాశి.అంతే కాక ఇక్కడ ఉండే మూడు నక్షత్రాలలోనూ మూలా నక్షత్రం ఒకటి. ఆశ్వియుజ మాసం శరన్నవరాత్రులలో ఈ మూలా నక్షత్రం రోజునే సరస్వతీ మాత పూజలందు కుంటుంది. ఒక విధంగా ఇది మూలాధార క్షేత్రంగా భావించి కుండలిని మేల్కొల్ప డానికి అనువైన సమయంగా ఈ ధనుర్మాసాన్ని ఉపయోగించుకొని ధన్యులము అవవచ్చు.

ఈ ధర్మక్షేత్రంలో సూర్యనారాయణుని సంచారం ధర్మ సంస్థాపనానికి చిహ్నం. అట్టి సమయం 

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం (04:07)

పరిత్రాణాయ సాధూనాఁ వినాశాయ చ దుష్కృతాం

ధర్మసఁస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే (04:08)

(ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సం రక్షణముల కొఱకు ప్రతి యుగమున అవతారమును దాల్చుచున్నాను.)

అన్న విష్ణువు సంపూర్ణ అవతారమైన కృష్ణుని స్మరించు కొనుటకు చక్కని సమయం. అందునా అధర్మం వీర విహారం చేస్తున్న ఈ రోజుల్లో ఆ నారాయణుని కరుణా కటాక్ష వీక్షణాలే మనకు అత్యంత ఆవశ్యకము.

అట్టి పవిత్ర సమయాన నారాయణాయ నామ సంకీర్తనతో ఈ ధనుర్మాసం సద్వినియోగము చేసుకుందుకు ప్రయత్నం చేద్దాము.

తదుపరి భాగంతో రేపు కలుసుకుందాము అంత వరకు శ్రీమద్వల్లభాచార్యవిరచిత మధురాష్టకాన్ని, నారాయణ తీర్థుల కృష్ణం కలయ సఖి…తరంగాన్ని మధురంగా ఆశ్వాదిద్దాము.

సేకరణ

హైదరాబాద్

                      మధురాష్టకం

అధరం మధురం వదనం మధురం

నయనం మధురం హసితం మధురమ్ ।

హృదయం మధురం గమనం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 1 ॥


వచనం మధురం చరితం మధురం

వసనం మధురం వలితం మధురమ్ ।

చలితం మధురం భ్రమితం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 2 ॥


వేణు-ర్మధురో రేణు-ర్మధురః

పాణి-ర్మధురః పాదౌ మధురౌ ।

నృత్యం మధురం సఖ్యం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 3 ॥


గీతం మధురం పీతం మధురం

భుక్తం మధురం సుప్తం మధురమ్ ।

రూపం మధురం తిలకం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 4 ॥


కరణం మధురం తరణం మధురం

హరణం మధురం స్మరణం మధురమ్ ।

వమితం మధురం శమితం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 5 ॥


గుంజా మధురా మాలా మధురా

యమునా మధురా వీచీ మధురా ।

సలిలం మధురం కమలం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 6 ॥


గోపీ మధురా లీలా మధురా

యుక్తం మధురం ముక్తం మధురమ్ ।

దృష్టం మధురం శిష్టం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 7 ॥


గోపా మధురా గావో మధురా

యష్టి ర్మధురా సృష్టి ర్మధురా ।

దలితం మధురం ఫలితం మధురం

మధురాధిపతేరఖిలం మధురమ్ ॥ 8 ॥


॥ ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం మధురాష్టకం సంపూర్ణమ్ ॥

*****

 నారాయణ తీర్థుల కృష్ణం కలయ సఖి…


రాగం: ముఖారి

తాళం: ఆది


కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం

(సఖీ! అత్యంత మనోహరమైన కృష్ణుడిని చూడు)


కృష్ణం కథవిషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాల

కృష్ణం కలయ సఖి సుందరం


(కృష్ణుడు, ఇంద్రియాల దాహాన్ని గెలుచుకున్నవాడు, విశ్వానికి ప్రభువు, రాక్షస సంహారకుడు మరియు రాక్షసులపై విజయం సాధించినవాడు, ఎప్పుడూ చిన్న పిల్లవాడే.)


నృత్యంతమిహ ముహుర్ అత్యంత పరిమిత,

బ్రూత్యానుకూలమకిలా సత్యం సదా బలా ॥


(అతను గొప్ప రాగాలకు నృత్యం చేస్తూనే ఉంటాడు,తన సేవకుల పట్ల పక్షపాతం చూపుతాడు, సత్యవంతుడు మరియు ఎల్లప్పుడూ బాలుడే)


ధీరం భవజలభారం సకలవేదసారం సమస్తయోగిధారం సదా బాల

కృష్ణం కలయ సఖి సుందరం


(ఆయన ధైర్యవంతుడు, ఆయన మనల్ని సంసార సాగరాన్ని దాటిస్తాడు, ఆయనే అన్ని వేదాలకు సారం, ఆయనే అన్ని యోగాలకు, యోగులకు ఆధారం మరియు ఆయన ఎల్లప్పుడూ బాలుడే.)


శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరికేళ సంగం సదా బాల

కృష్ణం కలయ సఖి సుందరం


(అతను శృంగార, సంగీత మరియు సాహిత్యాలనే గంగా తరంగాల సంగమము  మరియు ఎల్లప్పుడూ బాలుడే)


రామేణ జగదభిరామేణ బలభద్రరామేణ సమవాప్త కామేన సహ బాల

కృష్ణం కలయ సఖి సుందరం


(లోకాన్ని ఆకర్షించే రాముడు ఆయనే మరియు బలరాముడు ఆయనే,మన కోరికలను తీర్చే రాముడు ఆయనే కానీ ఆయన ఎప్పుడూ బాలుడే.)

దామోదరం అఖిల కామాకరంగన శ్యామాకృతిం అసుర భీమం సదా బాల

కృష్ణం కలయ సఖి సుందరం

(సమస్త లోకమూ తనను ప్రేమించేలా చేసే దామోదరుడు ఆయనే, ఆయన ముదురు నల్లని రంగు కలిగి ఉంటాడు, అసురులకు భయంకరంగా ఉంటాడు కానీ ఆయన ఎప్పుడూ బాలుడిగానే ఉంటాడు.)

రాధారుణాధర సుతాపం సచ్చిదానందరూపం జగత్రయభూపం సదా బాల

కృష్ణం కలయ సఖి సుందరం

(ఎర్రటి పెదవుల బాధను తీర్చేది ఆయనే రాధ,  దివ్య ఆనందం యొక్క రూపాన్ని కలిగి ఉంటాడు, మూడు లోకాలకు రాజు కానీ ఎల్లప్పుడూ బాలుడిగా ఉంటాడు.)

అర్థం శితిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థం పరమపురుషార్థం సదా బాల

కృష్ణం కలయ సఖి సుందరం

*****-

(ఆయనే సంపద, దుఃఖాన్ని నాశనం చేసేవాడు,నారాయణ తీర్థ రక్షకుడు, దైవిక పురుషుడు కానీ ఎల్లప్పుడూ బాలుడు.

*****

సర్వం విష్ణుమయం జగత్

                (2వ. భాగం)

“విష్" అనే ధాతువునుండి "విష్ణు" అనే పదానికి భాష్యకారులు అర్థం చెబుతారు. "విష్" అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట, అంతటినీ ఆవరించి ఉండుట అనే అర్థాలున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి శ్లోకంలో "విశ్వం, విష్ణుః, వషట్కారః, భూత భవ్య భవత్ప్రభుః, భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మా, భూత భావనః" అనే నామాలున్నాయి. 

"యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి" - అంతటా ప్రవేశించి ఉండేవాడు విష్ణువు - అని నిరుక్తి అర్థం. 

ఏది అన్నింటా వ్యాపించి ఉంటుందో, అదే విష్ణువు" అని అర్థం, ఇది విష్ణువు సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది.

"వేవేష్టి ఇతి విష్ణుః" అని శంకరాచార్యుల వ్యాఖ్యానం. "విశ్వం" అంటే అంతా తానైనవాడు. "విష్ణువు" అంటే అన్నియెడలా ఉండేవాడు. "భూత భవ్య భవత్‌ప్రభుః" అంటే గడచిన కాలానికి, జరుగుతున్న కాలానికి, రాబోయే కాలానికి కూడా ప్రభువు. భూత కృత, భూత భృత్, భావః, భూతాత్మా, భూత భావనః అంటే అన్ని భూతాలను (జీవులను) సృష్టించి, పోషించి, భరించేవాడు. అన్ని జీవులలోను ఉండేవాడు. ఈ నామాలు  విష్ణువుకు ఉన్న స్థానాన్ని క్లుప్తంగా చెబుతున్నా యనుకోవచ్చును. అనగా విష్ణువు కాలానికి, స్థలానికి, పదార్థానికి అతీతుడు.

భాగవతం గజేంద్ర మోక్షం ఘట్టంలో గజేంద్రుని ప్రార్థన (నిరాకార) పరబ్రహ్మమును ఉద్దేశించి చేసినట్లు కనిపిస్తుంది. 

లో కం బులు లోకేశులు

లో క స్థులుఁ దెగినఁ దుది న లో కం బగు పెం

జీ క టి కవ్వల నెవ్వఁ

డే కా కృతి వెలుఁగు నతని నే సేవించున్. తా|| 

ప్రళయాంతమందు స్ధితమగువాని వర్ణించుచున్నా డెటులన భువనములుఁ దత్పరిపాలనంబును, దద్గత జంతువులను నశించిన పిదపఁ బెంజీఁకటి కావల నేకాకియై ప్రకాశించు, నిషేధ వశిష్టుఁ డగు వికారరహితుని సేవించెను. 

ఇంకా

ఎ వ్వ నిచే జనించు జగ; మె వ్వని లోపల నుండు లీనమై;

యె వ్వ ని యందు డిందుఁ; బర మే శ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం

బెవ్వఁ ;​ డనాదిమధ్యలయుఁ డె వ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ డె వ్వఁ డు; వాని నాత్మభవు నీ శ్వరు నే శరణంబు వేడెదన్. తా|| 

సకల భువనసృష్టిలయ నియామకత్వంబులును, ఉపాదాన కారణత్వమును, ఆది మధ్యాంత రహితత్వమును, సర్వనామ రూపత్వ మెవ్వనిచే ధరింపఁబడుచున్నదో, యట్టి యీశ్వరుని శరణుఁజొచ్చుచున్నాను.

అట్టి ఈశ్వరుడు మహావిష్ణువేనని తలచి

శ్రీవిష్ణు షట్పదీ స్తోత్రరాజంతో స్తుతిద్దాము.

విష్ణు షట్పది స్తోత్రం పఠించడం వల్ల అజ్ఞానం తొలగి, మనస్సు ప్రశాంతమై, సంసార బంధాల నుండి విముక్తి లభించి మోక్షం వైపు నడిపిస్తుందని, భగవంతునిపై భక్తి పెరుగుతుందని, ఆత్మను ఉద్ధరించుకోవడానికి సహాయపడుతుందని పెద్దల విశ్వాసం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ స్తోత్రరాజం శ్రీ ఆదిశంకరాచార్య విరచిత మైనది.

అల్లాగే కర్ణాటక సంగీతనికి ఆద్యుడైన శ్రీ పురందర దాస విరచిత “ జగదోద్ధారణ “ కృతితో తరిద్దాం.

B-910

హైదరాబాద్.

                విష్ణు షట్పదీ స్తోత్రం

అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ ।

భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ॥ 1 ॥

(ఓ విష్ణు మూర్తి, నా అవినయమును పోగొట్టుము. నాకు మనోనిగ్రహమును ప్రసాదించుము, ప్రాపంచిక విషయములనెడి  ఎండమావులను రూపుమాపుము, సర్వ ప్రాణుల (భూతదయ) యందు దయను పెంపొందింపుము, సంసార సాగరం నుండి బయటపడుటకు నాకు మార్గము చూపించుము.)

దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే ।

శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే ॥ 2 ॥

(ఆకాశ గంగయే మకరందముగా కలిగివుండి సచ్చిదానందమును పరిమళముగా కలిగి

సంసార భయ దుఃఖములను నశింపచేసేవి అయిన శ్రీపతి (లక్ష్మి దేవి భర్త అగు విష్ణువు) యొక్క పాద పద్మములకు నమస్కరించుచున్నాను)

సత్యపి భేదాపగమే నాథ తవాఽహం న మామకీనస్త్వమ్ ।

సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ॥ 3 ॥

(ఓ నాథ, పరమ సత్యమును గ్రహించి నీకు నాకు భేదములేదు అను భావన కలిగినా కూడా, నేను నీకు చెందిన వాడినే కానీ నీవు నాకు చెందిన వాడవు కాదు ఎలాగంటే సముద్రము తరంగముల లాగా. తరంగములు సముద్రమునకు చెందినవి కానీ సముద్రము తరంగమునకు చెందదు కదా)

ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే ।

దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః ॥ 4 ॥


(పర్వతమును ఎత్తిన వాడా (కృష్ణునిగా), పర్వతముల రెక్కలు తెగ్గొట్టిన ఇంద్రుని తమ్ముడా, రాక్షస కుల శత్రువుగా ఉన్నవాడా, సూర్యచంద్రులను కన్నులుగా కలవాడా

మీ దృష్టి మాపై ప్రసరించినచో, ప్రత్యక్షమైనచో సంసార బాధ నశించక ఎలా ఉంటుంది)

మత్స్యాదిభిరవతారైరవతారవతాఽవతా సదా వసుధామ్ ।

పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోఽహమ్ ॥ 5 ॥

(ప్రపంచమును కాపాడుటకు నీవు మత్స్య ఇతర అవతారములు ఎత్తితివి

ఓ పరమేశ్వరా, భవ తాపముతో, సంసార 

తాపముతో భయపడు నన్ను కాపాడుము.)

దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద ।

భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే ॥ 6 ॥

(ఓ దామోదర (ఉదరము భాగమున త్రాడు వంటి ఆభరణము కలిగినవాడా), గుణములకు  నిలయమై, సుందరమగు పద్మము వంటి ముఖము కలిగినవాడా, గోవిందుడా ( గోవులను , సకల ప్రాణులను చూసుకొనువాడా)

సంసారమను సముద్రమును మథించు మందర పర్వతము వలే మథించువాడా, తీవ్రమగు నా భయమును పోగొట్టుము)

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ।

ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ॥

(ఓ నారాయణుడా, కరుణా మూర్తి, నీ పాదములను శరణు పొందుచున్నాను

ఇట్లు ఈ ఆరుపాదములు కలిగిన షట్పదీ స్తోత్రం ఆరుపాదములు కలిగిన తుమ్మెద వలే నా ముఖమనే పద్మము నందు ఎల్లపుడు నెలకొనుగాక)

ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం సంపూర్ణం

          జగదోద్ధారణా

పల్లవి

జగదోద్ధారానా ఆదిసిదాలే యశోదే

అనుపల్లవి

జగదోద్ధారానా మగనెందు తిలియుత

సుగుణాంత రంగనా ఆదిసిదాలే యశోదే

(ఆ స్వామి సద్గుణాలతో నిండి ఉన్నాడు. ఆయన అన్ని మంచి పాత్రల స్వరూపం. ఈ లోకాన్ని నివసించడానికి మంచి ప్రదేశంగా మార్చేది ఆయనే. రాక్షసులను చంపి, ఋషులను రక్షించేలా ఆయనే చూసుకుంటాడు. కానీ, యశోదే ఇవన్నీ పట్టించుకోడు. ఆమె అతనితో ఆడుకుంటోంది. ఆమె కొడుకులాగే. )

చరణం

నిగమకే సిలుకడ ఆగనిత మహిమాన

మగుగలే మాణిక్యానా ఆదిసిడలే యశోదే

(వేదాలు కూడా నిజంగా కనుగొనని వ్యక్తితో యశోద ఆడుకుంటోంది. అతను లెక్కలేనంత పెద్దవాడు. అతను అందరికంటే పెద్దవాడు. పిల్లలలో అతను ఒక రత్నం. కానీ, యశోదే అతనితో తన కొడుకులా ఆడుకుంటోంది, అంతకు మించి కాదు. )

అనోరనియాన మహతో మహిమాన

అప్రమేయనా నా ఆదిసిదాలే యశోదే

(ప్రపంచంలోని అతిపెద్ద వస్తువుల కంటే పెద్దవాడితో యశోద ఆడుకుంటోంది. ఆమె అపరిమితమైన మరియు నిజంగా కొలవలేని దానితో ఆడుకుంటోంది. ఆమె అణువులలో అతి చిన్నదానితో ఆడుకుంటోంది. ఆమె ఇవన్నీ అయిన వ్యక్తితో ఆడుకుంటోంది కానీ అతను ఎవరో నిజంగా తెలియకుండానే ఆమె అతనితో ఆడుకుంటోంది. అతను తన కొడుకులాగా ఆమె అతనితో ఆడుకుంటోంది. )

పరమ పురుసన పరవాసుదేవాన

పురందర విఠలనా ఆదిసిడలే యశోదే

(ఆయన మానవులలో అత్యుత్తముడు. ఆయన సమస్త లోకానికి దేవుడు. ఆయన పండరపుర విఠలుడు. ఇప్పుడు పురందరదాసు చేత ప్రశంసించబడుతున్నది ఆయననే. కానీ, యశోద నిజంగా ఆయన ఎవరో తెలియకుండానే ఆయనతో ఆడింది. ఆమె ఆయనతో కేవలం ఒక కొడుకుగానే ఆడింది.)

****

3.సర్వం విష్ణుమయం జగత్

వేదస్వరూపుడు, వేదరక్షకుడు, వేదాంత వేద్యుడు అయిన శ్రీ మహా విష్ణువుని వేదాలు యెంత గానో కీర్తించాయి.

పంచమ వేదమైన  మహాభారతం మొదలుపెడుతూనే శ్రీ మహావిష్ణుని వ్యాసభగవానుడు ఈ విధంగా స్మరించడం జరిగింది.

ఆద్యం పురుషమీశానం పురుహూతం పురుష్టుతం।

ఋతమేకాక్షరం బ్రహ్మ వ్యక్తావ్యక్తం సనాతనం॥ 1-1-28(28)

అసచ్చ సచ్చైవ చ యద్విశ్వం సదసతః పరం

పరావరాణాం స్రష్టారం పురాణం పరమవ్యయం॥ 1-1-29(29)

మంగల్యం మంగలం విష్ణుం వరేణ్యమనఘం శుచిం।

నమస్కృత్య హృషీకేశం చరాచరగురుం హరిం॥ 1-1-

కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన నారాయణోపనిషత్తులో ఇలా ఉంది -

ఓం. అథ పురుషో హ వై నారాయణోఽ కామయత, ప్రజాః సృజయేతి, నారాయణాత్ప్రాణో జాయతే, మనస్సర్వేంద్రియాణిచ, ఖం వాయుర్జ్యోతి రాపః, పృథివీ విశ్వస్య ధారిణీ, నారాయణాద్బ్రహ్మాజాయతే.... .... –

ఋగ్వేదంలో ఇలా ఉంది -

అథ నిత్యో నారాయణః, బ్రహ్మో నారాయణః, శక్రశ్చ నారాయణః, ద్యావా పృథివ్యౌచ నారాయణః, కాలశ్చ నారాయణః, దిశశ్చ నారాయణః, ఊర్ధ్వంచ నారాయణః, అధశ్చ నారాయణః, అంతర్బహిశ్చ నారాయణః,నారాయణ ఏవేదగ్‌ం సర్వం, యద్భూతం యచ్చభవ్యం, నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో, నిరాఖ్యాతశ్శుద్ధో దేవ ఏకో నారాయణః,న ద్వితీయోఽస్తి కశ్చిత్, య ఏవం వేదస విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి, ఏతద్యజుర్వేద శిరోఽధీతే –

నారాయణుడే సత్యము, నిత్యము, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, భూమి, ఆకాశము, పైన, క్రింద, అన్నిదిశలు, బయట, లోపల అన్నీ నారాయణుడే. అతడే భూత భవిష్యద్వర్తమానాలు. అతడు నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు. నారాయణుని మాటలతో నిర్వచింపలేము..

అట్టి పురాణ పురుషుణ్ణి ఈ రోజు ఈ స్కందపురాణోక్త శ్రీ ఆదినారాయణస్తవంతో స్వామిని ప్రార్ధన చేద్దాము.

తాళ్ళపాక అన్నమాచార్య తన కీర్తనలలో "సర్వం విష్ణుమయం" అనే భావనను లోతుగా వివరిస్తారు. ఆయన ప్రకారం, ఇంద్రియాలను జయించి, కర్మ బంధాలను విడిచిపెట్టి, పాప పుణ్యాలను త్యజించినప్పుడే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందని, అదే విష్ణుమయం అనే భావనకు మూలం అని ఆయన కీర్తనల ద్వారా విశదమౌతోంది.  

రేపు మరల కలిసి శ్రీ మహావిష్ణువు తత్వాన్ని ఆస్వాదిద్దాము.

B-910

హైదరాబాద్.

            శ్రీ ఆదినారాయణ స్తవః

ఋషయ ఊచుః |

నమః పరమకళ్యాణ కళ్యాణాయాత్మయోగినే |

జనార్దనాయదేవాయ శ్రీధరాయ సువేధసే || 1 ||


నమః పరమకింజల్క సువర్ణముకుటాయ చ |

కేశవాయాతిసూక్ష్మాయ బృహన్మూర్తే నమో నమః || 2 ||


నమః పంకజనాభాయ హరయే హరివేధసే |

నమో హిరణ్యగర్భాయ జగతః కారణాత్మనే || 3 ||


అచ్యుతాయ నమో నిత్యమున్నతాయ నమో నమః |

నమో మాయాపటచ్ఛన్న జగద్ధాత్రే మహాత్మనే || 4 ||


సంసారసాగరోత్తార జ్ఞానపోతప్రదాయినే |

అకుంఠమతయేధాత్రే సర్గస్థిత్యంతకారిణే || 5 ||


యథా హి వాసుదేవేతి ప్రోక్తం పాతకనాశనం |

తథా విలయమభ్యేతు దైత్యోయం మేఘవాహనః || 6 ||


యథా న విష్ణుభక్తేషు పాపం నాప్నోతి సంస్థితం |

తథా వినాశమాయాతు దైత్యోయం పాపకర్మకృత్ || 7 ||


స్మృతమాత్రో యథా విష్ణుః సర్వం పాపం వ్యపోహతి |

తథా ప్రణాశమభ్యేతు దైత్యోయం మేఘవాహనః || 8 ||


భవంతు భద్రాణి సమస్తదోషాః

ప్రయాంతు నాశం జగతోఽఖిలస్య |

అభ్యేత్యభక్త్యా పరమేశ్వరస్య

స్మృతే జగద్ధాతరివాసుదేవే || 9 ||


యస్తం పూజయతే భక్త్యా ఏకాదశ్యాన్నరోత్తమః |

సోఽశ్వమేధఫలం ప్రాప్య మోదతే దివి దేవవత్ || 10 ||


గోలక్షం బ్రాహ్మణే దత్త్వా యత్ఫలం ప్రాప్నుయాన్నరః |

తదాదిదేవం గోవిందం దృష్ట్వా భక్త్యా ఫలం లభేత్ || 11 ||


కలౌ కృతయుగస్తేషాం క్లేశాస్తేషాం సుఖాధికాః |

ఆదినారాయణో దేవో యేషాం హృదయసంస్థితః || 12 ||


ఏకాదశ్యాం రవిదినే స్నాత్వా సన్నిహితో జలే |

ఆదినారాయణం పూజ్య ముచ్యతే భవబంధనాత్ || 13 ||


ఇతి స్కందపురాణే శ్రీ ఆదినారాయణ స్తవః ||

(స్తవం ఆరంభంలో ఋషులు పరమకళ్యాణస్వరూపుడైన జనార్దనుడు, శ్రీధరుడు, సువేధసుడు అయిన దేవునికి నమస్కరిస్తారు. సువర్ణమయ కిరీటంతో, సున్నితమైన కానీ విస్తారమైన మహామూర్తిగా కేశవుడిని ధ్యానిస్తారు. పంకజనాభుడు, హరుడు, హిరణ్యగర్భుడు, జగత్తుకూ కారణాత్ముడు అనే నామాలు ఆయన సృష్టితత్త్వాన్ని వ్యక్తం చేస్తాయి.

అచ్యుతుడు, నిత్యం ఉన్నతుడైన పరమాత్ముడు మాయాపటంతో కప్పబడిన జగత్తును ధరిస్తూ అన్ని లోకాలకు ఆధారంగా ఉన్నారని ఋషులు వర్ణిస్తున్నారు. భగవంతుడు సంసారసాగరంనుండి బయటపడే జ్ఞానపోతాన్ని ప్రసాదించే దాత, సృష్టి–స్థితి–లయం నిర్వహించే ధాత్రి.

తరువాతి శ్లోకాలలో దైత్యసంహారం కోసం రక్షకశక్తిని ప్రార్థిస్తూ—

“వాసుదేవ నామస్మరణం పాపనాశకం, అలానే ఈ పాపకర్మకుడు అయిన దైత్యుడు నశించాలి”

అని ఋషులు దేవుని దయను వేడుకుంటారు.

విష్ణువును ఒక్కసారైనా స్మరించినా పాపాలు నశిస్తాయన్న సత్యాన్ని స్తవం పునరుద్ధరిస్తుంది.

జగత్తు దోషాలు, కష్టాలు, అశాంతులు నశించి శాంతి ఏర్పడాలని, వాసుదేవుని స్మరణతో లోకం క్షేమం పొందాలని సామూహికంగా ప్రార్థిస్తున్నారు.

ఫలశ్రుతి ప్రకారం, ఏకాదశి రోజున భక్తితో ఆదినారాయణుని పూజించే వ్యక్తి అశ్వమేధయాగఫలాన్ని పొందుతాడు. గోలక్ష దానం చేసిన పుణ్యాన్ని గోవిందుని దర్శనం, పూజ ద్వారా సులభంగా పొందుతాడు. కలియుగంలో ఆదినారాయణుడు హృదయంలో నివసించిన వారికి కృతయుగమంత శుభం, కష్టనాశనం లభిస్తాయి. ప్రత్యక్ష నారాయణునిగా భాసించే శ్రీ మహావిష్ణువును ఆదివారం,  ఏకాదశి సందర్భంగా స్నానము చేసి పూజించినవాడు భవబంధనమునుండి విముక్తి పొందుతాడు.

ఇది భక్తుని పాపక్షయం, ధర్మరక్షణ, దైవసన్నిధి, సంసారమోక్షం ప్రతిజ్ఞ చేసే అత్యంత పవిత్రమైన స్తోత్రం)

అన్నమయ్య” సర్వం విష్ణుమయం’

సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను

సర్వేశ్వరుఁడే పొందేటి వస్తువు శరణాగతియే వుపాయము ॥పల్లవి॥


తానని యెడి బుద్ధి దైవంబందు నునిచి

తానే తనమతి మరచిన సుఖ తత్వానందమిది

మేనని యెడి బుద్ది యీ మేదిని ప్రకృతి యందు

ఆనింపుచుఁ దా మమతలు విడిచిన నాత్మజ్ఞానంబు ॥సర్వం॥


పొరలి జగమనే బుద్ధి మాయపై నునిచి

పరగిన యింద్రియముల గెలిచినదే పరమపు యోగంబు

పొరిఁ గర్మపు బుద్ధి పుట్టువుపై నునిచి

వెరపునఁ బాపము బుణ్యము విడుచుట వివేకమగు దుదిపదము ॥సర్వం॥


వెలి దోచిన బుద్ధి వేగమే లోనునిచి

చలమున చంచల ముడిగి యుండుటే సమాధి లక్షణము

పలు భావపు బుద్ధి భక్తి వొకట నునిచి

యెలమి శ్రీ వేంకటపతి గలయుటే యిది తుర్యావస్థ.


(సర్వం విష్ణుమయం బను భావము సత్యం బిన్నిటను: ఈ విశ్వమంతా విష్ణుమయం (విష్ణువుతో నిండి ఉంది) అనే ఆలోచన నిజం, నిజం, ఇందులో ఎటువంటి సందేహం లేదు.

సర్వేశ్వరుఁడే పొందేటి వస్తువు శరణాగతియే వుపాయము: సర్వానికి ప్రభువైన విష్ణువును పొందాలంటే, ఆయనకు సంపూర్ణంగా శరణు కోరడం (శరణాగతి) మాత్రమే సరైన మార్గం. 

ముఖ్య సందేశం:

ఈ కీర్తన ద్వారా అన్నమయ్య, విశ్వమంతా భగవంతుడి రూపమేనని, ఆ భగవంతుడిని చేరడానికి అహంకారాన్ని విడిచిపెట్టి, పూర్తిగా దేవునిపై ఆధారపడటమే (శరణాగతి) అత్యుత్తమ మార్గమని తెలియజేస్తున్నారు. ఇది భగవద్గీత వంటి శాస్త్రాలలోని "వాసుదేవః సర్వమితి" (వాసుదేవుడే సర్వస్వం) అనే భావనకు దగ్గరగా ఉంటుంది. )

******

సర్వం విష్ణుమయం జగత్

                    (4వ. భాగం)

పురాణాలన్ని ఆ పరమపురుషుని కీర్తిస్తూ ఆతని తత్వాన్ని తెలియచేడమే పరామవధిగా ఉద్భవించాయి . అట్టి పరమ పురుషుడే ఈ శ్రీ మహావిష్ణు. 

ముఖ్యంగా మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి. 

మద్వయం, భద్వయం చైవ, బ్రత్రయం, వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్‌ పృథక్‌.

అర్థం :- పురాణాలు 'మ' అనే అక్షరంతో మొదలయ్యేవి రెండు, 'భ'తో మొదలయ్యేవి రెండు, 'బ్ర'తో మొదలయ్యేవి మూడు, 'వ'తో మొదలయ్యేవి నాలుగు, 'అ', 'నా', 'ప', 'లిం', 'గ', 'కూ', 'స్కా' ప్రథమాక్షరాలుగా కలిగినవి ఏడు, వెరసి 18 పురాణాలు.

ఈ 18 పురాణాలు శ్రీమహావిష్ణువు యొక్క అవయవాలుగా ఆవిష్కరించారు మన పెద్దలు..

1.బ్రహ్మ పురాణం (మహావిష్ణువు యొక్క శిరస్సు), 

2.పద్మపురాణం (మహావిష్ణువు యొక్క హృదయం),

3.విష్ణుపురాణం (మహావిష్ణువు యొక్క కుడిచేయి), 

4.వాయుపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమచేయి), 

5.శ్రీమద్భాగవతపురాణం (మహావిష్ణువు యొక్క తొడలు), 

6. నారదపురాణం (మహావిష్ణువు యొక్క నాభి), 

7.మార్కండేయపురాణం (మహావిష్ణువు యొక్క కుడిపాదం), 

8.అగ్నిపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ పాదం), 

9.భవిష్యపురాణం (మహావిష్ణువు యొక్క కుడిమోకాలు), 

10.బ్రహ్మవైవర్తపురాణం (మహావిష్ణువు యొక్క ఎడామ మోకాలు), 

11.లింగపురాణం (మహావిష్ణువు యొక్క కుడి చీలమండ), 

12.వరాహపురాణం (మహావిష్ణువు యొక్క ఎడమ చీలమండ), 

13.స్కాందపురాణం (మహావిష్ణువు యొక్క కేశములు), 

14.వామనపురాణం (మహావిష్ణువు యొక్క చర్మము), 

15.కూర్మపురాణం (మహావిష్ణువు యొక్క వీపుభాగం), 

16.మత్స్యపురాణం (మహావిష్ణువు యొక్క మెదడు), 

17.గరుడపురాణం (మహావిష్ణువు యొక్క మాంససారము), 

18.బ్రహ్మాండపురాణం (మహావిష్ణువు యొక్క ఎముకలు) మొదలయినవి; 

ఈ విధంగా మహావిష్ణువు యొక్క శరీరం లోని 18 అవయవములతో పోల్చారు.

ఈ పోలిక పురాణాలలోని సారాన్ని, ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క వివిధ రూపాలు, అవతారాలు, మరియు ఆయన మహిమను సూచిస్తుంది.

 "సర్వం విష్ణుమయం జగత్" (సమస్త ప్రపంచం విష్ణుమయం), విశ్వం, దానిలోని ప్రతి జీవి, ప్రతి వస్తువు అంతా విష్ణువు యొక్క స్వరూపమే అని సూచిస్తుంది. అన్నింటిలోనూ విష్ణువును చూడగలగడం, సర్వత్రా ఆయన వ్యాపించి ఉన్నాడని గ్రహించడమే జ్ఞానం అని ఉద్ఘాటిం చాయి పురాణాలు.

అట్టి పురాణ పురుషుడైన శ్రీ మహా విష్ణువుని గురించి  దృవుడు చేసిన విష్ణు స్తోత్రము అల్లాగే శృంగేరి జగత్గు రువులు శ్రీభారతీ తీర్థమహా స్వాములు వ్రాసిన అతి మధురమైన కీర్తన

“గరుడ గమన తవ చరణ కమలమివ” పాడుకుంటూ నేటికి శలవు తీసుకుందాము.

B-910

హైదరాబాద్.


        ధృవ కృత భగవద్ స్తుతి


ధృవ కృత భగవద్ స్తుతి

ధ్రువ ఉవాచ

యోऽన్తః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం

సఞ్జీవయత్యఖిలశక్తిధరః స్వధామ్నా

అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్

ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యమ్. 1


నీకు నీవుగా మా హృదయం లోపల చేరి నిదురిస్తున్న శక్తిని మేలుకొలిపి నీ యందు మా దృష్టిని నిలిపేట్లు చేస్తున్నావు. నిదురపోయి ఉన్న నా వాక్కును ఉజ్జీవింపచేసావు. అందరి శక్తినీ అందించేవాడివి, అందరి sakhti నీవే అయిన వాడివి. కేవల వాక్కునే కాదు, చేయీ కాలూ కళ్ళూ నాలికా అన్నీ, వీటిలో ఏది కదలాలన్నా పరమాత్మ వలనే. అన్ని ఇంద్రియాలలోకీ నీవు వెళ్ళి వాటి శక్తిని ఉజీవింపచేస్తావు. అటువంటి నీకు నమస్కారం


ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా

మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషమ్

సృష్ట్వానువిశ్య పురుషస్తదసద్గుణేషు

నానేవ దారుషు విభావసువద్విభాసి..2.


నీవొక్కడవే నీ యోగ మాయ అనే శక్తితో ప్రకృతితో మహత్ తత్వాన్ని, దానితో అహంకారమునూ, దానితో ఇంద్రియాలను సృష్టించి, ప్రవేశించి, సత్ అసత్తులోనూ,ప్రకృతిలోనూ మహదహంకారములో ప్రవేశించావు. ఒక్కడివే ఉన్నా చాలా మంది ఉన్నట్లు భాసిస్తావు. కట్టె ఆకారం బట్టి మంట ఆకారం మారుతూ ఉంటే, అగ్నే పలు రకాలుగా మారుతోంది అనిపించినట్లుగా నీవు కూడా పలు రకాలుగా ఉన్నట్లు భాసిస్తావు. వాస్తవముగా నీవు ఒక్కడవే.


త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం

సుప్తప్రబుద్ధ ఇవ నాథ భవత్ప్రపన్నః

తస్యాపవర్గ్యశరణం తవ పాదమూలం

విస్మర్యతే కృతవిదా కథమార్తబన్ధో..3


పడుకుని లేచిన వాడు ఎలా చూస్తాడో నీవిచ్చిన జ్ఞ్యానముతో సకల ప్రపంచాన్ని చూస్తున్నాము. ప్రపంచం తెలియాలన్నా ప్రపంచాన్ని చూడాలన్న నీ అనుగ్రహమే కావాలి. మోక్షమూలమైనది నీ పాదం. కానీ ఈ విషయాన్ని అన్నీ తెలుసనుకునే జనులు ఎలా మరిచిపోతున్నారు


నూనం విముష్టమతయస్తవ మాయయా తే

యే త్వాం భవాప్యయవిమోక్షణమన్యహేతోః

అర్చన్తి కల్పకతరుం కుణపోపభోగ్యమ్

ఇచ్ఛన్తి యత్స్పర్శజం నిరయేऽపి న్ణామ్..4


పరిశుద్ధమైన బుద్ధికలిగి, బాగా పరిశీలించి మంచి బుద్ధిగా ఉంటున్న వారందరూ నీ మాయతో సంసారాన్నీ మోక్షాన్నీ ఇచ్చేవాడివి (భవాప్యయవిమోక్షణ) అయిన నీ గురించి తెలిసి కూడా మోక్షన్ని కోరక సంసారాన్ని అడుగుతున్నారు. నిన్ను సంసారం కోసం అర్చిస్తున్నారు. కల్పవృక్షాన్ని పట్టుకొని పురుగులు తినే శరీరాన్ని కోరుతున్నారు. దానికి నీ మాయే కారణం


యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మ

ధ్యానాద్భవజ్జనకథాశ్రవణేన వా స్యాత్

సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథ మా భూత్

కిం త్వన్తకాసిలులితాత్పతతాం విమానాత్..5


శరీరధారులకు ఆనందం నీ పాద పద్మాలని ధ్యానం చేయడం వలనా, నీ భక్తుల కథలు వినడం వలనా, కలుగుతుంది. వీటి వలన కలిగే ఆనందం సంసారములో ఉండే జనులు యముని కత్తి వేటు తప్పించుకోవడములో పొందుతున్నారు. కింద పడేసే విమానాలు వద్దు నాకు


భక్తిం ముహుః ప్రవహతాం త్వయి మే ప్రసఙ్గో

భూయాదనన్త మహతామమలాశయానామ్

యేనాఞ్జసోల్బణమురువ్యసనం భవాబ్ధిం

నేష్యే భవద్గుణకథామృతపానమత్తః..6.


ఏమి చేస్తున్నా మాట్లాడుతున్నా నీ యందే భక్తి కలగాలి. నిరంతరం నిన్ను తలచుకొనే భక్తుల సావాసం చాలు. దాని వలన పరమ తీవ్రమైన మహాకష్టాలతో నిండి ఉన్న సంసారమనే మహా సముద్రాన్ని సులభముగా దాటుతాము. నీ కథలనే మత్తులో ఉన్న మాకు ఈ సంసారములో మునుగుతున్నా కూడా, మునుగుతున్నట్లు తెలియదు.


తే న స్మరన్త్యతితరాం ప్రియమీశ మర్త్యం

యే చాన్వదః సుతసుహృద్గృహవిత్తదారాః

యే త్వబ్జనాభ భవదీయపదారవిన్ద

సౌగన్ధ్యలుబ్ధహృదయేషు కృతప్రసఙ్గాః..7


నిరంతరం నీయందే మనో వాక్కులూ లగ్నం చేసిన వారి పొరపాటున కూడా శరీరాన్ని, మరణ ధర్మం కలిగి ఉన్నదాన్ని స్మరించరు. శరీరాన్నే తలచనప్పుడు, శరీరం కోసం వచ్చేవారు, శరీరముతో వచ్చిన వారు, శరీరం వలన వచ్చేవారైన, భార్యా పిల్లలూ ఇల్లూ వెంట రావు. పుత్రులూ, మిత్రులూ, ఇల్లూ, విత్తం, ధార వీళ్ళంతా శరీరం వెంట తిరిగేవారు. నీ పాదారవింద మకరందాన్ని రుచి చూసిన వారు వీటిని కోరరు.


తిర్యఙ్నగద్విజసరీసృపదేవదైత్య

మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషమ్

రూపం స్థవిష్ఠమజ తే మహదాద్యనేకం

నాతః పరం పరమ వేద్మి న యత్ర వాదః..8


మేము ఏ ఏ ఆకారాలను  కోరతామో ఆ రూపాలలో వచ్చావు. ఆహారముగా తినే మత్స్యాదులలో, పర్వతాలుగా, నదులుగా, పక్షులుగా, సర్పాలుగా, దేవతలుగా (వామనుడు) మనుషులుగా , ఎవరెవరు ఏ ఏ ఆకారలతో నిన్ను భావిస్తారో ఆ ఆకారములలో వచ్చావు. ఇన్ని రూపాలలో ఉన్నా వీటిలో ఉన్న దోషాలు ఏవీ నీకు అంటవు. నీవు సత్ కాదూ అసత్ కాదు. అన్నింటిలో ఉంటావు కానీ దేనిలోనూ ఉండవు. మహదాదులు ఉన్నాయి గానీ అవి నిజానికి లేవు. అవి అన్నీ నీ రూపాలే. ఇంతకంటే ఎక్కువ నేను ఏదీ తెలుసుకోలేను. అక్కడిదాకే నీ వాదాలన్నీ.


కల్పాన్త ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్

శేతే పుమాన్స్వదృగనన్తసఖస్తదఙ్కే

యన్నాభిసిన్ధురుహకాఞ్చనలోకపద్మ

గర్భే ద్యుమాన్భగవతే ప్రణతోऽస్మి తస్మై..9


ప్రళయకాలములో ఈ సకల జగత్తునీ నీ కడుపులోకి తీసుకుని, సకలప్రపంచాన్నీ నీకు నీవే చూస్తూ పడుకుంటావు. కొంతకాలానికి అలా పడుకొని ఉన్న నీ నాభి నుంచి బంగారు పద్మం పుడుతుంది. అదే లోకపద్మం. దాని మధ్యలో చతుర్ముఖ బ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటారు.


త్వం నిత్యముక్తపరిశుద్ధవిబుద్ధ ఆత్మా

కూటస్థ ఆదిపురుషో భగవాంస్త్ర్యధీశః

యద్బుద్ధ్యవస్థితిమఖణ్డితయా స్వదృష్ట్యా

ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే..10..


స్థితావధిమఖో- పరమాత్మ జగత్తును రక్షించడానికే పుడతాడు. అధి మఖ అంటే లోక రక్షణ గురించి యజ్ఞ్యములచే ఆరాధించబడే వాడు. నీ "స్థితి" ధర్మ స్థాపన కొరకే (పరిత్రాణాయ సాధూనాం). నీవు లోకాన్ని రక్షించడానికి అవతరిస్తున్నావు. నీ చేత రక్షించబడినవారు యజ్ఞ్యముల ద్వారా నిన్ను ఆరాధిస్తున్నారు. అవతరించినా నీవు వ్యతిరిక్త . అంటే ప్రకృతి కన్నా పురుషుడికన్నా విలక్షణుడవు. కానీ వాటికన్నా వేరుగా ఉన్నట్లు కనపడతావు.

                గరుడ గమన

గరుడ గమన తవ చరణ కమలమివ

మనసిల సతు మమ నిత్యం                      || గరుడ ||

మమ తాపమ పా కురు దేవా

మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

చరణం: 1 

జలజ నయన విధి, నముచి హరణ ముఖ

విబుధ వినుత పద పద్మా                           || 2||

మమ తాపమ పా కురు దేవా

మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

చరణం: 2

భుజగ శయన భవ, మదన  జనక మమ

జనన మరణ భయ హారి                            || 2||

మమ తాపమ పా కురు దేవా

మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

 చరణం: 3

శంఖ చక్ర ధర , దుష్ట దైత్య హర

సర్వ లోక శరణా                                        || 2||

మమ తాపమ పా కురు దేవా

మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

చరణం: 4

అగణిత గుణ గణ , అశరణ శరణద 

విదిలిత సురరిపు జాలా                           || 2|| 

మమ తాపమ పా కురు దేవా

మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||

చరణం: 5

భక్త వర్య మిహ , భూరి కరుణయా

పాహి భారతీ తీర్థం                                    || 2||

మమ తాపమ పా కురు దేవా

మమ పాపమ పా కురు దే ~ వా                || గరుడ ||k

No comments:

Post a Comment