Wednesday, 28 July 2021

 

  శ్రవేంకటేశ్వర: 🌻 పరమపుణ్యధామమూ..... ఉత్తరద్వారదర్శనము!! 🌻


శ్లో॥ సత్యం సత్యం పునస్సత్యం న దేవో వేంకటేశ్వరాత్ బ్రహ్మాండే నాస్తి, యత్కించిత్ న భూతం న భవిష్యతి. - భవిష్యోత్తర పురాణం


🍃🌺సత్యంగా చెబుతున్న మాట! ఒకసారి కాదు. మళ్లీ మళ్లీ చెబుతున్న సత్యమైన మాట ఇది! ఏమిటా సత్యం. అంటే ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా అటు భూతకాలంలోను ఇటు భవిష్యత్తులోను శ్రీవేంకటేశ్వరునివంటి దేవుడు లేడు. లేనే లేడు. కనపడడు కూడా" అని.

🍃🌺అలాంటి ఆనందనిలయుని దర్శనం కోసం ఇంటి నుంచి బయలు రడం, ఏడుకొండల్లో విహరించడం, బంగారుమేడ ఆనందనిలయాన్ని వీక్షించడం, ఆనందనిలయుని నిలువెత్తు దివ్యమంగళ విగ్రహాన్ని కన్నులారా దర్శించడం... ఇలా వీటన్నింటి వల్ల దివ్యానుభూతులతో ఒక ఆనందాన్ని పరమానందాన్ని పొందడం అద్భుతం పరమాద్భుతం! అయితే!

🍃🌺'అందరూ ఒక ఎత్తు, అగస్త్యుడొక ఎత్తు' అన్నట్లు ఇన్నిన్ని ఆనందాల్ని నిరంతరం పంచుతూ. భక్తులను మైమరపిస్తున్న తిరుమలక్షేత్రాన్ని ఏడాది పొడవునా దర్శించడం ఒక ఎత్తు! కాగా

🍃🌺ప్రత్యేకంగా ధనుర్మాసంలో ఒక నెలరోజుల్లో, ఏ ఒక్క రోజైనా తిరుమలక్షేత్రాన్ని సందర్శించే భాగ్యం కలగడం, ఆనందనిలయుణ్ణి దర్శించి వింత వింత అనుభూతుల్ని ఆనందాన్ని పొందే అదృష్టం కలగడం మాత్రం, మరో ఎత్తు! అందులోను ధనుర్మాసంలో వచ్చే వైకుంఠఏకాదశిపండుగనాడు కలియుగవైకుంఠంలో విహరించడంవల్ల, సందర్శించడంవల్ల భక్తుని మనస్సు ఆనందాల పంటలు పండేపూదోట అవుతుంది.


🌻 వెంకన్న సన్నిధిలో వైకుంఠ ఏకాదశి 🌻


🍃🌺ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే 'ఏకాదశి'ని 'వైకుంఠ ఏకాదశి' అంటారు. తిరుమలక్షేత్రంలో వైకుంఠఏకాదశి, ఆ మరునాడు వైకుంఠద్వాదశి ఇలా ఇది రెండు రోజుల పండుగగా ఎన్నో విశిష్ట సేవలతో నిర్వహింపబడుతుంది.


🌻 వైకుంఠద్వారం తెరవబడుతుంది 🌻


🍃🌺వైకుంఠ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిళ్లు మూసివేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠఏకాదశినాడు సుప్రభాతసమయంలో బంగారు వాకిళ్లు తెరచినప్పటినుండి మరునాడు వైకుంఠద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకు శ్రీవారి గర్భాలయానికి దగ్గరగా ఆనుకొని ఉన్న “ముక్కోటి ప్రదక్షిణ మార్గం" తెరవబడుతుంది.

🍃🌺ఈ ప్రదక్షిణ మార్గానికి ఉన్న ద్వారాలను వైకుంఠద్వారాలనీ, ఉత్తరద్వారాలనీ అంటారు. ఈ మార్గాన్ని ‘వైకుంఠప్రదక్షిణమార్గం' అనీ అంటారు. ఈ మార్గం విద్యుద్దీపాలతో, సుగంధ, సుమనోహరమైన పులమాలలతో అలంకరింపబడిన ఈ వైకుంఠప్రదక్షిణంలో ప్రవేశించే భాగ్యం ఏడాదిలో ఈ రెండురోజులు మాత్రమే కలుగుతుంది.

🍃🌺వైకుంఠఏకాదశి, ద్వాదశి రోజుల్లో శ్రీ స్వామివారిని దర్శించిన తర్వాత భక్తులకు వైకుంఠప్రదక్షిణంలో ప్రవేశం కలుగుతుంది. ఈ రెండు రోజులూ విమానప్రదక్షిణంలో భక్తులు అనుమతింపబడరు. వైకుంఠ ప్రదక్షిణంలో ప్రవేశించిన భక్తులకు దివ్యానుభూతులతో పాటు, పూర్వసంచిత పాపకర్మలన్నీ నశిస్తాయి. ఇష్టార్థాలన్నీ నెర వేరతాయి.


🌻 స్వర్ణరధోత్సవం 🌻


🍃🌺వైకుంఠ ఏకాదశినాడు సప్తగిరీశునికి మరో విశేష ఉత్సవం జరుగుతుంది. అదే స్వర్ణరథోత్సవం!

🍃🌺వైకుంఠ ఏకాదశినాడు ఉదయం 8 గంటలవేళ కలియుగ వైకుంఠ నాథుడైన కొండలరాయడు శ్రీదేవీ భూదేవేరులతో కలిసి బంగారుతేరుపై పురవీధుల్లో దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశి నాటి స్వర్ణరథోత్సవంలో పయనిస్తున్న అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుణ్ణి దర్శిస్తే చాలు.

🍃🌺భక్తుల మనోరథాలు తప్పక తీరతాయి. భక్తుల గోవిందఘోషల మధ్య జరిగే తిరుమల గోవిందుని స్వర్ణరథోత్సవదృశ్యాన్ని వర్ణించడం అక్షరాలకు అందదు. దర్శించి అనుభవించాలి. అంతే!


🌻 శ్రీస్వామిపుష్కరిణీతీర్థ ముక్కోటి ఉత్సవం 🌻


🍃🌺వైకుంఠ ఏకాదశి మరునాడు 'వైకుంఠద్వాదశి'. వీటినే "ముక్కోటి ఏకాదశి”, “ముక్కోటి ద్వాదశి అంటారు. వైకుంఠఏకాదశి మరునాడు వైకుంఠద్వాదశినాడు “శ్రీస్వామిపుష్కరిణీ తీర్థ ముక్కోటి ఉత్సవం” జరుగుతుంది.

ధనుర్మాసే సితే పక్షే ద్వాదశ్యా మరుణోదయే ఆయాతి సర్వతీర్థాని స్వామిపుష్కరణీ జలే తత్ర స్నాత్వా నరః సద్యోముక్తి మేతి నసంశయః యస్య జన్మ సహస్రేషు పుణ్య మేవార్జితం పురా

🍃🌺ధనుర్మాసంలో వైకుంఠద్వాదశినాటి అరుణోదయ వేళలో ముక్కోటి తీర్థాలు “శ్రీస్వామి పుష్కరిణి”లో మునకలిడుతాయి. శుభప్రదమైన ఆ వేళలో స్నానం చేసే మహాభాగ్యం అందరికీ కలుగనే కలగదట! ఎవరైతే వేలజన్మల్లో పుణ్యాన్ని ఆర్జించుకొని ఉంటారో, వారికి మాత్రమే ఈ నాడు తిరుమల శ్రీవారి కోనేట్లో స్నానం చేసే భాగ్యం కలుగుతుంది. అలాంటి వారికి సద్యోముక్తి కలుగుతుంది.

🍃🌺అంటే వారు శరీరంతో ఉన్నా, జీవన్ముక్తిని పొందుతారని సారాంశం. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని స్కాందపురాణాంతర్గత వేంకటాచల మాహాత్మ్యం స్పష్టం చేస్తోంది.


🌻 శ్రీవారి చక్రస్నానం 🌻


🍃🌺ఇలాంటి శ్రీస్వామిపుష్కరిణీ తీర్థముక్కోటి శుభఘడియల్లో, అంటే వ…
[6:59 am, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🌻 విష్ణుమూర్తి కూర్మావతారం చాలించడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా? 🌻



🍃🌺పురాణాల ప్రకారం లోకకల్యాణార్థం, ధర్మాన్ని కాపాడటం కోసం విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా దశావతారాలలో రెండవ అవతారమే కూర్మావతారం. అయితే విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తడానికి గల కారణం? కూర్మావతారాన్ని చాలించడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం....

🍃🌺పురాణాల ప్రకారం రాక్షసులు దేవతలు అమృతం కోసం సాగర మథనం చేస్తున్న సమయంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని దానిని పాలసముద్రంలో వేస్తే అది బరువుకు సముద్రంలో మునుగుతుంది. దీంతో దేవతలు రాక్షసులు ఏం చేయాలో తెలియక ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు.

🍃🌺దీంతో విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతం కింద ఉండి దాని బరువును మోస్తాడు. ఈ క్రమంలోనే దేవతలు రాక్షసులు దానిని చిలకడానికి ప్రయత్నించగా ఆ పర్వతం కదలలేదు. అప్ప…
[7:00 am, 26/06/2021] శ్రవేంకటేశ్వర: దేవీభాగవతం - 54
శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు
చతుర్థ స్కంధము - 14
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
లలితా సహస్రనామ శ్లోకము -53

సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ!
మహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్ముడప్రియా!!

శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
 53వ  భాగములో....
నరనారాయణులు అప్సరసలను అనుగ్రహించడం   చదువుకున్నాము.
🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏
అమ్మ దయతో......  ఈ రోజు
భూదేవి మొర  చదువుకుందాం.
🙏🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🙏

 భూదేవి మొర

జనమేజయా ! అతిమహత్తరమైన కృష్ణ చరిత్రను విశదీకరిస్తాను. తెలుసుకో. నీ సందేహాలకు అన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. అదీకాక ఇది అద్భుతమైన దేవీ చరిత్ర కూడా.

ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖిస్తూ, దీనురాలై, గోరూపం ధరించి త్రివిష్టపానికి (దేవలోకం) వెళ్ళింది. శక్రుడు ఈ దీనావస్థను గమనించి, ఏమిటమ్మా కారణం, ఎవరు నిన్ను హింసించారు, నీకు వచ్చిన భయమేమిటి, ఎందుకూ దుఃఖిస్తున్నావు ? అని ఆప్యాయంగా పలకరించాడు. దుఃఖం ఆపుకోలేక భూదేవి బావురుమంది.

శచీపతీ ! దుఃఖం ఎందుకని అడుగుతున్నావా ? తెలియకే అడుగుతున్నావా ? చూడు - నేనెంత భారాన్ని మోస్తున్నానో, నన్ను ఎవరెవరు ఏలుతున్నారో - గమనించు.

జరాసంధ, శిశుపాల, రుక్మి, కంస, నరక, శాల్వ, కేశి, ధేనుక - వత్సక ప్రభృతులు నాకు ఏలికలు. ముచ్చటగా చెప్పుకుందామంటే ఒక్కటంటే ఒక్కటి - సద్గుణం లేనివారు. సర్వధర్మ విహీనులు. సకల దుర్గుణ విరాజితులు. వీళ్ళు పరస్పర విరోధులు. మదోన్మత్తులు. కాలరూపులు. పాపాచారులు. నిరంతరం ఒకరితో ఒకరు కలహించుకుంటూ నన్ను దారుణంగా హింసిస్తున్నారు. ఈ పాపభారాన్ని నేను మొయ్యలేను. ఏమి చెయ్యాలో, ఎవరిని శరణువేడాలో తోచక ఆత్మీయుడవుకదా నీ దగ్గర మొర పెట్టుకుందాం ఏదైనా ఉపాయం చెబుతావని ఇలా వచ్చాను.

అలనాడు విష్ణుమూర్తి వరాహావతారం ధరించి నాకు చేసింది ఉపకారమే అనుకున్నాను. ఇప్పుడనిపిస్తోంది - అది ఉపకారంకాదు అపకారమే అని. చిన్న దుఃఖం నుంచి పెద్ద దు:ఖంలోకి తెచ్చిపడేసినట్టయ్యింది. కశ్యపాత్మజుడు దుష్టహిరణ్యాక్షుడు నన్ను లుంగజుట్టి మహాసముద్రంలోకి విసిరేస్తే శ్రీహరి వరాహరూపం ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి, తన బంగారు కోరమీద నన్ను తేల్చి తెచ్చి స్థిరంగా నిలబెట్టాడు కదా ! అప్పటినుంచి స్థిర అనే పేరు నాకు దక్కిందికదా ! ఇప్పటి పరిస్థితి చూస్తే అది అపకారమే అనిపిస్తోంది. అలా చేసిఉండకపోతే, పాతాళంలో సుఖంగా ఉండేదాన్ని. ఈ పాపాత్ముల చేతుల్లో పడి ఇంత పీడ అనుభవించాల్సిన దుర్దశ ఉండేది కాదు.

ఇంద్రా ! ఈ దుష్టుల భారాన్ని నేనింక మొయ్యలేను. ఇరవై ఎనిమిదవ కలియుగం రాబోతోంది. ఈ పాపభారం ఇంకా పెరిగిపోతుంది. అప్పుడెలాగూ రసాతలానికి పోకతప్పదు. ఈలోగా ఈ దు:ఖసముద్రం నుంచి నన్ను గట్టెక్కించు. భారం తొలగించు - నీ కాళ్ళు మొక్కుతాను.

ఇంత దయనీయంగా భూదేవి అభ్యర్థిస్తే ఇంద్రుడు చలించిపోయాడు. అమ్మా ! నేనేమి చెయ్యగలనూ ? నీ బాధ తీర్చలేను. ఆర్చలేను. బ్రహ్మదేవుడొక్కడే దీనికి సమర్థుడు. అతణ్ణి శరణువేడు. నేనూ తోడు వస్తాను. పద. ఇదే నేను చెయ్యగల ఉపకారం - అన్నాడు.

దేవతాపరివారంతో ఇంద్రుడు వెంటరాగా భూమాత సత్యలోకానికి వెళ్ళింది. చతుర్ముఖుడు స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేశాడు. పొంగివస్తున్న దుఃఖాన్ని నిబ్బరించుకుంటూ కడకొంగుతో కళ్లు ఒత్తుకుంటూ భూదేవి బదులు పలికింది.

సరస్వతీ వల్లభా ! కలికాలం రాబోతోంది. చాలా భయంగా ఉంది. ప్రజలంతా పాపాచారులైపోతారు. పాలకులు దుర్మార్గులవుతారు. పరస్పర విరోధులవుతారు. రాక్షసులుగా మారిపోతారు. అన్నీ దొంగ పనులే చేస్తారు. ఇప్పటికే ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. నాకు భారం పెరిగిపోయింది. మొయ్యలేకపోతున్నాను. ఒక్కొక్కరికీ ఎంతెంత సైన్యమని ! ఈ రాజులనూ సైన్యాలనూ సంహరించి నాకు భారం వదిలించు. ఇందుకోసమే కోరి నీ దర్శనానికి వచ్చాను.

భూదేవీ ! ఇది నావల్ల అయ్యే పనికాదు. జనార్దనుడే సమర్థుడు. పద. నేనూ వస్తాను. అతడిని అభ్యర్ధించుదాం - అని బ్రహ్మదేవుడు హంస వాహనంపై బయలుదేరాడు. అందరూ విష్ణుసదనం చేరుకున్నారు. ముందుగా చతుర్ముఖుడు శ్రీమహావిష్ణువును స్తుతించాడు -

సహప్రశీర్షా త్వమపి సహస్రాక్షః సహస్రపాత్ |
త్వం వేదపురుషః పూర్వం దేవదేవ: సనాతనః ||

మధుసూదనా ! నువ్వు సహస్రశీర్షుడవు. సహస్రాక్షుడవు. సహస్రపాదుడవు. వేదపురుషడవు. దేవదేవుడవు. సనాతనుడవు. భూతభవిష్యద్వర్తమానాలన్నీ నీకు స్పష్టంగా తెలుసు. మాకందరికీ అమరత్వాన్ని ప్రసాదించింది నువ్వే. నువ్వు ఎంతటి మహిమాన్వితుడవో ఎవ్వరూ ఊహించలేరు.

జగత్కర్తవు నువ్వే. రక్షకుడవు నువ్వే. భక్షకుడవూ నువ్వే. సర్వజగత్తుకు ప్రభువు-నువ్వు.

విరించి ఇలా స్తుతించితే విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు. అందరికీ దర్శనం అనుగ్రహించాడు. స్వాగతం పలికాడు. ఏ పనిమీద వచ్చారని ప్రశ్నించాడు.

భూదేవి పక్షాన బ్రహ్మదేవుడే పలికాడు. దయానిధీ ! కలియుగం రాబోతోంది. కనక ఈ ద్వాపరాంతంలో నువ్వు భూలోకాన అవతరించి దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించు. భూదేవి ఆవేదనను తీర్చు - అని అభ్యర్థించాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు.


(రేపు.... శ్రీహరి పరాధీనత )

 🙏అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే .......‌‌‌‌‌‌‌.🙏
                                  ..... సశేషం

శ్రీ మాత్రేనమః
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏

సూర్యుడు : వైద్యశాస్త్రం,బౌతికశాస్త్రం,కుజునితో కలసిన శస్త్రచికిత్స కునిగా,గురువుతో కలసిన ఆయుర్వేదం,శనితో కలసిన అనస్తీషియా,ఆర్ధోఫిడిక్స్ వైద్యుడు,చంద్ర,శుక్రులతో కలసిన గైనకాలజిస్ట్,బుధునితో కలసిన నరాల నిపుణులు,మరియు కర్ణరోగ వైద్యం సూచించును.రాజ్యాధికారము , పరిపాలనా విభాగాములకు అధికారి , ఆఫీస్ మేనేజ్ మెంట్ , అధ్యక్ష పదవులు, ధార్మిక సంస్థలు , సంఘములకు గౌరవ అధ్యక్షులు మొదలగు అనేక విధముల యజమాని హోదా పొందగలరు. చట్ట సభలలో అధికారము, శాసన నిర్మాణ కర్తలు , ప్రజా పరిపాలకులు . ఆర్డర్స్ జారీ చేయు అధికారము , హోదా , గౌరవము కలిగిన వృత్తులను ప్రసాదించును.

చంద్రుడు : చరిత్ర,కవిత్వం,సైకాలజీ,సముద్ర గర్బమును పరిశోదించుట. నీటికి సంబంధించిన శాఖలు , ద్రవ పదార్దములకు సంబంధించినవి . తెలుపు వర్ణమునకు చెందినవి .
అనగా కూల్ డ్రింక్స్ …
* ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811 లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి. *

మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో,  గురుకుల అభ్యాసం ఎలా ముగిసింది తెలుసుకుందాం.
గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో)  ఈ క్రింది విషయాలను బోధించారు.
01 అగ్ని విద్య (లోహశాస్త్రం)
02 వాయు విద్య (గాలి)
03 జల్ విద్య (నీరు)
04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)
05 పృథ్వి విద్య (పర్యావరణం)
06 సూర్య విద్య (సౌర అధ్యయనం)
07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)
08 మేఘ విద్య (వాతావరణ సూచన)
09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)
10 దిన్  రాత్ విద్య.
12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)
13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)
14 భుగోళ విద్య (భౌగోళిక)
15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)
16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)
17 రత్నాలు మరియు లోహాలు
18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)
19 ప్రకాశ విద్య (శక్తి)
20 సంచార విద్య (కమ్యూనికేషన్)
21 విమాన విద్య (విమానం)
22 జలయన్ విద్య (నీటి నాళాలు)
23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)
24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)
25 యజ్ఞ విద్య
ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి మాట్లాడదాం!
26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)
27 కృషి విద్య (వ్యవసాయం)
28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)
29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)
30 యాన విద్య (మెకానిక్స్)
32 వాహనాల రూపకల్పన
33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)
36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)
37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)
38 తక్కలు
39 రంగ్ విద్యా (డైయింగ్)
40 ఖాట్వాకర్
41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)
42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)
43 ఖానా బనానే కి విద్యా (వంట)
44 వాహన్ విద్యా (డ్రైవింగ్)
45 జలమార్గాల నిర్వహణ
46 సూచికలు (డేటా ఎంట్రీ)
47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)
48 బాగ్వానీ (హార్టికల్చర్)
49 వాన్ విద్యా (అటవీ)
50 సహోగీ ( పారామెడిక్స్).
ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, కాని కాలంతో పాటు, గురుకులాలను  అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత  భవిష్యత్తు ఇప్పటి కీ నాశనం అవుతోంది.

భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?
కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.

మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.

భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′ ′ దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ  పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం  ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.
మెకాలే ఇలా చెప్పాడు -  ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి.  అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థ కు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.
1850 వరకు భారతదేశంలో '7 లక్ష 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ  'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి.  గురుకులములు  ప్రజలు మరియు రాజు చేత  కలిపి నడుపుబడేవి.
విద్యను ఉచితంగా ఇచ్చారు.
గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!
మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలం తో నిండి ఉంటుంది మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు".  ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువ గా భావిస్తున్నాము.
మాతృభాష నుండి దూరం కాబడిన  సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం! నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి.

 మన భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని   తిరిగి పొందే సమయం ఇది.

🐍సుబ్రహ్మణ్య క్షేత్రం.... మోపిదేవి
💫🍂💫🍂💫🍂💫🍂💫🍂💫
సమర్పణ :—
🦅శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైశ్చరస్వామి దేవస్థానము - వినుకొండ.
( 🛕మన 2️⃣ తెలుగు రాష్ట్రాల లోనే తొలిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణమౌతున్న అత్యంత అరుదుగా గల సతీ సమేత ఆలయం)
{సంగండెయిరి పాలకేంద్రం పక్కన , నరసరావుపేట రోడ్డు -   - గుంటూరుజిల్లా ఆంద్రప్రదేశ్
 👉వ్యవస్థాపక అధ్యక్షులు:- పరమేశ్వర జానపాటి (శివగురుస్వామి) ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం అగుటకు phone phe  & google pay no : 8520096175)
🍂💫🍂💫🍂💫🍂💫🍂💫🍂
👉🏾మోపిదేవి లోని... వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం దక్షిణ భారతదేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వరక్షేత్రంగా విరాజిల్లుతోంది.

స్థల పురాణం
స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భంలో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది.
అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్టవలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలోకి చొచ్చుకొనిపోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించ సాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపోయాయి.ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమహర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షికి , విషయాన్ని వివరించారు. యోగదృష్టితో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలుపడదని తెలిసి కూడ లోకశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమరకార్యానికి అంగీకరించాడు. లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.

పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.
“వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్”
అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది,.

ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి, ఇదే “సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తి ము క్తి ఫలప్రదమని “శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తి కే సుబ్రమణ్యమనెడి పేరని మాండవ్యుడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు. కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరించారు అగస్య్తమహర్షి. “సనక,సనకస,సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ భగవదారాధనలోనే కాలం గడుపుతుంటారు. వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసంలో లేడు. లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయంలో శచీ,స్వాహా మొదలైన దేవతాస్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.

“ కుమారా! ఏల నవ్వుచున్నావు ? వారు నేనులా కన్పించలేదా.? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా ?” యని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపై బడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు.

ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగవలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. ” అత్రస్నానం తు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్, “ .... అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్ర తో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి.

కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టల తో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఈతను మహాభక్తుడు. అతనికి స్వామికలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి , ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టితో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమై పోగా మిగిలిన నంది,గుర్రము ఈనాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.

ఆలయప్రత్యేకత.:-----
స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగు తుంది. ఆలయప్రదక్షిణమార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.

ఇక్కడ స్వామివారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవ గా భక్తులు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం,మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు.

స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు.

ఓం శం శరవణభవ
🚩🏴🚩🏴🚩🏴🚩🏴🚩🏴🚩
🙏 శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనిదేవుని అనుగ్రహమునకు  అత్యంత అరుదుగా గల ఈ ఆలయ నిర్మాణంలో మీవంతు సహాయ సహకారమందించి ఆలయ నిర్మాణంలో మీరూ భాగస్వాములు కండి. :— 🦅
-శ్రీ జ్యేష్ఠలక్ష్మీ సమేత శ్రీశనైశ్చరస్వామి దేవస్థానము- 👉( మన తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటి సతీసమేత శనైశ్చరాలయం వినుకొండలో నిర్మాణమౌతున్నది )
 {రిజిష్టర్డ్ నంబర్ 14/2018 .}
(సంగంపాలకేంద్రం పక్కన - నరసరావుపేటరోడ్ - వినుకొండ {గుంటూరు జిల్లా - ఆంద్రప్రదేశ్ } )
👉 ఆలయ నిర్మాణమునకు సహకరించాలనుకునేవారు దేవస్థానము అకౌంటును పోస్టు చేయుచున్నాము.


. నిశ్శబ్దము - స్నేహము 🌻


నిజమైన స్నేహము, నిశ్శబ్దమై యుండునని చైనీయుల సూక్తి. నిశ్శబ్దమే నిజమైన స్నేహితుడని మరియొక సూక్తి. ప్రేమ, స్నేహము నిజమైనచో అది మాటలయందులేక, చేతలయందు మాత్రమే యుండును. చేతలేయుండును గాని మాటలుండవు. స్నేహమును, ప్రేమను భాషణములోనికి దించువారు లోతులేనివారు. వారికి నిశ్శబ్దపు లోతు, రుచిలేక, కేవలము పేలవమైన మాటల నుండి వ్యక్తము చేయుదురు. వాచావాత్సల్యమే లోతులేని వారికి ప్రీతి.

ప్రపంచమంతయు మాటల గారడిలో చిక్కి, ప్రేమయని స్నేహమని తల్లక్రిందులగు చున్నది. నిజమగు స్నేహము గలవారు, ప్రేమగలవారు దాని రుచి తెలిసి, భాషణమున రగుల్కొనక, తత్సంబంధిత కార్యముల నిమగ్నులగుదురు. నిశ్శబ్దమున ప్రవహించినంత స్నేహము, ప్రేమ, మాటలలో ప్రవహింపజాలదు. సీతారాముల ప్రేమ వారిరువురికే తెలియును.

కృష్ణ ప్రేమ భార్యలకన్న గోపికలకే ఎక్కువ తెలియును. ద్రౌపదిని గూర్చి కృష్ణునికి గలప్రేమ అత్యంత సన్నిహితము, సున్నితము కూడ. సత్యభామకది అంతుపట్టలేదు. భరతునిపై రామునికి గల ప్రేమ మాటలలో వ్యక్తము కాలేదు. రాముని స్నేహమంతయు క్రియా రూపమే. భాషణామయము కాదు.

గుహుడైనను, జటాయువైనను, శబరియైనను, సుగ్రీవుడైనను, విభీషణుడైనను రాముని స్నేహమును, ప్రేమను, చేతల ద్వారా రుచి చూచిరే కాని మాటల ద్వారా కాదు. లోతులలో జీవించువారికే, స్నేహము ప్రేమ తెలియును. లోతులు నిశ్శబ్దమునకు సంబంధించినవి. నిశ్శబ్దమున సాన్నిధ్యమున్నది. సాన్నిధ్యము దివ్యసాన్నిధ్యమే.

మన యందలి సాన్నిధ్యమే మన ప్రాణము
లను, తెలివిని నడుపుచున్నవి. మనము గుర్తింప కున్నను, ప్రాణముగను, తెలివిగను పని చేయుచున్నది. ఈ స్నేహమును, ప్రేమను ఏమని పిలువవలెను? సతతము మనలను ప్రేమించు దైవప్రేమ నిశ్శబ్దముననే నున్నది. స్నేహమునకు ప్రేమకు దైవమే పరాకాష్ఠ. అది నిశ్శబ్దమున ప్రవేశించిన వారికే తెలియును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

Tuesday, 27 July 2021

శ్రవేంకటేశ్వర: 🌻 తిరుమల స్వామి గడ్డం కింద పచ్చకర్పూరం కథ తెలుసుకొందాము 🌻




🍃🌺కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు. ఆ మూర్తిని కొన్ని సెకన్లు దర్శించుకోవడానికి లక్షలాదిమంది భక్తులు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకొని ఆ స్వామిని దర్శించుకుంటారు. తిరుమలలో ప్రతి అడుగు ఒక చరిత్ర. స్వామి దేవాలయంలో ప్రతి అడుగు వెనుక ఎంతో విశిష్టత.

🍃🌺స్వామి ఆర్చితామూర్తి రూపంలో ఎన్నో గాథలు.. విశేషాలు, వింతలు ఉన్నాయి. అలాంటిదొకటి తెలుసుకుందాం… శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం తెలుసా? ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఆ విషయాలు…

🍃🌺శ్రీవారి భక్తులలో అగ్రగణ్యుడు అనంతయ్య (అనంతాళ్వారు). ఆ శ్రీవారికి సేవచేస్తూ తరించిన భక్తుడు శ్రీ అనంతాళ్వార్. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు.

🍃🌺పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని, మొదలు పెడతాడు.

🍃🌺ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది.

🍃🌺అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు.

🍃🌺ఆమె మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది.

🍃🌺దాంతో బాలుడు రూపంలో వచ్చిన వేంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయం అయిపోతాడు.
ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారుకు చెప్తారు. దాంతో కంగారుగా అతడు అక్కడికి చేరుకుంటాడు.

🍃🌺గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోతాడు.
తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధ నుండి ఉపశమయం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు.

🍃🌺అప్పటి నుండి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గునపాన్ని ఇప్పటికీ మనం మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు.

🍃🌺అదండీ స్వామివారి గడ్డం కింది పచ్చకర్పూరం గాథ. ఈసారి స్వామిని దర్శించుకున్నప్పుడు ఒక్కసారి ఈ గాథను గుర్తుచేసుకోండి.. స్వామి వారికి తన భక్తుల గాథను తల్చుకుంటే మరింత సంతోషించి మీకు సులభంగా ప్రసన్నమవుతాడు.


🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[6:58 am, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🌻 పరమపుణ్యధామమూ..... ఉత్తరద్వారదర్శనము!! 🌻


శ్లో॥ సత్యం సత్యం పునస్సత్యం న దేవో వేంకటేశ్వరాత్ బ్రహ్మాండే నాస్తి, యత్కించిత్ న భూతం న భవిష్యతి. - భవిష్యోత్తర పురాణం


🍃🌺సత్యంగా చెబుతున్న మాట! ఒకసారి కాదు. మళ్లీ మళ్లీ చెబుతున్న సత్యమైన మాట ఇది! ఏమిటా సత్యం. అంటే ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా అటు భూతకాలంలోను ఇటు భవిష్యత్తులోను శ్రీవేంకటేశ్వరునివంటి దేవుడు లేడు. లేనే లేడు. కనపడడు కూడా" అని.

🍃🌺అలాంటి ఆనందనిలయుని దర్శనం కోసం ఇంటి నుంచి బయలు రడం, ఏడుకొండల్లో విహరించడం, బంగారుమేడ ఆనందనిలయాన్ని వీక్షించడం, ఆనందనిలయుని నిలువెత్తు దివ్యమంగళ విగ్రహాన్ని కన్నులారా దర్శించడం... ఇలా వీటన్నింటి వల్ల దివ్యానుభూతులతో ఒక ఆనందాన్ని పరమానందాన్ని పొందడం అద్భుతం పరమాద్భుతం! అయితే!

🍃🌺'అందరూ ఒక ఎత్తు, అగస్త్యుడొక ఎత్తు' అన్నట్లు ఇన్నిన్ని ఆనందాల్ని నిరంతరం పంచుతూ. భక్తులను మైమరపిస్తున్న తిరుమలక్షేత్రాన్ని ఏడాది పొడవునా దర్శించడం ఒక ఎత్తు! కాగా

🍃🌺ప్రత్యేకంగా ధనుర్మాసంలో ఒక నెలరోజుల్లో, ఏ ఒక్క రోజైనా తిరుమలక్షేత్రాన్ని సందర్శించే భాగ్యం కలగడం, ఆనందనిలయుణ్ణి దర్శించి వింత వింత అనుభూతుల్ని ఆనందాన్ని పొందే అదృష్టం కలగడం మాత్రం, మరో ఎత్తు! అందులోను ధనుర్మాసంలో వచ్చే వైకుంఠఏకాదశిపండుగనాడు కలియుగవైకుంఠంలో విహరించడంవల్ల, సందర్శించడంవల్ల భక్తుని మనస్సు ఆనందాల పంటలు పండేపూదోట అవుతుంది.


🌻 వెంకన్న సన్నిధిలో వైకుంఠ ఏకాదశి 🌻


🍃🌺ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే 'ఏకాదశి'ని 'వైకుంఠ ఏకాదశి' అంటారు. తిరుమలక్షేత్రంలో వైకుంఠఏకాదశి, ఆ మరునాడు వైకుంఠద్వాదశి ఇలా ఇది రెండు రోజుల పండుగగా ఎన్నో విశిష్ట సేవలతో నిర్వహింపబడుతుంది.


🌻 వైకుంఠద్వారం తెరవబడుతుంది 🌻


🍃🌺వైకుంఠ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిళ్లు మూసివేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠఏకాదశినాడు సుప్రభాతసమయంలో బంగారు వాకిళ్లు తెరచినప్పటినుండి మరునాడు వైకుంఠద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకు శ్రీవారి గర్భాలయానికి దగ్గరగా ఆనుకొని ఉన్న “ముక్కోటి ప్రదక్షిణ మార్గం" తెరవబడుతుంది.

🍃🌺ఈ ప్రదక్షిణ మార్గానికి ఉన్న ద్వారాలను వైకుంఠద్వారాలనీ, ఉత్తరద్వారాలనీ అంటారు. ఈ మార్గాన్ని ‘వైకుంఠప్రదక్షిణమార్గం' అనీ అంటారు. ఈ మార్గం విద్యుద్దీపాలతో, సుగంధ, సుమనోహరమైన పులమాలలతో అలంకరింపబడిన ఈ వైకుంఠప్రదక్షిణంలో ప్రవేశించే భాగ్యం ఏడాదిలో ఈ రెండురోజులు మాత్రమే కలుగుతుంది.

🍃🌺వైకుంఠఏకాదశి, ద్వాదశి రోజుల్లో శ్రీ స్వామివారిని దర్శించిన తర్వాత భక్తులకు వైకుంఠప్రదక్షిణంలో ప్రవేశం కలుగుతుంది. ఈ రెండు రోజులూ విమానప్రదక్షిణంలో భక్తులు అనుమతింపబడరు. వైకుంఠ ప్రదక్షిణంలో ప్రవేశించిన భక్తులకు దివ్యానుభూతులతో పాటు, పూర్వసంచిత పాపకర్మలన్నీ నశిస్తాయి. ఇష్టార్థాలన్నీ నెర వేరతాయి.


🌻 స్వర్ణరధోత్సవం 🌻


🍃🌺వైకుంఠ ఏకాదశినాడు సప్తగిరీశునికి మరో విశేష ఉత్సవం జరుగుతుంది. అదే స్వర్ణరథోత్సవం!

🍃🌺వైకుంఠ ఏకాదశినాడు ఉదయం 8 గంటలవేళ కలియుగ వైకుంఠ నాథుడైన కొండలరాయడు శ్రీదేవీ భూదేవేరులతో కలిసి బంగారుతేరుపై పురవీధుల్లో దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశి నాటి స్వర్ణరథోత్సవంలో పయనిస్తున్న అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుణ్ణి దర్శిస్తే చాలు.

🍃🌺భక్తుల మనోరథాలు తప్పక తీరతాయి. భక్తుల గోవిందఘోషల మధ్య జరిగే తిరుమల గోవిందుని స్వర్ణరథోత్సవదృశ్యాన్ని వర్ణించడం అక్షరాలకు అందదు. దర్శించి అనుభవించాలి. అంతే!


🌻 శ్రీస్వామిపుష్కరిణీతీర్థ ముక్కోటి ఉత్సవం 🌻


🍃🌺వైకుంఠ ఏకాదశి మరునాడు 'వైకుంఠద్వాదశి'. వీటినే "ముక్కోటి ఏకాదశి”, “ముక్కోటి ద్వాదశి అంటారు. వైకుంఠఏకాదశి మరునాడు వైకుంఠద్వాదశినాడు “శ్రీస్వామిపుష్కరిణీ తీర్థ ముక్కోటి ఉత్సవం” జరుగుతుంది.

ధనుర్మాసే సితే పక్షే ద్వాదశ్యా మరుణోదయే ఆయాతి సర్వతీర్థాని స్వామిపుష్కరణీ జలే తత్ర స్నాత్వా నరః సద్యోముక్తి మేతి నసంశయః యస్య జన్మ సహస్రేషు పుణ్య మేవార్జితం పురా

🍃🌺ధనుర్మాసంలో వైకుంఠద్వాదశినాటి అరుణోదయ వేళలో ముక్కోటి తీర్థాలు “శ్రీస్వామి పుష్కరిణి”లో మునకలిడుతాయి. శుభప్రదమైన ఆ వేళలో స్నానం చేసే మహాభాగ్యం అందరికీ కలుగనే కలగదట! ఎవరైతే వేలజన్మల్లో పుణ్యాన్ని ఆర్జించుకొని ఉంటారో, వారికి మాత్రమే ఈ నాడు తిరుమల శ్రీవారి కోనేట్లో స్నానం చేసే భాగ్యం కలుగుతుంది. అలాంటి వారికి సద్యోముక్తి కలుగుతుంది.

🍃🌺అంటే వారు శరీరంతో ఉన్నా, జీవన్ముక్తిని పొందుతారని సారాంశం. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని స్కాందపురాణాంతర్గత వేంకటాచల మాహాత్మ్యం స్పష్టం చేస్తోంది.


🌻 శ్రీవారి చక్రస్నానం 🌻


🍃🌺ఇలాంటి శ్రీస్వామిపుష్కరిణీ తీర్థముక్కోటి శుభఘడియల్లో, అంటే వైకుంఠ ద్వాదశినాటి అరుణోదయవేళలో శ్రీ సూర్య భగవానుడు ఉదయిస్తుండగా తిరుమల శ్రీవారిఆలయం నుండి శ్రీ సుదర్శనభగవానుని ఉత్సవమూర్తి ఊరేగింపుగా వెళతారు. మహాప్రదక్షిణంమార్గంలో దర్శనమిస్తూ ఊరేగింపుగా శ్రీ సుదర్శన భగవానుడు 'శ్రీస్వామి పుష్కరిణి'కి చేరుకొంటారు.

🍃🌺అక్కడ ముందుగా శ్రీసుదర్శన చక్రత్తాళ్వారుకు అర్చన అభిషేకాలు పూర్తి అయినతర్వాత శ్రీస్వామిపుష్కరిణిలో అర్చకస్వాములు మంగళ స్నానం చేయిస్తారు. దీన్నే “చక్రస్నానం” అంటారు. వైకుంఠ ద్వాదశినాటి సూర్యోదయవేళలో శ్రీ స్వామిపుష్కరిణీ తీర్థముక్కోటి శుభఘడిమల్లో ముక్కోటి తీర్థాలు మునిగేవేళ శ్రీ వేంకటేశభగవానుని దివ్యాయుధమైన శ్రీ సుదర్శనునికి జరిగే చక్రస్నానం సమయంలో వేలాదిమంది భక్తులు కోనేట్లో పవిత్రస్నానాలు చేస్తూ పునీతులవుతారు.

🍃🌺ఇది మహాద్భుత ఘట్టం. ఇది సిద్ధించిన భక్తుని అదృష్టం ఏమని చెప్పగలం! ఎంతని చెప్పగలం!!ఎందుకంటే!

శ్లో॥ స్వామిపుష్కరిణీ స్నానం సద్గురోః పాదసేవనం ఏకాదశీవ్రతం చాపి త్రయ మత్యంత దుర్లభమ్

🍃🌺స్వామిపుష్కరిణిలో స్నానం చెయ్యడం, సద్గురువు పాదసేవ దొరకడం, ఏకాదశీవ్రతం ఆచరించడం అనే మూడు పవిత్ర కార్యాల్లో, ఒక్కటంటే ఒక్కటైనా కలగడం ఎంతో అదృష్టం.

🍃🌺ధనుర్మాసం, అందులో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పండుగవేళల్లో, శ్రీస్వామిపుష్కరిణీస్నానం చేసి శ్రీవారిని దర్శించే భాగ్యం కలగడం ఎంతటి వారికో మాత్రమే కలుగుతుంది.


🌻 తిరుమలలో “ధనుర్మాసం” 🌻


🍃🌺'ధనుర్మాసం' నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఆరాధనల్లో, అర్చనల్లో, సేవల్లో, ఊరేగింపుల్లో కొన్ని ప్రత్యేకతలు గోచరిస్తాయి.

🍃🌺శ్రీవారి మూలమూర్తిని సాక్షాత్తు శ్రీకృష్ణునిగాను, వక్షఃస్థల శ్రీమహాలక్ష్మిని గోదాదేవిగా భావించి వక్షఃస్థలంలో రెండు వైపులా బంగారు చిలుకను, తమలపాకుల చిలుకను అలంకరిస్తారు. తర్వాత సహస్రనామార్చనలో శ్రీస్వామివారికి బిల్వదళాలను ఉపయోగిస్తారు. పిదప శ్రీవారికి వేడివేడిగా పొంగళ్ళను, బెల్లపు దోసెలను నివేదిస్తారు.

🍃🌺రాత్రి ఏకాంత సేవాసమయంలో ఈ నెలరోజుల పాటు వెన్నముద్ద కృష్ణునికి పట్టెమంచంపై శయనభాగ్యం కలిగిస్తారు, ఆ తెల్లవారుజామున సుప్రభాతసమయంలో గోదాదేవి పాశురాలను ఏకాంతంగా జియ్యంగార్లు, వైష్ణవాచార్యులు పఠిస్తూ మేల్కొల్పుతారు. ఆ తర్వాత చిన్నికృష్ణునికి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించి పొంగళ్లను, బెల్లవుదోసెలను నివేదిస్తారు.


🌻 ముల్లోకాల తీర్థస్నానఫలం 🌻


🍃🌺చిరంజీవి అయిన మార్కండేయమహర్షి పూర్వం బ్రహ్మ దేవుణ్ణి గూర్చి తపస్సుచేశాడు. సమస్తలోకాల్లోని అన్ని తీర్థాల్లో స్నానం చేసేట్లుగా వరం ఇమ్మని అడిగాడు. అది అసాధ్యం! ఎన్నెన్ని లోకాలు ఉన్నాయో నాకే తెలియదు. ఈ బ్రహ్మాండాలు అనంతం. అందువల్ల నీవు వేంకటాచలంలోని “శ్రీస్వామిపుష్కరిణి”లో ధనుర్మాసంలో వైకుంఠఏకాదశి, ద్వాదశిరోజున సూర్యోదయవేళలో స్నానం చేస్తే చాలు.

🍃🌺అన్ని తీర్థాలస్నాన ఫలితం సిద్ధిస్తుంది. ఎందుకంటే సమస్తతీర్థాలు తమ పాపాన్ని పోగొట్టు కోవడం కోసం ధనుర్మాసంలో వైకుంఠద్వాదశి, శ్రీస్వామిపుష్కరిణి తీర్థ ముక్కోటినాటి అరుణోదయవేళలో ఆ కోనేట్లో మునకలు పెడతాయి. అట్లా నీ కోరిక నెరవేరుతుంది అని వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. ఇలా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశీ పండుగ రోజుల్లో కలియుగ వైకుంఠమైన తిరుమలను దర్శించి ధన్యులమవుదాం....



🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[6:59 am, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🌻 విష్ణుమూర్తి కూర్మావతారం చాలించడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా? 🌻



🍃🌺పురాణాల ప్రకారం లోకకల్యాణార్థం, ధర్మాన్ని కాపాడటం కోసం విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా దశావతారాలలో రెండవ అవతారమే కూర్మావతారం. అయితే విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తడానికి గల కారణం? కూర్మావతారాన్ని చాలించడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం....

🍃🌺పురాణాల ప్రకారం రాక్షసులు దేవతలు అమృతం కోసం సాగర మథనం చేస్తున్న సమయంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని దానిని పాలసముద్రంలో వేస్తే అది బరువుకు సముద్రంలో మునుగుతుంది. దీంతో దేవతలు రాక్షసులు ఏం చేయాలో తెలియక ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు.

🍃🌺దీంతో విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతం కింద ఉండి దాని బరువును మోస్తాడు. ఈ క్రమంలోనే దేవతలు రాక్షసులు దానిని చిలకడానికి ప్రయత్నించగా ఆ పర్వతం కదలలేదు. అప్పుడు దేవతలు రాక్షసులు మరో మారి కుర్మాన్ని ప్రార్థించగా అప్పుడు కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి తన శరీరం నుంచి పదివేల చేతులను మొలిపింప చేసి, ఆ పర్వతాన్ని కదలనీయక పట్టుకోవడంతో క్షీర సాగర మథనం చేయడానికి వెసులుబాటు కల్పిస్తాడు. దీంతో సాగరం నుంచి అమృతం ఉద్భవిస్తుంది.

🍃🌺ఈ విధంగా ఉద్భవించిన అమృతాన్ని సేవించి దేవతలందరూ వెళ్ళిపోయిన తర్వాత కూర్మ రూపునికి, భృగు మహర్షి శాపం పెట్టాడు. శాపం కారణంగా మతిమరపుతో ఎంతో గర్వంతో తన వల్లనే అమృతం లభించిందని, దేవాసుర కన్నాతానే గొప్పవాడని తన పదివేల చేతులతో సముద్రాన్ని అల్లకల్లోలం సృష్టించాడు.

🍃🌺ఈ కూర్మం బీభత్సాన్ని భరించలేక దేవతలు ఆ పరమశివుని ప్రార్థించారు. ఆ కూర్మం గర్వాన్ని అణచి వేయడానికి తన పుత్రులు ఎంతో సమర్థవంతులని భావించిన పరమేశ్వరుడు తన పుత్రులిద్దరిని కూర్మం గర్వం అణచి వేయడానికి వేయడానికి పంపుతాడు.అయితే ఆ కూర్మం బలం మొత్తం తన వీపు పై ఉన్న చిప్పలో ఉందని గ్రహించిన సుబ్రహ్మణ్యుడు దానిని ఒడ్డుకు లాక్కొనివచ్చి వెల్లకిలా వేసాడు.

🍃🌺తరువాత ఒక పెద్ద రోకలి బండతో సహోదరులిద్దరు దానిని చితక బాది, చిప్పనుపేరు చేయడంతో నిజం తెలుసుకున్న విష్ణుమూర్తి కూర్మావతారాన్ని అంతటితో చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు.


🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[7:00 am, 26/06/2021] శ్రవేంకటేశ్వర: దేవీభాగవతం - 54
శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు
చతుర్థ స్కంధము - 14
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
లలితా సహస్రనామ శ్లోకము -53

సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ!
మహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్ముడప్రియా!!

శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
 53వ  భాగములో....
నరనారాయణులు అప్సరసలను అనుగ్రహించడం   చదువుకున్నాము.
🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏
అమ్మ దయతో......  ఈ రోజు
భూదేవి మొర  చదువుకుందాం.
🙏🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🙏

 భూదేవి మొర

జనమేజయా ! అతిమహత్తరమైన కృష్ణ చరిత్రను విశదీకరిస్తాను. తెలుసుకో. నీ సందేహాలకు అన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. అదీకాక ఇది అద్భుతమైన దేవీ చరిత్ర కూడా.

ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖిస్తూ, దీనురాలై, గోరూపం ధరించి త్రివిష్టపానికి (దేవలోకం) వెళ్ళింది. శక్రుడు ఈ దీనావస్థను గమనించి, ఏమ…
[7:53 pm, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🌻 మహా భారతం 🌻

🎈 భాగము 169 🎈

💧 అంతుచిక్కని శ్రీకృష్ణుని ఆనందం 💧


🍃🌺కౌరవ సైన్యం అభ్యర్థన మేరకు కర్ణుడు శక్తిని ప్రయోగించాడు. అది ఘటోత్కచుని బలి తీసుకుంది. దుర్యోధనుడు అందుకు ఎంతగానో సంతోషించాడు. అభినందనగా కర్ణుని గుచ్చి కౌగలించుకున్నాడు.ఘటోత్కచుని మరణం పాండవేయులను పెను విషాదంలోకి నెట్టింది. వారంతా కన్నీటి జాలులతో పరిపరి విధాల శోకించారు. అయితే శ్రీకృష్ణుడు అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఘటోత్కచుని మృతి అతనికెంతో ఆనందాన్ని కలిగించింది.

🍃🌺ఆ ఆనందంలో చేతనున్న పగ్గాలు వదలి, పాంచజన్యాన్ని పూరించాడతను. చిన్న పిల్లాడిలా తన చుట్టూ తాను తిరిగాడు. తర్వాత తననే పరమాశ్చర్యంగా చూస్తోన్న అర్జునుని సమీపించి అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ప్రోత్సాహంగా అతని వీపును చరిచాడు.కృష్ణుని ప్రవర్తన కౌరవ ప్రముఖులకు ఒక పట్టాన అర్థం కాలేదు. అర్జునుడికీ అంతే! దేవదేవుని చేష్ట…
[7:53 pm, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🌺 తాళపత్రం 🌺

🥀 169 వ రోజు 🥀


🌻 స్త్రీలు 'ఓం' కారాన్ని జపించవచ్చా? 🌻


🍃🌹స్త్రీలు 'ఓం' కారాన్ని జపించుటకు సమ్మతించ బడలేదు. ఇందుకు వారి శరీర నిర్మణ వ్యవస్థే కారణం.

🍃🌹'ఓం' కారాన్ని బిగ్గరగా (బయటకు శబ్దం వచ్చునట్లు) జపించుటకై దీర్ఘమైన, క్రమమైన, నెమ్మదైన విధానంలో గాలిని (శ్వాసను) బయటకు విడువ వలసి ఉంటుంది. అలా 'ఓం' న ఉచ్చరించినప్పుడు శరీరం నుండి చుట్టూతా హెచ్చు స్థాయిలో ఉండే శక్తి తరంగాలు వ్యక్తమౌతాయి.

🍃🌹ఇలాంటి శబ్దతరంగాలు ఉత్పన్నమౌతున్న మధ్య భాగంలో గర్భాశయ ఉండటం కారణంగా ఈ శబ్దతరంగాలు గర్భాశయాన్ని విరుద్ధంగా ప్రభావితం చేయడం మరియు మూసుకు పోయోలా చేయడం. జరిగే ప్రమాదం ఉంది. ఐదారు సార్లు 'ఓం' కారాన్ని చేయడం అంత ఇబ్బందికరమైనది కాదు కానీ అలా చాలా సేపు చేయడం ఇబ్బందులకు దారితీస్తుంది.

🍃🌹అది మాత్రమే కాక స్త్రీ అలా చాలా సేపు శ్వాసను క్రమబద్ధీకరించుకుంటూ 'ఓ…
[7:54 pm, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌺 విష్ణు సహస్రనామాలు 🌺


🌀 వేద్యో వైధ్యస్సదా యోగీ వీరహా మాధవో మధుః ।
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః॥ 🌀


🌹 169. అతీంద్రియః 🌹

🌺 ఓం అతీంద్రియాయ నమః 🌺


🍃🌹అతీతః ఇంద్రియాణి ఇంద్రియములను అతిక్రమించిన వాడు. ఇంద్రియములవలన అనుభవమునకు అందనివాడు. అశబ్ధ మస్పర్శనమ్ ఇత్యాదిశ్రుతిచే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనునవి ఏ మాత్రమును లేనివాడు కావున ఈ పంచ విషయములను గ్రహించగల జ్ఞానేంద్రియ పంచమునకును గోచరము కానివాడు.

🍃🌹శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు లేనిదియు అవ్యయమైనదియు, ఆద్యంతములు లేనిదియు, నిత్యమైనదియు, మహత్తుకు పరమైనదియు నయియున్న దానిని తెలిసికొనినవాడు మృత్యుముఖము నుండి పూర్తిగా విడివడును.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[7:58 pm, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🙏 శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం - 26 🙏

🌻 కేశవుని కధ 🌻


💫🌹పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేద వేదంగా పారంగతుడు ,బుద్ధిమాన్ ,స్వధర్మా చరణ నిష్టుడు. పుత్రులు ,పౌత్రులతో భార్య విశాలాక్షితో సుఖ జీవితం గడుపుతున్నాడు. అతిధి పూజలో జన్మ ధన్యం చేసుకొంటున్నాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువులా వెలిగి పోతున్నాడు కేశవుడు.

💫🌹కొంత కాలానికి అతని జీవితంలో విషాదం అలముకొంది ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది. అతని దుఖం పట్ట శక్యం కాకుండా ఉంది. బాధ తట్టుకోలేక కాశీ నగరం చేరాడు
అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ ,విశ్వేశ్వరున్ని దర్శిస్తూ ,అభిషేకం చేస్తూ ,విశాలాక్షీ దేవి దర్శనంతో ఊరట చెందుతున్నాడు.

💫🌹కొంత కాలం కాశీలో గడిపి ,తర్వాత ప్రయాగ ,గయా మొదలైన క్షేత్ర దర్శనం చేసి పితృ కార్యాలను నిర్వహిస్తూ ,విధ్యుక్త ధర్మాలన్నీ నిర్వహిస్తూ కొన్ని నెల…
[8:19 pm, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌹 ఓం నమో వేంకటేశాయ గ్రూపు సబ్యులకు అందరికీ నమస్కారం.

🌹ప్రస్తుతం గ్రూపులో ఉన్న సభ్యులు కొంతమంది మేసేజ్ లు చూడకుండా కొంతమంది సభ్యులు వున్నారు. వీరికి మెసేజ్ డెలివరీ అవుతుంది. కానీ వాళ్ళు మెసేజ్ చదవడం లేదు. ఇలాంటి వారిని గ్రూపులో నుంచి తొలగించడం జరుగుతుంది.

🌹వీరిని తొలగించడం వలన కొత్తగా కొంతమంది సబ్యులకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది.

🌹మరొక్క విషయం వ్యక్తి గత కారణంగా అతి త్వరలో ప్రస్తుతం ఉన్న గ్రూపులు అన్నింటినీ డిలీట్ చేసి కొత్తగా ఓం నమో వేంకటేశాయ గ్రూపు మొదలుపెట్టడం జరుగుతుంది.

🌹కొత్త గ్రూపులో యాక్టివ్ గా ఉన్న వారు మాత్రమే జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది.

🌹కొత్తగా గ్రూపు మొదలు పెట్టిన తరువాత ప్రస్తుతం ఉన్న గ్రూపులలో మెసేజ్ లు పంపడం జరగదు గమనించగలరు.

🌹మీ యొక్క
పేరు:
ఊరు:
వర్క్ (ఏమి చేస్తుంటారు): ఈ విషయాలు తెలిపితేనే గ్రూపులో…
[8:40 pm, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌻 తిరుమల సర్వస్వం 🌻


🎈 భాగము 110 (శ్రీవారి సంవత్సర సేవలు) 🎈

💧 ఉగాది ఆస్థానం 💧


🍃🌹తెలుగు లోగిళ్ళలో నూతన సంవత్సరపు తొలిరోజైన ఉగాది నాడు - సందర్భోచితంగా - తెలుగువారి కొంగుబంగార మైన శ్రీవేంకటేశ్వరునికి ఉగాది ఆస్థానం జరుగుతుంది. తిరుమలేశుని వార్షికోత్సవాలు - ఉత్సవాలు అన్నీ ఉగాది తోనే మొదలవుతాయి.

🍃🌹ఉగాది పర్వదినాన ప్రాతఃకాల మందు, నిత్యసేవలైన సుప్రభాతసేవ - తోమాలసేవ యథావిధిగా పూర్తయిన తరువాత; ఉభయ దేవేరుల సమేతుడైన శ్రీమలయప్పస్వామి వారికి, సేనాపతి విష్వక్సేనులవారికి ఏకాంతంగా తిరుమంజనం జరుప బడుతుంది. తరువాత, బంగారువాకిలి ముందున్న మహామణిమంటపంలో గరుడాళ్వార్ కు ఎదురుగా - స్వర్ణకాంతులీనే సర్వభూపాల వాహనం లో శ్రీదేవి భూదేవి సహిత మలయప్పస్వామి వారిని వేంచేపు చేస్తారు.

🍃🌹పట్టు పీతాంబరాలతో, కిరీటాలతో, సర్వాభరణాలతో, పరిమళ భరితమైన పూలమాలల…

 🕉️పెళ్లిలో కన్యను గంపలో తెచ్చే ఆచారము కొంత మందికి ఉంటుంది  ఇలా ఎందుకు తేవాలి దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ?

పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు తేవాలి , తెస్తారు?

 ముందుగా అమ్మాయి తో గౌరీ పూజ చేయించి ఆ తరువాత వెదురుతో చేసిన బుట్టలో  కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని మేనమామలు కలిసి ఆ అమ్మాయిని వివాహ వేదిక మీదకి తీసుకొని వస్తారు .

 బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది.

సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు.
సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. అనగా దైవ రుణం పిత్రు రుణం  ఋషి ఋణం తీరవు .

అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి.
ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి!

పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది. అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది.
ఆమెయే ఆతని లక్ష్మి.

అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం.
అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి.
అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది.
ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది.

ఆమె ‘నిత్యానపాయినీ’.
ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.

శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా
చారజనంబు గాఁగ,
విరజానది గౌతమిగా,
వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!


శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది.
ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు.
అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది.

ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ.
అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది.
ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది.

ఇక్కడ లక్ష్మి పుట్టింది.
అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను.
ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది.
అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.

కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం.
ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి.
ఎంతో ధార్మికంగా సంపాదించాలి.
ఆయనకి సంతానం కలగాలి.
ఆయన సంతోష పడిపోవాలి.
ఆయన తండ్రి కావాలి,
 తాత కావాలి.
ముత్తాత కావాలి.
ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది.  ఆ సంతానం నానుండి రావాలి. ‘ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం.
 లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి.

అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం.
ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు.
తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు.
ఈమె నీ లక్ష్మి.

ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోనక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ.
మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది.
బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు.
 అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు.
మేనమామలు ప్రేమైక మూర్తులు.

లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం. నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది. నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.

అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు.
లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అ…
ऊँ!
----

"శ్రీచక్రరాజనిలయాంప్రగతిప్రదాత్రీం ,

శ్రీపద్మరౌచ్యశుచినీంప్రముదేష్టదాత్రీమ్ !

శ్రీహంసగుహ్యసఫలాప్తశుభేష్టదాత్రీం ,


త్రైమూర్తిరూపపరమార్థగతింనమామి !!!
----
----------------------------------------

                      గురువు....!
                    

అవతార పురుషుడైన రాముడంతటి వానికి వసిష్ఠుడనే మహర్షి గురుస్థానం వహించాడు.

జగద్గురువైన శ్రీ కృష్ణునికి కూడా సాందీపుడు గురువయ్యాడు.

గురు పరంపర ఈ జగత్తులో అనాదిగా ఉంది. ఇక సరైన గురువు దొరకడం పూర్వజన్మ సుకృతం.

గురువును ప్రత్యక్ష దైవంగా భావించే సంస్కృతి మనది. అన్నిటికీ దైవమే స్వయంగా రాలేడు. అందుకే ఆయన వివిధ రూపాలలో అంటే తల్లి, తండ్రి, గురువు మొదలైన వారిగా మన శ్రేయస్సును చూస్తూ, ప్రేమను పంచుతూ మన అభ్యుదయానికి తోడ్పడతాడు. అందుకే ఈ ముగ్గురినీ దేవుళ్లుగా అభివర్ణించారు.

గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాను సాక్షాత్‌ పరబ్రహ్మంగానూ పేర్కొన్నారు. గురువు అంటే మనలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞాన మనే వెలుగును నింపేవాడని స్థూలంగా పేర్కొంటుంటారు. సాధారణంగా గురువుల్లో రెండు రకాల వారిని మనం చూస్తుంటాం. వారిలో కొందరు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వారైతే, మరి కొందరు లౌకిక విద్యను నేర్పించేవారు.

అయితే ఏ వ్యక్తి అయినా జీవితంలో గురువును ఆశ్రయించవలసిందే. ఒక్కోసారి మనం గురువును గుర్తించ లేకపోవచ్చు. తాళం చెవి లేకుండా తలుపు తెరవడం సాధ్యం కానట్లు గురువు తర్ఫీదు లేకుండా మనకు గుర్తింపు, జ్ఞానం కలగదని వేమన తన పద్యాలలో వివరించారు.

ఒక్కోసారి ప్రతిభ కలిగిన విద్యార్థుల వల్ల గురువుకు విశేష ఖ్యాతి లభిస్తుంది. కృష్ణుని వల్ల సాందీపునికి ఎవరికీ లభించనంతటి, ఆయన ఊహించనంతటి ప్రయోజనం సిద్ధించింది.

కృష్ణుడు యమలోకానికి వెళ్లి గురు పుత్రుని సజీవుని చేసి తీసుకువచ్చి గరువుగారి ఋణం తీర్చుకున్నాడు. మంచి గురుశిష్యుల సంబంధాన్ని సారవంతమైన నేలపై సకాలంలో సరి పడా పడ్డ వర్షంగా ఒకరు అభివర్ణించారు. ఇక విద్య నేర్వడం అంటే ప్రతి విషయాన్ని మనం తెలునుకునే ప్రయత్నం చేయడం.

వివేకానందుని అభిప్రాయం ప్రకారం జ్ఞానం మనలోనే ఉంది.  మన లోనే విజ్ఞానముంటే విద్య నేర్వాలనే ప్రయత్నం దేనికీ అన్న ప్రశ్న ఉదయిస్తుంది. పాలలోనే నెయ్యి, పెరుగు, వెన్న దాగి ఉన్నాయి. అయితే వాటన్నిటినీ బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తేనే అవి కనబడతాయి, బయటకు వస్తాయి. ప్రయత్నం చేయకపోతే అవి ఉన్నా కనబడవు. మనలోని వివేకాన్ని వెలికి తెచ్చుకునే ప్రయత్నానికి సహాయ భూతుడిగా, సలహా దారుడిగా ఉంటాడు గురువు.

వేమన వంటి భోగి గురువు ఉపదేశం వల్లనే ప్రజా కవి కాగలిగాడు. పూర్వం రాజకుమారులు సైతం గురు కులానికి వెళ్లి గురువుల్ని సేవించేవారు. గురువు ప్రసన్నుడై విద్య నేర్పితే నేర్చుకోవడం, ఆయనను సేవించడం వల్ల విద్య పొందడం, డబ్బు లేదా ఏదైనా ఇచ్చి విద్య నేర్చుకోవడం మినహా విద్య నేర్చుకునేందుకు వేరే ఎటువంటి మార్గాలు లేవు.

గొప్ప గురువు మాత్రమే మన జీవితాల్లో స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడు.. అని విశ్వ కవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ అన్నారు. మనిషి తన జీవిత కాలంలో ఒక వంతు గురువు ద్వారా, మరొక వంతు తన కృషి వల్ల, ఇంకొక వంతు సహధ్యాయిల సహచర్యం వల్ల, మరొక వంతు పాఠశాలల నుంచి నేర్చుకుంటూనే ఉంటాడు. నేర్చుకునే ప్రక్రియ లౌకికంగా ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది.

మనిషికి తొలి గురువు తల్లే. ఆమె వెంట ఉండే శిశువు చాలా విషయాలు గ్రహిస్తాడు. శిశువు ప్రపంచాన్ని చూసి చాలా నేర్చుకున్నా, ఎక్కు వగా చూసేది తల్లి కదలికలే కనుక ఆమె నుంచే ఎక్కువ విషయాలు గ్రహిస్తాడు. ఆ తర్వాతే లౌకిక విద్యలు నేర్పే గురువులు, మంత్ర విద్యలు నేర్పే మంత్ర గురువులు బోధనలు చేసే బోధ గురువులు వంటి వారందరూ వస్తారు...
*******

 గురుపౌర్ణమి విశిష్ఠత / వ్యాస పూర్ణిమ
ఓంశ్రీమాత్రే నమః


|| గురువందనం ||
 
శ్లో|| గురవే సర్వ లోకానాం భిషజే భావరోగిణామ్ |
నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ: ||


శ్లో|| చిద్ఘనాయ ప్రకాశాయ శృత్యాకాశ విహారిణే |
అద్వైతామృత వర్షాయ శంకరాయ నమోనమ: ||

 
శ్లో|| సదా శివ సమారంభాం శంకరాచార్య మాధ్యమామ్ |
అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరామ్ ||

 
శ్లో|| ఏకమేవాక్షరమ్ యస్తు గురు: శిష్య: ప్రబోధాయేత్ ||
పృథివ్యామ్ నాస్తి తద్రవ్యమ్ యద్ధత్వా చానృణీ భావేత్ ||

 
గురు పౌర్ణమి విశిష్ఠత:-
 
ఆషాఢ మాస శుక్ల పక్ష పౌర్ణమిని ‘గురుపౌర్ణమి‘ లేదా ‘వ్యాసపౌర్ణమి‘ అని అంటారు.  గురుపౌర్ణమి  సాధారణంగా అన్ని పండుగలను జరుపుకోవడానికి ఒక నిబద్ధత, విధానం ఉంటె, గురుపౌర్ణమికి మాత్రం అలా కాకుండా ఒక ప్రత్యేకత ఉంది. గురు సమానులైన వారందరికీ కృతజ్ఞత ను త…
గురు వందనం

మనకు, ప్రతి ఒక్కరికీ తల్లి తొలి గురువు.

మాతృదేవో భవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ
అతిథి దేవోభవ

ప్రకృతి మయమైన, ఈ జగము లో ప్రతి అణువు లోను , నిండిన శక్తి గురు స్వరూపమే.

ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, మనకి పూలు, పండ్లు ఇచ్చే వృక్షాలు, పంచభూతాలు - నేల, నింగి, వాయువు, అగ్ని, నీరు.  మొ.నవి కూడా గురువుతో సమానమైనవి గా చెప్పబడుతున్నది.

భూమి కి భారం కాకుండా, సహజ వనరులను - కలుషితం చేయకుండా, ఒద్దిక గా ప్రతి ఒక్కరు వాడుకుంటే మన వంతు బాథ్యతను, మన సక్రమంగా నిర్వర్తించినట్లే.

సూర్యచంద్రులు, లేనిదే మన మనుగడ సాథ్యపడదు. నిర్ణీత సమయానికి, ప్రతి రోజు ఉదయించడం, అస్తమించడం - దైనిక చర్య గా చేస్తూ, మనకి ఆరోగ్యాన్ని , ఆహారాన్ని ప్రసాదించే, భాస్కరుడు, చంద్రుడు, మనకి గురువులు కాదంటారా?
మనం తొలి సంథ్య వేళ అర్ఘ్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. అర్ఘ్యం ఇచ్చి, నమస్కరించిన మాత్రముననే, మన బాగోగులను చూసుకునే గురువులను, మనం విస్మరించకూడదు.

జగత్ కి మాతాపితరులైన ఉమామహేశ్వరులు, జగద్గురువైన కృష్ణ పరమాత్మ, ఎన్నో వనమూలికలను, ఇచ్చే సంజీవని ప్రదాత థన్వంతరి, లౌకిక విద్యలే కాకుండా జ్ఞాన ప్రభోథాన్ని చేసే లక్ష్మీహయగ్రీవ స్వామి, నిత్యస్మరణీయులు, గురుతుల్యులు.

మన అభ్యున్నతి కి కారకులైన, పెద్దలు-పిన్నలు, కూడా  మనకి మార్గదర్శకులే.

ఎందరోమహానుభావులు అందరికీ వందనములు.
🕉
శివాయ గురవే నమః

🙏🙏🙏🙏🙏
THVAMEVAAHAM   త్వమేవాహమ్‌

కన్నతల్లి కడుపులోంచి బయటపడి......
తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......
పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు.......
ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా
సాగే ప్రస్థానం.......
పేరే......

             నేను =I

ఈ "నేను" ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!

ఊపిరి ఉన్నంతదాకా "నేను" అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....

జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ...ఈ
"నేను" ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...

ఈ "నేను" లోంచే
నాది అనే భావన పుడుతుంది!

ఈ *నాది లోంచే....

1.నా వాళ్ళు,
2.నా భార్య,
3.నా పిల్లలు,
4.నా కుటుంబం,
5.నా ఆస్తి,
6.నా ప్రతిభ,
7.నా ప్రజ్ఞ,
8.నా గొప్ప...

అనేవి పుట్టుకొచ్చి....

చివరికి ఈ "నేను" అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,
ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహం గా ప్రజ్వరిల్లుతుంది.

              EGO అహం

అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ  ”నేను", ”నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది.

నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.

1. పంతాలతో
2. పట్టింపులతో,
3. పగలతో,
4. ప్రతీకారాలతో......

తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.

1 .బాల్య,
2.కౌమార,
3.యౌవన,
4.వార్ధక్య,  

దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ
నేను అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.

 సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.

 సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ  నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.

కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.

 మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.

మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.

1.నేనే  శాసన కర్తను,

 2.నేనే ఈ సమస్త భూమండలానికి అధిపతిని,

3.నేనే జగజ్జేతను...

అని మహోన్నతంగా భావించిన ఈ నేను
లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా
రోజు మారుతుంది.

ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’ కథ అలా సమాప్తమవుతుంది.

అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”
గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”
“SRIMADBHAGAVATH GEETHA”....

చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం మాత్రమే!

   అది శాశ్వతం కానే కాదు

ఈ నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన
”వైరాగ్యస్థితి” అభిలాషికి సాధ్యమవుతుంది.

వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు.
దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం.

స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.

మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం

అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.

ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం.

1. నిజాయితీగా,
2. నిస్వార్థంగా,
3.సద్ప్రవర్తనతో,
4. సచ్ఛీలతతో,
5.భగవత్‌ ధ్యానం

తో జీవించమనేదే
వేదాంతసారం.

అహం బ్రహ్మాస్మి అంటే
అన్నీ నేనే అనే స్థితి నుంచి
త్వమేవాహమ్‌ అంటే నువ్వేనేను అని
భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే
మానవ జన్మకు సార్థకత
      🙏 శుభమ్ భూయాత్🙏
గురువె బ్రహ్మ యందు గురువె విష్ణువు గను గురువె ఈశ్వరుడును
గురువె తల్లి తండ్రి గురుతు వల్ల విద్య వైభవమ్ము కలుగు
గురువు నొసగతెరవు గుర్తు బంధమ్ము గ విజయ మార్గ మిచ్చు
గురువె యిలను నాకు గురుతర బాధ్యతే జీవ లక్ష్య మవ్వు

🌻 95. విటమినులు 🌻

ప్రస్తుత కాలమున విటమినులను విపరీతముగ భుజించు చున్నారు. దేహపోషణమునకు అవి అత్యావశ్యకములని వైద్యశాస్త్రము యొక్క నమ్మిక. విటమినుల స్వీకరణము కారణముగ ప్రాణశక్తి (Vital Force) పెరుగునని నమ్మకము. మిటమినుల విషయమున మాదొక
అవగాహన యున్నది. మా అనుభవమున ప్రాణశక్తిని పెంపొందించు విటమినులు జీవుని యందే యున్నవి. జీవునియందలి సద్గుణమలే నిజమగు విటమినులు. సద్గుణములు ప్రాణమును పెంపొందించి నంతగ మిటమినులు పెంపొందింపలేవు.

సద్గుణవంతులు మిక్కుట ముగ ప్రాణశక్తి కలిగి యుందురు. వారహర్నిశలు పనిచేయుచున్నను ప్రాణము నీరసింపదు. తెలివికి సద్గుణంబుల బలిమి గూర్చినచో అంతకు మించిన విటమినులు, టానిక్కులు లేవు. సద్గుణములే సమస్త మిటమినులకు నివాస స్థానము. సద్గుణములు లేనివారికి యీ స్థావరములు మూతబడవు. వారు విటమినులు తినుచున్నను ప్రాణమంతంత మాత్రముగనే యుండును.

సాధారణ మానవునకు విటమినులు పనిచేయపోవుటకు కారణము వారియందు సద్గుణముల కొలుతయే. మా దృష్టిలో విశ్వాసము మొట్టమొదటి సద్గుణము. విశ్వాసము మూఢ నమ్మకము కాదు. అది ఆత్మవిశ్వాసము. తనయందు తనకు నమ్మకమున్న వానికి ఇతరులయందు కూడ నమ్మకముండును.

ఇతరుల యందు అప నమ్మకము తమ యందలి అపనమ్మకము యొక్క ప్రతిబింబమే. అపనమ్మకము ప్రాణమునకు శత్రువు. నమ్మకము ప్రాణమునకు మిత్రుడు. నమ్మినవాడు చెడడని ఆర్యోక్తి. నమ్మి చెడినవాడు లేడని మరియొక ఆర్యోక్తి. అనుమానము,
అపనమ్మకము గలవారు విటమినులుగొనుట నిష్ప్రయోజనము. అట్టివారికి విటమినులు అపాయమని కూడ మా నమ్మకము. విటమినులను గొని అపనమ్మిక శక్తి పెరుగునే కాని ప్రాణము పెరుగదు. అపనమ్మకము, అనుమానములకు సహాయనిరాకరణము (Non-co-operation) తోడైనచో ఇక అట్టివారికి ఔషధములు, విటమినులు పనిచేయుట కష్టము. ఇది తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

ప్రాంజలి ప్రభ  ..1

మన జన్మ సంగ్రహ సంఘర్షణ దైవ విధానముల్
యుగ ధర్మ సంతృప్తి జీవన వేద విధానముల్
యువ శక్తి సద్భావ భోధన సత్య విదానముల్
ప్రతి నిత్య దాంపత్య సంతస సేవ విధానముల్   

నా భావము : దేవుని ప్రేమ మనపై ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు, పుట్టుక అనేది ఘర్షణల వళ్ళ వచ్చే సంగ్రహ విధానములు,  వేదములలో ఉన్న మహాత్య ప్రభావము వళ్ళ, ధర్మాలను అను సరించి సాగు జీవన విధానములు, యువశక్తి ద్వారా అధునాతన విధానములు, అంతర్జాల విధానములు సద్భావముతో చేసే పనులు,  ప్రతిఒక్కరు సుఖ శాంతులతో ఉండుట యే ఒకరికొకరు అర్ధం చేసుకొని బ్రతకట యే ప్రేమ సేవ  విధానములు.


దేశ సౌభాగ్య  ప్రావణ్య సేవ హితమతుల్
ప్రేమ ఔదార్య ప్రాధాన్య అర్ధ హితమతుల్
 ధర్మ ప్రబోధ భాగ్యమ్ము నాకు హితమతుల్
 నాద బ్రహ్మాండ సాహిత్య బోధ హితమతుల్

 
నా భావము : దేశము కొరకు మేధావు లందరు హితవచనములు తెలిపి ప్రపంచములో మనదేశ గుర్తింపు కోసం నీవంతు ప్రావీణ్యత సేవచేస్తూ తెలపాలి హిత వచనాలు, ధనం కోసం ప్రేమ ఔదార్యం, మంచి ప్రావిణ్యం  గుణం ఎప్పటికి వదలొద్దు, నీవీవు చెప్పే హిమవచనాలే ధనంతో సమానము కావాలి, ధర్మాన్ని రక్షించుట నాకు భాగ్యమ్ము అని తలచాలి, నాద బ్రహ్మాండ పురాణాల సాహిత్యమును అర్ధమే మనకు మనసు ప్రశాంత పరిచే హిత వచనాలు.
ప్రేమ భావాల ప్రతీక ధర్మ ప్రభోధమ్ములన్
దేశ కాలాన్ని ప్రబోధ మార్గ మనోనేత్రముల్
వేళ గ్రహించి ప్రచండ కల్ప మనోశాంతముల్
సత్య ధర్మాన్ని పకృతి నిలిపే మనోభావముల్
 
 నా భావన :

ధర్మాన్ని నిలబెట్టుటకు, ప్రతి వక్కరి మనస్సులో ప్రేమను నింపేందుకు, దేశంలో మంచి మార్గాన్ని చూపే ప్రబోధాలను గ్రహించి జీవితము గడపాలని,  మనస్సులో ఉన్న మంచి మార్గాన్ని నలుగురికి చూపి దేశాన్ని కాపాడుటకు మనో నేత్రములతో సహకరించాలని, ఏంతో కష్టము  వచ్చిన, ప్రళయము వచ్చిన, భయముతో వణుకుతున్న ప్రాంతాన్ని ఆదుకొని భయమును తొలగించి మనస్సుతో శాంతిని కల్పించాలని, ప్రకృతి అనుకరించి సత్యము, ధర్మము గ్రహించి మనుష్యుల మనోభావాల ననుసరించి జీవితము సాగించాలి.
*ఇది దశావతార నృసింహ మంత్రము,
 ఈ మంత్రము ఒకసారి చదివి షేర్ చేయండి,
 మీరు ఈరోజు తప్పకుండా ఒక శుభవార్త వింటారు, ప్రతిరోజు చదివితే మనసులోని కోరికలు అన్నీ ఒక్కోక్కటిగా నేరవేరుతాయి.*

"ఓం క్ష్రౌం నమోభగవతే నరసింహాయ |
ఓం క్ష్రౌం మత్స్యరూపాయ నమః |
ఓం క్ష్రౌం కూర్మరూపాయ నమః |

ఓం క్ష్రౌం వరాహరూపాయ నమః |
ఓం క్ష్రౌం నృసింహరూపాయ నమః |
ఓం క్ష్రౌం వామనరూపాయ నమః |
ఓం క్ష్రౌం పరశురామాయ నమః |
ఓం క్ష్రౌం రామాయ నమః |
ఓం క్ష్రౌం బలరామాయ నమః |
ఓం క్ష్రౌం కృష్ణాయ నమః |
ఓం క్ష్రౌం కల్కినే నమః జయజయజయ సాలగ్రామ నివాసినే నమః |
దివ్యసింహాయ నమః |
స్వయంభువే పురుషాయ నమః |
ఓం క్ష్రౌం ||"

ఇతరులకు చెప్పకూడదని మీరు మాత్రమే చదివి ఊరుకుంటే ఫలితం ఉండదు, మంచిని నలుగురికి పంచితేనే రెట్టింపు అవుతుంది, కావున కనీసం పదిమందికైనా వి చేసి వారి మంచికి దోహదపడండి, అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతాయి.

. పాత్రత  -1 🌻


తగినవాడు‌ కనిపించినపుడు దానము‌ చేయుము, తగని వారితో కూడా ప్రియముగనే మాట్లాడుము. అంత మాత్రమున అసత్యము మాట్లాడకుము.

ఎవరికిని నీ‌ వలన బాధ కలుగరాదను  ప్రయత్నము నిత్యము కలిగియుండుము. ఈ మార్గమున జీవించినచో నరుడు స్వర్గానికి చేరుదురని నా మతము.

పాత్రునకు దానము చేయుట‌ అనగా బీదవారికిచ్చుట ఒక్కటే కాదు. మనము చేయలేని పని ఇంకొకడు చేయగలవాడు కనిపించినచో మన సహకారము, మన దగ్గరున్న సాధన సంపత్తి వానికి ఇచ్చునట్టి బుద్ధి యండవలెను.

అది లేక పోవుట చేతనే ఉత్తమ ప్రభుత్వము స్థాపించ వలెనను బుద్ధితో ప్రజలు వర్గములై చిలిపోయి క్షుద్రులుగా ప్రవర్తించుట జరుగుచున్నది.

అది లేకపోవుట చేతనే  మహానుభావులైన స్వాముల వార్లు ఆశ్రమములను స్థాపించి హిందూ మతోద్ధరణకై ఎవనికి వాడుగా వేరుగా ప్రయత్నించుట, ఇంకొకని పొడగొట్టకుండుట, చీలిపోవుట జరుగుచున్నది.

దేశమునకు ఉపయోగించు మహానీయునకు ఆరోగ్యము చెడినప్పుడు స్వయముగా పోయి మందిచ్చుట, అతని క్షేమము గూర్చి బాధ్యత స్వీకరించుట పాత్ర దానమగును.

తనకన్నా తక్కువ వాని యందు జాలి, దానబుద్ధి చాలమందికి ఉండును. తనతో‌ సమానుడు, తాను చేయలేని పనులు సాధించువాడు కనిపించునపుడు తాను సహకరించునట్టి దాన బుద్ధి నిజమైన పాత్రత.


దానిని‌ సాధింపవలెనన్నచో ఈర్ష్య మొదలగునవి దాటవలెను...

✍️ మాస్టర్ ఇ.కె.
🌹 🌹 🌹 🌹 🌹


Monday, 5 July 2021

 

 

నేటి సమస్యను పూరించుట .....

మనసు మెచ్చు నట్లు నాట్య మహిమ     
గుణము తెల్ప కున్న మోహ వలపు
చినుకు లాగ ముంచ మోస తలపు       
వనిత  వచ్చె , చంపె వాయుసుతుడు..

నేటి సమస్యను పూరించుట  .......

పాద సార మెల్ల పృథ్వి  కెఱుక
వాద సార మెల్ల వాది కెఱుక.
నాద సార మెల్ల రాధ కెఱుక.
వేద సార మెల్ల వేశ్య కెఱుక.....
 

Thursday, 1 July 2021

chandassu

   


01/07 . Mallapragada:నేటి కవిత..

 పడవ మునక


గాలి కొద్ది కదలె చెక్క కలప పడవ

తాళి ఎగతాళి చేయ క దరిని చేర్చు

గేలి చేసేపలుకు భయం కదిలి కయే

రాలి పోవు ఆకులతెప్ప గాను కదిలె 


బల్ల వాటం కదలికలే పడవ ఎగిరె

చిల్లు పడినీరు పడవలో చేరియుండె

వొళ్ళు జలతరించె ప్రజ ఓడి గెలిచె

నీళ్ళు లో చెక్క ముక్కలై నీటి తేలె


ఇది పగిలి పోయెనని భయ మింత వరకు

మది చెదిరి తలంపులు భయ మావహించె

చెదిరి నమనుషులు భయ జాము రాత్రి

బెదిరి సంద్రలొ మునిగారు చెక్క  పట్టె


 విరిగి పోయిన చెక్కలు దరికి చేర్చి

మరిగిన హృదయం ఓర్పుయు మేలుచేసె

నురుగు పెరిగి జలచరాలు తేలు చుండె

గర్భ సంద్రలొ అగ్నియే కలిగి పెరిగె


జరిగి పోయె విపత్తు క్షణమ్ము లోని

తరుణ ఆశలు బతుకుకు దారి చూపె

కరుణ లేని జలం పొంగి కష్ట మిచ్చె

పరుగు పందాలె శవములు మోయు జలధి

 

నేటి కవిత ప్రాంజలి ప్రభ  -3-

జీవితం లో గమ్య మే దో
తెలియటం లేదు ఎందుకు
పాప మేదో పుణ్య మే దో
తెలపటం లేదు ఎందుకు

సంసారం సాగరం మే దో
తెలసు కోవటం లేదు ఎందుకు
సాంఘీక సంక్షేమ మే దో
బతుకు నేర్పడం లేదు ఎందుకు

సామాన్య ధర్మాలు ఏ వో
సామరస్యానికి పనికి రావెందుకు
సాహిత్య సంభాషణలు ఏ వో
మానవత్వానికి పనికి రావెందుకు

ప్రతిఘటన వ్యతిరేకత ఏ దో
ప్రేమలో కన బడదు ఎందుకు
ఇష్టం అయిష్టం కష్టం ఏదో
ప్రేమలో కాన రాదు ఎందుకు

మధురం మాధుర్యం యే దో
తెలి పే వారు లే రెందుకు
మోక్షము కు మార్గ మే దో
మనసు కు చెప్ప లే రెందుకు

సఫలము విఫల మైన దే దో
తెలుప లేరు ఎందుకు
సహనము కు కష్ట మైన దే దో
కను గొన లేరు ఎందుకు

పట్టు బట్టి మనసు పెట్టిన కా దే దో
కారణం తెలుపు లేరు ఎందుకు
గుట్టు రట్టు అయిన చెప్పరు ఏ దే దో
బాధ్య తై మనసు వెంట  ఎందుకు

ఎందు వెదికినా దొరదు ఏ  దో
దొరికినా ఉపయోగం లేదెందుకు  
సమయానికి పొందే తృప్తి ఏ దో
అదే సుఖ మన్నందుకు
 
--(())--


 నేటి కవిత ... లోక నీతి (4 )

తెలుసు కో లేనిది మనస్సు  
తెలుపు కో లేనిది వయస్సు
నిలుపు కో లేనిది తపస్సు
నిలుపు కో లేనిది ఉషస్సు

తెలుసు అనుకుంటే తింగరివి
మనసు మనదంటే ఒంటరివి
సొగసు కథలంటే తుంటరివి
నలుసు పడిఉంటే మంధరివి

ఆకలి ఉంటే ఆర గిస్తావు
వాకిలి వెంటే వెల్గు లిస్తావు
జాబిలి వెంటే చల్లఁ నిస్తావు
కోమలి వెంటే గాలి నిస్తావు

చెడును ప్రోత్సహిస్తే చోరు డవుతావు
గొడుగు గౌరవిస్తే గొప్పొడవు తావు    
అడుగు ఆదరిస్తే ఆత్మ గవుతావు
ముడుపు తీర్చివస్తే దేవుడవు తావు

గొప్ప వాడి వైతే గర్వము తోడు
నిప్పు లాగ ఉంటే సర్వము తోడు  
చెప్ప లేక పోతే పర్వము తోడు
వప్పు కోక పోతే  దర్పము తోడు


--(())--

నేటి స్థితి పద్యాలు
పరిచయస్తుల ను సంతసింపచేయు శ్రధ్ధ ఉంది
కాని నిజమైన వారెవరో తెలియదే
మనకలస్తులకు మంచియేదొ చెప్పు శ్రధ్ధ
ఉంది కాని మనసున్న వారెవరో తెలియదే
మానవ సంబంధాల సౌందర్యం పొందాలని ఉంది
కాని నాలో ఈర్ష్యతో పొందలేకున్నా
ప్రేమతొ విశ్వాసంతొ ఆనందం చెందాలని ఉంది
కాని నాలో అజ్ణాణంవల్ల పొందలేకున్నా
తప్పి దాలను మన్నిస్తావు కాని నేను తెలుసు కో లేను
కష్ట మార్గము చూపిస్తావు కాని నాకు సహన మే లేదు
ఇష్ట మైనది తిన్పిస్తావు కాని నాకు రుచిగ నే లేదు
బత్క మాయను తెల్పలేవు కాని నాకు మనుగ డే లేదు
శాస్వితం గా దూరం తెలియదు కాని నాకు దూరంగా నే తెలుస్తాయి
తాత్వికం గా నాకే వెలుతురు కాని నాకు చిక్కుల్నే వెంబ డిస్తే హాయి
విశ్వాసం గా ఉండే చరిత మె కాని నాకు అర్ధా లన్నీ కరు స్తాయి
శాస్వితంమ్మే ఏదో తెలియదు కాని నాకు సేవా భావం ఋణస్తాయి
 
--(())--
 

నేటి కవితలు

చెట్టు నుండి విత్తు వచ్చె
విత్తు నుండి చెట్టు వచ్చె
పక్షి నుండి గుడ్డు వచ్చె
గుడ్డు నుండి పక్షి వచ్చె
వెల్గు నుండి బింబ మెచ్చె
బింబ మాయ వెల్గు తెచ్చె
యోగి నుండి పల్కు వచ్చె
పల్కు నుండి ఆశ తెచ్చె
చెట్టు నుండి కొమ్మ వచ్చె
కొమ్మ నుండి మొగ్గ వచ్చె
మొగ్గ నుండి పువ్వు వచ్చె
పువ్వు నుండి కాయ వచ్చె
పూర్ణాత్మ నుండి అంశాత్మ వచ్చె
అంశాత్మ నుండి పూర్ణాత్మ వచ్చె
ఆశ్చర్యము నుండి సోకమ్ము వచ్చె
సోకమ్ము నుండి ఆశ్చర్య మోచ్చె

 నేటి కవిత -- ప్రాంజలి ప్రభ

పాల తెలుపు కలిగి  బలిమిఁ సెగలు కలిగి
నాలఁ గాచె చెలిమి - వోలి వెట్టి  కొలిమి

నీల వర్ణ సొబగు - కాలి గజ్జ మెరుపు
వేలి రింగు రంగు - మేలి ముసుగు జయము

జలధి మాత కొలువు - నెలమి తోడు ఇదియు
లెల్ల మాట వినుము - కొలము కొలముఁ గూడి

తలఁపఁ జక్కఁ దనము - కొలువు లెల్ల తరము
పలుకు వల్ల తెలుపు  - తెలిపి మనసు గెలుపు

తెలుపు రంగు మలుపు - నలుపు మాట తలపు
తలుపు తెరిచి వెలుగు - వెలుగ వల్ల తొలగు

పొలము దున్న లేక  - పాలు తాగ లేక
కలలు నమ్మ లేక - గోల చేయ కుండె
   
హలము తెచ్చి దున్న- హాలహలము చెత్త
కలిసి భయము తెచ్చె - జల్లు వచ్చి ముంచె

చలన మయిన చెత్త - చాల చేరి కంపు
వల్ల గుండె నెప్పి  - గుల్ల గుల్ల చేసె
                
లలన వోలె వచ్చి  - లాస్య మాడు చుండె
 జాలి కల్గి చేయ     -లేని జగతి ఉండె

వలపు గుది బండయి -- వలదు అనియు వెళ్ళు
  అలక చూపి నెట్టె - లోక భయము వలదు
            
కలదు సహనమ్ముయు -  కలిసి పోవు నింట
 తెలియ రాని బాధ - గలదు ధైర్య ముంచు
            
తలచుకుంటె చాలు - తల్ల డిల్లుమనిషి
వళ్ళు  జల్లుమనుచు - ఎళ్ళవేళ సుఖము

--(())--


 

ప్రాంజలి ప్రభ.. కల్పన (2)
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ  
 

హృదయమ్మున వినయమ్ముగ తరుణమ్ముయె
విషయమ్మున విమలమ్మున విధినమ్మియె
మరణమ్మున చరణమ్మున నటనమ్ముయె
పరువమ్మున మదనమ్ముయె సకలమ్మున

నినుజూడగ మదిమారగ తెర అడ్డము
గనుచూపులొ కలలాగున కర్గి పోయెను
తనువంతయు తపమాయెను ఆశ పెర్గెను
చనువేఇది కనుకేమది తేలి కాయెను

వ్యధయెందుకు రొద చేయకు అదిఇష్టము
నిధి జోలికి కధలల్లకు అది కష్టము
మది మార్చకు సమయమ్మిది ఇది నష్టము
ఇది కాదులె అలా అంటిని ఇది అష్టమి

కాని దెందుకు వాని ముందుకు తెచ్చు టెందుకు
సాని కొంపకు వెళ్ళు టెందుకు రోగ మెందుకు  
బోణి లేనిది అప్పు లివ్వకు చిల్ల రైనను   
వాణి వళ్ళన విద్య వచ్చును బుద్ధి కల్గును

--(())--


నేటి ఛందస్సు ... కల్పనా (త్రీ)  

నర సుందరు లందరితో - సుఖ జీవన మందున నీ - శుభ నామము దళ్వక యే    
కర కౌగిలి పొందికతో  - ముఖ మాయకు చిక్కితి నీ - సభ యందున గొల్వక యే
గర మాయిన జీవముతో  - నఖ సౌఖ్యము పొందితి నీ - విభ వంబున తొందర యే
వర మవ్వుట కామముతో - సుఖ మాయకు దక్కితి  నీ - అభయమ్మున ఆస ర యే    

చరణమ్ముల చింతన లో - స్మరియించుచు జిత్తము లో - జనులెప్పుడు గొల్వక యే
తరుణమ్మున తొందర లో - మురిపించుచు విత్తము లో - మనువెప్పుడు లేకను యే  
కరుణమ్ము గ అందరి లో  -  కురిపించుచు హత్తుక లో - తనువెప్పుడు కొత్తగ యే
అరుణమ్మ గ ఆకలి లో - చిరుహాసము పొత్తుల లో - అనువంతుయు కృష్ణుడు యే   

దురదృష్టము కల్గిన చో - దురితమ్ము గ నీగుడి లో - దొరనీవని యాత్రము యే
పరయిష్టము కోర్కల చో - మురిపమ్ము గ నీవడి లో - దరిచేరితి మాత్రను యే
నర ఇష్టము కష్టము  చో - భరిణమ్ము గ నీదడి లో - విరి జాజుల ఛాతిగ యే          
కర కౌగిలి చిక్కిన చో  -  పరిణమ్ము ఎ దోపిడీ లో -  మరి దేవుడు కృష్ణుడు యే

బరి తీరుల నీదయ కై - వరమీయగ గోరుదు రో - పరమాత్ముడు చిత్రము యే       
కరి తీరున ఉండుట కై - చరణాలను పట్టుదు రో - కరుణాత్ముని చిత్రము యే
వరి కంకుల మాటున కై - ధర లెక్కను చూడరు రో -  తరుణాత్ముని శాంతిగ యే    
కాహారి తమ్ముగ తెల్పుట కై - అర మార్కలు చూడను రో - వర కృష్ణుని కోరిక యే

--(())--


నేటి ఛందస్సు ... కల్పన (4)  
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

అరిటాకు అన్నముయు - ధర్మ మేగ ఆకలియు 

కలిసాక సంతసము - విధి రాత కాదా 

విరజాజి పువ్వులకు  - సాసహనము వాసనయు
మరుమల్లె నవ్వులలొ  -
విధి రాత కాదా

వినయమ్ము చూపుటయు - కలమాయ మాపుటయు
- బతుకంత వేదనయు - విధి రాత కాదా
చిరునవ్వు పంచుటయు - మది తెల్పి ఆగుటయు
- దరిచేరి వేడుటయు  - విధి రాత కాదా

సకలమ్ము కారణము - మదిలోని మచ్చలుయె
- మనసంత రోదనము - విధి రాత కాదా
పరువాన ఉండుటయు - దరహాస మాడుటయు
- వినసొంపు మాటలయు -  విధి రాత కాదా

చతురత్వ విద్యయును - చతురత్వ భాషయును
చతురత్వ కోపమును - విధి రాత కాదా
మరుజన్మ యన్నదియు - సహజత్వ మాటలయు
అనునిత్య  నాటకము - విధి రాత కాదా

కల మాయ  కోన కధ - గిరి మాయ నీతి కధ
చిరు గాలి  గోలి కధ - విధి గాలి భీతీ
కరి మాయ కోరి కధ - నిధి మాయ వీధి కధ
మది గాలి మౌన కధ - తిధి గాలి  తీపీ
  
దరహాస తీరు దయ - విరజాజి మా రు కృప
- మది తెల్పు  మాయకల - తనువంత బాధా 
కావచ్చు కాలమున - వినవచ్చు శబ్దమున
-కానవచ్చు చీకటిన - మనసంత బాధా      

--(())--


నేటి ఛందస్సు ... కల్పన (6)

కల హంసల సయ్యాటలో కను విందు చేసే
మను వాడిన ముద్దాటలే  మది పొందు కోరే
చిరు హాసపు ఉయ్యాలలో  చను విచ్చి  చేరే
మరు మల్లెపు సయ్యాటలో  కధ లల్లి విప్పే

రమ కోరిక ఉయ్యాలలో సమ పొందు కోరే
సుమ మాలిక జంజాటమే దర హాస మేడే
తమ  ఏలిక ఇష్టాలలో తనువంత పంచే
గమ కానికి తోడూ ఇదే సముఖాన విందే
     
మౌన హంస అర్ధానికి అర్ధంగా అర్ధాంగి  
బంధానికి భంధమై ఆశయ కార్యోన్ముఖి
ప్రేమ హంస స్నేహానికి స్నేహంగా స్నేహవతి
కాలానికి కాలమై చలిమితో ప్రేమసఖి

భామ నీతి సౌఖ్యానికి  సౌఖ్యం గా సౌందర్య
ప్రేమాసతి సఖ్యత్తై సుఖము సఖ్యాన్ముఖి
చారుహాస చాపల్యము చైతన్యమే మాధుర్య
ప్రేమా పతి ధైర్యమై మనసు ధైర్యాణ్ముఖి
      
రాజ హంస హృదయానికి హృద్యంగా వేదవతి   
ప్రేమకు ప్రేమయై  కళలతో  పిపాసి
సత్య హంస  ధర్మానికి ధర్మంగా ధర్మదేవత
న్యాయానికి న్యాయమై  రాజ్యమేలే భారతి
 

--(())--

నేటి ఛందస్సు ... కల్పన - 7-  

కోరు వయసులోన - కొరికే తృప్తిగా  
చేష్టలగను - కలలు తలపు గాను  
సేవ బలము - వర్ణ మవ్వుటే జీవితం  
ప్రేమ బ్లు చూపుటే

చేరు తనువులోన - తాపమే  తృప్తిగా
కష్టములను - కళల వలపు గాను  
కాల మనసు నర్ధ మవ్వుటే జీవితం  
కాల కలలు తీర్చుటే  

అమ్మ పలుకు లోన - బ్రేమయే మానసం
అన్ని తెలుపు - మనసు కదలయయ్యె
కాని పనులు వద్దు - భావమే మానసం
నన్ను మరువటేల నీవు    

వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా
కన్నె మనసు - కలల కవనమయ్యె
వన్నె లలరినట్లు - వాంఛలే పూచెఁగా
నన్ను కనవదేల నీవు

ప్రేమ తలపులోన - బంధ బాంధవ్యమే
ప్రేమ చెలిమి - మాన్సు తలపు గాను
ప్రేమ మనసుచేరి - బ్రేమనే పంచుటే
ప్రేమ అనునదే ఇదీ    
 
కష్ట సుఖములోన - ధర్మ ధర్మాలులే
ఇష్ట వయసు - చెలిమి తలపు గాను
నష్ట మనునదేది - చేయకే ఉండుటే
ఇష్ట మనునదే ఇదీ

--(())--


నేటి ఛందస్సు ... కల్పనా --98--

కాల మహిమతో మనసుకు కష్ట సుఖము వచ్చు వరుసగా
బేల కనులలో తెలియని ఇష్ట మొకటి  తెల్పి తెలపకా
మాల లతలులా పరిమళ మంత పలక రింపు పరముగా
వేళ బతుకులో ఒకటిది వేరు సుఖము పంచు మహిళగా

కాలము మనకే కధలను కావ్యములను తెల్పగలుగుటే
వేలపు మనసే మధనము వైపు కదలి మాయ పరుగులే  
మాలిక వలనే మనుగడ  మోనముగను చేదు బతుకులే
ఏలిక కొరకే సుఖమును ఎంచు తలపు మోహ వలపుకే                   

జ్వాల వలన జనిత మగు నేస్తములను వీడ వలదులే
గోల జరిగి విషయమగు  గొప్ప కొరకు గోడు కలలులే   
ఆలి కొరకు కద పెరుగు అల్పమయిన తెల్ప గలుగుటే
ఏలి క తగు విధమగును  ఏది యనక  సేవ తెలుపుటే

--(())--