Saturday, 24 May 2025

శా

ఎంతోకొంతవికాసవిద్దెలగనున్ యేశక్తి పక్షాలుగన్

శాంతాకారునికోరిపూర్ణముగన్ సాహిత్య చంద్రాంబికా

మాతాశుక్లముకృష్ణముగన్ మానమ్ము సౌందర్యమున్ 

సంతోషమ్ము విషాదమేకనని సామర్థ్య మాహేశ్వరీ


వివరణ

 * : నీ శక్తి యొక్క రెండు పార్శ్వాల ద్వారా (బహుశా సృష్టి మరియు లయ వంటివి కావచ్చు), నేను కొంతైనా జ్ఞానాభివృద్ధిని పొందగలను.

 * : శాంతమైన రూపాన్ని కలిగిన నిన్ను, సాహిత్యానికి వెన్నెల వంటి తల్లిని, నేను పూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారిని సాహిత్యానికి చంద్రిగా పోల్చడం ఆమె యొక్క జ్ఞానప్రదాతృత్వాన్ని సూచిస్తుంది.

 *

 : ఓ సమర్థురాలైన మాహేశ్వరీ! శుక్ల పక్షం మరియు కృష్ణ పక్షం వలె, మంచి మరియు చెడు, అందం మరియు విచారం, సంతోషం మరియు దుఃఖం అన్నీ నీలోనే కలిసి ఉన్నాయి. జీవితంలోని ద్వంద్వాలు నీలోనే ఏకమవుతున్నాయని కవి భావిస్తున్నాడు.

ఓ దేవి!మాహేశ్వరీ నీ సామర్థ్యంతో, ఎంతో కొంతైనా వికాసాన్ని (జ్ఞానాభివృద్ధిని) పొందగలను. నీవే రెండు శక్తి స్వరూపాలుగా (శుక్ల పక్షం మరియు కృష్ణ పక్షం వలె) ఉన్నావు. శాంతమైన రూపం కలిగిన నిన్ను పూర్ణంగా కోరుకుంటున్నాను, ఓ సాహిత్యానికి చంద్రివైన తల్లి! శుక్లము (తెలుపు), కృష్ణము (నలుపు) వలె మానము, సౌందర్యము, సంతోషము, విషాదము అన్నీ నీలోనే ఏకమై ఉన్నాయి.సౌందర్యలహరీ.. 46


*****.

కనుబొమల జంట అందముయెకాన మన్మధాకారమున్

అణువగువిల్లు పట్టియు సమధ్య భాగమున్ చూపుగన్ 

తనువునశంకరాకళలుతాకి తన్మయా దాహమున్ 

ప్రణయముపొంది దేహమగు తల్లి నీల కంఠామదీ


* ఆ తల్లి యొక్క కనుబొమ్మల జంట మన్మథుని (ప్రేమ దేవుడు) విల్లు వలె అందంగా ఉంది.

 * ఆమె సూక్ష్మమైన విల్లును పట్టుకుని, మధ్య భాగాన్ని గురిగా చూపిస్తుంది.

 * ఆమె శరీరాన్ని శివుని కళలు తాకడం వల్ల ఒక రకమైన మైమరపు కలిగించే దాహం కలుగుతుంది.

 * ప్రేమను పొందిన ఆ తల్లి నీలకంఠుని (శివుని) అర్ధభాగమైన పార్వతి దేవి... సౌందర్య లహరీ.. 47

ఈ పద్యం అమ్మవారి సౌందర్యాన్ని, శక్తిని మరియు శివునితో ఆమెకున్న అవినాభావ సంబంధాన్ని వర్ణిస్తోంది.

మేఘ జలం సమానము సమోన్నతి యేదియు లేదులేదులే 

ఆఘమ నాత్మ మించినది యన్నది యేదియు లేదులేదులే 

డేగ గ చూపు కాంతిగను మించిన దేదియు లేడు లేదులే 

మాఘమనేదియన్నము మానస తృప్తికి అన్న పూర్ణగన్


 *వర్షపు నీటికి సమానమైన పవిత్రమైనది, గొప్పది మరొకటి లేదు. ప్రకృతి ప్రసాదించిన ఈ జలం జీవకోటికి ఆధారం. పాపపు ఆలోచనల కంటే మించిన చెడు మరొకటి లేదు. మనసులోని కల్మషమే అన్ని అనర్థాలకు మూలం. డేగ చూపు ఎంత తీక్షణంగా ఉంటుందో, అంతకంటే గొప్ప కాంతివంతమైన దృష్టి మరొకటి లేదు. ఇది జ్ఞానానికి, స్పష్టతకు ప్రతీక. మాఘ మాసం అన్నంతో సమానమైనది, మనసుకు తృప్తినిచ్చే అన్నపూర్ణ వంటిది. ఈ మాసంలో చేసే దానాలు, పుణ్యకార్యాలు మానసిక శాంతిని కలిగిస్తాయి.

*****

సక్రమంవిద్యల తీరుగా కదలగన్ సాకార కామాక్షి గా

అప్రమేయమ్మగు సర్వదృష్టికళలున్ ఆనంద తీరేయగున్

వక్ర కేశంబులు చెంచలాకనులుగన్ వాశ్చల్య చూపేలు టే 

చక్ర వక్షోకళ సుందరేశ్వరుని ఆజన్మమ్ము అక్కర్షితా 


క్రమబద్ధమైన విద్యల వలె కదులుతూ, సాక్షాత్తు కామాక్షిగా భాసిల్లుతోంది. ఆమె యొక్క అపరిమితమైన మరియు సమస్త దృష్టి కళలు ఆనందాన్ని కలిగిస్తాయి.

ఆమె వంకరైన కురులు మరియు చంచలమైన కన్నులు కలిగి,ప్రేమతో కూడిన చూపులను ప్రసరింపజేస్తుంది. అందమైన రొమ్ములతో, సుందరేశ్వరుని (శివుని) నిరంతరం ఆకర్షిస్తుంది.

***

కామకోటిపీఠసారసా కధాపరమ్ముశక్తిగన్ 

శోమయుక్తితత్త్వమున్ వినాశకాలమేయగున్ సుధీ 

ప్రేమ భక్తి మార్గమేపతీప్రియాసుఖమ్ముగాయగున్

నామమౌనుపుణ్యమూర్తిగా నమోశివాయసేవగన్ 


 * : కామకోటి పీఠంలోని ముఖ్యమైన కథల ద్వారా శక్తివంతమైన జ్ఞానం లభిస్తుంది.ఓ తెలివైనవాడా! జ్ఞానం మరియు యుక్తి లేకపోతే, అది వినాశనానికి సమయం అవుతుంది. ప్రేమ మరియు భక్తి మార్గమే భర్తకు ప్రియమైన సుఖాన్ని కలిగిస్తుంది. ఇక్కడ 'పతిప్రియ' అంటే భర్తకు ప్రియమైనది అని అర్థం కావచ్చు, లేదా భగవంతునికి ప్రియమైనది అని కూడా భావించవచ్చు.

  పుణ్యమూర్తి అయిన శివుని నామమైన 'నమో శివాయ' యొక్క సేవతో సమానం.

సౌందర్యలహరీ.. 75

ప్రత్యక్షా సమదృష్టిగాయనుగ్రహం ప్రాబల్య యాత్మాప్రభా 

సత్యాసాహితిగానుదర్శనముగన్ సామర్థ్య పుణ్యమ్ముగన్

నిత్యాశాంతిసుఖమ్ముగావిధిగనున్ నిర్వాహ కావ్యమ్ము గన్ 

వ్యత్యాసమ్మగుజీవయాత్రలుగనున్ వాశ్చల్య కామాక్షిగన్


 అమ్మా నీ దయ అందరినీ సమానంగా చూస్తూ,నీ ప్రభావం ఆత్మ యొక్క తేజస్సు వలె ప్రకాశిస్తూ.

  సత్యమైన సాహిత్యంగా మాకు దర్శనమిస్తావు (జ్ఞానాన్ని ప్రసాదిస్తావు).

: నీవు సామర్థ్యంతో కూడిన పుణ్యమవుతావు (మంచి ఫలితాలు) నీవు శాశ్వతమైన శాంతి మరియు సుఖాన్ని విధిగా అనుగ్రహిస్తూ,  ఈ ప్రపంచాన్ని నడిపించే ఒక కావ్యం వలె ఉన్నావు. జీవుల యొక్క వేర్వేరు జీవిత ప్రయాణాలను నీవు గమనిస్తావు (వాత్సల్యంతో చూస్తావు).: ఓ ప్రేమగల కామాక్షీ దేవి! మీకు మా వందనాలు 


మల్లాప్రగడ రామకృష్ణ 

6281199539

చిరునవ్వే శుభ చిహ్నమేయగుటయున్ చిత్తమ్ము హృద్యమ్ముగన్ 

తరుణమ్మే సహనమ్ముగాను కళగన్ తత్త్వమ్ము నేస్తమ్ముగన్ 

కరుణాస్వల్పము సర్వసమ్మతమగున్ కార్యమ్ము ప్రేమమ్ముగన్ 

శరణమ్ముల్ పలుకీర్తివిద్యలగుటన్ సామర్థ్య కామాక్షిగన్


పద్యం యొక్క భావం క్లుప్తంగా:

 * అమ్మా నీ చిరునవ్వే శుభానికి సూచన. నీ మనస్సు హృదయాన్ని ఆహ్లాదపరుస్తూ, నీ యవ్వనమే సహనానికి నిలయం, కళలకు నిధిగా,:తత్వమే నీకు స్నేహితుడు (అంటే నీవు తత్వజ్ఞానివి),  నీ స్వల్పమైన కరుణ కూడా అందరికీ ఆమోదయోగ్యమై, నీ ప్రతి పని ప్రేమతో నిండగా, నీ శరణు పొందడం అనేక కీర్తిదాయకమైన విద్యలను పొందినట్లు, ఓ సామర్థ్యవంతురాలైన కామాక్షీ!

మీకు వందనాలు


మల్లాప్రగడ రామకృష్ణ 

6281190539

శా..ఆదిన్ స్త్రీ గను కొప్పుపై తనువుపై అంశోత్త రీయంబుపై 

పాదాబ్జoబులపైప్రభావమెరుపున్ పాలిండ్లపై నూత్న మ

ర్యా దన్ చెందు కరంబులే మలుపునిర్వాహమ్ము మోహమ్ము మేల్

గాదే సర్వము ప్రేమకన్నులు కళాకాయంబు కామాక్షి గన్


 మొదట స్త్రీ రూపంలో ఉన్న నిన్ను, నీ కొప్పుపై, నీ శరీరంపై, ఉత్తరీయంపై, నీ పాదపద్మాలపై ప్రకాశించే మెరుపును, నీ స్తనాలపై కొత్త శోభతో ప్రకాశించే చేతులే సృష్టి యొక్క నిర్వహణను త్రిప్పుతాయి. అంతా మోహము యొక్క మేలుకొలుపు కాదా?

 ప్రేమతో నిండిన కన్నులు కలిగిన, కళలకు నిలయమైన ఓ కామాక్షీ!మీకు మా వందనాలు


మల్లాప్రగడ రామకృష్ణ 

6281190539

 మదికిలభించుశాంతమగు మార్గము భాగ్యవసంత భారతీ

పదిలములేనియుద్ధమిదిపాశము వృత్తవిధాన భార్గవీ

బెదరని ధైర్యఆదురత బింకము లేనిది శాంతి శాంభవీ

కుదరనికష్టసౌఖ్యమదికూడు లభించును సత్య మీశ్వరీ


ఓ భాగ్యవసంత భారతీ, మనసుకు శాంతి లభించే మార్గం గురించి చెబుతూ, ఓ భార్గవీ, ఇది ఒక వృత్త పాశ యుద్ధం లాంటిది, ఒక ఉచ్చు వంటిది అని అంటూ,  ఓ శాంభవీ, భయపడని ధైర్యం, తొందరపాటు లేనిది నిజమైన శాంతి అని వివరిస్తూ, 

ఓ ఈశ్వరీ, కష్టాలు, సుఖాలు శాశ్వతం కావు, నిజాయితీతో ఉంటే ఆహారం లభిస్తుంది అని అంటున్నారు. అమ్మలుగన్నమ్మ కు వందనాలు

*****

మల్లాప్రగడ రామకృష్ణ 

6281199539

Friday, 9 May 2025


*10-May-25, ప్రాంజలి ప్రభ

*సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం*

  

*ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది. వివేకానందుడు సన్యసించారు, కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు.భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకుని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు.*

వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడనారంభించాడు. అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏ పనీ చేయకుండా, సోమరిలా తిరుగుతూ, ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ, ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని. ఇటువంటి భావం కలిగి  స్వామీజీతో అతడిలా అన్నాడు.

ఓ స్వామీ! చూడు చూడు నేనెంత మంచి భోజనం చేస్తున్నానో, నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్ళు ఉన్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా...? ఏ సంపాదనా లేకుండా దేవుడు,దేవుడూ అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా... ఆకలి బడలిక తప్ప..!” అని దెప్పి పొడవటం మెుదలుపెట్టాడు.* 

*స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.*

*అప్పుడు ఒక అద్బుతం జరిగింది ...*

*ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు, *మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల   శ్రీ రామ చంద్రమూర్తి అనుగ్రహం. దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి!" అని ప్రాధేయపడ్డాడు.*

*స్వామీజీ “ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే.. పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు!” అని అంటూ ఉంటే,  ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ నేను కలలో చూసింది మిమ్మల్నే..!”*

*”శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా.. లే.. లేచి అతనికి భోజనం పెట్టు!  అని ఆజ్ఞాపించారండి. ఆహా.. ఏమి నాభాగ్యం మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరచిపోలేరు.”*

*”నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు.* 

*స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది.     ఏ అభయ హస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో. అదే అభయ హస్తమిది.*

*ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామి వారి పాదాలపైపడి, కన్నీటి ధారాలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు. సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయింది. నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే అని తెలుసుకున్నాడు.*

*తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. యోగులు హృదయాలలో సదా నివసిస్తుంటాడు ఆ పరమాత్మ.*

*ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే, ఇంతకు మించినవి, ఎంతో ఆశ్చర్యం కలుగజేసేవి, భగవంతుని పట్ల, యోగుల పట్ల సడలని విశ్వాసం కలుగజేసేవి మరెన్నో...!*

*అందరికీ తెలిసేలా మన భారతీయ ధర్మాన్ని వ్యాప్తిచెయ్యాలి.*

_-[స్వామి_వివేకానంద జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన..]-_

🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*సర్వేజనా సుఖినోభవంతు*

*లోకా సమస్త సుఖినోభవంతు*

 *శుభం భూయాత్*

*ఓం శాంతి శాంతి శాంతిః*

*స్వస్తి*

*****

 అనిమిత్త భయం

మహాభారత ఇతిహాసం ఒక శునకం కథతో ప్రారంభమవుతుంది! కుక్క అంటే అది సామాన్యమైన కుక్క కాదు... మాట్లాడే ఆడ కుక్క.. దేవతల కుక్క... పేరు సరమ కోసం పనికిరాదని, నియమనిష్టలతో యాగాలు చేసిన వారికంటే కోపం లేనివాడే ఘనుడని చెప్పే కథ ఇది. ఎదుటివాళ్లు కానిమాటలు మాట్లాడినా పట్టించుకొనకపోవడం, ప్రతీకారానికి పూనుకోకపోవడం బుద్ధిమంతుల లక్షణం' అని హితం ఉపదేశించే దివ్యగాథ సరమది. స్నేహంతో ఉన్నవారిని ఆకారణంగా తూలనాడేవారికి సమీపంలో ఉండరాదని సలహా ఇస్తున్నది సరమ చరిత్ర. బలహీనులపట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఎప్పటికైనా ఆ పాపం కట్టి

కుడుపుతుందని వ్యాసమహర్షి భారతం ప్రారంభంలోనే హెచ్చరించాడు. భయాలు రెండు విధాలు... నిమిత్త భయం, అనిమిత్త భయం. కొన్ని భయాలకు కారణం ఉంటుంది. కొన్నింటికి ఉండదు. నిరపరాదులను బాధిస్తే, ఏ సూచన లేకుండానే భయాలు కలుగుతాయి. మనుషుల మధ్య ఏదో ఒక కారణంతో శత్రుత్వం కలుగుతుంది. జంతువులకు పుట్టుకతోనే వైరం ఉంటుంది.

ఎలుకకు పిల్లిని చూస్తే భయం పిల్లికి కుక్కను చూస్తే భీతి పాములు, పులులను చూస్తే మనిషికి భయం! మనిషిని చూస్తే ప్రాణులన్నింటికీ భయమే! చివరికి సాటి మనిషిని చూసి మనిషే భయపడు తున్నాడు. బలహీనులను చూసి ఎవరూ భయపడరు. కానీ, బలహీనుల పట్ల అమానుషంగా ప్రవర్తించేవారికి అనిమిత్త భయం కలగక తప్పుడు. దీనికి విరుద్ధ స్థితిలో కలిగేవి నిమిత్తభయాలు.

అంతర్యామి చెప్పే సందర్భం గా

సరమ సంగతి రుగ్వేదంలోన వరాహపురాణంలోను కనిపిస్తుంది. నిరుక్తకారులు 'మాధ్యమిక వాణి'గా సరమను పేర్కొంటారు. దీని అర్ధం 'మేఘగర్జన'. వర్షాలు లేక బాధపడే ప్రజలు హఠాత్తుగా మేఘగర్జన విన్నప్పుడు ఆశ్చర్యపడే దృశ్యాన్ని గురించి వేదంలో ఈ పదం ఉంది. వరాహపురాణంలో సరమ పాత్ర ప్రవేశిస్తుంది. దేవతల గోవులకు కాపలా కాస్తూ ఉంటుంది. రాక్షసులు సమయం ఆ గోవులను కాజేశారు. దేవతలు ఇంద్రుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఇంద్రుడు గోవులకు కాపలాగా ఉన్న సరమను పిలిచి ప్రశ్నించాడు. సమ నాకు తెలియదు' అని అబద్ధం చెప్పింది. సరమ రాక్షసుల వద్ద లంచం తీసుకొని ఆవులను అసురులకు ఇచ్చింది. ఇంద్రుడు కోపించి సరమను కొట్టాడు. దానితో సరమకు బుద్ధి వచ్చి జరిగింది చెప్పింది. 'అయితే నువ్వే వెళ్ళి గోవులను తీసుకొని రా!' అని ఇంద్రుడు ఆజ్ఞాపించాడు. 'మరి నేను వెళ్లిపోతే నా పిల్లలకు పాలు ఎలా? దయతో వాటికి అవ్వ పాలను ఇప్పించు!" అని సరమ ప్రార్ధించగా ఇంద్రుడు అంగీకరించాడు.

ఇక భారతంలో సరమ కథ జనమేజయుడు కురుక్షేత్రంలో దీర్ఘసత్రయాగం ప్రారంభించాడు. ఆ సమయంలో సరమ కుమారుడు ఆడుకుంటూ ఆ యాగ ప్రాంతానికి వెళ్ళాడు. జనమేజయుడి తమ్ముళ్లు పసివాడని చూడకుండా సరమ కొడుకును కొట్టి హింసించారు. ఈ సంగతి సరమకు తెలిసింది. 'అభంశుభం తెలియని పసిబిడ్డ అయిన నా ముద్దుల కొడుకును అనవసరంగా నీ తమ్ముళు కొట్టి హింసించారు. పేదవారిని, సాధువులను, బలహీనులను హింసించేవారికి అనిమిత్త భయాలు కలుగుగాక!' అని శపించి సరమ అదృశ్యం అయింది. దీన్ని భారత నీతిగా మనం గ్రహించవచ్చు:

****

 

*09-May-25,
*ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు. ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.

ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది.

బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.

తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరేనన్నాడు.

ఆ ఘడియ రానే వచ్చింది. బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.

ఆశ్చర్యం ......! దాని నుండి నిధి ఒక బయటపడింది. వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి. అవన్నీ అతడి సొంతమయ్యాయి. మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు.

కానీ, ఒక సందేహం అతడిని పీడించింది. నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.
దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది! అని దేవుణ్ణి ప్రశ్నించాడు.
అతడికి దేవుడు సమాధానం చెబుతూ, "నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది.”

అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి!” అన్నాడు దేవుడు.

*వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి, గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి. తప్పక అంతర్ముఖుడు కావాలి!*

🔸♦️🔹

Thursday, 8 May 2025


ధృతి: క్షమా దమోsస్తేయం శౌచమింద్రియనిగ్రహ:

ధీర్విద్యా సత్యమక్రోధ: దశకం ధర్మ లక్షణమ్   

 

1. ధైర్యం  2. సహనం , 3. మనో నిగ్రహం 

1. దొంగతనంచేయకపోవడం , 5. శుచిగా ఉండడం , 6. ఇంద్రియనిగ్రహం, 7. బుద్ధిబలం , 8. విద్య , 9. సత్యం , 10. క్రోధం లేకపోవడం అనే ఈ పది ధర్మం యొక్క లక్షణాలు .

*****

 నేటి జీవిత సత్యం. ప్రాంజలి.. ప్రభ. 3

మానవ జీవితంలో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, మనుషుల మధ్య సంబంధాలు... వీటిలో కూడా మంచి చెడులు ఉంటాయి. మన జీవితంలో మంచి తక్కువ పాళ్ళలో, చెడు ఎక్కువ పాళ్ళలో ఉంటే... ఎక్కడో ఏదో అవరోధం ఉందని అర్థం చేసుకోవాలి. కొందరు జీవితాన్ని సుఖప్రదంగా గడుపుతూ ఉంటే... అది చూసి ‘మనం కూడా అలా ఎందుకు ఉండకూడదు?’ అనిపిస్తుంది. నిజంగా వారేదో శక్తిని వినియోగించడం వల్లే... వారికి అంతా మంచి జరుగుతోందనేది అపోహ కాదు.

ఆనందాన్ని పొందడానికి వారు ‘ప్రేమ’ అనే శక్తిని వినియోగిస్తూ ఉండొచ్చు. ఆ ప్రేమ శక్తితో అన్నీ మంచి విషయాలే జరుగుతాయి. పూర్వకాలానికి చెందిన ఎందరో ధర్మ గురువులు, మహనీయులు, దార్శనికులు...  ప్రతి ధర్మంలోను ప్రేమకు సముచితమైన స్థానం ఇచ్చారు. తమ తమ యుగ ధర్మాలను అనుసరించి, తాము జీవించిన కాలంలోని మానవుల స్వభావాలను, సంస్కారాలను దృష్టిలో ఉంచుకొని వారు ఆ సందేశాలు ఇచ్చారనేది నిజం.

వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకోగలిగితే... ప్రేమ అన్నిటినీ మించిన పరమశక్తి. అది ప్రేమ సాగరుడైన పరమాత్మ తాలూకు పవిత్ర శక్తి. మనం ప్రేమను పంచినప్పుడు... ఆ పరంధామంలో ఉన్న భగవంతుడి ప్రేమను వినియోగించుకుంటున్నామని గుర్తుంచుకోవాలి. ‘ప్రేమ’ అంటే మన పరివారాన్నీ, స్నేహితులనూ, ప్రియమైన వస్తువులనూ ఇష్టపడడం కాదు. మన జీవితంలో ఎదురయ్యే శక్తులు ఏవైనా అవి ప్రేమ నుంచి ఉద్భవించినవేనని గ్రహించాలి. మనల్ని ప్రభావితం చేసే ఈ శక్తి మనలోనే... మన ఆత్మలోనే ఉంది. 

మరి అలాంటి గొప్ప శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండాలి కదా! కానీ మీరు కోరుకుంటున్నవి మీ దగ్గర ఎందుకు లేవు? మీరు అనుకున్న పని ఎందుకు చేయలేకపోతున్నారు? సుఖ సంతోషాలు ఎందుకు లేవు?

మానవ హృదయంలోని ప్రేమ శక్తి వల్లే ప్రకృతి పులకిస్తుంది. పరిశోధనలు, ఆవిష్కరణలతో సృష్టి సుసంపన్నమైన ప్రగతిపథాన నడుస్తుంది. . సృష్టి నలువైపులా పరిశీలిస్తే... మనిషి తయారు చేసిన వస్తువులే కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కనిపించని ప్రేమ శక్తితోనే సాధ్యమయ్యాయి. ‘‘ఒకవేళ మన నుంచి ప్రేమను తొలగించుకుంటే... ఈ భూమి శ్మశానం అవుతుంది’ అని రాబర్ట్‌ బ్రౌనింగ్‌ అనే కవి అన్నారు. మానవుల్లో శాశ్వతంగా నిలిచి ఉండే ప్రేమే ఈ లోకానికి ఆలంబన.

ప్రేమ శక్తే మనల్ని నడిపిస్తుంది. చెడ్డ విషయాల వల్ల, సమస్యల వల్ల మనలో ప్రేమ లోపిస్తుంది. చాలామందికి ప్రేమ అంటే ఏమిటనే దానిపై అర్థవంతమైన అవగాహన లేదు. ఎందుకంటే... ప్రేమ అనేది ప్రపంచంలో అన్నిటికన్నా శక్తిమంతమైనది మాత్రమే కాదు, గుర్తించలేనిది కూడా. కంటికి కనిపించని ఈ మహిమాన్విత శక్తిని  గుర్తించాలంటే... మొదట జ్ఞానసాగరుడైన పరమాత్మను గుర్తించాలి. ప్రేమమయమైన ఆయన సృష్టిని అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రేమను అర్థం చేసుకోగలం. ఆయన సృష్టించిన ఈ జీవన రంగస్థలంలో పరమానందంతో అభినయిస్తూ జీవించగలం.

***--

*కైలాస నగరం -3*
🔱

రచన: శ్యాంబాబు

ఒక్క నిమిషం చెప్పడం ఆపి, కాలిపోయిన సిగరెట్ ని  ఫైర్ ప్లేస్ లోకి విసిరేసి మరోటి వెలిగించాడు గాడ్సన్.

నేను మెల్లిగా కొద్దిగా బ్రాందీని చప్పరించాను.

“అవును. మౌంట్ ఎవరెస్ట్ కన్నా ఎత్తయిన శిఖరం వుందని ఎవరెస్ట్ కనుగొనబడిన దగ్గర్నుంచీ అనేక వాదోపవాదాలు చాలా జరిగాయి. కాని ఆ విషయం ఇధమిద్దంగా ఇంతవరకూ తేలలేదు. నిజానికి చైనీయులు ఆ శిఖరాన్ని కనుగొన్నారనీ, అయితే చైర్మన్ మావో వందవ జన్మదిన కానుకగా ఆ శిఖరాన్ని సమర్పించి దానికా పేరు పెట్టడానికి ఆ విషయం దాస్తున్నారనీ కూడా కొందరు అంటున్నారు" అన్నాను నేను. ఎవరెస్టు కాంట్రవర్సీ గురించి నాకు తెలిసిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొంటూ.

"యస్! యు ఆర్ రైట్! ఆ విషయం కూడా తెలిసింది. నాకు ! దాదాపు ఆర్నెల్లక్రితం భారతదేశం, పాకిస్తాన్, ఇంగ్లండ్ లో వున్న పెద్ద వార్తాపత్రిక లన్నిటిలోనూ ఓ ప్రకటన చేశాను నేను. హిమాలయ పర్వశ శ్రేణుల గురించి, షాంగ్రీలా గురించి కొత్త ఇన్ఫర్ మేషన్ ఇవ్వగలిగిన వాళ్ళకు తగిన బహుమతి ఉంటుందని ప్రకటించాను.

నా ప్రకటనకు జవాబుగా అనేకమంది దగ్గర్నుండి అనేక ఉత్తరాలు, సమాచారం అందింది నాకు. అయితే వాటిలోఇదివరకు నా దగ్గర లేని కొత్త విషయాలు ఏమీలేవు.

అయితే దాదాపు నెలరోజులక్రితం డెట్రాయిట్ లో నా నివాసానికి కెయిత్ ముల్లరీ అనే అతను వచ్చాడు. ముల్లరీ ఇంగ్లండు దేశస్థుడు. కెయిత్ తాతగారు జాన్ ముల్లర్ బ్రిటిష్ ఇండియాలో సర్వేయర్ గా పని చేశాడు" అని ఆగాడు గాడ్సన్ నావైపు దీర్ఘంగా చూస్తూ..

జాన్ ముల్లరీ అనే పేరు వినగానే నా మెదడులో ఏ మూలో అలారం బెల్ మ్రోగ సాగింది. ఎక్కడో విన్న పేరది.

మనసంతా కేంద్రీకరించి ఆలోచించాను. ఎస్. ఇప్పుడు తట్టింది. మా తాతగారు పండిట్ విక్రందేవ్, జాన్ ముల్లరీలు అప్పట్లో సర్వే ఆఫ్ ఇండియా సంస్థలో ఉద్యోగులు. వందేళ్ళ క్రితం హిమాలయాల స్వరూపాన్ని గురించి ఇంకా లోకానికి అంతగా తెలియనప్పుడు వీళ్ళిద్దరూ నేపాల్ ప్రాంతమంతా తిరిగి ఒక మాప్ తయారు చేసినట్లు నాన్నగారు అప్పుడప్పుడూ చెప్పేవారు.

గాడ్సన్ చిన్నగా నవ్వాడు.

“నేను చెబుతున్న విషయంలోని లింక్ అర్థమవుతూ ఉండాలి నీకు” అన్నాడు.

అవునన్నట్లు తలూపాను. "కాని స్పష్టంగా ఏమీ తెలియడంలేదు.” అన్నాను.

“చెపుతాను. 1868 ప్రాంతంలో నేపాల్, సిక్కిం ప్రాంతాలలోని హిమాలయ పర్వత శ్రేణులను సర్వేచేసి మాప్ లు తయారు చేసిన ఇద్దరు ప్రముఖులు విక్రందేవ్, జాన్ ముల్లరీలు. అయితే ఆ సమయంలోనే వారిద్దరూ అదృష్టవశాత్తు ‘షాంగ్రీలా'ను చేరుకోవడానికి దారి కనుక్కొన్నారు."

"వాట్? అన్ బిలీవబుల్" అన్నాను ఆశ్చర్యంగా.

“నేనూ మొదట అలాగే అనుకొన్నాను. కాని కెయిత్ ముల్లరీ నాకు చూపెట్టిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసిం తరువాత నమ్మక తప్పలేదు అన్నాడు గాడ్సన్ లేచి బార్ దగ్గరికి వెళ్ళి తన గ్లాసు నింపుకుంటూ.

"ఏమిటా డాక్యుమెంటరీ ఎవిడెన్స్?" అడిగాను.

“నీకు నిజంగా తెలియక అడుగుతున్నావా విశాల్ ?” అన్నాడు గాడ్సన్ తిరిగివచ్చి తన చైర్ లో కూర్చొంటూ.

"హానెస్టు టుగాడ్! నాకు ఏమీ తెలియదు" అన్నాను నేను గాడ్సన్ ప్రశ్న అర్థంకాక....

“ఓకె. ఐ హావ్ నతింగ్ టు లూజ్! చెబుతాను విను. విక్రందేవ్, జాన్ లు బౌద్ధ లామాల వేషంలో నేపాల్ సిక్కిం ప్రాంత మంతా పర్యటిస్తూ సర్వే చేశారు. ఆ పర్వతాల్లో వారు సంచరిస్తున్నసందర్భంలో  అదృష్టవశాత్తు 'షాంగ్రీలా'కు వాళ్ళిద్దరూ దారి కనుక్కోవడం జరిగింది. అనుకోని విధంగా ఈ షాంగ్రీలా ఎవరెస్టుకన్నా ఎత్తయిన శిఖరం చుట్టూ వుందని తెలిసింది.

ఈ పర్వత ప్రాంతమంతా, సరిగ్గా చెప్పాలంటే ఈ షాంగ్రీలా శిఖరం బంగారు, వెండి లోహాల సమ్మేళనంతో ఏర్పడిందనీ, దాన్ని చేరుకోవడం వందేళ్ళ కొకసాకే సాధ్యపడుతుందనీ జాన్ ముల్లరీ తన కొడుకుకి, అంటే కెయిత్ ముల్లరీ తండ్రికి వ్రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు.”

"ఉత్తరమా?" అన్నాను నేను ఆశ్చర్యంగా.

"ఐయామ్ సారీ! విషయం పూర్తిగా చెప్పలేదు నేను" అని విస్కీ మరో గుటక వేసి “మొదట విక్రందేవ్, జాన్ లు షాంగ్రీలా ను కనుగొన్నప్పుడు వారికి నిజమైన 'షాంగ్రీలా' చూసే అవకాశం లేకపోయింది. జాన్ ముల్లరీ ఉత్తరాన్నిబట్టి నేను తెలుసు కున్నదేమిటంటే షాంగ్రీలా శిఖరం చుట్టూ అంతులేని పెద్ద అఘాతం ఉందనీ, ఆ అఘాతం వందేళ్ళ కొకసారి పూడిపోయి షాంగ్రీలాకు దారి ఏర్పడుతుందనీను. ఆ వివరాలన్నీ ఆ ఉత్తరం చదివినప్పుడు నీకు అర్థమవుతాయి.

అంచేత వారిద్దరూ షాంగ్రీలావరకూ చేరుకో గలిగారుగాని, షాంగ్రీలాను మాత్రం చేరుకో లేకపోయారు. అయితే ఇండియాకు తిరిగొచ్చేముందు వారిద్దరూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. అదేమంటే మళ్ళీ మరో వందేళ్ళకు, అంటే ఈ సంవత్సరం చివరికి సరిగ్గా వందేళ్ళు పూర్తవుతాయి- మళ్ళీ షాంగ్రీలాకు దారి ఏర్పడుతుందనీ, కాబట్టి ఆ రహస్యాన్ని అంతవరకూ దాచి, తమ తర్వాత తరాల వారికే ఆ శిఖరాన్ని కనుక్కొన్న కీర్తి దక్కాలనీ వారు నిశ్చయించుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారంగా 'షాంగ్రీలా' చేరుకొనే దారి చూపించే మాప్ ఒకదాన్ని తయారు చేశారు.

భద్రతకోసం ఆ మాప్ ని మధ్యకు రెండు ముక్కలుచేసి, ఓ సగం విక్రందేవ్, మరో సగం జాన్ ముల్లర్ తీసుకొన్నారు. అంటే భవిష్యత్తులో తిరిగి ఆ రెండు కుటుంబాల వారు మాత్రమే కలిసి ఆ శిఖరాన్ని చేరుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం అన్నమాట. అంటే ఆ మాప్ రెండు ముక్కలూ కలిపితే తప్ప షాంగ్రీలా చేరుకొనేమార్గం ఎవ్వరికీ తెలియదన్నమాట.

జాన్ ముల్లర్ ఈ మాప్ ని, మరికొన్ని వివరాలున్న ఓ ఉత్తరాన్ని తన కొడుకు కెయిత్ ముల్లరికి అందజేశాడు. అయితే కెయిత్ ముల్లరీ తన తాతగారి ఆశయాలకి అనుగుణంగా పెరగలేదు. కెయిత్ ముల్లరీ కి, అటు సరైన విద్యగానీ, పర్వతారోహణ లో శిక్షణ గాని లేవు. వాటి మీద అతనికి ఇంట్రస్టూ లేదు. దానికి తోడు ఆస్తి కూడా ఏమీ లేకపోవడంతో జులాయిగా తయార య్యాడు. అతను హెరాయిన్, ఎల్, యస్. డి. లాటి మత్తుపదార్థాలకు కూడా బాగా అలవాటుపడ్డాడని కూడా నాఅనుమానం.

ఏమైతేనేం అతి దీనదశలో ఉన్న కెయిత్ ముల్లరీ అతి హీనదశలో ఉన్నప్పుడు ఇంగ్లండు పత్రికల్లో వెలువడిన నా ప్రకటన చూడడం జరిగింది. వెంటనే అతను నన్ను కలుసుకొన్నాడు. ఆ పత్రాలకు ఎంతో కొంత ముట్టకపోతుందా అనే ఉద్దేశ్యంతో.

కెయిత్ ఇచ్చిన పత్రాలు చదవగానే ముందు నాకు ఆశ్చర్యం, తర్వాత ఎంతో ఉత్సాహం కలిగాయి. పదివేల డాలర్లకు ఆ రెండు పత్రాలనూ తన దగ్గర్నుండి కొన్నాను నేను. నిజంగా 'షాంగ్రీలా' ఉంటే దాన్ని
ఎలాగైనా కనుక్కోవాలి అనే నిశ్చయం నాలో ధృఢపడింది. వెంటనే బైలుదేరి ఇండియా వచ్చాను.

బహుశా నేను ఇండియాకి ఎందుకు వచ్చానో ఇప్పటికి నీకు ఆర్థమై వుంటుంది. ముల్లరీ నాకు అమ్మిన మాప్ రెండవ భాగం నీ దగ్గరుంది. పండిత్ విక్రందేవ్ కి ఉన్న ఒకే ఒక్క మనవడివి నువ్వు, సో ..తప్పకుండా ఆ మాప్ మీ తాతగారు నీకు అందచేసి ఉండాలి. అందుకే నిన్ను వెతుక్కొంటూ ఇండియా వచ్చాను" అన్నాడు గాడ్సన్ విశాల్ వైపు ప్రశ్నార్థకంగా చూసి.

నేను బ్రాందీ గ్లాసులో మిగిలిన ద్రవ్యాన్ని గొంతులో పోసుకొని తల అడ్డంగా ఊపాను.

“సారీ ఫ్రెండ్! నా దగ్గర అలాంటి మాప్ లు గాని, ఉత్తరాలుగాని ఏమీలేవు. నిజంగా అలాంటి ఋజువేమైనా ఉంటే, ఎవరెస్టు కన్నా ఎత్తయిన శిఖరాన్ని కనుక్కోవడానికి ఆ సగం మాప్ తోనే నేను బయలుదేరి ఉండేవాణ్ని. పైగా మా తాతగారు నేను పుట్టకముందే పోయారు.. మా నాన్న నాలాగే పర్వతారోహకుడు. కాంచనగంగ శిబిరాన్ని ఎక్కిన మొదటి బృందం సభ్యుడాయన. నిజంగా అలాంటి మాప్ ఉండిఉంటే షాంగ్రీలాను కనుక్కోడానికి ఆయనే ప్రయత్నించి ఉండేవాడు. లేదా కనీసం నాకన్నా అందజేసి ఉండేవారు!" అన్నాను.

"మే బి యు ఆర్ స్పీకింగ్ ది ట్రూత్! కాని మీ నాన్నగారు ఓ ప్లేన్ యాక్సిడెంట్ లో పోయారని విన్నాను. తను అంత త్వరగా చనిపోతానని ఆయన అనుకొని ఉండరు. పైగా....మీ నాన్నగారు చనిపోయేప్పటికి నీ వయస్సెంత?" అడిగాడు గాడ్సన్.

"పదిహేను.”

“అప్పటికి మౌంటెనీరింగ్ నేర్చుకుంటున్నా ను" అన్నాను అతని ప్రశ్న అర్థంకాక.

"యుసీ మై పాయింట్ ? బహుశా నీవు మౌంటెనీరింగ్ లోనూ రాక్ క్లెయింబింగ్ లోనూ పూర్తి నిష్ణాతుడవయ్యేవరకూ నీ ఫాదర్ ఆ విష యం చెప్పదలచుకోలేదను కొందాం. ఈలోగా ఈ యాక్సిడెంట్ లో ఆయన పోయారు. బహుశా ఆ ఉత్తరాలు, మాప్ మీ ఇంట్లో ఉండి ఉండాలి" అన్నాడు గాడ్సన్ నావైపు రెప్పచెయ్యకుండా దీక్షగా చూస్తూ.

రాత్రి జరిగిన సంఘటనలు నా కళ్ళ ముందు ఒక్కసారిగా గిర్రున తిరిగాయి. బహుశా గాడ్సన్ నిజమే చెపుతూ ఉండాలి.

“ఇంతకూ రాత్రి నా ఇంట్లో జొరబడి బిమాన్ను హత్య చేసింది ఎవరు..? అని అడిగాను.
🗻
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆**ప్రాంజలి ప్రభ*

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 6281190539*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*టామ్ సాయర్ - 3*
🧑‍🌾

రచన : మార్క్ ట్వేన్

అనువాదం :  నండూరి రామమోహన్ రావు

పడకగదీ, భోజనాలగదీ, చదువుకునే గదీ ఆయిన వెనక గదిలో కూర్చుని పూలు అల్లుతూ జోగుతున్న పోలీ పెద్దమ్మ ఎదుట టామ్ హాజరైనాడు. ఆవిడ ఒళ్లో పడుకుని నిద్రపోతున్న పిల్లి తప్ప ఆవిడకు వేరే తోడెవరూ లేరు. ఆవిడ కళ్ళజోడు తల మీదికి ఎగదోయబడి వున్నది. ఎప్పుడో పరారీ అయివుంటాడనుకున్న టామ్ తన ఎదట హాజరయేసరికి ఆమె ఆశ్చర్యపడింది.

"నేనిక వెళ్ళి ఆడుకోవచ్చా పెద్దమ్మా?" అని అడిగాడు టామ్.

"అప్పుడేనా ? పని ఎంతవరకయింది?"

"అంతా అయిపోయింది, పెద్దమ్మా."

"అబద్ధాలాడకు, టామ్- నాకు చిరాకేస్తుంది.”

"అబద్ధాలు కాదు, నిజంగా అంతా అయిపోయింది."

పెద్దమ్మకు ఇటువంటి సాక్ష్యంలో నమ్మకం లేక స్వయంగా చూడడానికి బైలుదేరింది. టామ్ చెప్పిన దానిలో అయిదో వంతు నిజంవున్నా ఆవిడ సంతోషించడానికి సిద్దంగానే వుంది. అటువంటప్పుడు చెక్కలగోడ యావత్తూ తెల్లగా రంగువేసి వుండడమే కాక ఒకటికి రెండు విడతలు రంగువేసి వుండడం చూసి ఆవిడకు నోట మాట రానంతపని అయింది.

"నా యిల్లు బంగారంగానూ! చూశావా, తలచుకుంటే నువ్వు పని చెయ్యగలవు కాని తలచుకోడమే వుండదు. పో, వెళ్ళి ఆడుకో, కాని అదేపోత పొయ్యేవు, వీపు చిట్లగొడతా" అన్నది పెద్దమ్మ.

వాడు చేసిన పనికి ఆవిడ పాపం ఎంతో సంతోషించి వాడికి మంచి ఆపిల్ పండు ఏరి ఇస్తూ బుద్ధిమంతులుగా ఉండి చెప్పిన మాట వినే పిల్లలు ఎట్లా బాగుపడతారో చిన్న ఉపన్యాసం ఇచ్చింది. ఈ సందడిలో టామ్ ఆవిడకు తెలియకుండా ఒక్క అప్పచ్చి చేతివాటు వేశాడు.

టామ్ బయటికి వస్తూ మేడమీదికి వెళ్ళే మెట్లెక్కుతున్న సిడ్ ని చూశాడు. తనకి కావలసినన్ని మట్టిబెడ్డలు అందుబాటులో వున్నాయి సిడ్ మీద విసరడానికి. టామ్ కి క్షణంకూడా పట్టలేదు. బిత్తరపోయిన పెద్దమ్మ కదిలివచ్చి సిడ్ ని రక్షించేలోపుగా సిడ్ కి ఆరేడు బెడ్డలు గురిగా తగిలాయి. టామ్ గోడదూకి పారిపోయినాడు. చెక్క గోడకు వాకిలి లేకపోలేదు. కాని టామ్ కి సామాన్యంగా దీన్ని ఉపయోగించే వ్యవధి వుండేదికాదు. చొక్కాకు కుట్టివున్న దారం నల్లదారమని బయటపెట్టినందుకు సిడ్ కి తగినశాస్తి అయింది. ఇప్పుడు టామ్ కి మనస్సు శాంతించింది.

టామ్ ఇంటిపక్క సందులో నుంచి పెద్దమ్మ ఆవులుండే పాక పక్కగా గ్రామం మధ్యకు వెళ్ళాడు. అక్కడ రెండు పిల్ల సేనలు యుద్ధానికిగాను చేరి వున్నాయి. అందులో ఒక సేనకు సేనానాయకుడు టామ్. రెండో సేనకు నాయకుడైన జోహార్పర్, టామ్ కి ప్రాణస్నేహితుడు. సేనానాయకులిద్దరూ యుద్ధంలో పాల్గొన్నారు. వారు ఎత్తున దిబ్బ మీద కూర్చుని తమ అంగరక్షకుల ద్వారా సైనికులకు ఆజ్ఞలిచ్చి యుద్ధం చేయిస్తారు. యుద్ధం చాలాసేపు తీవ్రంగా జరిగి చివరకు టామ్ బలాలు గెలిచాయి. యుద్ధంలో చచ్చిపోయినవారు లెక్కించబ డ్డారు. యుద్ధఖైదీలు వాపసు చేయబడ్డారు మరొక యుద్ధానికి షరతులుకూడా ఆమోదించబడ్డాయి. తరువాత రెండు సేనలూ రెండు పంక్తులుగా నిలబడి “మార్చ్” చేసుకుంటూ వెళ్ళిపోయారు. టామ్ ఒంటరిగా ఇంటిముఖం పట్టాడు.

జెఫ్ థాచర్ ఇంటిమీదుగా వస్తుండగా వాళ్ళ దొడ్లో టామ్ కి ఒక కొత్త అమ్మాయి కనిపించింది. నీలమైన కళ్ళు పెట్టుకుని అందంగా వుంది. బంగారు రంగు జుట్టు రెండు జడలు వేసుకుంది. తెల్లటి ఫ్రాక్ వేసుకుని, కుట్టుపనిచేసిన కుచ్చీలాగు తొడుక్కుంది. ఈమెను చూస్తూనే మన యోధుడు నిలువునా కూలినట్టయినాడు. అక్కడితో ఆమీ లారెన్స్ అనే ఒకానొక పిల్ల టామ్ హృదయంలో నుంచి ఒక్కసారిగా మాయమైపోయింది.

టామ్ ఈ కొత్త పిల్లను ఆరాధించసాగాడు, ఆమె తనను చూసేదాకా చాటుగా ఆమెను తాను చూడసాగాడు. ఆ తర్వాత ఆమెను చూడనట్టు నటిస్తూ, ఆమెని ఆకర్షించడా నికి రకరకాల పిల్లకొర్నాసి వేషాలు వేయ సాగాడు. ఏదో మొగ్గవేస్తూ టామ్ చూసే సరికి ఆ పిల్ల దొడ్లో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోవడం కంటబడింది. పాపం టామ్ విచారంతో కంచె దగ్గిరికివచ్చి నిలబడి, ఆ పిల్ల ఇంకా కొంచెంసేపు నిలబడుతుందని ఆశించాడు. ఆమె మెట్ల మీద ఒక క్షణం అగి గడప లోపలికి అడుగుపెట్టడం చూసి ఒక్క నిట్టూర్పు విడిచాడు. కాని ఆ మరుక్షణమే వాడి మొహం వికసించింది. ఎందుకంటే లోపలికి పోతూ ఆ పిల్ల బంతి పువ్వొకటి కంచె మీదుగా విసిరేసింది.

టామ్ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి నేల మీద పడివున్న పువ్వుకు ఒకటి రెండడుగు ల దూరాన ఆగి కళ్ళకి చెయ్యిపెట్టి దూరాన ఏదో వింత జరుగుతున్నట్టుగా వీధివెంట చూశాడు. తరువాత వెనకటి లాగే పిల్లి మొగ్గలు వేయసాగాడు. ఆయినా ఆ పిల్ల మళ్ళీ కనిపించలేదు ఆ పిల్ల ఏ కిటికీలో నుంచైనా తనను చూసి వుంటుందని టామ్ ఆశించాడు. చివరకు వాడు ఇంటికి వెళ్ళాడు.

రాత్రి అన్నం తింటున్నంతసేపూ వాడి ఉత్సాహం చూసి పెద్దమ్మ, "వీడికేం వచ్చింది!" అని ఆశ్చర్యపడింది! సిడ్ మీద బెడ్డలు వేసినందుకు బాగా చివాట్లుతిని కూడా టామ్ చలించలేదు. మీదు మిక్కిలి పెద్దమ్మ ఎదురుగానే పంచదార కాజెయ్య డానికి ప్రయత్నించి ముణుకులు విరగ గొట్టించుకున్నాడు.

"సిడ్ పంచదార తీసుకుంటే కొట్టవేం" అన్నాడు టామ్ పెద్దమ్మతో.

"అవును, సిడ్ నీలాగా కొరుక్కుతినడు. నే చూడనప్పుడల్లా నీ చెయ్యి పంచదార మీదికే పోతుంది" అన్నది పెద్దమ్మ.

కొద్దిసేపటికి పెద్దమ్మ వంటింట్లోకి వెళ్ళింది. సిడ్ ఎవరు ఏమి అంటారన్న భయం లేకుండా పంచదార పోసిన పింగాణిదొన్నె అందుకున్నాడు. కాని అది వాడి వేళ్ళ నుంచి జారి కిందపడి పగిలిపోయింది. టామ్ కి పరమానందమయింది. కాని వాడు కిక్కురుమనలేదు. పెద్దమ్మ వచ్చి, "ఈ పని ఎవరుచేశారు?" అని అడిగేదాకా టామ్ నోరు మెదపదలచలేదు.

పెద్దమ్మ తిరిగివచ్చింది. పగిలిన పంచదార దొన్నె చూసి కళ్ళజోడు మీదుగా నిప్పు రవ్వలు కురిపించింది. "ఇంకొక్కక్షణంలో అబ్బాయి. గారిపని" అని అనుకుంటున్నా డు. మరుక్షణం వాడే నేలమీద పడి ఉన్నాడు. పెద్దమ్మ మళ్ళీ రెండో దెబ్బ వెయ్యడానికి చెయ్యిఎత్తింది.

"నన్నెందుక్కొడతావ్? సిడ్ పగలగొట్టాడు" అని టామ్ ఆరిచాడు.

పోలీ పెద్దమ్మ నిశ్చేష్టురాలయింది. ఆవిడ నుంచి ఇక దయారసం ఒలుకుతుందని టామ్ అనుకున్నాడు. కాని ఆవిడ, "దెబ్బతింటే ఏంలే? నే చూడకుండా ఎన్ని వెధవపనులు చేశావో!" అన్నది.

అయినా ఆవిడ అంతరాత్మ బాధపడింది. జాలిగా ఏమన్నా అందామనుకున్నది గాని బెట్టు చెడిపోయి, టామ్ కి అలుసవుతుం దని సంకోచించింది. అందుచేత ఆవిడ పై కేమీ అనకుండా తనపనులు చూసుకో సాగింది.
🧑‍🌾
*ఇంకా ఉంది*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*ప్రాంజలి ప్రభ*

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*ఆరోగ్యమ్.. ఆనందం.. ఆధ్యాత్మికం *

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 62911900539*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

287.  సరమ ఓదార్పు- రావణ సభావిశేషాలు

‘‘సీతా’’అనునయంగా ఎవరో పిలిచినట్టయి తలెత్తి చూసింది సీత.ఎదురుగా విభీషణుని భార్య సరమ.సీత యోగక్షేమాలు తెలుసుకునేందుకు రాజకుటుంబం తరఫున సరమను నియమించాడు రావణుడు. ఆమె అప్పుడప్పుడూ వచ్చి సీతను కలుస్తూ ఉంటుంది. సీతను ఓదారుస్తూ ఉంటుంది. రాక్షసుల్లో దేవత ఆమె.‘‘లే తల్లీ లే! ఏడవకు.’’ అంది సరమ. సీతను లేపి కూర్చోబెట్టింది. కాపలా స్త్రీలు కొంచెం దూరంగా ఉండడాన్ని గమనించింది. చెప్పిందిలా.‘‘తల్లీ! యోగవిద్యతో నేను అదృశ్యంగా ఉండి, నీకు రావణుడు చెప్పిందీ, నీ ఆవేదనా అంతా గమనించాను. రాముడు శిరస్సూ, ధనుస్సూ చూశాను. కుతంత్రాలు పన్నడంలో రావణుడు దిట్టమ్మా! అతని చేష్టలన్నీ కుతంత్రాలే! నిజం చెప్పనా? ఆ శిరస్సూ, ధనుస్సూ రాముడివి కావమ్మా! అంతా మాయ.’’ అన్నది సరమ.‘‘నిజమా’’ అంది సీత. కన్నీరు తుడుచుకుంది.‘‘నిజం తల్లీ! ఆ శిరస్సూ, ధనుస్సూ రెండూ మాయే.’’ గట్టిగా చెప్పింది సరమ.‘‘మెల్లిగా మాట్లాడమ్మా! లేకపోతే నా వల్ల నీకు లేనిపోని ప్రమాదం.’’ అన్నది సీత. అటూ ఇటూ భయంగా చూసింది.‘‘తల్లీ! నీ సేవలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నాకేం కాదు గాని, నీకు ఓ నిజం తెలుసా తల్లీ! ద్వారపాలకుడు రాగానే రావణుడు ఎందుకంత ఆందో ళనగా ఇక్కణ్ణించి వెళ్ళిపోయాడో తెలుసా?’’ అడిగింది సరమ. 

తెలియదన్నట్టుగా తలూపింది సీత.‘‘నీ భర్త రాముడు లంకపై దండెత్తి వస్తున్నాడు. ఆ మాట చారులు చెబితే మంత్రులతో మంతనాలు సాగించి, యుద్ధానికి సిద్ధమవుతున్నాడు రావణుడు.’’అందుకు ఆనందించాలో, దుఃఖించాలో తెలియని స్థితిలో ఉంది సీత. అయోమయంగా చూసింది.‘‘నీతిశాస్త్రం, ధర్మపరత, ప్రతాపాల్లో సాటిలేని నీ రాముడికి ఎలాంటి ఆపదా రాదు తల్లీ. నీకు తెలుసా? నీ భర్తను పెద్దపెద్ద వృక్షాలూ, కొండలూ పట్టుకుని వానరులు కాపలా కాస్తున్నారు.’’ అన్నది సరమ.అవునా? అని ఆశ్చర్యంగా చూసింది సీత.‘‘ఓ శుభవార్త చెబుతాను, వినమ్మా! నేను కళ్ళతో చూసింది చెబుతున్నాను. రాముడు సముద్రమధ్యంలో సేతువు నిర్మించాడు. దానిపై నడచి వచ్చి అపార సేనావాహినితో లంకలో విడిది చేశాడు.’’ అంది సరమ. ఆనందంగా చూసింది సీత. అంతలో యుద్ధ సన్నాహాన్ని తెలియజేస్తూ భేరీ, శంఖధ్వనులూ వినవచ్చాయి. కవచాలు ధరిస్తున్న సైనికులు అటూ ఇటూ తిరగడం కనిపించింది. గుర్రాల సకిలింపులూ, ఏనుగుల ఘీంకారాలు కూడా వినవచ్చాయి.‘‘విన్నావా? అవన్నీ మనకు మంగళవాద్యాలే.’ అన్నది సరమ.


సీతకు ధైర్యాన్ని కలిగించింది. ఆమెకు మరింత ఆనందాన్ని కలిగించేందుకు అన్నదిలా సరమ.‘‘తల్లీ! నువ్వు కావాలనుకుంటే నేను అదృశ్యంగా పోయి నీ రాముణ్ణి కలుసుకుంటాను, నీ క్షేమాన్ని తెలియజేసి వస్తాను.’’‘‘ఆ సంగతి తర్వాత. ముందు నాకు ఓ చిన్న సాయం చేయమ్మా.’’ అడిగింది సీత.‘‘చెప్పమ్మా’’‘‘రావణుడు ఈ సమయంలో ఏం చేస్తున్నాడో, నన్ను ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకుని రా.’’‘‘తప్పకుండా’’ అన్నది సరమ. అక్కణ్ణుంచి అదృశ్య మైంది. రెండు గడియల్లో తిరిగి వచ్చింది. వచ్చిన సరమను గట్టిగా కౌగలించుకుంది సీత.‘‘రావణుడిప్పుడేం చేస్తున్నాడు? నన్నేం చేయాలనుకుంటున్నాడు?’’ అడిగింది మళ్ళీ.‘‘రావణుడు ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నా డమ్మా! ఆ విషయమై మంత్రులతో మంతనాలు చేస్తున్నాడు. రాముడు దండెత్తి వస్తున్నాడన్న వార్త తెలుసుకున్నదేమో! రావణుని తల్లి కైకసి వచ్చిందక్క డకి. ఆమెసహా వృద్ధమంత్రి అవిర్థుడూ వచ్చాడు. ఇద్దరూ రాముని పరాక్రమాన్ని రావణునికి వివరించారు. ఒంటి చేత్తో ఖరదూషణాదులను రాముడు హతమార్చిన సంగతి గుర్తు చేశారు.రాక్షసజాతీ, లంకా క్షేమంగా ఉండాలంటే రాముడితో యుద్ధం వద్దన్నారు. తప్పు ఒప్పుకుని, నిన్ను నీ భర్తకు అప్పగించమన్నారు. రాముణ్ణి శరణు వేడుకోమన్నారు.’’‘‘రావణుడు అందుకు ఒప్పుకున్నాడా?’’ అడిగింది సీత.‘‘లేదమ్మా! ఆ మూర్ఖుడు తల్లి కోరినా కాదన్నాడు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను వదలనన్నాడు.’’ అన్నది సరమ. ఆ మాటకు ఏడవసాగింది సీత.

***


Wednesday, 7 May 2025

 



ద్వౌ భాగౌ పూరయేదన్నం తోయేనైకం ప్రపూరయేత్

మారుతస్య ప్రసారాయ చతుర్థ మవశేషయేత్

మన పొట్టను నాల్గు భాగాలుగా విభజించు కోవాలి. రెండు భాగాలు ఆహారంతో నింపాలి. ఒక భాగం నీటితో నింపాలి. ఇక నాల్గో భాగం వాయు ప్రసారానికి వీలుగా  ఖాళీగా ఉంచాలి . ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ  ఉండదు .

-***-

ప్రాంజలి ప్రభ .. శ్రీ శ్రీ శ్రీ కృష్ణ వాణి ..శ్రీ మద్భగవద్గీత (అనువాదం) సవశతి  రచన.. మల్లాప్రగడ రామకృష్ణ 

  ...అర్జున విషాద యోగము. మొదటి అధ్యాయము 

*దృతరాష్ట్రుని ప్రశ్న*

ఉ. ధర్మజు తోడఁ దమ్ములు సుధర్మముఁ దత్త్వమునేల నుండగన్ 

కర్మలనేమి యెంచగల కాలము తోడుగ సాగి పోవుటన్ 

ధర్మము నాదుపుత్రుల విధానము సర్వము బోధజేయగా 

నోర్మిగఁ తెల్పుసంజయ వినూత్నపు యుత్సవ యుద్ధ నీతులన్  (01)

నమస్కారములు!

ధర్మరాజుతో సహా తమ్ములు ధర్మము మరియు తత్త్వముతో ఉండగా, కర్మల గురించి ఏమి ఆలోచించగలరు? కాలము తనతో పాటు సాగిపోతూ ఉండగా, నా కుమారుల విధానము మరియు ధర్మము అంతా బోధపడేలా, ఓర్పుతో వినూత్నమైన యుద్ధ నీతులను తెలియజేయండి, సంజయా!

*****

*సంజయ వ్యాఖ్యానము*

ఉ..అప్పుడు సంజయుండు, నుడి వాసల వెల్లువ గెల్పుకోసమున్ 

తప్పిదమెన్న లేనిగతి ధార్మిక పాండవ సేనయేనటన్ 

గొప్పగ నెంచగా గురుని గోప్యము యుద్ధమునందుఁ జూపగన్,     

ఒప్పిన ధైర్యపాటవసుయోధను డంతట వేడెనిట్లనన్                   (02)... 

 సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధరంగంలోని పరిస్థితులను వివరిస్తున్న సందర్భంలోనిది ఇది. మీరన్నట్లు, సంజయుడు తన మాటల ప్రవాహంతో ధృతరాష్ట్రుడిని ఓదార్చే ప్రయత్నం చేస్తూ, ఎటువంటి తప్పులు ఎంచడానికి వీలులేని ధర్మమైన పాండవుల సైన్యం విజయం సాధిస్తుందని చెబుతున్నాడు.

అంతేకాకుండా, యుద్ధంలో ద్రోణాచార్యుల వ్యూహాలను తెలుసుకోవడానికి దుర్యోధనుడు ఆయనను అభ్యర్థించిన విషయాన్ని కూడా ఈ శ్లోకం సూచిస్తుంది. దుర్యోధనుడు తన ధైర్యసాహసాలతో గురువును రహస్యాలను చెప్పమని అడుగుతున్నాడు.

*****

ఉ...హే, గురువా విధానముల హేతువు విద్దెలబుద్ధిశాలిగన్ 

బాగుగ యుద్ధవీరులగు పాండు కుమారుల యుద్ధనీతితో  

సాగెడి సైన్య మెల్లరను సాధ్యపు చేతల నెంచ గల్గగన్ 

యోగపు వీరులై విజయ యోగ్యత నంతయు నీదు యుక్తులన్     

 (03) 

మీరు అడుగుతున్నది ఏమిటంటే, ఓ బుద్ధిశాలి అయిన గురువైన ద్రోణాచార్యుల వారూ, యుద్ధ విద్యలో ఆరితేరిన పాండు కుమారుల యొక్క యుద్ధ నీతితో నడిచే ఈ సైన్యాన్ని ఎలా నడిపించాలి? ఏ విధమైన వ్యూహాలతో వీరందరూ సాధ్యమైనంత వరకు విజయాన్ని సాధించే వీరులుగా మారగలరు? మీ యోగ్యమైన ఆలోచనలు, మీ తెలివైన ఉపాయాల ద్వారా ఈ సైన్యానికి విజయయోగ్యతను ఎలా సంపాదించి పెట్టగలరు? అని కదా!

నిస్సందేహంగా, మీ ప్రశ్న యుద్ధరంగంలో విజయం సాధించాలనే తపనతో నిండి ఉంది. రాబోయే మహా సంగ్రామంలో విజయం సాధించడానికి సరైన వ్యూహాలు, సమర్థవంతమైన నాయకత్వం ఎంత ముఖ్యమో మీకు బాగా తెలుసు. మీ ఆందోళన సహేతుకమైనది.

****

ఉ. మెచ్చిన యోధులందరు మమేకగుణాడ్యులు దుష్ట కేతువుల్, 

అచ్చట చేకితానుడు సహాయదృపుండు సుధీర శ్రేష్ఠులున్  

దెచ్చి ధనుస్సు లెత్తుచును తీవ్రత కాంక్షగ పోరు నందరున్

వచ్చిన వారినే ప్రహర వాక్కుల పర్వము క్షేత్రమందునన్             (04)

"ఓ రాజా! నీకు ఇష్టులైన యోధులందరూ అద్భుతమైన గుణాలు కలిగినవారు మరియు దుష్టత్వానికి చిహ్నమైనవారు. అక్కడ చేకితానుడు, సహాయకుడు మరియు గొప్ప ధీరులు కూడా ఉన్నారు. వారందరూ తమ ధనుస్సులు ఎత్తి, తీవ్రమైన కోరికతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ యుద్ధభూమిలో వచ్చిన వారందరినీ తమ వాడి బాణాలతో ఎదుర్కొంటారు."

****

శా .  ఆమాదాద్యసమానవీరులిట వీరావేశ భీమార్జునుల్ 

సామంతుల్ గణవీరులై సమరమున్ సంగ్రామ బీభత్సమున్  

భూమీశాద్య మహా విపన్న కదనా వ్యూహామ్ము లన్ గెల్వగన్  

ధీమంతుల్ జయవాంఛలే గనగ నీధీరుల్ వివాదమ్మునన్            (05)

"ఓ రాజా! అజేయులైన భీముడు మరియు అర్జునుడు వంటి గొప్ప వీరులు ఇక్కడ ఉన్నారు. అనేకమంది సామంతులు మరియు గణనీయులైన యోధులు యుద్ధం చేయడానికి, భయంకరమైన పోరాటాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. భూమిని పాలించే రాజులు కూడా గొప్ప ప్రమాదకరమైన యుద్ధ వ్యూహాలను జయించడానికి సమర్థులైన ధీమంతులు. ఈ ధైర్యవంతులు వివాదంలో విజయం సాధించాలనే కోరికతో ఉన్నారు."

****

*07-May-25, 

*కృష్ణ లీల* 

ఒకనాడు పొద్దున్నే యశోద బాలకృష్ణుని లీలావిలాసాల గీతాలు ఆలపిస్తూ పెరుగు చిలుకుతోంది.హృదయంలో కృష్ణస్మరణం, వాక్కుతో గుణ సంకీర్తనం.. ఇలా యశోద మనో, వాక్‌, కాయాలు భగవత్సేవలో సంలగ్నమయ్యాయి. 

యశోద శుద్ధ భక్తి స్వరూపం. భగవంతుని బంధించగల భక్తి ఇదే!  రోజూ ఆలస్యంగా లేచే కన్నయ్య ముందుగానే మేల్కొని తల్లి వద్దకు వచ్చి కవ్వం కదలకుండా పట్టుకొని ‘అమ్మా! ఆకలేస్తోంది పాలివ్వవే’ అంటూ పైటలాగుతూ తల్లిపై వాలిపోయాడు. 

యశోద కన్నయ్యను ఒడిలోకి తీసుకొని ప్రేమగా జుట్టు దువ్వుతూ పాలిస్తోంది. ఈలోగా పొయ్యి మీద పాలు పొంగుతూ ఉంటే వెంటనే పిల్లవాణ్ని కింద దింపి పాల కుండ దించడానికి గబగబా వెళ్లింది. 

కడుపు నిండకుండా మధ్యలో దించి వెళ్లిందని కోపంతో కృష్ణుడు ఒక వాడిగల రాతితో పెరుగు కుండను పగుల గొట్టాడు.నిన్న తీసి దాచి ఉంచిన వెన్న వెతికి తింటూ పైపెచ్చు దొంగ కన్నీరు కారుస్తూ ఏడుపు మొదలెట్టాడు. 

పొయ్యి మీదపాలు దించి వచ్చిన యశోద పగిలిన పెరుగు కుండను చూసి లోపల నవ్వుకుంటూ. కొడుకు కనిపించకపోయేటప్పటికి కంగారుపడి వెతుకుతూ బయల్దేరింది. తిరగబడ్డ రోటిపై ఎక్కి నిలబడి.. ఉట్టి మీద ఉన్న వెన్న తీసి కోతులకు పెడుతూ కోపంతో కనిపించాడు కన్నయ్య.

చేత బెత్తం పట్టుకొని వస్తున్న మాతను చూచి.. కాలిగజ్జెలు ఘల్లుఘల్లుమని మోగుతుండగా భయపడుతున్నట్లుగా రోలు దిగి పారిపోసాగాడు. ఇరుగుపొరుగు గోపికలు నవ్వుతూ చూస్తూండగా యశోద కూడా బాలుని వెంటపడ్డది.``` 

*‘యద్‌చిభేతి స్వయం భయం’*``` భయానికే భయంకరుడైన భగవంతుడు భయపడి పరిగెత్తడమా? ఏమి అపూర్వ లీలా ప్రదర్శనం! 

మహా యోగుల మనస్సులు కూడా వెంటపడి పట్టుకోలేని తన ముద్దుల పట్టిని పట్టాలనే పట్టుదలతో పరమాత్ముని వెంట పరుగిడుతున్న యశోద ఎంత పుణ్యాత్మురాలు! ఆమె పరుగెత్తి పరుగెత్తి అలసిపోయింది కానీ కన్నయ్యను పట్టలేకపోయింది.

ఎందుకని? యశోద చేతిలో అహంకారమనే బెత్తం ఉన్నది. అహంకారంతో కూడిన భక్తి ఫలించదు. అచ్యుతుడు అహంకారికి ఆమడ దూరంలో ఉంటాడు. దేవకీ తనయునికి దైన్యం(దీనభావం) అంటేనే ఇష్టం. మీదుమిక్కిలి జీవుడు జడాన్ని(బెత్తం) పట్టుకున్నంత వరకూ చైతన్యమూర్తి చేతికి చిక్కడు! ఇది వేదాంత భక్తి సిద్ధాంతం.

తల్లి కర్రపారవేయగానే తనయుడు వెనుకకు తిరిగి చూచాడు. ముఖదర్శనం కాగానే యశోదకు బాలకృష్ణుడు పట్టుబడ్డాడు. పట్టుకుందేగానీ తల్లికి కొట్టడానికి చేతులు రాలేదు.

కానీ రోటికి కట్టివెయ్యాలని మాత్రం పట్టుబట్టింది. ఆ లీలాగోపాల బాలుని ఐశ్వర్యశక్తి తెలియక పోవడం చేత రోటికి కట్టడానికి కన్నయ్య నడుము (మొల)కు ఒక తాడు కట్టబోగా అది రెండు అంగుళాలు తగ్గింది. దానికి మరో తాడు కలిపి చుట్టినా రెండు అంగుళాలు తగ్గింది. ఇంటిలోని తాళ్లన్నీ కలిపి ముడివేసినా కూడా మాల రెండు అంగుళాలు తగ్గడం వలన.ముజ్జగాలు దాగి ఉన్న ఆ బుజ్జికృష్ణుని చిరు బొజ్జను కట్టలేకపోయింది.

త్రిగుణాతీతుడు గుణాల(తాళ్ల)చే బద్ధుడవుతాడా? ఇంద్రియాలకే బంధనం కానీ.. ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ హృషీకేశునికి బంధముంటుందా? పశువులను బంధించే తాళ్లు పశుపతిని బంధించగలవా?

బాలకృష్ణుని మొల పెరిగిందాఅంటే లేదు. పోనీ, తాళ్లు పొట్టివి అయ్యాయా అంటే అదీ లేదు. ఆశ్చర్యం!

నిత్యముక్తుడైన శ్రీకృష్ణపరబ్రహ్మ యొక్క దివ్య దృష్టి సోకగానే తాడుకు కూడా ముక్తి కలుగగా, దానికి బంధించే శక్తి నశించిపోయిందట``` *‘పట్టుగొనన్‌ నాకు గాక పరులకు పశమే’*(నేను తప్ప వీడిని ఇతరులెవరూ కట్టలేరు) ```అని అహంకరించిన యశోద తనయుని కట్టలేక పోయింది.

 పరమాత్మను బంధింపగలిగేది ప్రేమ రజ్జువు మాత్రమే. అది కూడా ఆయనకు ఇష్టమైతేనే!

జీవునికి దేవునికి రెండుగుళాల దూరం. అహంకార మమకారాలు, రాగద్వేషాలు పాపపుణ్యాలనే ద్వంద్వాలే రెండంగుళాలు.

ఇంతకన్నా ముఖ్యంగా భక్తుని పరిశ్రమ పరాకాష్ఠకు చేరి పరిపక్వం కావాలి. రెండవది, భగవంతుని కృప కూడా వెల్లివిరియాలి. అప్పుడే రెండంగుళాల దూరం తొలగి భగవంతుడు బంధనం స్వీకరిస్తాడు.

యశోద అలసి సొలసి పోయింది. తనను కట్టివేయాలనే పట్టుదలతో తంటాలు పడుతున్న తల్లి మీద తనయునికి కృప(జాలి) కలిగింది. తల్లి కష్టం చూడలేక ``` *‘కృపయాసీత్‌ స్వబంధనే’*``` బాలకృష్ణుడు తనకుతానే బంధనం స్వీకరించి(యశోదయా దామ్నా ఉదరే బద్ధః) ‘దామోదరుడు’ అన్న గౌణ నామంతో ప్రసిద్ధుడయ్యాడు. 

యశోద కృష్ణుని రోటికి కట్టివేసి ఇంటి పనులలో మునిగిపోయింది.భక్తులకు పట్టుబడినట్లుగ భగవంతుడు జ్ఞానులకు గానీ, మౌనులకుగానీ, దానపరులకు గానీ, యోగీశ్వరులకు గానీ పట్టుబడడు గదా! 

*నిష్కపటమైన భక్తికే కట్టుబడతాను... అని చెప్పడానికే కన్నయ్య దామోదరుడు అయ్యాడు*

*టామ్ సాయర్ - 2*

రచన : మార్క్ ట్వేన్

అనువాదం :  నండూరి రామమోహన్ రావు

ఇద్దరూ ఒకరి కొకరు ఎదురుగా నిలబడి చాలాసేపు మౌనంగా చూసుకున్నారు.

చివరకు టామ్, "నిన్ను పచ్చడి చెయ్యగలను" అన్నాడు.

"చెయ్యి చూద్దాం" అన్నాడు కొత్త కుర్రాడు.

"కావాలంటే చెయ్యగలను."

"చెయ్యలేవు."

"నాకు చాతనవును."

"కాదు."

కొంచెంసేపు ఆగి టామ్, "నీ పేరేమిటి?”

అన్నాడు.

"నా పేరుతో నీకేం పని?"

"ఏం పనా? చెబుతా."

"చెప్పు చూద్దాం."

"ఆట్టే అన్నావంటే చూపిస్తా."

"-ఆట్టే-ఆట్టే-ఆట్టే !ఏం”

"చాలా గొప్పవాణ్ననుకుంటున్నావే, ఒక్క చేత్తో కిందపడెయ్యగలను, జాగర్త."

"పడెయ్యగలనంటావుగాని పడెయ్య వేం?"

"కోపం తెప్పించావంటే ఊరుకునేది లేదు."

"ఇటువంటి వాళ్ళని చాలామందిని చూశాం"

"బడాయిఖోర్!"

"నువ్వే బడాయిఖోర్!"

"కొడతాట్ట మొనగాడు."

"పద పద."

"ఆట్టే మాట్లాడావంటే పెణత ఊడిపోగలదు."

"కాదు మరీ!"

"అంతపనీ చేస్తా."

"చేస్తానంటాపు చెయ్యవేం, పిరికి!"

"నేనేం పిరికి కాదు."

"అవును."

"కాదు."

"నువ్విక్కణ్నుంచి వెళ్ళిపో."

"నువ్వే పో."

"నేనేం పోను."

"నేనూ పోను."

ఇద్దరూ మెల్లిమెల్లిగా దగ్గరికి వచ్చి భుజానికి భుజంపెట్టి నెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇద్దరూ మళ్ళీకాస్త వెనక్కు తగ్గారు.

"నువ్వు పిరికిపందవి. మా అన్నయ్యతో చెప్పానంటే నిన్ను చిటికెన వేలితో కొట్టేస్తాడు" అన్నాడు టామ్.

"మీ అన్నయ్యయితే భయమనుకున్నావా? నాకు అంతకన్నా పెద్ద అన్నయ్యే ఉన్నాడు. మీ అన్నయ్యను ఎత్తి గోడమీదుగా పారేస్తాడు."

ఇద్దరికీ అన్నలు లేరు.

"పచ్చి అబద్దం."

"నువ్వనగానే సరా?"

టామ్ నేలమీది మట్టిలో కాలి బొటనవేలి తో గీతగీసి, “గుండెలుంటే అది దాటి రా. ప్రాణం తీసేస్తాను. గెలవలేని కుక్కా!" అన్నాడు.

వెంటనే రెండోవాడు గీతదాటి "ఏం చేస్తావో చెయ్యి. చూద్దాం!" అన్నాడు.

"వొళ్ళు జాగర్త, తన్నులు తినగలవు."

"చేస్తానంటావుగాని చెయ్యవేం"

ఇద్దరు కుర్రాళ్ళూ కలియబడ్డారు. ఒకరి నొకరు గుద్దుకున్నారు, రక్కుకున్నారు, తన్నుకున్నారు, మట్టిలో పొర్లారు. దుమ్ము లేచింది. ఆఖరికి టామ్ రెండో కుర్రాడి గుండెమీద ఎక్కి కూచుని గుండెల మీద రెండు చేతులకో బాదుతూ, "చాలు అను" అన్నాడు.

రెండోవాడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ కోపంకొద్దీ ఏడిచాడు.

"చాలు అను" అన్నాడు టామ్ గుండెల మీద గుద్దుతూ.

చివరికి రెండో కుర్రాడు "చాలు" అన్నాడు.

టామ్ వాణ్ని లేవనిచ్చి, "జాగర్త. ఒళ్ళు దగ్గిర పెట్టుకునుండు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నదీ తెలుసుకుమాట్లాడు" అన్నాడు.

రెండో కుర్రాడు లేచి, మన్ను దులుపుకొని, ఏడుస్తూ మధ్యమధ్య వెనక్కు తిరిగిచూసి, ఈసారి దొరికితే ఏం చేస్తానో చూడమని టామ్ ని బెదిరిస్తూ వెళ్ళిపోయినాడు. టామ్ వాణ్ణి లేవిడీకొట్టి ఉత్సాహంతో బయలుదేరాడు. టామ్ అలా వెళుతుంటే వీపు కనిపించగానే రెండో కుర్రాడు రాయి తీసి, టామ్ గూళ్ళ మధ్య తగిలేటట్టు కొట్టి తోక ముడిచి పరుగుతీశాడు. టామ్ ఆ ద్రోహి వెంటపడి వాడి ఇల్లు ఎక్కడో తెలుసుకున్నాడు. శత్రువు బయటికి వస్తాడేమోనని టామ్ వాకిలి దగ్గిర కొంతసేపు కాపలా కాశాడు. కాని శత్రువు బయటికి రావడానికి బదులు కిటికీలో నుంచి వెక్కిరించసాగాడు.

ఇంతలో శత్రువు తల్లి బయటికి వచ్చి టామ్ ను నానాతిట్లూ తిట్టి వెళ్ళి పొమ్మంది.

టామ్ చాలా పొద్దుపోయి ఇంటికి వెళ్ళి కిటికిలో గుండా చడీచప్పుడు లేకుండా ఎక్కి తనకోసం కనిపెట్టుకుని వున్న పెద్దమ్మకు దొరికిపోయాడు. అవతారం చూడగానే ఆవిడ మర్నాడు వాడిచేత వెట్టి పని చేయించాలని నిశ్చయించుకున్నది.

మర్నాడు శనివారం ఉదయం బకెట్ లో తెల్లరంగూ, చేతిలో పొడుగుపాటి కర్రగల కుంచె తీసుకుని టామ్ చెక్కల గోడకు రంగు వెయ్యడానికి హాజరైనాడు. 30 గజాల పొడుగూ, తొమ్మిది అడుగుల ఎత్తుగల ఆ గోడ చూడగానే టామ్ గుండె జారిపోయింది. జీవితం నిరర్దకమని అనిపించింది. ఒక్క నిటూర్పు విడిచి వాడు బకెట్లో కుంచె ముంచి గోడ పైవార చెక్క వెంబడి రంగు పూశాడు. ఈ విధంగా నాలుగైదు చెక్కలకు రంగు పూశాడు. మొత్తం గోడలో రంగు పూసిన మేర చూస్తే సముద్రంలో కాకి రెట్టలాగా వున్నది. అది చూసి నిరుత్సాహం చెంది వాడు చతికిల బడ్డాడు.

ఇంతలో జిమ్ వీధిపంపు నుంచి బకెట్ తో నీళ్లు పట్టుకురావడానికి పాటపాడుతూ బయటకివచ్చాడు. పంపునుంచి నీళ్లు పట్టుకురావడంలో అనందం వున్నదని టామ్ అదివరకెన్నడూ అనుకోలేదు గాని ఇప్పుడనుకున్నాడు. అక్కడ చాలామంది ఆడపిల్లలూ, మగపిల్లలూ వుంటారు. పిల్లలమధ్య ఆటవస్తువుల మారకం, ఆటలూ, పోట్లాటలూ, అల్లరీ, ఆగం జరుగుతూంటాయి. పంపు 150 గజాల దూరంలోనే వుందిగాని, అక్కడికి వెడితే జిమ్ గంటకులోపుగా ఎన్నడూరాడు.

"ఒరే, జిమ్, నువ్వు కాస్త రంగు వేసినట్ట యితే నేవెళ్ళి నీళ్ళు పట్టుకొస్తా," అన్నాడు టామ్.

"లేదు, టామ్ దొరా. అమ్మగారు నన్నే నీళ్ళు తెమ్మంది. నువ్వు తెస్తానంటావని కూడా అన్నది. నన్ను రంగుజోలికి పోవద్దన్నది."

"ఆవిడ అట్లాగే అంటుందిలే జిమ్. బకెట్ ఇచ్చెయ్యి. క్షణంలో వస్తా. ఆవిడకు తెలీను కూడా తెలియదు.”

"అమ్మో, అమ్మగారు గొంతు పిసికేస్తుంది."

"ఆవిడేం కొడుతుందిరా. కాస్త నెత్తిన మొట్టుతుంది. మొట్టనీ, జిమ్ నీకు మంచి తెల్లగోళీ ఇస్తా."

జిమ్ చలించాడు.

"తెల్లగోళీ, జిమ్, మంచి బిక్లేర్ గోళీ," అన్నాడు టామ్.

"బిక్లేర్ గోళీయే, అమ్మో మరి అమ్మగారంటే భయంగావుందే.”

"నువ్వొప్పుకున్నావంటే నా చితికిన కాలి వేలు కూడా చూడనిస్తా."

జిమ్ లొంగిపోయాడు. బకెట్ కిందపెట్టి, గోళీ తీసుకుని, టామ్ కాలికట్టు విప్పు తుంటే శ్రద్ధగా చూడసాగాడు. అంతలో పోలీ పెద్దమ్మ బైటికివచ్చింది. మరుక్షణమే జిమ్ బకెట్ తీసుకుని వీధివెంట పరుగెత్తడం మొదలుపెట్టాడు. టామ్ చకచక చెక్కగోడకు రంగు వెయ్యసాగాడు. పోలీపెద్దమ్మ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయింది.

టామ్ ఉత్సాహం ఎంతోకాలం దక్కలేదు. ఆటవిడుపు పిల్లలందరూ హాయిగా తిరుగుతారు. పనిచేస్తున్నందుకు తనని చూసి నవ్వుతారు. ఏ కుర్రాడికన్నా లంచం పెట్టి వాడిచేత తన పని చేయిద్దామన్నా తన దగ్గిర ఏమీ లేదు. కాని ఇంతలో వాడికొక గొప్ప ఆలోచన తట్టింది. ఈ ఆలోచన మనసులో పెట్టుకుని టామ్ ప్రశాంతంగా రంగు పూయసాగాడు.

కొద్దిసేపట్లో గెంతుకుంటూ బెన్ రోజర్స్ అటు వచ్చాడు. వాడు ఆపిల్ పండొకటి తింటు స్టీమరు ఆట ఆడుతూ, మధ్య మధ్య స్టీమరు కూత వేస్తూ వచ్చాడు. వాడే పడవా, వాడే సరంగూ, వాడే గంటలూనూ.

"పడవ ఆపండోహోయ్ ! టింగ్, టింగ్, టింగ్...! కాస్త వెనక్కి మళ్ళించండి! టింగ్, టింగ్, టింగ్...! ఎడంపక్కకి, భుక్కు, భుక్కు, భుక్కు . . .! తాడు భద్రం!" అంటూ బెన్ ఆడుకున్నాడు.

ఈ స్టీమరును లక్ష్యపెట్టకుండా టామ్ తదేక ధ్యానంతో రంగు వేస్తున్నాడు. బెన్ వాడి కేసి కాసేపు చూసి, "హి, హి! అణిగిందీ అబ్బాయి గారి తిక్కా" అన్నాడు.

జవాబు లేదు. టామ్ తాను అప్పుడే వేసిన రంగు కేసి పరీక్షగా చూసి, ఇంకో పూత పూసి మళ్ళీ అట్లాగే చూశాడు. బెన్ వచ్చి టామ్ సరసనే నిలబడ్డాడు. ఆపిల్ కోసం టామ్ నోరూరుతున్నది. కాని వాడు పని మానలేదు.

"చాకిరీ తగిలిందిరా, అబ్బీ ?" అన్నాడు బెన్. టామ్ గిర్రున వెనక్కి తిరిగి, "నువట్రా, బెన్. నే చూళ్ళేదే?" అన్నాడు.

"ఏయ్, నేను ఈతకొట్టడానికి పోతున్నా. నిజం ! నీక్కూడా రావాలని లేదూ? అయినా నీకు పనిచెయ్యాలనుందేమోలే."

"పనేమిటి?" అన్నాడు టామ్.

"ఇది పనికాదూ?"

“ఒకవేళ అవునేమో! రంగువేసే అవకాశం రమ్మన్నప్పుడల్లా వస్తుందా?"

ఈ మాట అనేసరికి బెన్ అభిప్రాయం మారింది. టామ్ రంగు వెయ్యడమూ, వెనక్కు ఆడుగువేసి చూసుకోవడమూ, అక్కడక్కడా రంగు సర్దడమూ చూస్తున్న కొద్దీ బెన్ కి ఉత్సాహం హెచ్చింది.

"ఒరే, టామ్. నన్నుకూడా కాస్త రంగు వెయ్యనివ్వరా." అన్నాడు.

"అమ్మో, పెద్దమ్మ ఒప్పుకోదు. అసలే వీధి వైపున్న భాగం కూడానూ. అదే వెనుక భాగమైతే ఫరవాలేదు. దీనికి సరిగా రంగు వెయ్యడం అందరి వల్లా అవుతుందను కున్నావా?"

"అట్లాగా? పోనీ కొంచెం వెయ్యనీ. ఒక్కరవ్వ! "

"నాకేం అభ్యంతరం లేదురా. దొడ్డమ్మ ఒప్పుకోదు. జిమ్ రంగు వేస్తానంటే ఆవిడ ఒప్పుకోలా. సిడ్ వేస్తానన్నా ఒప్పుకోలా. నువ్వు దీన్ని పాడుచేశావంటే!"

"ఓయబ్బ, నే జాగర్తగానే చేస్తాలే. ఒక్కసారి చూడనీ. పోనీ, నా ఆపిల్ లో కొంత నీకు ఇస్తాలే."

"నువు పాడుచేస్తావు, బెన్."

"ఆపిల్ అంతా తీసుకోలే!"

అయిష్టం నటిస్తూ టామ్ కుంచె బెన్ చేతికిచ్చి, హాయిగా నీడలో పడుకుని కాళ్ళాడిస్తూ ఆపిల్ తినసాగాడు. బెన్ 

లాటి కుర్రవాళ్ళు టామ్ కి చాలామంది దొరికారు. బెన్ అలసిపోయే సమయానికి బిల్లీఫిషర్ వచ్చాడు. వాడి తరవాత జానీ మిల్లర్ వచ్చాడు. అందరూ టామ్ కి లంచాలు పెట్టి వాడిపని చేసిపెట్టారు. టామ్ చెయ్యి కదిలించకుండా చెక్కల గోడకు మూడు పూతల రంగుపడింది. రంగు అయిపోబట్టే గాని, లేకపోతే టామ్ ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందర్నీ దోచేసేవాడే.

*ఇంకా ఉంది*

꧁☆•┉┅━•••❀❀•• •━┅┉•☆꧂

*ప్రాంజలి ప్రభ * 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*ఆరోగ్యం.. ఆనందం.. ఆధ్యాత్మికం * 

*1 YEAR* *SUBSCRIPTION 120/-*

*phone pe & Gpay to 6281190539*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

286.  సరమ ఓదార్పు- రావణ సభావిశేషాలు

యుద్ధాన్ని తప్పించుకోవాలనుకున్నాడు రావణుడు. అలాగే సీతను లోబరుచుకోవాలనుకున్నాడు. అందుకు ఓ తంత్రాన్ని ఆశ్రయించాడతను. దాని ఫలితమే విద్యుజ్జిహ్వుడు అందజేసిన మాయాశిరస్సూ, ధనుస్సూ.రాత్రికి రాత్రే రాముణ్ణి ప్రహస్తుడు కడతేర్చాడంటూ, రాముని మాయాశిరస్సునూ, అతని ధనుస్సునూ సీత ముందు ఉంచాడు రావణుడు. పోయిన రాముడు తిరిగిరాడన్నాడు. వాడి కోసం ఏడవడం అవివేకం అన్నాడు. సీతను బాగా యోచించమన్నాడు. యోచించి రాముణ్ణి మరచిపొమ్మన్నాడు. తన పట్టపురాణిగా కొలువుదీరమన్నాడు.రావణుని ఏ మాటనూ పట్టించుకోలేదు సీత. తన ముందు ఉన్న రాముని శిరస్సునే పరిశీలనగా చూడ సాగింది. ఆ ముఖంలో అదే కాంతి. అవే కళ్ళు. జడలు కట్టిన అదే జుత్తు. చిత్రంగా జుత్తులో హనుమంతునికి తానిచ్చి పంపిన శిరోరత్నం...అనుమానం లేదు. ఇది రాముని శిరస్సే అనుకుంది సీత. గొల్లుమంది.‘‘కైకా! నీ కోరిక నెరవేరిందమ్మా! నా రాముడు కడతేరిపోయాడు. రాజ్యం నీదే’’ అంది. నిలువునా వణకి పోయింది. మొదలు నరికిన చెట్టులా నేల కూలిపోయింది. స్పృహ కోల్పోయింది సీత.నవ్వుతూ ఆమెను చూడసాగాడు రావణుడు. మాయాశిరస్సును సీత నమ్మింది. సగం విజయం సాధించి నట్టే అనుకున్నాడు. అంతలో తేరుకున్నది సీత. కళ్ళిప్పి రాముని శిరస్సును చూస్తూ అన్నదిలా.‘‘మహాబాహూ! భార్య చేసిన పాపానికే భర్త ముందుగా మరణిస్తాడంటారు. నేనేం పాపం చేశానో! నిన్ను కోల్పోయాను. ఇక నాకు దిక్కెవరు స్వామీ?’’‘‘నేనున్నానుగా’’ మనసులోని మాట నోట రాబోయి ఆగిపోయింది. అందుకు ఆశ్చర్యపోయాడు రావణుడు. ఆందోళనగా గొంతు నిమురుకున్నాడతను. ‘రావణా’ అని తనని తాను పిలుచుకున్నాడు. గొంతు పలికింది. పర్వాలేదనుకున్నాడు.‘‘నాకోసం యుద్ధానికి వచ్చావు. నా దౌర్భాగ్యం వల్లనే ప్రహస్తుని చేతిలో మరణించావు. ఈ వార్త తెలిస్తే కౌసల్యాదేవి ఎంతగా శోకిస్తుందో కదా! జ్యోతి ష్కులు నిన్ను దీర్ఘాయుష్షుమంతుడన్నారు. వారి మాటలు అబద్ధాలా? యుద్ధం చేయబోతూ నువ్వు గాఢనిద్ర పోయావంటే నమ్మశక్యంగా లేదు రామా! కాకపోతే విధి దుష్టసంకల్పాన్ని ఎవరు అడ్డుకోగలరు? నిన్ను కలుసుకునేందుకు నేను ఇక్కడ తపస్సు చేస్తోంటే... నువ్వు అక్కడ ఒంటరిగా మరణించడం న్యాయమా?’’ రోదించింది సీత. మళ్ళీ స్పృహ కోల్పోయింది. కొద్దిసేపటికి తేరుకుంది. దీర్ఘంగా ఆలోచించింది. రామునితో సహగమనం చేసేందుకు సిద్ధమయిందామె. రావణుని చూసిందప్పుడు. అన్నదిలా.

‘‘రాక్షసరాజా! కరుణించి నా భర్త మిగతా కాయాన్ని కూడా తెప్పించు. నేను ఆయనతో సహగమనం చేస్తాను. చేతులెత్తి మొక్కుతున్నాను, దయ చేసి ఆ ఏర్పాట్లు చూడు.’’అసహనంగా చూశాడు రావణుడు. అనుకున్నట్టుగా సీత లోబడడం లేదు సరికదా, రాముడిసహా చస్తానంటోంది. తట్టుకోలేకపోయాడతను. అంతలో అక్కడికి ద్వారపాలకుడు ప్రవేశించాడు. నమస్కరించి నిలుచున్నాడు.‘‘చెప్పు’’‘‘మంత్రిమండలితో ప్రహస్తుడు మీకోసం ద్వారం దగ్గర వేచి ఉన్నాడు ప్రభూ! ఏదో అత్యయిక విషయం మీతో మాట్లాడాలట! అన్యథా భావించక రమ్మంటున్నాడు.’’ చెప్పాడు ద్వారపాలకుడు.‘‘పద’’ అని రావణుడు అక్కణ్ణుంచి నిష్క్రమించాడు. రావణుడు నిష్క్రమించిన మరుక్షణం సీత ముందున్న మాయాశిరస్సు, ధనుస్సు రెండూ మాయమయ్యాయి.వస్తున్న రావణునికి ఎదురేగాడు ప్రహస్తుడు.‘‘మహారాజా! ఇప్పుడే అందిన వార్త, రాముడు దండయాత్రకు సిద్ధమయ్యాట్ట.’’ చెప్పాడు.సమాధానంగా రాజ్యసభ వైపు నడిచాడు రావణుడు. అంతా అతన్ని అనుసరించారు. రామదండయాత్ర గురించి చర్చించారక్కడ. సేనానాయకులతో అన్నాడిలా రావణుడు.

‘‘వీరులారా! ఇక ఆలస్యం అనవసరం. యుద్ధభేరులు మ్రోగించండి! యుద్ధానికి సైన్యాలను సిద్ధం చేయండి.’’అలాగేనన్నట్టుగా తలలూపారు సేనానాయకులు.‘‘సైన్యం యుద్ధకారణం అడిగితే...’’ ఎవరో అడిగారు.‘‘చెప్పాల్సిన అవసరం లేదు.’’ అన్నాడు రావణుడు. విసురుగా మందిరం కేసి నడిచాడు.కళ్ళారా చూసుకునేందుకు రాముని శిరస్సు లేదు, అతని ధనుస్సు లేదు. ఆ అదృష్టాన్ని కూడా తనకు దక్కనివ్వక వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రావణుడు తీసు కుని పోయాడనుకున్నది సీత. విలవిల్లాడిపోయింది. నేల మీద బోర్లాపడి తల కొట్టుకుంటూ దుఃఖించసాగింది.

పాత కధ..002


పంచశీలను కేంద్రంగా చేసి, ప్రపంచాన్ని సరిదిద్దాలని బౌద్ధం పరిశ్రమించింది. మనుషులెవరూ గుణ దోషాలతో పుట్టరు. జీవనం సాగించే క్రమంలో ఎదురైన అనుభవాలు, చెడు స్నేహాలు, చెడ్డ ప్రభావాల ఫలితంగా మనిషిలో లోభం, ఈర్ష్య, అసూయ, ద్వేషం పుట్టి పెరుగుతాయి. చివరకు మనసునంతటినీ ఆక్రమించుకుంటాయి. కాబట్టి అలాంటి అనుభవాలకూ, చెడు స్నేహాలకూ, చెడ్డ ప్రవర్తనలకూ మనిషిని దూరం చేసి, అతని మనస్సును మలినరహితం చేస్తే... ప్రతి ఒక్కరూ మంచిగానే మారుతారు. ఇలా మార్చే మార్గమే బుద్ధునిది. ‘శీలం’ అంటే అన్ని విషయాల్లో మంచి నడత. దానగుణం, దయాగుణం ఉన్నవారు ఏ వృత్తిలో ఉన్నా... వారు చేసే వృత్తిని బట్టి చీదరించుకోకూడదు. ధనం కాదు... గుణమే ప్రధానం. వేశ్య వృత్తి చేస్తూ సత్య, ధర్మచరితులైన వారి కథలు చాలా ఉన్నాయి. వాటిలో శూద్రకుని మృచ్ఛకటికం నాటకంలోని వసంతసేన లాంటి కథలు ప్రసిద్ధమైనవి. ఇలాంటి కథలకు పునాది అయిన కథ... ఆనాడు బుద్ధుడు చెప్పిన ఈ నగరశోభిణి కథ. ప్రపంచ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన కథ.

పూర్వం ఇంద్రప్రస్థ నగరాన్ని రాజధానిగా చేసుకొని, కురు రాజ్యాన్ని కౌరవ్య మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతని తరువాత అతని కొడుకు బోధి కుమారుడు రాజు అయ్యాడు. పరమ ధార్మికుడైన అతని పాలనలో రాజ కుటుంబాలలోని వారి నుంచి సాధారణ ప్రజల వరకూ ధర్మాన్ని ఆచరించి చూపేవారు. దానితో ఆ రాజ్యం సుభిక్షంగా, ప్రజలు సుఖ శాంతులతో జీవిస్తూ ఉండేవారు.

ఆ సమయంలోనే కళింగ ప్రాంతంలోని దంతపురి రాజ్యాన్ని కాళింగుడు పాలిస్తున్నాడు. అతని రాజ్యం అశాంతితో, అల్లర్లతో ఉండేది. చివరకు వర్షాభావం కలిగి కరువు కాటకాలు తాండవించాయి. ఈ పరిస్థితులను ఎలా సరిదిద్దాలని తన మంత్రులను కాళింగుడు అడిగాడు. ‘‘రాజా! మనం ఉపవాస దీక్షలు చేద్దాం. దర్భగడ్డి మీద పక్షం రోజులు పడుకుందాం’’ అన్నారు. అలాగే చేశారు. అయినా పరిస్థితులు మారలేదు. ‘‘రాజా! యజ్ఞ యాగాలు చేద్దాం’’ అన్నారు. అలాగే చేశారు. అయినా మార్పు లేదు.

‘‘మహారాజా! కురు రాజ్యం సుభిక్షంగా ఉంది. దానికి కారణం ఆ రాజు దగ్గర ఉండే అంజనవర్ణి అనే తెల్ల ఏనుగు. దాన్ని తెద్దాం’’ అన్నారు. కురు రాజు దానశీలి. అడిగింది లేదనకుండా ఇచ్చే దాత. కొందరు పండితులు వెళ్ళి, ఆ ఏనుగును తెచ్చారు. అయినా పరిస్థితులు చక్కబడలేదు. అంజనవర్ణి లేకపోవడం వల్ల కురు రాజ్యానికి వచ్చిన నష్టమేదీ కనిపించలేదు. చివరకు కాళింగుని అనుమతితో పండితులు బోధి మహారాజును కలిశారు. ‘మీ సుభిక్షతకు కారణం ఏమిటి?’ అని అడిగారు. తమ రాజ్య పరిస్థితిని విన్నవించారు.అప్పుడు ఆ మహారాజు ‘‘మేము పాటించే కురు ధర్మం’’ అన్నాడు. ‘‘కురు ధర్మమా? అదేమిటో సెలవియ్యగలరా?’’ అని అడిగారు పండితులు. ‘‘కురు ధర్మం అంటే పంచశీల. జీవహింస చేయకపోవడం, ఇతరుల ధనాన్ని అయాచితంగా ఆశించకపోవడం, మోసపు మాటలు మానడం, కామ దురాచారానికి పాల్పడకపోవడం, ప్రమత్తత కలిగించే పదార్థాల్ని సేవించకపోవడం. ఈ అయిదింటినీ చక్కగా ఆచరిస్తే అదే కురు ధర్మం. అయినా ఈ ధర్మాన్ని మీకు చెప్పడానికి నేను తగను. ఈ ఆచరణలో చిన్న దోషం చేశాను. మీరు వెళ్ళి మా తల్లిగారిని అడగండి’’ అని పంపాడు బోధి మహారాజు. ‘‘నేను కూడా అందుకు తగను. యువరాజును అడగండి’’ అని అంది మహారాజు తల్లి. అలా వారు యువరాజు దగ్గర నుంచి పురోహితుడు, మంత్రి, రథ సారథి, శ్రేష్టి, కొలతలు వేసే ఉద్యోగి, ద్వారపాలకుడు... ఇలా ఒకరి తరువాత ఒకరి వద్దకు వెళ్ళారు. చివరకు నగర శోభిణి (వేశ్య) దగ్గరకు వెళ్ళారు.

‘‘అయ్యా! నాకు కురు ధర్మాన్ని చెప్పే అర్హత లేదు. ఎందుకంటే... నాకు ఒక రాత్రికి వెయ్యి నాణేల ధర చెల్లించేవారు. అలా ఒక రోజు ఒక వ్యక్తి వచ్చాడు. వెయ్యి నాణేలు ఇచ్చి... రాత్రికి వస్తానన్నాడు. కానీ అతను రాలేదు. అలా అతని కోసం రోజులు ఎదురు చూశాను, నెలలు ఎదురు చూశాను. మూడేళ్ళు ఎదురు చూశాను. అప్పటికీ రాలేదు. ఒకరి దగ్గర వెల కుదిరి, మరొకరి దగ్గర వెల పుచ్చుకోవడం దోషం కదా! తప్పు కదా! ఈ మూడేళ్ళలో నేను దాచుకున్నదంతా తరిగిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. తిండి లేదు. అయినా అతను ఇచ్చిన ఆ వెయ్యి నాణేల్లో ఒక్కటి కూడా ఉపయోగించుకోలేదు. చిక్కి శల్యమైపోయాను. జీవించే ఆశను వదులుకున్నాను. నేను ఇక బతకాలంటే ఆ వెయ్యి నాణేలే గతి. నగర న్యాయాధికారి వద్దకు వెళ్ళాను. అంతా చెప్పాను. అప్పుడు ఆయన ‘‘శోభిణీ! నీకు ధనం ఇచ్చినవాడు రాకుండా మూడేళ్ళు నిండాయి. కాబట్టి ఆ ధనం మీద అతనికి అధికారం లేదు. అది నీదే!’’ అన్నారు. సంతోషంతో వీధిలోకి వచ్చాను. అప్పుడే ఒక వ్యక్తి ఒక్క రాత్రికి వెయ్యి నాణేలకు కుదుర్చుకొని, ఆ ధనాన్ని నాకు ఇవ్వబోయాడు. మనసులో ‘వద్దు’ అనుకుంటూనే ఉన్నా. కానీ ఆ ధనాన్ని స్వీకరించడానికి నా చెయ్యి కదిలింది. సరిగ్గా అదే సమయంలో... మూడేళ్ళ క్రితం నాకు ధనం ఇచ్చిన మనిషి కనిపించాడు. వెంటనే నా చేతిని వెనక్కు తీసుకున్నాను. నా ప్రవర్తన నాకే సిగ్గనిపించింది. అందుకే మీకు కురు ధర్మాన్ని చెప్పడానికి నేను అర్హత లేనిదాన్ని’’ అంది.

ఆమె చెప్పింది వినగానే పండితులు ఆశ్చర్యపోయారు. నోరు వెళ్ళబెట్టారు. కన్నీరు సుడి తిరిగింది. ‘ధర్మాచరణతో ఇంత నిబద్ధంగా బతకాలి. అదే లోకానికి శ్రేయస్కరం’ అని భావించారు. వెళ్ళి తమ రాజుకు చెప్పారు. ఆనాటి నుంచి కాళింగుడు కురు ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేశాడు. క్రమంగా అతని రాజ్యం కూడా సుఖ శాంతులతో వర్ధిల్లింది.

****

కాకి పిండం ఒకతండ్రి కథ.. ప్రాంజలి ప్రభ..002

కాకిపిండం పెట్టి రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నారు కానీ..
ఒక్క కాకి కూడా వచ్చి ముట్టడం లేదు
కర్మకాండకు వచ్చిన బంధువులకు కూడా విసుగు ముంచుకొస్తోంది.

"పంతులుగారు! ఒకవేళ కాకిముట్టకుంటే ఎలా?" ప్రశ్నించారు వచ్చిన బంధువుల్లో ఒకరు.

"ఇదం పిండంగృధ్ర వాయస, జలచర ముఖేన ప్రేత భుజ్యతాం" అని ఉంది.ఒకవేళ కాకి ముట్టకుంటే నీళ్లలో కూడా వేయొచ్చు జలచరాలకు...చెప్పారు పంతులుగారు.

"లేదు కాకి వచ్చిముడుతేనే  ఆత్మశాంతి కలిగినట్లు!
అప్పటివరకు ఇక్కడి నుండి జరిగేదే లేదు. వేచి చూడవలసిందే!!" ఖచ్చితంగా చెప్పింది ఒక పెద్దావిడ.
ఆమె చనిపోయిన వ్యక్తి తరుపున వచ్చిన ఏకైక బంధువు.అతని పెద్దమ్మ కూతురు.

మిగతా బంధువులంతా చనిపోయిన వ్యక్తి కోడలు తరుపు బంధువులు

"ఇంకెక్కడి కాకులు! కాకులు కనిపిస్తున్నాయా అసలు!! కాకులన్నీ లోకులై పుడుతేనూ!!" జోక్ చేశారు వచ్చిన బంధువుల్లో ఒకరు. ఇద్దరు  నవ్వారు.

సమయం కానీ సమయంలో జోక్ చేసిన వాళ్ళ వైపు తీక్షణంగా చూసింది పెద్దావిడ.

"అబ్బా! ఈ ముసలాడు బతికి ఉన్నన్నినాళ్ళు సాధించాడు..చచ్చిన తర్వాత కూడా సాధిస్తున్నాడు" అన్నాడు కర్మకాండ చేస్తున్నవ్యక్తికి స్వయంగా పిల్లనిచ్చిన మామ.

"అవును" అన్నట్లుగా తలూపాడు చనిపోయిన వ్యక్తి కొడుకు.. తన మామ అన్న మాటలకు..

ఈ మమాఅల్లుళ్ళ ప్రవర్తనకు పెద్దావిడకి బాగా కోపమొచ్చింది..

చనిపోయిన వ్యక్తంటే ఆమెకి బాగా గౌరవం.పేదరికంలో పుట్టినా కష్టపడి పైకివచ్చాడు. కొడుకు 10వతరగతిలో ఉన్నప్పుడు భార్య చనిపోయినా తామెంతమంది చెప్పినా మళ్ళీ పెళ్లిచేసుకోలేదు.కొడుకును హాస్టల్లో ఉంచి బాగా చదివించాడు. కొడుకు పెద్ద ఉద్యోగంలో ఉండి ఊర్లు తిరుగుతుండడం వల్ల ..కొడుకు వద్దకు వెళ్లకుండా ఊర్లోనే ఒక్కడే ఉండేవాడు.కొడుక్కి కూడా ఆస్తిపాస్తులు బాగానే సంపాదించి ఇచ్చాడు.3 సంవత్సరాల క్రిందటి నుండి మంచం పట్టాడు. చేసేది లేక తండ్రిని తీసుకెళ్లి తనదగ్గరే ఉంచుకున్నాడు కొడుకు.

కొడుకు తన భార్య కోరికపై తన అత్తగారి కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలనుకున్నాడు.
తండ్రిని ఎక్కడ ఉంచాలనే ప్రసక్తివచ్చింది.
తిరిగివచ్చే 10 రోజుల వరకు ఏదైనా వృద్ధాశ్రమంలో ఉంచుదామని సలహా ఇచ్చాడు సడ్డకుడు(తోడల్లుడు).

"లేదు!ఇలా మంచంమీదనే ఉండేవాళ్ళని తీసుకోరు! అదీగాక, ఇతరుల దృష్టిలో కూడా బావుండదు! "అంది భార్య.

చివరకు అనేక చర్చల తర్వాత ముందర ప్రత్యేకంగా ఉన్న ఒకరూంకు తండ్రిని షిఫ్ట్ చేసి ఇల్లుకు తాళం వేసుకుని 10 రోజులవరకు తండ్రిని చూడడం కోసం ఒక వ్యక్తిని కిరాయి మాట్లాడి టూర్ కు బయలుదేరారు.

ఎందుకు భారం అనుకున్నాడో ఏమో కాని, అదే రోజు రాత్రి తెల్లరేటప్పుడు గుండెపోటుతో మరణించాడు.

టూర్ వెళ్లిన అందరూ అర్ధాంతరంగా రావలసి వచ్చింది.అంత్యక్రియల కోసం స్వగ్రామం వచ్చారు.అంత్యక్రియలకు ఊరుఊరంతా హాజరయ్యారు. తర్వాత జరిగే కర్మకాండలో దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారు.

"బతికిఉన్నన్నినాళ్ళు ఏం కష్టపెట్టాడ్రా??మీ నాన్నా!!" అడిగింది పెద్దావిడ.

"నీకేం తెలుసే అత్తమ్మా! 3 సంవత్సరాల నుండి ఎంత నరకం చూస్తున్నామో!!

ఈ ఆరునెలల నుండి మరీనూ!! అన్నీ మంచం మీదే!!
వాటికోసం పెద్దజీతానికి మనిషిని మాట్లాడవలసి వచ్చింది.
వాడు రాత్రికి ఉండడు కదా!..రాత్రంతా మేమే సేవ చేయవలసి వచ్చేది!" అన్నాడు కొడుకు సమాధానంగా...

"అదొక్కటేనా!!!!
చాలా రాత్రివరకు కూడా కాళ్ళు నొక్కించుకుంటూనే ఉండేవాడు..తొందరగా వదిలిపెట్టేవాడు కాదు!!" చెప్పాడు అతని మామ కూడా అల్లుడికి సపోర్ట్ గా!!

" ఓహో అంతేనా!
నీకు చిన్నప్పుడు రెండు  సంవత్సరాల పాటు ఆల్బమినో..గిల్బమినో ఎక్కువై రోగం పడితే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....

మీ అమ్మ చనిపోయిన తర్వాత బెంగతో మానసికంగా కృంగిన నీకు ఫీట్స్ వస్తుంటే..సంవత్సరం పాటు నిన్ను కనిపెట్టుకుని సేవచేస్తూనే ఉన్నాడే!!..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....

మీ అమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళిచోసుకోరా!! అంటూ మేమెంత పోరినా "వచ్చేదేలాంటిది వస్తుందో నా కొడుకు దిక్కులేనివాడౌతాడే!! "అంటూ నీ కోసం తనసుఖాలన్నీ వదులుకున్నాడుగా!!..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....

"నేను దరిద్రంలో పుట్టి పెరిగాను..నా కొడుక్కి అలాంటి పరిస్థితి రావద్దని తన చెమటంతా దారపోసి జాగలు.. భూములు.. నగా నట్రా అన్నీ జమచేసి ఇచ్చాడుగా!!..అదికదా!! మీ నాన్న నిన్ను సాధించడమంటే.....

నువ్వెప్పుడు బిజీగా ఉంటావు..ఫోన్ చేస్తే నీకెక్కడ ఇబ్బంది కలుగుతుందేమోనని ఫోన్ చెయ్యడానికి కూడా వెనుకాముందయ్యేవాడు..
నీతో మాట్లాడుదామనుకున్న మాటలన్ని ఒక డైరీలో రాసేవాడు.. మీ నాన్నమీద ప్రేముంటే ఇంట్లో వెతికి చదువురా దాన్ని!!

పగలనకా రాత్రనకా కష్టపడి నీకోసం ముప్పై ఏండ్లు సేవచేసినోడికి మూడేండ్ల సేవ చేయడం "సాధించడం " క్రిందకైంది కదూ!!నీకు!

అయినా ఎలా తెలుస్తుందిలే!!మీ నాన్న విలువా!!ఎప్పుడూ హాస్టల్లోనే ఉన్నాడివాయే!! తండ్రి కష్టం..విలువా..బంధం చూస్తేనే కదా తెలిసేది!!
చూసినా తెలుసుకునే కాలం కూడా కాదిది!!

పెద్దసంబంధం!! సుఖపడతావని.. పెళ్లిచేసాడు..

ఎవరో మహాకవి అన్నాట్టా!!

" సముద్రం వద్దకు ముత్యాలేరుకుందామనే ఆశతో వెళ్ళాను! చివరకు ఆ సముద్రమే మింగివైచినది!!"అని.

అలా అయింది మీ నాన్న పరిస్థితి.

ఏమయ్యా పెద్దమనిషి !నువ్వైనా చెప్పొద్దూ!!
ఎన్నడూ కొడుకుని కష్టపెట్టనివాడు అంతసేపు కాళ్ళు ఎందుకు నొక్కిచ్చుకున్నాడో!!!....

ఈ లోకంలో అన్నిటికన్నా పెద్ద సుఖం "పుత్రపరిష్వంగమేనయ్యా"!!! ..పెద్ద పెద్ద గ్రంథాలు కూడా చెబుతున్నాయావిషయం. కొడుకుని కావలించుకోవడం వల్ల పొందే సుఖం ఇంకెక్కడా దొరకదయ్యా!!

ఆ వయస్సులో భార్య..ప్రియురాలు.. ఎవరి స్పర్శ సుఖమనిపించదు.. ఏ వయస్సులోనైనా సుఖాన్నిచ్చేది తన సంతానం స్పర్శనేనయ్యా!!

ఇదికూడా తెలియక పేద్ద.. చెప్పొచ్చావ్!!

తన చివరి వయస్సులోనైనా కొడుకుతో ప్రేమసుఖం పొందడానికేనయ్యా!! వాడు కాళ్ళు నొక్కించుకున్నది!!

నీకూ వయసొస్తుంది! అప్పుడర్థమైతుందయ్యా ఇదంతా!!""

తల్లిలేదు! తండ్రిలేడు!!
ప్రేమలేదు!బంధం లేదు!!
కాలమా!! ఎలా అయిపోతివే!!!""

అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది పెద్దావిడ !!!!!

అప్పుడేడ్చాడు కొడుకు
నిజంగా..
గుండె పగిలేలా..మనుసునిండా..
తండ్రి గుర్తొచ్చి..
తండ్రిప్రేమ గుర్తొచ్చి..
తండ్రి చేసిన త్యాగాలు గుర్తొచ్చి..
తన జీవితమంతా కళ్ళముందు కదిలి..
...పశ్చాత్తాపంతో

అతన్ని చూసి కోడలూ..వియ్యంకుడు.. బంధువులు.. ఇలా అందరూ ఏడవసాగారు.

కొందరికి తమ తమ తండ్రి గుర్తుకురాగా!..
మరికొందరికి తమ తండ్రితనం..పిల్లలకోసం పడిన కష్టం గుర్తుకురాగా!!
ఇంకా కొందరికి ఆ పెద్దావిడ"కాలమా!! ఎలా అయిపోతివే!!!" అంటూ ఏడుస్తున్న విధానాన్ని చూస్తూ తమ కాలం ఎలా ఉండబోతోందో అనే వేదన కలగడం వల్ల.....

పుత్రధర్మాన్ని కావుమంటూ(రక్షించుమంటూ)
అప్పుడొచ్చాయి ఒక్కసారిగా!
కావు.. కావు మంటూ!!
అంతవరకు ఎక్కడాలేని కాకులు!!!
"కాకిపిండాన్ని " తినడానికి!

***
*కైలాస నగరం -2*
🔱

రచన: శ్యాంబాబు

"వెల్ కం మిస్టర్ విశాల్ ! యు ఆర్ వెరీ పంక్చుయల్" అన్నాడు ఫైర్ ప్లేస్ ముందు స్ప్రింగ్ కుర్చీలో ముందుకూ వెనక్కూ ఊగుతున్న వ్యక్తి, ఉదయం ఫోన్ లో కంఠస్వరం ఆ వ్యక్తిదే.

నేను మెల్లిగా అడుగులు వేస్తూ ఆతని దగ్గరికి నడిచాను. క్షణం పాటు అతనివైపు సూటిగా చూశాను.

నున్నగా పైకి దువ్వుకొన్న జుట్టు, ఎత్తయిన తల, నలుపుకాదు. లాగ్ ఫైర్ కాంతిలో స్పష్టంగా తెలియడంలేదు. బహుశా కాఫీ రంగు అయ్యుండాలి. అక్కడక్కడా కణతల దగ్గిర నెరసింది. విశాలమైన నుదురు, సన్నని కనుబొమల క్రింద పెద్ద కళ్ళు, ఆకాశరంగు, పొడవుగా చివర కొక్కెంలా వంపు తిరిగిన ముక్కు, నున్నగా గీసుకొన్న పై పెదవి. బిగించిన నిండు పెదిమలు, స్పష్టంగా కనిపిస్తోన్న దవడ ఎముకలు.

అతను చేతిలోని గ్లాస్ ప్రక్కనే వున్న టీపాయ్ మీద పెట్టి నవ్వుతూ లేచి నిలబడ్డాడు.

నిలబడితే నాకన్నా దాదాపు మూడు అంగుళాల ఎత్తున్నాడు. "థాంక్స్ ఫర్ ఒబ్లయిజింగ్ !" అన్నాడు చెయ్యి ముందుకు చాస్తూ.

నేనతని చేతివైపు నిదానంగా చూశాను. వెడల్పుగా బలమైన వేళ్ళు.

“అపరిచితులతో చేతులు కలిపే అలవాటు లేదు నాకు" అన్నాను!

చిన్నగా నవ్వాడతను. "ఓ అయామ్ సారీ మిస్టర్ విశాల్. ఆయామ్ గాడ్సన్, బాబ్ గాడ్సన్. ఫ్రమ్ డెట్రాయిట్" అన్నాడతను.

నేను మౌనంగా అతనితో కరచాలనం చేశాను.

"ప్లీజ్ సిడవున్ ! మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ " అన్నాడు గాడ్సన్ తన ఎదురుగా వున్న కుర్చీ చూపెట్టి తను కూర్చొంటూ.

నేను కుర్చీలో కూర్చొంటూ ఆ గదిలో వున్న మరో వ్యక్తివైపు చూశాను.

నా చూపు గమనించి గాడ్సన్ నవ్వాడు. "హి ఈజ్ సాటో ! నా బాడీగార్డు! మేజర్ డెమీలాంటివాడు. అతనెప్పుడూ నా వెంటే వుంటాడు" అన్నాడు.

సాటో మా ఇద్దరికీ డ్రింక్స్ తెచ్చిపెట్టి తను గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు.

"బిమాన్ హత్య గురించి నీకేం తెలుసు?" అన్నాను సూటిగా విషయానికి వస్తూ.

గాడ్సన్ తన విస్కీ ఓ గుటకవేసి నవ్వాడు. “నాట్ సో ఫాస్ట్ ! టేకిట్ ఈజీ, ముందు నన్ను గురించి నేను చెప్పుకోనియ్యి" అన్నాడు.

ఇంతకుముందే చెప్పినట్లు నేను అమెరికన్ని. సంపీపుల్ కాల్ మి ఏన్ అమెరికన్ మిలియనీర్. డెట్రాయిట్ లో వున్న అనేక మోటారు కంపెనీలలో నేను షేర్ హోల్డర్ ని. డైరెక్టర్ ని. బహుశా డెట్రాయిట్ ఎక్కడ వుందో మీకు తెలుసనుకొంటాను."

తెలుసన్నట్లు తల ఊపాను నేను. అమెరికా పశ్చిమ తీరంలో చికాగో నగరానికి దగ్గరగా ఉంది డెట్రాయిట్. ఒక రకంగా అమెరికన్ మోటారు పరిశ్రమ కేంద్ర స్థానం అని చెప్పాలి.

"ఓసారి పాస్ పోర్టు, వీసా చూస్తే నీకే అనుమానమూ ఉండదనుకొంటాను" అన్నాడు గాడ్సన్ టీపాయ్ మీద వున్న ఆ రెండింటినీ నా చేతికిస్తూ.

అతని పాస్ పోర్టుని, వీసాని ఓసారి చూసి పక్కన పెట్టేశాను. అతను బాబ్ గాడ్సన్ కాదనడానికి ఆధారం ఏమీలేదు. పాస్ పోర్టులో వున్న ఆతని ఫోటో ఆ విషయం స్పష్టంచేస్తోంది. అంతేకాదు. అతను భారతదేశానికొచ్చి సరిగ్గా ఆరురోజులైనట్లు కూడా వీసాలోని ఎంట్రీ స్టాంప్ వల్ల తెలుస్తోంది.

"ఇక అసలు విషయానికొస్తాను. నేను పారిశ్రామికవేత్తనే. అయినప్పటికీ, లక్షలకు అధికారినయినా అందరూ అనుకొనేంత బిజీ మనిషిని కాదు, నా తరపున బిజినెస్ మేనేజ్ చేయటానికి ఎందరో బ్రిలియంట్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ లు, సొలిసిటర్లు, అకౌంటెంట్లు వున్నారు. డబ్బు ఈ ప్రపంచం లో చేయలేని పని దాదాపు ఏదీలేదు. అంచేత చేతినిండా డబ్బు, దాన్ని ఖర్చు పెట్టడానికి సమయం వున్నాయి నాకు. అయితే కొంతమంది మిలియనీర్లలా నేను గాంబ్లింగ్, ఇతర అలవాట్లలో నా సమయాన్ని, డబ్బును నేనెప్పుడూ వృథా చెయ్యలేదు. కొన్ని ప్రత్యేక హాబీలలో నా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాను. అందులో మొదటిది మౌంటెనీరింగ్, రెండవది పాత పుస్తకాల సేకరణ.

మౌంటినీరింగ్ లో నీఅంత పేరుప్రఖ్యాతులు లేకపోయినా రాఖీ, ఆండిస్ మొదలైన పర్వతశ్రేణుల్లోని కొన్ని ఎత్తయిన శిఖరాల ను నేనూ ఇంకా కొందరు పర్వతారోహకుల బృందంతో కలిసి ఎక్కాసు" గాడ్సన్ విస్కీ ఓ సిప్ చేసి సిగరెట్ దమ్ములాగి నా వంక చూశాడు.

"వెరీ ఇంటరెస్టింగ్ మిస్టర్ గాడ్సన్"అన్నాను నేను... అతన్ని మరింత పరిశీలనగా చూస్తూ.... పర్వతారోహణ అతని హాబీ అయితే అది నాకు వృత్తి...

ప్రతి సంవత్సరం అనేకమంది ఔత్సాహిక పర్వతారోహకులకు శిక్షణ ఇస్తుంటాను నేను. నేను శిక్షణ ఇస్తున్న ఓ బృందం వచ్చే వేసవిలో ఎవరెస్టు పర్వతాన్ని మరోసారి అధిరోహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంచేత గాడ్సన్ తాను పర్వతారోహకుణ్ని అని చెప్పగానే అతని మీద వెంటనే నాకు మరింత ఇంటరెస్టు కలిగింది.

గాడ్సన్ బలమైన చేతులు పొడవుగా ఉన్నా, బలంగా ఉక్కు తీగెలా ఉన్న అతని శరీరం అతని మాటల్ని ధృవపరుస్తున్నా యి. బలమైన చేతులు లేని మనుషులు పర్వతారోహణకు ఏ మాత్రం పనికిరారు.

"ఇక నా రెండవ హాబీ పాత పుస్తకాల సేకరణ అని చెప్పాను. నా పర్సనల్ లైబ్రరీ లో ఇప్పటికి దాదాపు పదివేల పుస్తకాలు ఉన్నాయి. అందులో చాలా వరకూ పందొమ్మిదవ శతాబ్దంలో ప్రచురితమైన గ్రంధాలే, ఇలా నేను సేకరించిన పుస్తకాల లో పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగంలో సరిగ్గా చెప్పాలంటే పద్దెనిమిది వందల తొంభై ఆరులో ప్రచురింపబడిన పుస్తకం ఒకటి ఆదృష్టవశాత్తు గత సంవత్సరం నాకు లభించింది. అది భారతదేశంలో బ్రిటిష్ సైన్యంలో మేజర్ గా పనిచేసిన స్మిత్ అనే బ్రిటిషర్ రాసిన పుస్తకం.

భారతదేశంలో ఉండగా తన అనుభవాల ను స్మిత్ అప్పట్లో ఒక పుస్తకరూపంలో ప్రచురించాడు. ఆ పుస్తకంలో హిమాలయ పర్వతాల గురించి కొన్ని చిత్రమైన విషయాలు రాశాడు స్మిత్.

స్మిత్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడే ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరంగా పరిగణించబడుతోన్న మౌంట్ ఎవరెస్ట్ కనుగొనబడింది. ఆయితే అదే సమయం లో హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరంకన్నా ఎత్తయిన శిఖరం ఒకటున్నదవి, సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసుల్లో జరిగిన పొరపాటు వల్ల, ఆ శిఖిరానికి బదులు మరో శిఖరాన్ని ఎత్తయిన శిఖరంగా ప్రకటించారని కొన్ని వాదోపవాదాలు బయలుదేరాయి.

స్మిత్ ఈ విషయాన్ని గురించి వ్రాస్తూ, ఈ వాదనలో కొంత నిజం వున్నదనీ, మౌంట్ ఎవరెస్ట్ కనుగొనక పూర్వం నుండీ టిబెటన్ల కు టికెట్ లో ఉండే బౌద్ధమత గురువులైన 'లామా'లకు ప్రపంచంలో ఎత్తయిన శిఖరం హిమాలయాల్లో వున్నట్లు తెలుసుననీ, దాన్ని వారు 'షాంగ్రీలా' అని పిలుస్తారని స్మిత్ వ్రాశాడు.

అంతేకాకుండా ఈ 'షాంగ్రీలా' ఖచ్చితంగా ఏ ప్రాంతంలో వున్నదీ, దాన్ని ఏ రకంగా చేరుకోవలసిందీ ఈ బౌద్ధ 'లామా'లకు తెలుసుననీ, కాని మతరీత్యా వున్న కొన్ని అభ్యంతరాలవల్ల వారు మౌనంగా ఉంటున్నారనీ మేజర్ స్మిత్ వ్రాశాడు.

నిజానికి టిబెటన్ భాషలో 'షాంగ్రీలా' అంటే 'దేవతలు విహరించే స్థలమని' అర్థం.. తాము పవిత్రంగా భావించే ఆ ప్రదేశంలోకి నాగరిక మానవులు దాడిచెయ్యడం ఇష్టం లేక 'షాంగ్రీలా” ఎక్కడవుందో తెలిసినా టిబెటన్ లామాలు బయటపెట్టడంలేదని స్మిత్ వ్రాశాడు.

ఈ విషయం చదివిన వెంటనే నాకు హఠాత్తుగా ఈ హిమాలయాల మిస్టరీమీద ఇంట్రస్టు కలిగింది. వెంటనే హిమాలయాల గురించి నాకు దొరికినంత వరకూ సమాచారాన్ని సేకరించాను.

నేను సేకరించిన సమాచారం బట్టి స్మిత్ వ్రాసిన దానిలో చాలా వరకూ నిజం ఉన్నదని ఆర్థమయింది నాకు.

కాని నిరంతరం మంచులోనూ, మంచు మబ్బుల్లోనూ కప్పబడి ఉండే ఈ చల్లటి హిమాలయాల్లో ఎవరెస్ట్ కన్నా ఎత్తయిన శిఖరం ఏ ప్రాంతంలో ఉంటుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు.”

ఒక్క నిమిషం చెప్పడం ఆపి, కాలిపోయిన సిగరెట్ ని  ఫైర్ ప్లేస్ లోకి విసిరేసి మరోటి వెలిగించాడు గాడ్సన్.
🗻
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*ప్రాంజలి ప్రభ *

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*ఆరోగ్యం.. ఆనందం.. ఆధ్యాత్మికం *

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 6281190539*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂


 



ప్రజానాం వినయాధానాద్రక్షాణాద్భారణాదపి

స పితా పితరస్తాసాం కేవలం జన్మ హేతవ

(రఘువంశం కాళిదాసు)

దిలీపుడు తన ప్రజలకు విద్యనేర్పించడం  ద్వారా , రక్షించడం ద్వారా, అన్నపానాదులు కల్పించి పోషించడం ద్వారా ఆయనే ప్రజలందరికీ తండ్రి (వంటి వాడు) అయ్యాడు . ఇక వారి వారి (తల్లి)దండ్రులు కేవలం జన్మహేతువులుగానే మిగిలిపోయారట . అంటే దేశరక్షణ , విద్య, పోషణ బాధ్యతలు  అన్నీ స్వయంగా  ఆయనే చూచుకునే వాడని భావం.


07/05, 7:51 pm] . Mallapragada: *టామ్ సాయర్ - 1*

🧑‍🌾


రచన : మార్క్ ట్వేన్


అనువాదం :  నండూరి రామమోహన్ రావు


*ఉపోద్ఘాతం*


ఈ పుస్తకంలో వర్ణించిన సాహసాలలో చాలామటుకు నిజంగా జరిగినవే. వాటిలో ఒకటి రెండు నా సొంత అనుభవాలు. మిగిలినవి నా సహాధ్యాయుల అనుభవాలు. హక్ ఫిన్ లాంటి బాలుడు నిజంగా వుండేవాడు. టామ్ సాయర్ కూడా అంతే. కాని, టామ్ ఒకడు కాడు. నాకు తెలిసిన ముగ్గురు బాలర గుణగణా లను చేర్చితే టామ్ పాత్ర తయారైంది.


ఈ నవలలో పేర్కొన్న చిత్ర విచిత్రమైన నమ్మకాలు ఈ కథ జరిగిన రోజులలో — అంటే ఇప్పటికి ముప్పయి, నలభై ఏళ్ళ క్రిందట అమెరికా పశ్చిమ రాష్ట్రాలలో పిల్లలలోను, బానిసలలోను నిజంగా వుండేవి.


నా పుస్తకం ప్రధానంగా బాలురకు, బాలికలకు వినోదం కోసం వ్రాసినదైనా, ఆ కారణాన పెద్దవాళ్ళు దీన్ని చదవడం మానరని ఆశిస్తున్నాను. పెద్దవాళ్ళు తమ చిన్నతనంలో తాము ఎలా వుండేవారో, తమ ఆలోచనలు ఎలా వుండేవో, తాము ఎలా మాట్లాడేవారో, ఏ చిత్రమైన సన్ని వేశాలలో తాము చిక్కుకునేవారో వారికి ఆహ్లాదకరంగా జ్ఞాపకం చేయడం కూడా ఈ నవలా రచన ఉద్దేశాలలో ఒకటి.


మార్క్ ట్వేన్


(హార్ట్ ఫోర్డ్, 1876)

###############


*కధ*


"టామ్!"


జవాబు లేదు.


"టామ్!"


జవాబు లేదు.


"వీడెమైనట్టు? ఒరే, టామ్ ?"


జవాబు లేదు.


ముసలావిడ కళ్ళజోడు ముక్కుచివరికి లాగి దానిమీదుగా గది అంతటా కలయ చూసింది. తరువాత కళ్ళజోడు పైకి లాగి దానికిందుగా చూసింది. కుర్రాడిలాంటి చిన్న వస్తువు కోసం కళ్ళజోడులోంచి చూడడం ఆవిడకి అలవాటు లేదు. ఆయినా అది అలంకారార్థం కళ్ళజోడు గాని, అవసరానికి కళ్ళజోడు కాదు. దానిలోంచి చూసినా ఒకటే, రెండు చిల్ల పెంకుల్లోనుంచి చూసినా ఒక్కటే. ఆవిడ కాస్సేపు విస్తుపోయినట్టు కనబడి తర్వాత కుర్చీలకి, బల్లలకి వినిపించేలాగా, "ఈసారి దొరకవూ, అప్పుడు నీ పని …” 


ఆవిడ మంచంకింద గడచీపురుతో పొడవడం కోసం వంగడంచేత మాట మధ్యలో ఆపవలసి వచ్చింది. మంచం కింది నుంచి పిల్లి మాత్రమే పైకొచ్చింది.


"ఈ వెధవ అంతు తేలకుండా వుంది."


ఆవిడ పెరటివాకిలి దగ్గిరకి పోయి దొడ్లో పాదులన్నీ పరీక్షించింది. టామ్ లేడు. అందుకని అవిడ గొంతెత్తి బాగా దూరం వినిపించే లాగ, "ఓరే-ఏ-ఏ, టామ్!" అని కేకపెట్టింది.


తన వెనక అలికిడి కాగా ఆమె వెనక్కు తిరిగి, పారిపోతున్న కుర్రాడిని కాస్తా పట్టేసింది.


"అలమారు మాట తట్టనేలేదు. ఏం చేస్తున్నావందులో? "


"ఏం లేదు"


"ఏం లేదూ! నీ చేతులు చూడు. మూతి చూడు. ఏమిటది?"


"నాకు తెలీదు, పెద్దమ్మా."


"నాకు తెలుసు, వెన్న తెలిసిందా. దాని జోలికి పోతే తాట వొలుస్తానని నలభై సార్లు చెప్పా. ఆ బెత్తం ఇలాతే."


బెత్తం మీదపడడానికి సిద్ధంగా వుంది —


"అమ్మో, నీ వెనకేమిటి, దొడ్డమ్మోయ్ ?"


ముసలావిడ కంగారుపడి వెనక్కు తిరిగే సరికి కుర్రాడు ఒక్క పరుగుతీసి, పిట్టగోడ మీదుగా దూకి మాయమైనాడు. ఆవిడ నవ్వింది.


"వీడి కడుపుడకా! నా తెలివి తగలడ్డట్టే వుంది. ఎన్నిసార్లు వాడు టోకరా ఇచ్చినా మళ్ళీ మళ్ళీ మోసపోతూనే వుంటా. అయినా ఒకసారి వేసిన ఎత్తు మరోసారి వెయ్యడుగా, నన్నెట్లా ఏడిపించాలో వాడికి సరిగ్గా తెలుసు. ఒక్కక్షణం ఏమరుపాటున వుండి నవ్వితినా, చెయ్యి చచ్చుపడుతుం దాయె. కొట్టకపోతేనేమో మకురుతనం నేర్చి ఎందునా కాకుండా పోతాడాయె. కొడదామన్నా, పిచ్చి వెధవ, తల్లి లేనివాడే అనిపిస్తుంది. కొట్టకపోతే రేపు పని చేయించాలి. శనివారంనాడు పిల్లలందరూ ఆడుకుంటూంటే వాడు పని చేస్తాడూ? అసలే పనికి మొండి. చూస్తూ ఊరుకుంటే నేమో చెడిపోతాడు" అనుకున్న దావిడ. 


టామ్ రోజల్లా ఆడుకుని కులాసాగా గడిపి యింటికి వచ్చాడు. వాడింటికి వచ్చేసరికి నీగ్రో కుర్రాడు జిమ్ రేపటికని పేళ్ళు పగలేస్తున్నాడు. టామ్ జిమ్ కి తోడు పడ్డాడు. తోడుపడడమంటే మూడు వంతులు పని జిమ్ ని చెయ్యనిచ్చి తాను రోజల్లా చేసిన పనులను గురించి వాడికి కబుర్లు చెప్పాడు. టామ్ తమ్ముడు సిడ్ (సొంత తమ్ముడు కాదు) తనవంతు పని పూర్తి చేశాడు. వాడు నెమ్మదైనవాడు. 


టామ్ అన్నం తింటూ, వీలు దొరికినప్పు డల్లా పంచదార చాటుగా బొక్కుతూవున్న సమయంలో పోలీపెద్దమ్మ టామ్ ని పట్టుకోవడానికని ఎంతో యుక్తిగా ప్రశ్నలు వేసింది.


"ఇవాళ బళ్ళో చాలా వేడి అనిపించింది కదూ ?"


"అవును, పెద్దమ్మా."


"వడగొట్టింది కదూ?"


"అవును, పెద్దమ్మా."


"నువ్వు ఈతలకు పోలేదా, టామ్"


టామ్ ఉలిక్కిపడ్డాడు.


"లేదు, పెద్దమ్మా."


ముసలావిడ టామ్ చొక్కా ముట్టుకు చూసింది.


"నీ వొళ్ళేమంత వేడిగా లేదే?"


టామ్ రానున్నది ఊహించి, ముందుగానే "ఒకళ్ళమీద ఒకళ్ళం నీళ్ళు చల్లుకున్నాం. తల చూడు. ఇంకా తడిగానే వుంది" అన్నాడు.


తల తడిమి చూడనందుకు ముసలావిడ పశ్చాత్తాపపడింది. ఆవిడ కింకో ఆలోచన తట్టింది.


"ఒకళ్ళ నెత్తిన ఒకళ్ళు నీళ్ళు చల్లుకుంటే చొక్కా ఊడదీయక్కర్లేదుగా? కాలరు అంటగుట్టానే, సరిగా వుందో లేదో చూపించు" అన్నదావిడ.


టామ్ చూపించాడు. చొక్కా కాలరు కుట్టేవున్నది.


"సరే, పద. గొట్టికాయలాడి ఈతలు కొట్టావేమో అనుకున్నా. నీతోచిక్కేమిటంటే నువ్వు పైకి కనపడ్డంత చెడ్డ వెధవ్వి కావు — ఈ తడవ."


టామ్ ఈసారన్నా సరిగా ప్రపర్తించినందు కావిడ కొంత సంతోషించింది.


"నుపు తెల్లదారంతో వాడి చొక్కా అంటగుట్టావేమో, ఇప్పుడు నల్లదారం వుంది" అన్నాడు సిడ్.


"అవును, తెల్లదారంతోనే కుట్టా!"


కాని టామ్ అక్కడ నిలవలేదు. వాడు బయటికి పోతూ, "ఒరే సిడ్, నీ తాట ఒలుస్తా!" అన్నాడు.


టామ్ దగ్గిర రెండు సూదులున్నాయి. ఒక దానికి తెల్లదారమూ, మరో దానికి నల్ల దారమూ వుండనే వున్నది. కాని పోలీ పెద్దమ్మ ఎప్పుడు ఏ దారం పెట్టి కుట్టినదీ వాడికి సరిగా జ్ఞాపకం వుండదు.


టామ్ బుద్ధిమంతుడు కాడు. గ్రామంలో కల్లా బుద్ధిమంతుడనిపించుకున్న కుర్రాణ్ణి చూసి వాడు ఏవగించుకునేవాడు.


పెద్దవాళ్ళకు వాళ్ళ కష్టా లెటువంటివో, టామ్ కి వాడి కష్టాలూ అటువంటివే. కాని, ఇప్పుడు వాడొక కొత్తవిద్యని అభ్యసించ వలసిఉండడం చేత వాటినిమర్చిపోయా డు. ఆ విద్య ఏమిటంటే ఈల వెయ్యడం. టామ్ కి ఎవరో నీగ్రోవాడు ఈల వెయ్యడం నేర్పాడు. ఈ విద్యను టామ్ సావధానంగా అభ్యసించాడు. త్వరలోనే వాడికది పట్టుబడింది. టామ్ వీధి వెంట ఈల వేసుకుంటూ వెళ్ళాడు.


వేసవికాలం, ఇంకా చీకటిపడలేదు. కొంత దూరం వెళ్ళి టామ్ ఈల వెయ్యడం ఆపాడు. వాడికి ఎదురుగా ఒక కొత్త  కుర్రవాడు, వాడికన్న కొంచెం పెద్దవాడు కనిపించాడు. కుగ్రామమైన సెంట్ పీటర్స్ బర్గ్ ప్రజలను కొత్తవాళ్ళు వెంటనే ఆకర్షిస్తారు. అందులో ఈ కుర్రవాడు, ఆదివారం కాకపోయినా, మంచి దుస్తులు వేసుకుని వున్నాడు. ఈ కుర్రవాడి నెత్తి మీద అందమైన టోపీ వున్నది. మెరిసే నీలం కోటూ, పంట్లామూ, కాళ్ళకి బూట్లూ వేసుకున్నాడు. అందమైన నెక్ టై పెట్టుకున్నాడు. వాడి బస్తీ వాలకం చూసి టామ్ దహించుకుపోయినాడు. వాణ్ణి చూస్తున్నకొద్దీ తన దుస్తులు చాలా కుళ్ళువిగా తోచసాగాయి.


ఇద్దరూ ఒకరి కొకరు ఎదురుగా నిలబడి చాలాసేపు మౌనంగా చూసుకున్నారు.

🧑‍🌾

*ఇంకా ఉంది*


꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂సేకరణ 

*ప్రాంజలి ప్రభ * 


*ఆరోగ్యం.. ఆనందం.. ఆధ్యాత్మకం * 


*1 YEAR* *SUBSCRIPTION 120/-*

*phone pe & Gpay to 6281190539

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

[07/05, 8:08 pm] . Mallapragada: *కైలాస నగరం -1*

🔱


రచన: శ్యాంబాబు


డార్జిలింగ్ స్టేషన్ లో రైలు ఆగేప్పటికి రాత్రి ఏనిమిదయ్యింది. సన్నని ఈదురుగాలితో పాటు జోరుగా వాన పడుతోంది.


కంపార్టుమెంట్ లోనే సూట్ కేస్ తెరచి రెయిన్ కోటు బయటికి తీశాను. స్టేషనుకు కారు తీసుకురమ్మని కలకత్తాలో బైలుదేరే ముందు నా నౌకరు బిమాన్ కి టెలిగ్రామ్ ఇచ్చాను.


వర్షం వలన చాలా చలిగా వుంది. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడంవల్ల వేసవిలోనే అతి చల్లగా ఉంటుంది డార్జిలింగ్. ఇక వర్షాకాలంలోనూ, శీతా కాలంలోనూ చెప్పక్కరలేదు. ఉలెన్ హుడెడ్ టోపీని చెవులమీదకు లాక్కొని ప్లాట్ ఫారం మీదకు దిగాను.


ఎక్కడా బిమాన్ జాడలు తెలియడంలేదు. నా టెలిగ్రాం అందిందో లేదో.... వర్షాకాలం లో తరచు టెలిగ్రాఫ్ స్తంభాలు పడిపోయి లైన్లు పాడయిపోతూ వుంటాయి. బహుశా అంది వుండదు. అందివుంటే తప్పక స్టేషన్ కి వచ్చి ఉండేవాడే.... ఇప్పుడిక ఏ టాక్సీ లోనో వెళ్ళాలి ఇంటికి.


స్టేషన్ బయట ఒకే ఒక టాక్సీ వుంది. పోర్టరు సూట్ కేస్ న్ను ముందుసీట్లో పెట్టాడు. నేను సిగరెట్టు పారేసి లోపల కూర్చున్నాను. టాక్సీ రయ్యిన డార్జిలింగ్ వీధుల్లో నుండి దూసుకుపోసాగింది. క్రెయిటన్ పాయింట్ చేరుకొనేప్పటికి వర్షం తగ్గిపోయింది. సన్నగా తుంపర పడుతోంది.


ఇంటిముందు టాక్సీ దిగి డబ్బు డ్రైవర్ కి చెల్లించాను. టాక్సీవాడు చిన్న సలాంచేసి టాక్సీ తిప్పుకొని వెళ్ళిపోయాడు.

📖


క్రెయిటన్ పాయింట్ చివరి ఇల్లు నాదే. ఎప్పుడో దాదాపు ఎనబై ఏళ్ళ క్రితం మా తాతగారు కట్టించినది. మా ఇంటికి కాస్త ఆవతలికి రోడ్డు ఆగిపోతుంది. అవతలి లోయలోకి ఎవరూ ప్రమాదవశాత్తు వెళ్ళ కుండా ఆరడుగుల ఎత్తున బలమైన కాంక్రీటుగోడ నిర్మించారు.


కొండ అంచున అన్ని వాతావరణాలకు తట్టుకొనేట్లు కట్టిన ఇల్లది. కట్టడంలో పురాతన బ్రిటిష్ నిర్మాణ పద్ధతి స్పష్టంగా కనిపిస్తోంది. పోర్టికో లోని ఎలక్ట్రిక్ దీపం కాంతి చెట్ల ఆకులమీద పడి చిత్రంగా మెరుస్తోంది. గాలికి పొడవాటి ఆ చెట్లు అటూ ఇటూ ఊగుతున్నాయ్. 


ఇంట్లో ఎక్కడా దీపాలు వెలుగుతున్నట్లు లేవు.... బిమాన్ ఇంట్లో లేడా?


బిమాన్ లేకపోయినా టైగర్ ఏమైనట్లు....? టైగర్ మొరగదే....? బయట తలుపుమీద చెయ్యివేశాను. గడియవేసిలేదు. నిశ్శబ్దంగా గేటు లోపలకు కదిలింది. క్షణం సేపు ఆశ్చర్యం వేసింది నాకు. చకచక పోర్టికోలో నుండి వరండా వైపు అడుగులు వేశాను.


కాంక్రీటు బాటమీద బూట్ల చప్పుడు ఒంటరిగా వినిపిస్తోంది. ఇంటి ముఖ ద్వారం తలుపులు వేసివున్నాయి. తలుపు తోశాను.... తెరుచుకోలేదు. లోపల గడియ వేసి ఉండాలి. అయితే బిమాన్ ఇంట్లో ఉన్నాడా ? ఉంటే తలుపు తెరవడేం? ఎందుకో నా మనసు కీడు శంకించసాగింది.


కాలింగ్ బెల్ మీద వేలితో నొక్కాను. లోపల బజర్ మ్రోగుతోన్న శబ్దం స్పష్టంగా వినబడుతోంది. బిమాన్ గాఢనిద్రలో 

ఉన్నాడా ? అతడు రాత్రి పదకొండుకుగాని నిద్రపోడతను. ఇంకా తొమ్మిది కూడా కాలేదు. ఇంట్లోంచి ఏ చప్పుడూ వినిపించలేదు.


చల్లగాలి తెర ఒకటే రయ్యిన వీచింది. ఇంటిముందు సింకోనా చెట్లు చిత్రమైన శబ్దంచేశాయి జుయ్ మంటూ. ఎందుకో తెలియకుండా గుండె జల్లుమంది. సూట్ కేస్ క్రిందపెట్టి, తెరిచి టార్చిలైట్ బయటకు తీశాను.


టార్చి వెలిగించి ఇంటి వెనుకవైపుకు నడిచాను. అంతా నిశ్శబ్దం. అక్కడ ఎలాంటి కదలికాలేదు.


"బిమాన్!" గట్టిగా పిలిచాను. నా ఆరుపుకు వెనుక కొండ గోడ నుండి చిన్న ప్రతిధ్వని వచ్చింది.


వెనుక తలుపు దగ్గరకి నడిచాను. తలుపు మీద చెయ్యివేసి మెల్లిగా నెట్టాను. నిశ్శబ్దంగా తలుపు తెరుచుకొంది. టార్చి వెలుతుర్ని ఫోకస్ చేశాను లోపలకు.


ఏదో తెలియని విచిత్రమైన సెన్సేషన్ కలుగుతోంది నాకు. గుర్తుతెలియని వాసన ముక్కుపుటాలకు తగుల్తోంది. టార్చి తిప్పుతూ వంటిల్లంతా కలియజూశాను, తలుపు పక్కనే ఉన్న స్విచ్ నొక్కాను. ఎల క్ట్రిక్ దీపం వెలుతురులో కిచెన్ కి డైనిం రూం కి మధ్య తలుపు తెరిచే వుంది.


గుమ్మంలో నిలబడి గదిలోకి టార్చి ఫోకస్ చేశాను. ఎవరూ లేరు. ఎదురుగా డైనింగ్ రూమ్ నుండి బయటి హాల్లోకి ఉన్న తలుపు తెరిచే కనబడుతోంది. గుండెలు ఎందుకో దడదడమంటున్నాయి. బిమాన్ ఇంట్లో లేడని తెలుసు...ఎక్కడ ఉన్నట్లు...? ఒకడుగు ముందుకు వేశాను.


చటుక్కున ఆగిపోయాను. ఏదో వాసన ఘాటుగా వస్తోంది. టార్చి వెలుగు గోడ మీద ఓ స్పాట్ లో ఆగిపోయింది. తెల్లని గోడమీద ఏదో మరక.... చిన్నపిల్లాడు నిండుగావున్న రంగు డబ్బాలో బ్రష్ ని ముంచి విదిలించినట్లు ఎరుపో, నలుపో తెలియడంలేదు.


మరో రెండడుగులు ముందుకు వేశాను. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది.... రక్తం! అవును రక్తం మరక.... ఆ వాసన రక్తం వాసన.. మరో అడుగు ముందుకు వేశాను. కాళ్ళక్రింద మెత్తగా ఏదో తగిలింది. టార్చిని కాళ్ళవైపు ఫోకస్ చేశాను.


టైగర్'! యస్! టైగర్.... తల చితికి.... రక్తం నుడుగులో పడి వుంది. మృత్యుకౌగిలిలో దాని పళ్ళు వికృతంగా, భయంకరంగా బైటికి పొడుచుకువచ్చి కనిపిస్తున్నాయి. వెన్నులోంచి చలి తన్నుకువచ్చి క్షణం పాటు ఒళ్ళు జలదరించింది.


బయట ఈదురు గాలితోపాటు హోరున వర్షం కురుస్తోంది.


చటుక్కున ఇంట్లోకి పరిగెత్తాను. వెళుతూ ఒక్కొక్క లైట్ వెలిగించుకొంటూ వెళ్ళాను.


హాలులో లైటు వెలిగించి క్షణంసేపు చుట్టూ చూశాను. ఒక్కసారి గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది.


హాలుకు, వరండాకు మధ్యవుండే తలుపు పక్కగా బిమాన్ పడి వున్నాడు. చకచక అతని దగ్గరికి నడిచాను. దగ్గరగా వెళ్ళి చూడగా తెలుస్తోంది.... బిమాన్ శరీరంలో ప్రాణంలేదని.


నుదుటి మధ్య ఎర్రని రంధ్రం, చిన్నది. అంచుల చుట్టూ నల్లగా మాడిపోయింది.

హత్య జరిగి గంట, రెండు గంటల కంటే ఎక్కువకాలేదు అనిపించింది.


నలభై ఏళ్ళు ఉంటాయి బిమాన్, నాకు పదేళ్ళు ఉంటాయేమో అతన్ని మొదటి సారిగా డొమెస్టిక్ సర్వెంట్ గా కలకత్తా నుండి తీసుకువచ్చినప్పుడు.... ఇప్పుడు నా వయసు ముప్పై. గత ఇరవై ఏళ్ళలో జీవితంలో చాలా మార్పులు జరిగాయి. ఇంతకాలమూ ఎంతో విశ్వాసంగా పని చేశాడు మా ఇంట్లో. మా కుటుంబసభ్యు ల్లో ఒకరిగా కలిసిపోయారు. బిమాన్ చనిపోయాడనే నిజం మనసులోకి ఇంకి దుఃఖిం పెల్లుబికింది.


హాలంతా చిందరవందరగా, ఎవరో ప్రతి వస్తువును కదిపినట్టు కనిపిస్తోంది. చాలా హడావిడిగా ఎవరో దేనికోసమో వెతికిన ట్లుగా కనిపిస్తోంది. ఆ దృశ్యం చూస్తోంటే ?


మతిపోయిన మనిషికిమల్లే లేచి డ్రాయింగ్ రూమ్లోకి నడిచాను డ్రాయింగూమ్ పరిస్థితి అలాగే వుంది. గోడలోకి అమర్చబడివున్న  ఐరన్ సేఫ్ ముందు తగిలించి ఉన్న శివపార్వతుల పటం క్రిందపడి ముక్కలై ఉంది. సేఫ్ తలుపు ఊడి కనిపిస్తోంది. చాలా పాతకాలపు సేఫ్ ఆది. ఏదో ప్రేలుడు పదార్ధంతో తలుపు తెరిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది.


ఆ సేఫ్ లో ఎప్పుడూ డబ్బు దాచిపెట్టను నేను. ఉన్నదేదో బాంక్ లో ఉంటుంది. ముఖ్యమైన కాగితాలు, పాతకాలపు నగలు అమ్మవి ఉన్నాయి అందులో. కాగితాలన్నీ కెలికి చెల్లా చెదురుచేసి పారేశారు. దంతపుపెట్టెలో వున్న నగలు అలానే వున్నాయి.


డ్రాయరు అరలన్నీ సగం సగం తెరిచి వున్నాయి. పై అరలో నాలుగు వందలు పెట్టాను కలకత్తాకు వెళ్ళేముందు, ఆ కాష్ మాత్రం కనిపించడంలేదు.


హాలులోకి వచ్చి పోలీస్ క్రైమ్ బ్రాంచి నెంబరు త్రిప్పాను. ఇన్స్ పెక్టర్ గుర్ ముఖ్ సింగ్ పలికాడు. క్లుప్తంగా జరిగిన విషయం వివరించి ఫోన్ పెట్టేశాను.


నేను హాలు తలుపు తెరిచి వరండాలోకి వెళ్ళి నిలబడ్డాను. వర్షం ఉదృతంగా కురవకపోయినా ఇంకా జల్లుపడుతూనే ఉంది. గాలి మాత్రం హోరున వీస్తోంది. బయట గేటు తెరిచే ఉంది.


పావుగంట తర్వాత పోలీస్ కారు, దాని వెనుక అంబులెన్స్ వచ్చి వరండా ముందు పోర్టికోలో ఆగాయి.


పోలీసులు తమ పని ముగించుకొని వెళ్ళేప్పటికి రాత్రి రెండయింది.

📖


రాత్రి డ్రాయర్ లో ఉన్న నాలుగొందలు కరెన్సీ తప్ప మరేమీ పోలేదని తెలిసింది.


ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి కేవలం దొంగే అయితే దంతపు పెట్టెలోని బంగారు ఆభరణాలు కూడా తీసుకొనేవాడు. దాదాపు ఆరు  తులాల బరువుంటాయి. ఎంతలేదన్నా నాలుగయిదువేలు వస్తాయి వాటికి మార్కెట్ లో. చాలా పురాతనపు ఇల్లు మాది. చూడ్డానికి డబ్బు గల వాళ్ళ ఇల్లులా కనిపించదు. నిజానికి నేను ధనవంతుణ్ణి కాదు. నెలకు ఎనిమిది వందల రూపాయల ఉద్యోగం నాది. నేషనల్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇన్ ఫ్రాస్ట్రక్టర్ ని  నేను.


దొంగలు ఇళ్ళలో జొరబడేముందు ఆ ఇంట్లో మనుషుల్ని గురించి వాకబు చేస్తార ని అంటారు. ఒక మనిషిని చంపేంత రిస్క్ తీసుకొనే ఆ దొంగ నన్ను గురించి తెలుసు కోకుండా దొంగతనానికి వచ్చాడా ?


బిమాన్ శరీరం పడివున్న పొజిషన్ బట్టి అతను తలుపు తీయగానే ఆ దొంగ పాయింట్ బ్లాంక్ గా బిమాన్ ని కాల్చినట్లు తెలుస్తోంది. అంటే దొంగతనం చేస్తుండగా పట్టుబడి తప్పించుకోవడానికి కాల్చినట్లు లేదు. ఇంట్లోకి రాకపూర్వమే ఇంట్లో ఎవరు ఉన్నా చంపి ఆయినా తన పనిని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో దొంగ వచ్చినట్లు కనిపిస్తోంది.


దొంగిలించడానికి గొప్ప వస్తువులేమీ లేవు ఇంట్లో. నేను అమెరికన్ బృందంతో కలిసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినప్పుడు మన దేశస్థులు ఇచ్చిన బహుమతులు, మెడల్స్ ఉన్నాయి. పర్వతారోహకులు ఉపయోగిం చే ఐస్ యాక్స్ లు, ఇన్స్ లేటెడ్ బూట్లు, ధర్మల్ వేర్ వున్నాయి. దొంగిలించినా అవి కొనే వ్యక్తులు బహుతక్కువ.


లేక కాస్త మతి స్తిమితం లేని దొంగా? ఏమో! ఆయ్యుండాలి !


ఇన్స్ పెక్టర్ సింగ్ ఫోన్ చేసి ఈ ప్రాంతంలో పాత దొంగలనందర్నీ రౌండప్ చేశాననీ, వాళ్ళల్లో ఎవరూ హంతకులు కారనీ, హత్యలు చేసే ధైర్యం వాళ్ళకులేదనీ, గట్టి ప్రయత్నాలు చేస్తున్నామనీ చెప్పాడు.


మళ్ళీ ఫోన్ మ్రోగింది. రిసీవర్ ఎత్తాను. "హలో !”


"హలో! ఈజిట్ మిస్టర్ విశాల్?" ఎవరో గుర్తురావడంలేదు. పరిచయమైన గొంకు కాదు. అమెరికన్ యాక్సెంట్ లా వుంది.


"యస్ ! హు ఈజిట్ ప్లీజ్" అన్నాను.


చిన్న నవ్వు అవతలివైపు నుండి. "మిస్టర్ విశాల్ ! రాత్రి నీ ఇంట్లో మర్డర్ ఎందుకు జరిగిందో నాకు తెలుసు" అన్నది అవతలి కంఠం.


"వాట్" అన్నాను ఆశ్చర్యంగా.


"యస్ ! మిస్టర్ విశాల్ ! బిమాన్ ఎందుకు హత్యచెయ్యబడ్డాడో.. నీ ఇంట్లోకి ప్రవేశించిన హంతకుడెవరో నాకు తెలుసు "


"తెలిస్తే వెంటనే పోలీసులకి తెలియచెయ్" అన్నాను కోపంగా. ఆతని ధోరణి నాకేం నచ్చలేదు.


మళ్ళీ చిన్న నవ్వు. "లేదు మిస్టర్ విశాల్ ! అది పోలీసులకు తెలియజేయకుండా వుండడం మంచిది. విషయాలు తెలుసు కోవాలనుకుంటే సాయంత్రం ఆరు గంటలకి టూరిస్టుపారడైజ్ దగ్గరకు రా !"


"వాట్ ది హెల్ యు మీన్....హూ ఆర్ యు.... ?"


"నెవర్ మైండ్ మిస్టర్ విశాల్ ! నేను చెప్పింది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నో పోలీస్ కంప్లయింట్.... ఈ విషయం మనిద్దరిమధ్యే ఉండాలి. ఈ రహస్యం తెలుసుకోవడంవల్ల మీకూ, నాకూ లాభం చేకూరుతుంది. ప్లీజ్ రిమంబర్ సాయంత్రం ఆరుగంటలకు...." అని ఫోన్ పెట్టేశాడతను.


నేను ఆలోచిస్తూ ఫోన్ రిసీవర్ క్రెడిల్ మీద పడేశాను మరో క్రొత్త సిగరెట్ పాకెట్ తెరుస్తూ.

🗻

*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

*ప్రాంజలి ప్రభ * 


https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe


ఆరోగ్యం.. ఆనందం.. ఆధ్యాత్మికం * 


*1 YEAR* *SUBSCRIPTION 120/-*

*phone pe & Gpay to 6281190539*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

[07/05, 8:16 pm] . Mallapragada: శ్రీమద్ భగవద్గీత..001

1. అర్జున విషాద యోగము.. తెలుగు పద్యాలు.. 47

2. సాంఖ్య యోగము... తెలుగు పద్యాలు..72

3. కర్మయోగము.. తెలుగు పద్యాలు..43

4. జ్ఞాన కర్మ సన్యాసయోగము.. తెలుగు పద్యాలు.. 42

5. కర్మ సన్యాస యోగము.. తెలుగు పద్యాలు..29

6. ఆత్మసంవ్యమ యోగము.. తెలుగు పద్యాలు..47

7. జ్ఞాన విజ్ఞాన యోగము.. తెలుగు పద్యాలు.. 30

8. అక్షర బ్రహ్మయోగము.. తెలుగు పద్యాలు..28

9. రాజ విద్యా రాజగుహ్య యోగము.. తెలుగు పద్యాలు.. 34

10. విభూతి యోగము.. తెలుగు పద్యాలు..42

11. విశ్వరూప దర్శన యోగము.. తెలుగు పద్యాలు..54

12. భక్తి యోగము.. తెలుగు పద్యాలు..20

13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము.. తెలుగు పద్యాలు..34

14. గుణ త్రయ విభాగము.. తెలుగు పద్యాలు.. 27

15. పురుషోత్తమ యోగము.. తెలుగు పద్యాలు..20

16. దైవాసుర సంపద్విభాగ యోగము.. తెలుగు పద్యాలు.. 24

17. శ్రద్ధాత్రయ విభాగయోగము.. తెలుగు పద్యాలు..28

18. మోక్ష సన్యాస యోగము.. తెలుగు పద్యాలు..78


ప్రాంజలి ప్రభ 

ఆరోగ్యం.. ఆనందం.. ఆధ్యాత్మికం

One year sub.Rs.120/-  Phon pay & google pay ph. 6281190539

[07/05, 8:36 pm] . Mallapragada: ప్రాంజలి ప్రభ.. పాత కథ.. 001

చిన్నప్పుడు చదువుకున్న వ్యాకరణాన్ని ఒకసారి సరదాగా గుర్తు చేసుకోండి! 

కుదిరిన సంధి: (సరదాగా చేసిన ఓ చిన్న ప్రయత్నం)

అతి+అంత, అత్యంత సుందరమైన రాజ్యం "యణా దేశం"!  మహా+ఉన్నతమైన, మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ఆ దేశపు మహారాజు "గుణ సంధుడు". దేశ+ఔన్నత్యం, దేశౌన్నత్యమే , ఏక +ఏక, ఏకైక లక్ష్యంగా తన రాజ్యాన్ని "వృద్ధి" చేశాడు అతడు. అటువంటి ఉన్నత సంస్కారం "కలవారి" ఇంట పుట్టినది, సౌందర్యంతో పాటు చక్కని గుణగణాలు "కలది" ఆ దేశపు యువరాణి "బహువ్రీహి" ! 

తన చుట్టూ "ఒకటి" కాదు, "రెండు" కాదు....అసంఖ్యాకమైన మిత్రులను ఏర్పరుచుకుని "ద్విగు మహారాజు" , పక్కనే ఉన్న "గసడదవా దేశాన్ని" రాజ్యము+చేయు, రాజ్యముసేయు చుండెను. ఆ దేశపు యువరాజు, అత్యంత పరాక్రమశాలి, చక్కటి శరీర+ఆకృతి, శరీరాకృతి కలిగి ఉండిన, సుందర+అతిసుందరుడు, సుందరాతిసుందరుడు అయిన  "సవర్ణ దీర్ఘ సుందరుడు", యణా దేశపు యువరాణి బహువ్రీహిని ప్రేమించాడు. 

ఓ విహార యాత్రలో సవర్ణ దీర్ఘ సుందరుడిని చూసి, తాను కూడా అతడిని మోహించింది, బహువ్రీహి! అదే విషయాన్ని మొదట+మొదట, మొట్టమొదట తన తల్లి అయిన "ఆమ్రేడిత" తో చెప్పింది. తండ్రి గుణ సంధుడు కూడా సంతోషంగా ఇందుకు ఒప్పుకుని, వారిరువురికీ వివాహం చెయ్యడానికి నిశ్చయించుకుని, అదే విషయాన్ని ద్విగు మహారాజుకి వర్తమానం పంపాడు. ద్విగు మహారాజు కూడా ఆనందంగా ఇందుకు ఒప్పుకున్నాడు. 

వారిద్దరి వివాహం ఖరారైన నేపథ్యంలో , బహువ్రీహి ప్రధాన  చెలికత్తె అయిన "ఉత్పలమాల" "భరనభభరవ... భళి భళి" అంటూ ఉత్సాహంతో ఎగిరి గంతేసింది. "తాన తానన తాన తానన తాన తానన తాన తా" అంటూ "రస(జజ)భరితంగా" యువరాణి గుణ గణాలను గానం చేసింది...."మత్తకోకిల" ! 

ఇదిలా ఉండగా....

వజ్రము+గనులు, వజ్రపుగనులు, మిక్కుటంగా కలిగి, ప్రపంచము+అంగడి, ప్రపంచపు అంగడిలో వ్యాపార లావాదేవీలను జరుపుతూ, మిక్కిలి సంపన్న దేశంగా వెలుగొందుతోంది "పుంప్వా దేశం". ఈ పై వివాహ విషయాన్ని వార్తాహరుల ద్వారా తెలుసుకుని గట్టిగా నిడు+ఊర్పు, నిట్టూర్చాడు ఆ దేశపు చక్రవర్తి, " ద్విరుక్త టకారుడు" ! ఇది ససేమిరా తనకు నచ్చలేదు. బహువ్రీహి పై తనకు ఎప్పటి నుండో మోజు ఉంది. సమయం కోసం వేచి చూస్తున్న ద్విరుక్త టకారునికి, ఇదే సరైన సమయం అని తోచి...అహంకార గర్వంతో, బహు వ్రీహి ని తనకు ఇచ్చి వివాహం చెయ్యమని, లేని పక్షాన "ద్వంద్వ"యుధ్ధానికి సిధ్ధం కమ్మని....తన వద్ద పనిచేసే అన్న-తమ్ముడు, అన్నదమ్ములు అయిన జయవిజయులను రాయబారానికి యణా దేశానికి పంపాడు. 

తాను ఒక్కడినే ద్విరుక్త టకారుని ఓడించడం కష్టమని, ద్వంద్వ యుద్దము లో ఓడిపోవడం ఖాయమని తలంచి యణా దేశపు రాజు గుణ సంధుడు, ద్విగు మహారాజు తో సమావేశం అయి పరిష్కారాన్ని కోరాడు. అందుకు ద్విగు మహారాజు ఒప్పుకుని, ఉత్తరాదిన ఉన్న తన మిత్రదేశాల రాజుల సహాయం కూడా కోర దలచి, అందరూ కలసి యుధ్దం చేస్తే ద్విరుక్త టకారుడిని జయించడం అంత కష్టమైన విషయం కాదని ఎంచి, ఉత్తర భారతానికి ప్రయాణం కట్టాడు ద్విగు మహారాజు. 

అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ, దారిలో వృద్ధురాలు,  పేద+ఆలు, పేదరాలు అయిన "రుగాగమ" ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆమెకు అభయమొసగి, తిరిగి ప్రయాణం కొనసాగించి ఉత్తర భారతం చేరుకున్నాడు ద్విగు మహారాజు. 

"ఆ - ఈ - ఏ" అంటూ తన రాజ్యం లోనికి స్వాగతం పలికాడు "త్రిక సంధుడు" . విషయం విని తన మద్దతు ప్రకటించాడు. ఆ+కన్య, అక్కన్య వివాహం తమ చేతుల మీదుగా చేద్దాం అంటూ హామీ ఇచ్చాడు. 

సంధి కై ప్రయత్నించుదుము, సంధి కుదరని యెడల మనమెటుల ఊరడిల్లి+ ఉండు, ఊరడిల్లియుండగలము, కలసి పోరాడుదాం అంటూ "యడాగముడు" కూడా బదులిచ్చాడు. 

జగత్+నాటక, జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్ముని అండ మనకి ఉండగా, ద్విరుక్త టకారుడిని దండించి తీరుదాం అని, పక్క దేశపు మహారాణి అయిన "అనునాసిక" తన మద్దతు తెల్పింది.

నా అంతః+ఆత్మ, అంతరాత్మ కూడా అదే చెబుతోంది అంటూ "విసర్గ" దేశపు పట్టపురాణి బదులు పలికింది. 

"అత్వ", "ఇత్వ", "ఉత్వ", "శ్చుత్వ", "జశ్త్వ" దేశాల రాజులు కూడా వంత పాడారు. 

అందరి మద్దతు కూడగట్టుకున్న ద్విగు మహారాజు మరియు గుణ సంధులు,  ద్విరుక్త టకారుడు భయము+పడె, భయపడేలా, నివ్వెరము+పాటు, నివ్వెరపాటు కి లోనయ్యేలా "పడ్వాదు"లను రాయబారానికి పంపి, ముందుగా సంధి ప్రయత్నం చేశారు.

విషయాన్ని గ్రహించిన ద్విరుక్త టకారుడు.... అన్ని దేశాల రాజులు కలసి తనపై యుధ్దం ప్రకటిస్తే, తనకు ముప్పు తప్పదని తెలుసుకున్నాడు. అంత బలగం ముందు తానొక చిరు+ఎలుక, చిట్టెలుక అని తెలుసుకుని, తాను ప్రతిపాదించిన విషయాన్ని వెనక్కి తీసుకుని,  సంధి కి ఒప్పుకున్నాడు! అంతే కాదు తన వాణిజ్యం కూడా దెబ్బ తింటుంది అని గ్రహించి, తనకున్న వజ్రపు గనులలో కొన్నిటిని సవర్ణ దీర్ఘ సంధుడు-బహువ్రీహిల  పేరిట 

రాసిచ్చి, దగ్గరుండి వారిద్దరి వివాహాన్ని కూడా జరిపించాడు. 

అందరూ ఎంతో సంతోషించి, గట్టిగా చప్పట్లతో తమ హర్షధ్వానాలు తెలియజేశారు!! 

ఒరేయ్.... ! లే....ఏవిటా చప్పట్లు, నువ్వూనూ. తెలుగు పరీక్ష అనేసరికి ఎక్కడలేని కలవరింతలు, పలవరింతలూను. ముందుగానే కొంచెం చదువుకుని ఉండొచ్చుగా! తెల్లారి అయిదు కావస్తోంది...లే...లేచి కూచుని చదువుకో, తొమ్మిదింటికి పరీక్ష కి వెళ్ళాలి....! 

తల్లి కేకతో, ఆమె అటుగా వెళ్లిన తరువాత సందు చూసుకుని సంధులు పక్కన పెట్టి, తయారై పరీక్షల సందడిలో మునిగిపోయాడు తొమ్మిదో తరగతి చదువుతున్న సందేశ్! 

అమ్మ, నాన్నగార్ల ఆశీస్సులతో

మల్లాప్రగడ .

[07/05, 8:42 pm] . Mallapragada: అందరికీ ధన్యవాదములు 

రోజూ కథలు చదవండి,ఇతరులకు పంపి స్నేహాన్ని పెంచుకోండి,