శ్రవేంకటేశ్వర: 🌻 పరమపుణ్యధామమూ..... ఉత్తరద్వారదర్శనము!! 🌻
శ్లో॥ సత్యం సత్యం పునస్సత్యం న దేవో వేంకటేశ్వరాత్ బ్రహ్మాండే నాస్తి, యత్కించిత్ న భూతం న భవిష్యతి. - భవిష్యోత్తర పురాణం
🍃🌺సత్యంగా చెబుతున్న మాట! ఒకసారి కాదు. మళ్లీ మళ్లీ చెబుతున్న సత్యమైన మాట ఇది! ఏమిటా సత్యం. అంటే ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా అటు భూతకాలంలోను ఇటు భవిష్యత్తులోను శ్రీవేంకటేశ్వరునివంటి దేవుడు లేడు. లేనే లేడు. కనపడడు కూడా" అని.
🍃🌺అలాంటి ఆనందనిలయుని దర్శనం కోసం ఇంటి నుంచి బయలు రడం, ఏడుకొండల్లో విహరించడం, బంగారుమేడ ఆనందనిలయాన్ని వీక్షించడం, ఆనందనిలయుని నిలువెత్తు దివ్యమంగళ విగ్రహాన్ని కన్నులారా దర్శించడం... ఇలా వీటన్నింటి వల్ల దివ్యానుభూతులతో ఒక ఆనందాన్ని పరమానందాన్ని పొందడం అద్భుతం పరమాద్భుతం! అయితే!
🍃🌺'అందరూ ఒక ఎత్తు, అగస్త్యుడొక ఎత్తు' అన్నట్లు ఇన్నిన్ని ఆనందాల్ని నిరంతరం పంచుతూ. భక్తులను మైమరపిస్తున్న తిరుమలక్షేత్రాన్ని ఏడాది పొడవునా దర్శించడం ఒక ఎత్తు! కాగా
🍃🌺ప్రత్యేకంగా ధనుర్మాసంలో ఒక నెలరోజుల్లో, ఏ ఒక్క రోజైనా తిరుమలక్షేత్రాన్ని సందర్శించే భాగ్యం కలగడం, ఆనందనిలయుణ్ణి దర్శించి వింత వింత అనుభూతుల్ని ఆనందాన్ని పొందే అదృష్టం కలగడం మాత్రం, మరో ఎత్తు! అందులోను ధనుర్మాసంలో వచ్చే వైకుంఠఏకాదశిపండుగనాడు కలియుగవైకుంఠంలో విహరించడంవల్ల, సందర్శించడంవల్ల భక్తుని మనస్సు ఆనందాల పంటలు పండేపూదోట అవుతుంది.
🌻 వెంకన్న సన్నిధిలో వైకుంఠ ఏకాదశి 🌻
🍃🌺ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే 'ఏకాదశి'ని 'వైకుంఠ ఏకాదశి' అంటారు. తిరుమలక్షేత్రంలో వైకుంఠఏకాదశి, ఆ మరునాడు వైకుంఠద్వాదశి ఇలా ఇది రెండు రోజుల పండుగగా ఎన్నో విశిష్ట సేవలతో నిర్వహింపబడుతుంది.
🌻 వైకుంఠద్వారం తెరవబడుతుంది 🌻
🍃🌺వైకుంఠ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిళ్లు మూసివేస్తారు. పిదప తెల్లవారుజామున వైకుంఠఏకాదశినాడు సుప్రభాతసమయంలో బంగారు వాకిళ్లు తెరచినప్పటినుండి మరునాడు వైకుంఠద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకు శ్రీవారి గర్భాలయానికి దగ్గరగా ఆనుకొని ఉన్న “ముక్కోటి ప్రదక్షిణ మార్గం" తెరవబడుతుంది.
🍃🌺ఈ ప్రదక్షిణ మార్గానికి ఉన్న ద్వారాలను వైకుంఠద్వారాలనీ, ఉత్తరద్వారాలనీ అంటారు. ఈ మార్గాన్ని ‘వైకుంఠప్రదక్షిణమార్గం' అనీ అంటారు. ఈ మార్గం విద్యుద్దీపాలతో, సుగంధ, సుమనోహరమైన పులమాలలతో అలంకరింపబడిన ఈ వైకుంఠప్రదక్షిణంలో ప్రవేశించే భాగ్యం ఏడాదిలో ఈ రెండురోజులు మాత్రమే కలుగుతుంది.
🍃🌺వైకుంఠఏకాదశి, ద్వాదశి రోజుల్లో శ్రీ స్వామివారిని దర్శించిన తర్వాత భక్తులకు వైకుంఠప్రదక్షిణంలో ప్రవేశం కలుగుతుంది. ఈ రెండు రోజులూ విమానప్రదక్షిణంలో భక్తులు అనుమతింపబడరు. వైకుంఠ ప్రదక్షిణంలో ప్రవేశించిన భక్తులకు దివ్యానుభూతులతో పాటు, పూర్వసంచిత పాపకర్మలన్నీ నశిస్తాయి. ఇష్టార్థాలన్నీ నెర వేరతాయి.
🌻 స్వర్ణరధోత్సవం 🌻
🍃🌺వైకుంఠ ఏకాదశినాడు సప్తగిరీశునికి మరో విశేష ఉత్సవం జరుగుతుంది. అదే స్వర్ణరథోత్సవం!
🍃🌺వైకుంఠ ఏకాదశినాడు ఉదయం 8 గంటలవేళ కలియుగ వైకుంఠ నాథుడైన కొండలరాయడు శ్రీదేవీ భూదేవేరులతో కలిసి బంగారుతేరుపై పురవీధుల్లో దర్శనమిస్తారు. వైకుంఠ ఏకాదశి నాటి స్వర్ణరథోత్సవంలో పయనిస్తున్న అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుణ్ణి దర్శిస్తే చాలు.
🍃🌺భక్తుల మనోరథాలు తప్పక తీరతాయి. భక్తుల గోవిందఘోషల మధ్య జరిగే తిరుమల గోవిందుని స్వర్ణరథోత్సవదృశ్యాన్ని వర్ణించడం అక్షరాలకు అందదు. దర్శించి అనుభవించాలి. అంతే!
🌻 శ్రీస్వామిపుష్కరిణీతీర్థ ముక్కోటి ఉత్సవం 🌻
🍃🌺వైకుంఠ ఏకాదశి మరునాడు 'వైకుంఠద్వాదశి'. వీటినే "ముక్కోటి ఏకాదశి”, “ముక్కోటి ద్వాదశి అంటారు. వైకుంఠఏకాదశి మరునాడు వైకుంఠద్వాదశినాడు “శ్రీస్వామిపుష్కరిణీ తీర్థ ముక్కోటి ఉత్సవం” జరుగుతుంది.
ధనుర్మాసే సితే పక్షే ద్వాదశ్యా మరుణోదయే ఆయాతి సర్వతీర్థాని స్వామిపుష్కరణీ జలే తత్ర స్నాత్వా నరః సద్యోముక్తి మేతి నసంశయః యస్య జన్మ సహస్రేషు పుణ్య మేవార్జితం పురా
🍃🌺ధనుర్మాసంలో వైకుంఠద్వాదశినాటి అరుణోదయ వేళలో ముక్కోటి తీర్థాలు “శ్రీస్వామి పుష్కరిణి”లో మునకలిడుతాయి. శుభప్రదమైన ఆ వేళలో స్నానం చేసే మహాభాగ్యం అందరికీ కలుగనే కలగదట! ఎవరైతే వేలజన్మల్లో పుణ్యాన్ని ఆర్జించుకొని ఉంటారో, వారికి మాత్రమే ఈ నాడు తిరుమల శ్రీవారి కోనేట్లో స్నానం చేసే భాగ్యం కలుగుతుంది. అలాంటి వారికి సద్యోముక్తి కలుగుతుంది.
🍃🌺అంటే వారు శరీరంతో ఉన్నా, జీవన్ముక్తిని పొందుతారని సారాంశం. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని స్కాందపురాణాంతర్గత వేంకటాచల మాహాత్మ్యం స్పష్టం చేస్తోంది.
🌻 శ్రీవారి చక్రస్నానం 🌻
🍃🌺ఇలాంటి శ్రీస్వామిపుష్కరిణీ తీర్థముక్కోటి శుభఘడియల్లో, అంటే వ…
[6:59 am, 26/06/2021] శ్రవేంకటేశ్వర: 🌻 విష్ణుమూర్తి కూర్మావతారం చాలించడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా? 🌻
🍃🌺పురాణాల ప్రకారం లోకకల్యాణార్థం, ధర్మాన్ని కాపాడటం కోసం విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా దశావతారాలలో రెండవ అవతారమే కూర్మావతారం. అయితే విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తడానికి గల కారణం? కూర్మావతారాన్ని చాలించడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం....
🍃🌺పురాణాల ప్రకారం రాక్షసులు దేవతలు అమృతం కోసం సాగర మథనం చేస్తున్న సమయంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని దానిని పాలసముద్రంలో వేస్తే అది బరువుకు సముద్రంలో మునుగుతుంది. దీంతో దేవతలు రాక్షసులు ఏం చేయాలో తెలియక ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు.
🍃🌺దీంతో విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతం కింద ఉండి దాని బరువును మోస్తాడు. ఈ క్రమంలోనే దేవతలు రాక్షసులు దానిని చిలకడానికి ప్రయత్నించగా ఆ పర్వతం కదలలేదు. అప్ప…
[7:00 am, 26/06/2021] శ్రవేంకటేశ్వర: దేవీభాగవతం - 54
శ్రీ బేతవోలు రామబ్రహ్మంగారు
చతుర్థ స్కంధము - 14
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
లలితా సహస్రనామ శ్లోకము -53
సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ!
మహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్ముడప్రియా!!
శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
53వ భాగములో....
నరనారాయణులు అప్సరసలను అనుగ్రహించడం చదువుకున్నాము.
🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🙏
అమ్మ దయతో...... ఈ రోజు
భూదేవి మొర చదువుకుందాం.
🙏🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🙏
భూదేవి మొర
జనమేజయా ! అతిమహత్తరమైన కృష్ణ చరిత్రను విశదీకరిస్తాను. తెలుసుకో. నీ సందేహాలకు అన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. అదీకాక ఇది అద్భుతమైన దేవీ చరిత్ర కూడా.
ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖిస్తూ, దీనురాలై, గోరూపం ధరించి త్రివిష్టపానికి (దేవలోకం) వెళ్ళింది. శక్రుడు ఈ దీనావస్థను గమనించి, ఏమిటమ్మా కారణం, ఎవరు నిన్ను హింసించారు, నీకు వచ్చిన భయమేమిటి, ఎందుకూ దుఃఖిస్తున్నావు ? అని ఆప్యాయంగా పలకరించాడు. దుఃఖం ఆపుకోలేక భూదేవి బావురుమంది.
శచీపతీ ! దుఃఖం ఎందుకని అడుగుతున్నావా ? తెలియకే అడుగుతున్నావా ? చూడు - నేనెంత భారాన్ని మోస్తున్నానో, నన్ను ఎవరెవరు ఏలుతున్నారో - గమనించు.
జరాసంధ, శిశుపాల, రుక్మి, కంస, నరక, శాల్వ, కేశి, ధేనుక - వత్సక ప్రభృతులు నాకు ఏలికలు. ముచ్చటగా చెప్పుకుందామంటే ఒక్కటంటే ఒక్కటి - సద్గుణం లేనివారు. సర్వధర్మ విహీనులు. సకల దుర్గుణ విరాజితులు. వీళ్ళు పరస్పర విరోధులు. మదోన్మత్తులు. కాలరూపులు. పాపాచారులు. నిరంతరం ఒకరితో ఒకరు కలహించుకుంటూ నన్ను దారుణంగా హింసిస్తున్నారు. ఈ పాపభారాన్ని నేను మొయ్యలేను. ఏమి చెయ్యాలో, ఎవరిని శరణువేడాలో తోచక ఆత్మీయుడవుకదా నీ దగ్గర మొర పెట్టుకుందాం ఏదైనా ఉపాయం చెబుతావని ఇలా వచ్చాను.
అలనాడు విష్ణుమూర్తి వరాహావతారం ధరించి నాకు చేసింది ఉపకారమే అనుకున్నాను. ఇప్పుడనిపిస్తోంది - అది ఉపకారంకాదు అపకారమే అని. చిన్న దుఃఖం నుంచి పెద్ద దు:ఖంలోకి తెచ్చిపడేసినట్టయ్యింది. కశ్యపాత్మజుడు దుష్టహిరణ్యాక్షుడు నన్ను లుంగజుట్టి మహాసముద్రంలోకి విసిరేస్తే శ్రీహరి వరాహరూపం ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి, తన బంగారు కోరమీద నన్ను తేల్చి తెచ్చి స్థిరంగా నిలబెట్టాడు కదా ! అప్పటినుంచి స్థిర అనే పేరు నాకు దక్కిందికదా ! ఇప్పటి పరిస్థితి చూస్తే అది అపకారమే అనిపిస్తోంది. అలా చేసిఉండకపోతే, పాతాళంలో సుఖంగా ఉండేదాన్ని. ఈ పాపాత్ముల చేతుల్లో పడి ఇంత పీడ అనుభవించాల్సిన దుర్దశ ఉండేది కాదు.
ఇంద్రా ! ఈ దుష్టుల భారాన్ని నేనింక మొయ్యలేను. ఇరవై ఎనిమిదవ కలియుగం రాబోతోంది. ఈ పాపభారం ఇంకా పెరిగిపోతుంది. అప్పుడెలాగూ రసాతలానికి పోకతప్పదు. ఈలోగా ఈ దు:ఖసముద్రం నుంచి నన్ను గట్టెక్కించు. భారం తొలగించు - నీ కాళ్ళు మొక్కుతాను.
ఇంత దయనీయంగా భూదేవి అభ్యర్థిస్తే ఇంద్రుడు చలించిపోయాడు. అమ్మా ! నేనేమి చెయ్యగలనూ ? నీ బాధ తీర్చలేను. ఆర్చలేను. బ్రహ్మదేవుడొక్కడే దీనికి సమర్థుడు. అతణ్ణి శరణువేడు. నేనూ తోడు వస్తాను. పద. ఇదే నేను చెయ్యగల ఉపకారం - అన్నాడు.
దేవతాపరివారంతో ఇంద్రుడు వెంటరాగా భూమాత సత్యలోకానికి వెళ్ళింది. చతుర్ముఖుడు స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేశాడు. పొంగివస్తున్న దుఃఖాన్ని నిబ్బరించుకుంటూ కడకొంగుతో కళ్లు ఒత్తుకుంటూ భూదేవి బదులు పలికింది.
సరస్వతీ వల్లభా ! కలికాలం రాబోతోంది. చాలా భయంగా ఉంది. ప్రజలంతా పాపాచారులైపోతారు. పాలకులు దుర్మార్గులవుతారు. పరస్పర విరోధులవుతారు. రాక్షసులుగా మారిపోతారు. అన్నీ దొంగ పనులే చేస్తారు. ఇప్పటికే ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. నాకు భారం పెరిగిపోయింది. మొయ్యలేకపోతున్నాను. ఒక్కొక్కరికీ ఎంతెంత సైన్యమని ! ఈ రాజులనూ సైన్యాలనూ సంహరించి నాకు భారం వదిలించు. ఇందుకోసమే కోరి నీ దర్శనానికి వచ్చాను.
భూదేవీ ! ఇది నావల్ల అయ్యే పనికాదు. జనార్దనుడే సమర్థుడు. పద. నేనూ వస్తాను. అతడిని అభ్యర్ధించుదాం - అని బ్రహ్మదేవుడు హంస వాహనంపై బయలుదేరాడు. అందరూ విష్ణుసదనం చేరుకున్నారు. ముందుగా చతుర్ముఖుడు శ్రీమహావిష్ణువును స్తుతించాడు -
సహప్రశీర్షా త్వమపి సహస్రాక్షః సహస్రపాత్ |
త్వం వేదపురుషః పూర్వం దేవదేవ: సనాతనః ||
మధుసూదనా ! నువ్వు సహస్రశీర్షుడవు. సహస్రాక్షుడవు. సహస్రపాదుడవు. వేదపురుషడవు. దేవదేవుడవు. సనాతనుడవు. భూతభవిష్యద్వర్తమానాలన్నీ నీకు స్పష్టంగా తెలుసు. మాకందరికీ అమరత్వాన్ని ప్రసాదించింది నువ్వే. నువ్వు ఎంతటి మహిమాన్వితుడవో ఎవ్వరూ ఊహించలేరు.
జగత్కర్తవు నువ్వే. రక్షకుడవు నువ్వే. భక్షకుడవూ నువ్వే. సర్వజగత్తుకు ప్రభువు-నువ్వు.
విరించి ఇలా స్తుతించితే విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు. అందరికీ దర్శనం అనుగ్రహించాడు. స్వాగతం పలికాడు. ఏ పనిమీద వచ్చారని ప్రశ్నించాడు.
భూదేవి పక్షాన బ్రహ్మదేవుడే పలికాడు. దయానిధీ ! కలియుగం రాబోతోంది. కనక ఈ ద్వాపరాంతంలో నువ్వు భూలోకాన అవతరించి దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించు. భూదేవి ఆవేదనను తీర్చు - అని అభ్యర్థించాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు.
(రేపు.... శ్రీహరి పరాధీనత )
🙏అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ........🙏
..... సశేషం
శ్రీ మాత్రేనమః
🙏🌹🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🌹🙏
సూర్యుడు : వైద్యశాస్త్రం,బౌతికశాస్త్రం,కుజునితో కలసిన శస్త్రచికిత్స కునిగా,గురువుతో కలసిన ఆయుర్వేదం,శనితో కలసిన అనస్తీషియా,ఆర్ధోఫిడిక్స్ వైద్యుడు,చంద్ర,శుక్రులతో కలసిన గైనకాలజిస్ట్,బుధునితో కలసిన నరాల నిపుణులు,మరియు కర్ణరోగ వైద్యం సూచించును.రాజ్యాధికారము , పరిపాలనా విభాగాములకు అధికారి , ఆఫీస్ మేనేజ్ మెంట్ , అధ్యక్ష పదవులు, ధార్మిక సంస్థలు , సంఘములకు గౌరవ అధ్యక్షులు మొదలగు అనేక విధముల యజమాని హోదా పొందగలరు. చట్ట సభలలో అధికారము, శాసన నిర్మాణ కర్తలు , ప్రజా పరిపాలకులు . ఆర్డర్స్ జారీ చేయు అధికారము , హోదా , గౌరవము కలిగిన వృత్తులను ప్రసాదించును.
చంద్రుడు : చరిత్ర,కవిత్వం,సైకాలజీ,సముద్ర గర్బమును పరిశోదించుట. నీటికి సంబంధించిన శాఖలు , ద్రవ పదార్దములకు సంబంధించినవి . తెలుపు వర్ణమునకు చెందినవి .
అనగా కూల్ డ్రింక్స్ …
* ఇంగ్లాండ్లో మొదటి పాఠశాల 1811 లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి. *
మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో, గురుకుల అభ్యాసం ఎలా ముగిసింది తెలుసుకుందాం.
గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో) ఈ క్రింది విషయాలను బోధించారు.
01 అగ్ని విద్య (లోహశాస్త్రం)
02 వాయు విద్య (గాలి)
03 జల్ విద్య (నీరు)
04 అంతరిక్ష విద్య (స్పేస్ సైన్స్)
05 పృథ్వి విద్య (పర్యావరణం)
06 సూర్య విద్య (సౌర అధ్యయనం)
07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్ర అధ్యయనం)
08 మేఘ విద్య (వాతావరణ సూచన)
09 ధాతు ఉర్జా విద్య (బ్యాటరీ శక్తి)
10 దిన్ రాత్ విద్య.
12 శ్రద్ధా విద్యా (అంతరిక్ష పరిశోధన)
13 ఖాగోళ విజ్ఞానం (ఖగోళ శాస్త్రం)
14 భుగోళ విద్య (భౌగోళిక)
15 కాల విద్యా(సమయ అధ్యయనాలు)
16 భూగర్బ విద్య (జియాలజీ & మైనింగ్)
17 రత్నాలు మరియు లోహాలు
18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)
19 ప్రకాశ విద్య (శక్తి)
20 సంచార విద్య (కమ్యూనికేషన్)
21 విమాన విద్య (విమానం)
22 జలయన్ విద్య (నీటి నాళాలు)
23 అగ్నియా ఆస్ట్రా విద్య (ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి)
24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)
25 యజ్ఞ విద్య
ఇది శాస్త్రీయ విద్య యొక్క చర్చ. ఇప్పుడు ప్రొఫెషనల్ మరియు టెక్నికల్ విభాగాల గురించి మాట్లాడదాం!
26 వ్యాపార్ విద్య (వాణిజ్యం)
27 కృషి విద్య (వ్యవసాయం)
28 పశు పాలన విద్య (పశుసంవర్ధక)
29 పక్షి పాలన (బర్డ్ కీపింగ్)
30 యాన విద్య (మెకానిక్స్)
32 వాహనాల రూపకల్పన
33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)
36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)
37 లఘు (లోహశాస్త్రం & కమ్మరి)
38 తక్కలు
39 రంగ్ విద్యా (డైయింగ్)
40 ఖాట్వాకర్
41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)
42 వాస్తుకర విద్యా (ఆర్కిటెక్చర్)
43 ఖానా బనానే కి విద్యా (వంట)
44 వాహన్ విద్యా (డ్రైవింగ్)
45 జలమార్గాల నిర్వహణ
46 సూచికలు (డేటా ఎంట్రీ)
47 గౌషాలా మేనేజర్ (పశుసంవర్ధక)
48 బాగ్వానీ (హార్టికల్చర్)
49 వాన్ విద్యా (అటవీ)
50 సహోగీ ( పారామెడిక్స్).
ఈ విద్య అంతా గురుకులం లోనే బోధించబడింది, కాని కాలంతో పాటు, గురుకులాలను అదృశ్యము చేసి బ్రిటిష్ వారు ఈ జ్ఞానం అంతటిని కనుమరుగయ్యేలా చేశారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. ఈ రోజు, మెకాలే పద్ధతి ద్వారా మన దేశ యువత భవిష్యత్తు ఇప్పటి కీ నాశనం అవుతోంది.
భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?
కాన్వెంట్ విద్య పరిచయం గురుకులాన్ని నాశనం చేసింది. భారతీయ విద్యా చట్టం 1835 లో ఏర్పడింది (1858 లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.
మెకాలే ఇక్కడ విద్యావ్యవస్థపై ఒక సర్వే నిర్వహించగా, చాలా మంది బ్రిటిషర్లు భారతదేశ విద్యా విధానం గురించి తమ నివేదికలను ఇచ్చారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యు. లూథర్ మరియు మరొకరు థామస్ మున్రో! వారిద్దరూ వేర్వేరు ప్రాంతాలను వేర్వేరు సమయాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశం (ఉత్తర భారత్) ను సర్వే చేసిన లూథర్, ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని, దక్షిణ భారతదేశం (దక్షిణ భారత్) ను సర్వే చేసిన మున్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.
భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′ ′ దేశీయ మరియు సాంస్కృతిక విద్యావ్యవస్థ పూర్తిగా కూల్చివేయబడాలి మరియు దాని స్థానంలో ′ ′ ఆంగ్ల విద్యా విధానం ఉండాలి అని మెకాలే స్పష్టంగా చెప్పారు మరియు అప్పుడే భారతీయులు శారీరకంగా భారతీయులు అవుతారు , కానీ మానసికంగా ఇంగ్లీష్ వారు అవుతారు. వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఇంగ్లీష్ విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు పని చేస్తారు.
మెకాలే ఇలా చెప్పాడు - ఒక పంటను నాటడానికి ముందు ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా దున్నుతున్నట్లే, దానిని దున్నుతూ ఆంగ్ల విద్యావ్యవస్థలో తీసుకురావాలి. అందుకే అతను మొదట గురుకులము చట్టవిరుద్ధమని ప్రకటించాడు. అప్పుడు అతను సంస్కృతాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించి గురుకుల వ్యవస్థ కు నిప్పంటించాడు, అందులో ఉన్న ఉపాధ్యాయులను కొట్టి జైలులో పెట్టించాడు.
1850 వరకు భారతదేశంలో '7 లక్ష 32 వేల' గురుకుల & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామంలో గురుకులము ఉంది మరియు ఈ గురుకులములన్నీ 'ఉన్నత విద్యా సంస్థలు' గా ఉండేవి. గురుకులములు ప్రజలు మరియు రాజు చేత కలిపి నడుపుబడేవి.
విద్యను ఉచితంగా ఇచ్చారు.
గురుకులాలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్యను చట్టబద్ధం చేశారు మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. ఆ సమయంలో దీనిని 'ఉచిత పాఠశాల' అని పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాస్ విశ్వవిద్యాలయం సృష్టించబడ్డాయి. ఈ మూడు బానిస యుగ విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!
మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశారు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: " కాన్వెంట్ పాఠశాలలు భారతీయుల మాదిరిగా కనిపించే పిల్లలను బయటకు తీసుకువస్తాయి కాని వారి మెదడు ఇంగ్లీషు భావజాలం తో నిండి ఉంటుంది మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వారి సంస్కృతి గురించి వారికి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి జాతి గురించి వారికి తెలియదు, అలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు వెళ్లినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు". ఆ సమయంలో రాసిన లేఖ లో ఉన్న నిజం ఈనాటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య ద్వారా మన స్వంత భాష మాట్లాడటం మరియు మన స్వంత సంస్కృతిని చూసి సిగ్గుపడటం, మనల్ని మనం తక్కువ గా భావిస్తున్నాము.
మాతృభాష నుండి దూరం కాబడిన సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు మరియు ఇది మెకాలే యొక్క వ్యూహం! నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతిని గొప్పతనం తెలుసుకోండి.
మన భారతీయ సంస్కృతి , వారసత్వాన్ని తిరిగి పొందే సమయం ఇది.
🐍సుబ్రహ్మణ్య క్షేత్రం.... మోపిదేవి
💫🍂💫🍂💫🍂💫🍂💫🍂💫
సమర్పణ :—
🦅శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనైశ్చరస్వామి దేవస్థానము - వినుకొండ.
( 🛕మన 2️⃣ తెలుగు రాష్ట్రాల లోనే తొలిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణమౌతున్న అత్యంత అరుదుగా గల సతీ సమేత ఆలయం)
{సంగండెయిరి పాలకేంద్రం పక్కన , నరసరావుపేట రోడ్డు - - గుంటూరుజిల్లా ఆంద్రప్రదేశ్
👉వ్యవస్థాపక అధ్యక్షులు:- పరమేశ్వర జానపాటి (శివగురుస్వామి) ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం అగుటకు phone phe & google pay no : 8520096175)
🍂💫🍂💫🍂💫🍂💫🍂💫🍂
👉🏾మోపిదేవి లోని... వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి దేవస్థానం దక్షిణ భారతదేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వరక్షేత్రంగా విరాజిల్లుతోంది.
స్థల పురాణం
స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భంలో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది.
అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్టవలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలోకి చొచ్చుకొనిపోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించ సాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపోయాయి.ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమహర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షికి , విషయాన్ని వివరించారు. యోగదృష్టితో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలుపడదని తెలిసి కూడ లోకశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమరకార్యానికి అంగీకరించాడు. లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.
పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు.
“వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్”
అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది,.
ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి, ఇదే “సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తి ము క్తి ఫలప్రదమని “శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తి కే సుబ్రమణ్యమనెడి పేరని మాండవ్యుడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు. కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరించారు అగస్య్తమహర్షి. “సనక,సనకస,సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ భగవదారాధనలోనే కాలం గడుపుతుంటారు. వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసంలో లేడు. లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయంలో శచీ,స్వాహా మొదలైన దేవతాస్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.
“ కుమారా! ఏల నవ్వుచున్నావు ? వారు నేనులా కన్పించలేదా.? ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా? భేదమేమైననూ కన్పించినదా ?” యని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపై బడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు.
ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగవలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. ” అత్రస్నానం తు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్, “ .... అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్ర తో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి.
కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టల తో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఈతను మహాభక్తుడు. అతనికి స్వామికలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి , ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టితో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమై పోగా మిగిలిన నంది,గుర్రము ఈనాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.
ఆలయప్రత్యేకత.:-----
స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగు తుంది. ఆలయప్రదక్షిణమార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం.
ఇక్కడ స్వామివారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవ గా భక్తులు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం,మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు.
స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు.
ఓం శం శరవణభవ
🚩🏴🚩🏴🚩🏴🚩🏴🚩🏴🚩
🙏 శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనిదేవుని అనుగ్రహమునకు అత్యంత అరుదుగా గల ఈ ఆలయ నిర్మాణంలో మీవంతు సహాయ సహకారమందించి ఆలయ నిర్మాణంలో మీరూ భాగస్వాములు కండి. :— 🦅
-శ్రీ జ్యేష్ఠలక్ష్మీ సమేత శ్రీశనైశ్చరస్వామి దేవస్థానము- 👉( మన తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటి సతీసమేత శనైశ్చరాలయం వినుకొండలో నిర్మాణమౌతున్నది )
{రిజిష్టర్డ్ నంబర్ 14/2018 .}
(సంగంపాలకేంద్రం పక్కన - నరసరావుపేటరోడ్ - వినుకొండ {గుంటూరు జిల్లా - ఆంద్రప్రదేశ్ } )
👉 ఆలయ నిర్మాణమునకు సహకరించాలనుకునేవారు దేవస్థానము అకౌంటును పోస్టు చేయుచున్నాము.
. నిశ్శబ్దము - స్నేహము 🌻
నిజమైన స్నేహము, నిశ్శబ్దమై యుండునని చైనీయుల సూక్తి. నిశ్శబ్దమే నిజమైన స్నేహితుడని మరియొక సూక్తి. ప్రేమ, స్నేహము నిజమైనచో అది మాటలయందులేక, చేతలయందు మాత్రమే యుండును. చేతలేయుండును గాని మాటలుండవు. స్నేహమును, ప్రేమను భాషణములోనికి దించువారు లోతులేనివారు. వారికి నిశ్శబ్దపు లోతు, రుచిలేక, కేవలము పేలవమైన మాటల నుండి వ్యక్తము చేయుదురు. వాచావాత్సల్యమే లోతులేని వారికి ప్రీతి.
ప్రపంచమంతయు మాటల గారడిలో చిక్కి, ప్రేమయని స్నేహమని తల్లక్రిందులగు చున్నది. నిజమగు స్నేహము గలవారు, ప్రేమగలవారు దాని రుచి తెలిసి, భాషణమున రగుల్కొనక, తత్సంబంధిత కార్యముల నిమగ్నులగుదురు. నిశ్శబ్దమున ప్రవహించినంత స్నేహము, ప్రేమ, మాటలలో ప్రవహింపజాలదు. సీతారాముల ప్రేమ వారిరువురికే తెలియును.
కృష్ణ ప్రేమ భార్యలకన్న గోపికలకే ఎక్కువ తెలియును. ద్రౌపదిని గూర్చి కృష్ణునికి గలప్రేమ అత్యంత సన్నిహితము, సున్నితము కూడ. సత్యభామకది అంతుపట్టలేదు. భరతునిపై రామునికి గల ప్రేమ మాటలలో వ్యక్తము కాలేదు. రాముని స్నేహమంతయు క్రియా రూపమే. భాషణామయము కాదు.
గుహుడైనను, జటాయువైనను, శబరియైనను, సుగ్రీవుడైనను, విభీషణుడైనను రాముని స్నేహమును, ప్రేమను, చేతల ద్వారా రుచి చూచిరే కాని మాటల ద్వారా కాదు. లోతులలో జీవించువారికే, స్నేహము ప్రేమ తెలియును. లోతులు నిశ్శబ్దమునకు సంబంధించినవి. నిశ్శబ్దమున సాన్నిధ్యమున్నది. సాన్నిధ్యము దివ్యసాన్నిధ్యమే.
మన యందలి సాన్నిధ్యమే మన ప్రాణము
లను, తెలివిని నడుపుచున్నవి. మనము గుర్తింప కున్నను, ప్రాణముగను, తెలివిగను పని చేయుచున్నది. ఈ స్నేహమును, ప్రేమను ఏమని పిలువవలెను? సతతము మనలను ప్రేమించు దైవప్రేమ నిశ్శబ్దముననే నున్నది. స్నేహమునకు ప్రేమకు దైవమే పరాకాష్ఠ. అది నిశ్శబ్దమున ప్రవేశించిన వారికే తెలియును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹