ధృతి: క్షమా దమోsస్తేయం శౌచమింద్రియనిగ్రహ:
ధీర్విద్యా సత్యమక్రోధ: దశకం ధర్మ లక్షణమ్
1. ధైర్యం 2. సహనం , 3. మనో నిగ్రహం
1. దొంగతనంచేయకపోవడం , 5. శుచిగా ఉండడం , 6. ఇంద్రియనిగ్రహం, 7. బుద్ధిబలం , 8. విద్య , 9. సత్యం , 10. క్రోధం లేకపోవడం అనే ఈ పది ధర్మం యొక్క లక్షణాలు .
*****
నేటి జీవిత సత్యం. ప్రాంజలి.. ప్రభ. 3
మానవ జీవితంలో మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది. ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, మనుషుల మధ్య సంబంధాలు... వీటిలో కూడా మంచి చెడులు ఉంటాయి. మన జీవితంలో మంచి తక్కువ పాళ్ళలో, చెడు ఎక్కువ పాళ్ళలో ఉంటే... ఎక్కడో ఏదో అవరోధం ఉందని అర్థం చేసుకోవాలి. కొందరు జీవితాన్ని సుఖప్రదంగా గడుపుతూ ఉంటే... అది చూసి ‘మనం కూడా అలా ఎందుకు ఉండకూడదు?’ అనిపిస్తుంది. నిజంగా వారేదో శక్తిని వినియోగించడం వల్లే... వారికి అంతా మంచి జరుగుతోందనేది అపోహ కాదు.
ఆనందాన్ని పొందడానికి వారు ‘ప్రేమ’ అనే శక్తిని వినియోగిస్తూ ఉండొచ్చు. ఆ ప్రేమ శక్తితో అన్నీ మంచి విషయాలే జరుగుతాయి. పూర్వకాలానికి చెందిన ఎందరో ధర్మ గురువులు, మహనీయులు, దార్శనికులు... ప్రతి ధర్మంలోను ప్రేమకు సముచితమైన స్థానం ఇచ్చారు. తమ తమ యుగ ధర్మాలను అనుసరించి, తాము జీవించిన కాలంలోని మానవుల స్వభావాలను, సంస్కారాలను దృష్టిలో ఉంచుకొని వారు ఆ సందేశాలు ఇచ్చారనేది నిజం.
వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకోగలిగితే... ప్రేమ అన్నిటినీ మించిన పరమశక్తి. అది ప్రేమ సాగరుడైన పరమాత్మ తాలూకు పవిత్ర శక్తి. మనం ప్రేమను పంచినప్పుడు... ఆ పరంధామంలో ఉన్న భగవంతుడి ప్రేమను వినియోగించుకుంటున్నామని గుర్తుంచుకోవాలి. ‘ప్రేమ’ అంటే మన పరివారాన్నీ, స్నేహితులనూ, ప్రియమైన వస్తువులనూ ఇష్టపడడం కాదు. మన జీవితంలో ఎదురయ్యే శక్తులు ఏవైనా అవి ప్రేమ నుంచి ఉద్భవించినవేనని గ్రహించాలి. మనల్ని ప్రభావితం చేసే ఈ శక్తి మనలోనే... మన ఆత్మలోనే ఉంది.
మరి అలాంటి గొప్ప శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండాలి కదా! కానీ మీరు కోరుకుంటున్నవి మీ దగ్గర ఎందుకు లేవు? మీరు అనుకున్న పని ఎందుకు చేయలేకపోతున్నారు? సుఖ సంతోషాలు ఎందుకు లేవు?
మానవ హృదయంలోని ప్రేమ శక్తి వల్లే ప్రకృతి పులకిస్తుంది. పరిశోధనలు, ఆవిష్కరణలతో సృష్టి సుసంపన్నమైన ప్రగతిపథాన నడుస్తుంది. . సృష్టి నలువైపులా పరిశీలిస్తే... మనిషి తయారు చేసిన వస్తువులే కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కనిపించని ప్రేమ శక్తితోనే సాధ్యమయ్యాయి. ‘‘ఒకవేళ మన నుంచి ప్రేమను తొలగించుకుంటే... ఈ భూమి శ్మశానం అవుతుంది’ అని రాబర్ట్ బ్రౌనింగ్ అనే కవి అన్నారు. మానవుల్లో శాశ్వతంగా నిలిచి ఉండే ప్రేమే ఈ లోకానికి ఆలంబన.
ప్రేమ శక్తే మనల్ని నడిపిస్తుంది. చెడ్డ విషయాల వల్ల, సమస్యల వల్ల మనలో ప్రేమ లోపిస్తుంది. చాలామందికి ప్రేమ అంటే ఏమిటనే దానిపై అర్థవంతమైన అవగాహన లేదు. ఎందుకంటే... ప్రేమ అనేది ప్రపంచంలో అన్నిటికన్నా శక్తిమంతమైనది మాత్రమే కాదు, గుర్తించలేనిది కూడా. కంటికి కనిపించని ఈ మహిమాన్విత శక్తిని గుర్తించాలంటే... మొదట జ్ఞానసాగరుడైన పరమాత్మను గుర్తించాలి. ప్రేమమయమైన ఆయన సృష్టిని అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రేమను అర్థం చేసుకోగలం. ఆయన సృష్టించిన ఈ జీవన రంగస్థలంలో పరమానందంతో అభినయిస్తూ జీవించగలం.
***--
*కైలాస నగరం -3*
🔱
రచన: శ్యాంబాబు
ఒక్క నిమిషం చెప్పడం ఆపి, కాలిపోయిన సిగరెట్ ని ఫైర్ ప్లేస్ లోకి విసిరేసి మరోటి వెలిగించాడు గాడ్సన్.
నేను మెల్లిగా కొద్దిగా బ్రాందీని చప్పరించాను.
“అవును. మౌంట్ ఎవరెస్ట్ కన్నా ఎత్తయిన శిఖరం వుందని ఎవరెస్ట్ కనుగొనబడిన దగ్గర్నుంచీ అనేక వాదోపవాదాలు చాలా జరిగాయి. కాని ఆ విషయం ఇధమిద్దంగా ఇంతవరకూ తేలలేదు. నిజానికి చైనీయులు ఆ శిఖరాన్ని కనుగొన్నారనీ, అయితే చైర్మన్ మావో వందవ జన్మదిన కానుకగా ఆ శిఖరాన్ని సమర్పించి దానికా పేరు పెట్టడానికి ఆ విషయం దాస్తున్నారనీ కూడా కొందరు అంటున్నారు" అన్నాను నేను. ఎవరెస్టు కాంట్రవర్సీ గురించి నాకు తెలిసిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొంటూ.
"యస్! యు ఆర్ రైట్! ఆ విషయం కూడా తెలిసింది. నాకు ! దాదాపు ఆర్నెల్లక్రితం భారతదేశం, పాకిస్తాన్, ఇంగ్లండ్ లో వున్న పెద్ద వార్తాపత్రిక లన్నిటిలోనూ ఓ ప్రకటన చేశాను నేను. హిమాలయ పర్వశ శ్రేణుల గురించి, షాంగ్రీలా గురించి కొత్త ఇన్ఫర్ మేషన్ ఇవ్వగలిగిన వాళ్ళకు తగిన బహుమతి ఉంటుందని ప్రకటించాను.
నా ప్రకటనకు జవాబుగా అనేకమంది దగ్గర్నుండి అనేక ఉత్తరాలు, సమాచారం అందింది నాకు. అయితే వాటిలోఇదివరకు నా దగ్గర లేని కొత్త విషయాలు ఏమీలేవు.
అయితే దాదాపు నెలరోజులక్రితం డెట్రాయిట్ లో నా నివాసానికి కెయిత్ ముల్లరీ అనే అతను వచ్చాడు. ముల్లరీ ఇంగ్లండు దేశస్థుడు. కెయిత్ తాతగారు జాన్ ముల్లర్ బ్రిటిష్ ఇండియాలో సర్వేయర్ గా పని చేశాడు" అని ఆగాడు గాడ్సన్ నావైపు దీర్ఘంగా చూస్తూ..
జాన్ ముల్లరీ అనే పేరు వినగానే నా మెదడులో ఏ మూలో అలారం బెల్ మ్రోగ సాగింది. ఎక్కడో విన్న పేరది.
మనసంతా కేంద్రీకరించి ఆలోచించాను. ఎస్. ఇప్పుడు తట్టింది. మా తాతగారు పండిట్ విక్రందేవ్, జాన్ ముల్లరీలు అప్పట్లో సర్వే ఆఫ్ ఇండియా సంస్థలో ఉద్యోగులు. వందేళ్ళ క్రితం హిమాలయాల స్వరూపాన్ని గురించి ఇంకా లోకానికి అంతగా తెలియనప్పుడు వీళ్ళిద్దరూ నేపాల్ ప్రాంతమంతా తిరిగి ఒక మాప్ తయారు చేసినట్లు నాన్నగారు అప్పుడప్పుడూ చెప్పేవారు.
గాడ్సన్ చిన్నగా నవ్వాడు.
“నేను చెబుతున్న విషయంలోని లింక్ అర్థమవుతూ ఉండాలి నీకు” అన్నాడు.
అవునన్నట్లు తలూపాను. "కాని స్పష్టంగా ఏమీ తెలియడంలేదు.” అన్నాను.
“చెపుతాను. 1868 ప్రాంతంలో నేపాల్, సిక్కిం ప్రాంతాలలోని హిమాలయ పర్వత శ్రేణులను సర్వేచేసి మాప్ లు తయారు చేసిన ఇద్దరు ప్రముఖులు విక్రందేవ్, జాన్ ముల్లరీలు. అయితే ఆ సమయంలోనే వారిద్దరూ అదృష్టవశాత్తు ‘షాంగ్రీలా'ను చేరుకోవడానికి దారి కనుక్కొన్నారు."
"వాట్? అన్ బిలీవబుల్" అన్నాను ఆశ్చర్యంగా.
“నేనూ మొదట అలాగే అనుకొన్నాను. కాని కెయిత్ ముల్లరీ నాకు చూపెట్టిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసిం తరువాత నమ్మక తప్పలేదు అన్నాడు గాడ్సన్ లేచి బార్ దగ్గరికి వెళ్ళి తన గ్లాసు నింపుకుంటూ.
"ఏమిటా డాక్యుమెంటరీ ఎవిడెన్స్?" అడిగాను.
“నీకు నిజంగా తెలియక అడుగుతున్నావా విశాల్ ?” అన్నాడు గాడ్సన్ తిరిగివచ్చి తన చైర్ లో కూర్చొంటూ.
"హానెస్టు టుగాడ్! నాకు ఏమీ తెలియదు" అన్నాను నేను గాడ్సన్ ప్రశ్న అర్థంకాక....
“ఓకె. ఐ హావ్ నతింగ్ టు లూజ్! చెబుతాను విను. విక్రందేవ్, జాన్ లు బౌద్ధ లామాల వేషంలో నేపాల్ సిక్కిం ప్రాంత మంతా పర్యటిస్తూ సర్వే చేశారు. ఆ పర్వతాల్లో వారు సంచరిస్తున్నసందర్భంలో అదృష్టవశాత్తు 'షాంగ్రీలా'కు వాళ్ళిద్దరూ దారి కనుక్కోవడం జరిగింది. అనుకోని విధంగా ఈ షాంగ్రీలా ఎవరెస్టుకన్నా ఎత్తయిన శిఖరం చుట్టూ వుందని తెలిసింది.
ఈ పర్వత ప్రాంతమంతా, సరిగ్గా చెప్పాలంటే ఈ షాంగ్రీలా శిఖరం బంగారు, వెండి లోహాల సమ్మేళనంతో ఏర్పడిందనీ, దాన్ని చేరుకోవడం వందేళ్ళ కొకసాకే సాధ్యపడుతుందనీ జాన్ ముల్లరీ తన కొడుకుకి, అంటే కెయిత్ ముల్లరీ తండ్రికి వ్రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు.”
"ఉత్తరమా?" అన్నాను నేను ఆశ్చర్యంగా.
"ఐయామ్ సారీ! విషయం పూర్తిగా చెప్పలేదు నేను" అని విస్కీ మరో గుటక వేసి “మొదట విక్రందేవ్, జాన్ లు షాంగ్రీలా ను కనుగొన్నప్పుడు వారికి నిజమైన 'షాంగ్రీలా' చూసే అవకాశం లేకపోయింది. జాన్ ముల్లరీ ఉత్తరాన్నిబట్టి నేను తెలుసు కున్నదేమిటంటే షాంగ్రీలా శిఖరం చుట్టూ అంతులేని పెద్ద అఘాతం ఉందనీ, ఆ అఘాతం వందేళ్ళ కొకసారి పూడిపోయి షాంగ్రీలాకు దారి ఏర్పడుతుందనీను. ఆ వివరాలన్నీ ఆ ఉత్తరం చదివినప్పుడు నీకు అర్థమవుతాయి.
అంచేత వారిద్దరూ షాంగ్రీలావరకూ చేరుకో గలిగారుగాని, షాంగ్రీలాను మాత్రం చేరుకో లేకపోయారు. అయితే ఇండియాకు తిరిగొచ్చేముందు వారిద్దరూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. అదేమంటే మళ్ళీ మరో వందేళ్ళకు, అంటే ఈ సంవత్సరం చివరికి సరిగ్గా వందేళ్ళు పూర్తవుతాయి- మళ్ళీ షాంగ్రీలాకు దారి ఏర్పడుతుందనీ, కాబట్టి ఆ రహస్యాన్ని అంతవరకూ దాచి, తమ తర్వాత తరాల వారికే ఆ శిఖరాన్ని కనుక్కొన్న కీర్తి దక్కాలనీ వారు నిశ్చయించుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారంగా 'షాంగ్రీలా' చేరుకొనే దారి చూపించే మాప్ ఒకదాన్ని తయారు చేశారు.
భద్రతకోసం ఆ మాప్ ని మధ్యకు రెండు ముక్కలుచేసి, ఓ సగం విక్రందేవ్, మరో సగం జాన్ ముల్లర్ తీసుకొన్నారు. అంటే భవిష్యత్తులో తిరిగి ఆ రెండు కుటుంబాల వారు మాత్రమే కలిసి ఆ శిఖరాన్ని చేరుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం అన్నమాట. అంటే ఆ మాప్ రెండు ముక్కలూ కలిపితే తప్ప షాంగ్రీలా చేరుకొనేమార్గం ఎవ్వరికీ తెలియదన్నమాట.
జాన్ ముల్లర్ ఈ మాప్ ని, మరికొన్ని వివరాలున్న ఓ ఉత్తరాన్ని తన కొడుకు కెయిత్ ముల్లరికి అందజేశాడు. అయితే కెయిత్ ముల్లరీ తన తాతగారి ఆశయాలకి అనుగుణంగా పెరగలేదు. కెయిత్ ముల్లరీ కి, అటు సరైన విద్యగానీ, పర్వతారోహణ లో శిక్షణ గాని లేవు. వాటి మీద అతనికి ఇంట్రస్టూ లేదు. దానికి తోడు ఆస్తి కూడా ఏమీ లేకపోవడంతో జులాయిగా తయార య్యాడు. అతను హెరాయిన్, ఎల్, యస్. డి. లాటి మత్తుపదార్థాలకు కూడా బాగా అలవాటుపడ్డాడని కూడా నాఅనుమానం.
ఏమైతేనేం అతి దీనదశలో ఉన్న కెయిత్ ముల్లరీ అతి హీనదశలో ఉన్నప్పుడు ఇంగ్లండు పత్రికల్లో వెలువడిన నా ప్రకటన చూడడం జరిగింది. వెంటనే అతను నన్ను కలుసుకొన్నాడు. ఆ పత్రాలకు ఎంతో కొంత ముట్టకపోతుందా అనే ఉద్దేశ్యంతో.
కెయిత్ ఇచ్చిన పత్రాలు చదవగానే ముందు నాకు ఆశ్చర్యం, తర్వాత ఎంతో ఉత్సాహం కలిగాయి. పదివేల డాలర్లకు ఆ రెండు పత్రాలనూ తన దగ్గర్నుండి కొన్నాను నేను. నిజంగా 'షాంగ్రీలా' ఉంటే దాన్ని
ఎలాగైనా కనుక్కోవాలి అనే నిశ్చయం నాలో ధృఢపడింది. వెంటనే బైలుదేరి ఇండియా వచ్చాను.
బహుశా నేను ఇండియాకి ఎందుకు వచ్చానో ఇప్పటికి నీకు ఆర్థమై వుంటుంది. ముల్లరీ నాకు అమ్మిన మాప్ రెండవ భాగం నీ దగ్గరుంది. పండిత్ విక్రందేవ్ కి ఉన్న ఒకే ఒక్క మనవడివి నువ్వు, సో ..తప్పకుండా ఆ మాప్ మీ తాతగారు నీకు అందచేసి ఉండాలి. అందుకే నిన్ను వెతుక్కొంటూ ఇండియా వచ్చాను" అన్నాడు గాడ్సన్ విశాల్ వైపు ప్రశ్నార్థకంగా చూసి.
నేను బ్రాందీ గ్లాసులో మిగిలిన ద్రవ్యాన్ని గొంతులో పోసుకొని తల అడ్డంగా ఊపాను.
“సారీ ఫ్రెండ్! నా దగ్గర అలాంటి మాప్ లు గాని, ఉత్తరాలుగాని ఏమీలేవు. నిజంగా అలాంటి ఋజువేమైనా ఉంటే, ఎవరెస్టు కన్నా ఎత్తయిన శిఖరాన్ని కనుక్కోవడానికి ఆ సగం మాప్ తోనే నేను బయలుదేరి ఉండేవాణ్ని. పైగా మా తాతగారు నేను పుట్టకముందే పోయారు.. మా నాన్న నాలాగే పర్వతారోహకుడు. కాంచనగంగ శిబిరాన్ని ఎక్కిన మొదటి బృందం సభ్యుడాయన. నిజంగా అలాంటి మాప్ ఉండిఉంటే షాంగ్రీలాను కనుక్కోడానికి ఆయనే ప్రయత్నించి ఉండేవాడు. లేదా కనీసం నాకన్నా అందజేసి ఉండేవారు!" అన్నాను.
"మే బి యు ఆర్ స్పీకింగ్ ది ట్రూత్! కాని మీ నాన్నగారు ఓ ప్లేన్ యాక్సిడెంట్ లో పోయారని విన్నాను. తను అంత త్వరగా చనిపోతానని ఆయన అనుకొని ఉండరు. పైగా....మీ నాన్నగారు చనిపోయేప్పటికి నీ వయస్సెంత?" అడిగాడు గాడ్సన్.
"పదిహేను.”
“అప్పటికి మౌంటెనీరింగ్ నేర్చుకుంటున్నా ను" అన్నాను అతని ప్రశ్న అర్థంకాక.
"యుసీ మై పాయింట్ ? బహుశా నీవు మౌంటెనీరింగ్ లోనూ రాక్ క్లెయింబింగ్ లోనూ పూర్తి నిష్ణాతుడవయ్యేవరకూ నీ ఫాదర్ ఆ విష యం చెప్పదలచుకోలేదను కొందాం. ఈలోగా ఈ యాక్సిడెంట్ లో ఆయన పోయారు. బహుశా ఆ ఉత్తరాలు, మాప్ మీ ఇంట్లో ఉండి ఉండాలి" అన్నాడు గాడ్సన్ నావైపు రెప్పచెయ్యకుండా దీక్షగా చూస్తూ.
రాత్రి జరిగిన సంఘటనలు నా కళ్ళ ముందు ఒక్కసారిగా గిర్రున తిరిగాయి. బహుశా గాడ్సన్ నిజమే చెపుతూ ఉండాలి.
“ఇంతకూ రాత్రి నా ఇంట్లో జొరబడి బిమాన్ను హత్య చేసింది ఎవరు..? అని అడిగాను.
🗻
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆**ప్రాంజలి ప్రభ*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 6281190539*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*టామ్ సాయర్ - 3*
🧑🌾
రచన : మార్క్ ట్వేన్
అనువాదం : నండూరి రామమోహన్ రావు
పడకగదీ, భోజనాలగదీ, చదువుకునే గదీ ఆయిన వెనక గదిలో కూర్చుని పూలు అల్లుతూ జోగుతున్న పోలీ పెద్దమ్మ ఎదుట టామ్ హాజరైనాడు. ఆవిడ ఒళ్లో పడుకుని నిద్రపోతున్న పిల్లి తప్ప ఆవిడకు వేరే తోడెవరూ లేరు. ఆవిడ కళ్ళజోడు తల మీదికి ఎగదోయబడి వున్నది. ఎప్పుడో పరారీ అయివుంటాడనుకున్న టామ్ తన ఎదట హాజరయేసరికి ఆమె ఆశ్చర్యపడింది.
"నేనిక వెళ్ళి ఆడుకోవచ్చా పెద్దమ్మా?" అని అడిగాడు టామ్.
"అప్పుడేనా ? పని ఎంతవరకయింది?"
"అంతా అయిపోయింది, పెద్దమ్మా."
"అబద్ధాలాడకు, టామ్- నాకు చిరాకేస్తుంది.”
"అబద్ధాలు కాదు, నిజంగా అంతా అయిపోయింది."
పెద్దమ్మకు ఇటువంటి సాక్ష్యంలో నమ్మకం లేక స్వయంగా చూడడానికి బైలుదేరింది. టామ్ చెప్పిన దానిలో అయిదో వంతు నిజంవున్నా ఆవిడ సంతోషించడానికి సిద్దంగానే వుంది. అటువంటప్పుడు చెక్కలగోడ యావత్తూ తెల్లగా రంగువేసి వుండడమే కాక ఒకటికి రెండు విడతలు రంగువేసి వుండడం చూసి ఆవిడకు నోట మాట రానంతపని అయింది.
"నా యిల్లు బంగారంగానూ! చూశావా, తలచుకుంటే నువ్వు పని చెయ్యగలవు కాని తలచుకోడమే వుండదు. పో, వెళ్ళి ఆడుకో, కాని అదేపోత పొయ్యేవు, వీపు చిట్లగొడతా" అన్నది పెద్దమ్మ.
వాడు చేసిన పనికి ఆవిడ పాపం ఎంతో సంతోషించి వాడికి మంచి ఆపిల్ పండు ఏరి ఇస్తూ బుద్ధిమంతులుగా ఉండి చెప్పిన మాట వినే పిల్లలు ఎట్లా బాగుపడతారో చిన్న ఉపన్యాసం ఇచ్చింది. ఈ సందడిలో టామ్ ఆవిడకు తెలియకుండా ఒక్క అప్పచ్చి చేతివాటు వేశాడు.
టామ్ బయటికి వస్తూ మేడమీదికి వెళ్ళే మెట్లెక్కుతున్న సిడ్ ని చూశాడు. తనకి కావలసినన్ని మట్టిబెడ్డలు అందుబాటులో వున్నాయి సిడ్ మీద విసరడానికి. టామ్ కి క్షణంకూడా పట్టలేదు. బిత్తరపోయిన పెద్దమ్మ కదిలివచ్చి సిడ్ ని రక్షించేలోపుగా సిడ్ కి ఆరేడు బెడ్డలు గురిగా తగిలాయి. టామ్ గోడదూకి పారిపోయినాడు. చెక్క గోడకు వాకిలి లేకపోలేదు. కాని టామ్ కి సామాన్యంగా దీన్ని ఉపయోగించే వ్యవధి వుండేదికాదు. చొక్కాకు కుట్టివున్న దారం నల్లదారమని బయటపెట్టినందుకు సిడ్ కి తగినశాస్తి అయింది. ఇప్పుడు టామ్ కి మనస్సు శాంతించింది.
టామ్ ఇంటిపక్క సందులో నుంచి పెద్దమ్మ ఆవులుండే పాక పక్కగా గ్రామం మధ్యకు వెళ్ళాడు. అక్కడ రెండు పిల్ల సేనలు యుద్ధానికిగాను చేరి వున్నాయి. అందులో ఒక సేనకు సేనానాయకుడు టామ్. రెండో సేనకు నాయకుడైన జోహార్పర్, టామ్ కి ప్రాణస్నేహితుడు. సేనానాయకులిద్దరూ యుద్ధంలో పాల్గొన్నారు. వారు ఎత్తున దిబ్బ మీద కూర్చుని తమ అంగరక్షకుల ద్వారా సైనికులకు ఆజ్ఞలిచ్చి యుద్ధం చేయిస్తారు. యుద్ధం చాలాసేపు తీవ్రంగా జరిగి చివరకు టామ్ బలాలు గెలిచాయి. యుద్ధంలో చచ్చిపోయినవారు లెక్కించబ డ్డారు. యుద్ధఖైదీలు వాపసు చేయబడ్డారు మరొక యుద్ధానికి షరతులుకూడా ఆమోదించబడ్డాయి. తరువాత రెండు సేనలూ రెండు పంక్తులుగా నిలబడి “మార్చ్” చేసుకుంటూ వెళ్ళిపోయారు. టామ్ ఒంటరిగా ఇంటిముఖం పట్టాడు.
జెఫ్ థాచర్ ఇంటిమీదుగా వస్తుండగా వాళ్ళ దొడ్లో టామ్ కి ఒక కొత్త అమ్మాయి కనిపించింది. నీలమైన కళ్ళు పెట్టుకుని అందంగా వుంది. బంగారు రంగు జుట్టు రెండు జడలు వేసుకుంది. తెల్లటి ఫ్రాక్ వేసుకుని, కుట్టుపనిచేసిన కుచ్చీలాగు తొడుక్కుంది. ఈమెను చూస్తూనే మన యోధుడు నిలువునా కూలినట్టయినాడు. అక్కడితో ఆమీ లారెన్స్ అనే ఒకానొక పిల్ల టామ్ హృదయంలో నుంచి ఒక్కసారిగా మాయమైపోయింది.
టామ్ ఈ కొత్త పిల్లను ఆరాధించసాగాడు, ఆమె తనను చూసేదాకా చాటుగా ఆమెను తాను చూడసాగాడు. ఆ తర్వాత ఆమెను చూడనట్టు నటిస్తూ, ఆమెని ఆకర్షించడా నికి రకరకాల పిల్లకొర్నాసి వేషాలు వేయ సాగాడు. ఏదో మొగ్గవేస్తూ టామ్ చూసే సరికి ఆ పిల్ల దొడ్లో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోవడం కంటబడింది. పాపం టామ్ విచారంతో కంచె దగ్గిరికివచ్చి నిలబడి, ఆ పిల్ల ఇంకా కొంచెంసేపు నిలబడుతుందని ఆశించాడు. ఆమె మెట్ల మీద ఒక క్షణం అగి గడప లోపలికి అడుగుపెట్టడం చూసి ఒక్క నిట్టూర్పు విడిచాడు. కాని ఆ మరుక్షణమే వాడి మొహం వికసించింది. ఎందుకంటే లోపలికి పోతూ ఆ పిల్ల బంతి పువ్వొకటి కంచె మీదుగా విసిరేసింది.
టామ్ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి నేల మీద పడివున్న పువ్వుకు ఒకటి రెండడుగు ల దూరాన ఆగి కళ్ళకి చెయ్యిపెట్టి దూరాన ఏదో వింత జరుగుతున్నట్టుగా వీధివెంట చూశాడు. తరువాత వెనకటి లాగే పిల్లి మొగ్గలు వేయసాగాడు. ఆయినా ఆ పిల్ల మళ్ళీ కనిపించలేదు ఆ పిల్ల ఏ కిటికీలో నుంచైనా తనను చూసి వుంటుందని టామ్ ఆశించాడు. చివరకు వాడు ఇంటికి వెళ్ళాడు.
రాత్రి అన్నం తింటున్నంతసేపూ వాడి ఉత్సాహం చూసి పెద్దమ్మ, "వీడికేం వచ్చింది!" అని ఆశ్చర్యపడింది! సిడ్ మీద బెడ్డలు వేసినందుకు బాగా చివాట్లుతిని కూడా టామ్ చలించలేదు. మీదు మిక్కిలి పెద్దమ్మ ఎదురుగానే పంచదార కాజెయ్య డానికి ప్రయత్నించి ముణుకులు విరగ గొట్టించుకున్నాడు.
"సిడ్ పంచదార తీసుకుంటే కొట్టవేం" అన్నాడు టామ్ పెద్దమ్మతో.
"అవును, సిడ్ నీలాగా కొరుక్కుతినడు. నే చూడనప్పుడల్లా నీ చెయ్యి పంచదార మీదికే పోతుంది" అన్నది పెద్దమ్మ.
కొద్దిసేపటికి పెద్దమ్మ వంటింట్లోకి వెళ్ళింది. సిడ్ ఎవరు ఏమి అంటారన్న భయం లేకుండా పంచదార పోసిన పింగాణిదొన్నె అందుకున్నాడు. కాని అది వాడి వేళ్ళ నుంచి జారి కిందపడి పగిలిపోయింది. టామ్ కి పరమానందమయింది. కాని వాడు కిక్కురుమనలేదు. పెద్దమ్మ వచ్చి, "ఈ పని ఎవరుచేశారు?" అని అడిగేదాకా టామ్ నోరు మెదపదలచలేదు.
పెద్దమ్మ తిరిగివచ్చింది. పగిలిన పంచదార దొన్నె చూసి కళ్ళజోడు మీదుగా నిప్పు రవ్వలు కురిపించింది. "ఇంకొక్కక్షణంలో అబ్బాయి. గారిపని" అని అనుకుంటున్నా డు. మరుక్షణం వాడే నేలమీద పడి ఉన్నాడు. పెద్దమ్మ మళ్ళీ రెండో దెబ్బ వెయ్యడానికి చెయ్యిఎత్తింది.
"నన్నెందుక్కొడతావ్? సిడ్ పగలగొట్టాడు" అని టామ్ ఆరిచాడు.
పోలీ పెద్దమ్మ నిశ్చేష్టురాలయింది. ఆవిడ నుంచి ఇక దయారసం ఒలుకుతుందని టామ్ అనుకున్నాడు. కాని ఆవిడ, "దెబ్బతింటే ఏంలే? నే చూడకుండా ఎన్ని వెధవపనులు చేశావో!" అన్నది.
అయినా ఆవిడ అంతరాత్మ బాధపడింది. జాలిగా ఏమన్నా అందామనుకున్నది గాని బెట్టు చెడిపోయి, టామ్ కి అలుసవుతుం దని సంకోచించింది. అందుచేత ఆవిడ పై కేమీ అనకుండా తనపనులు చూసుకో సాగింది.
🧑🌾
*ఇంకా ఉంది*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*ప్రాంజలి ప్రభ*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*ఆరోగ్యమ్.. ఆనందం.. ఆధ్యాత్మికం *
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 62911900539*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
287. సరమ ఓదార్పు- రావణ సభావిశేషాలు
‘‘సీతా’’అనునయంగా ఎవరో పిలిచినట్టయి తలెత్తి చూసింది సీత.ఎదురుగా విభీషణుని భార్య సరమ.సీత యోగక్షేమాలు తెలుసుకునేందుకు రాజకుటుంబం తరఫున సరమను నియమించాడు రావణుడు. ఆమె అప్పుడప్పుడూ వచ్చి సీతను కలుస్తూ ఉంటుంది. సీతను ఓదారుస్తూ ఉంటుంది. రాక్షసుల్లో దేవత ఆమె.‘‘లే తల్లీ లే! ఏడవకు.’’ అంది సరమ. సీతను లేపి కూర్చోబెట్టింది. కాపలా స్త్రీలు కొంచెం దూరంగా ఉండడాన్ని గమనించింది. చెప్పిందిలా.‘‘తల్లీ! యోగవిద్యతో నేను అదృశ్యంగా ఉండి, నీకు రావణుడు చెప్పిందీ, నీ ఆవేదనా అంతా గమనించాను. రాముడు శిరస్సూ, ధనుస్సూ చూశాను. కుతంత్రాలు పన్నడంలో రావణుడు దిట్టమ్మా! అతని చేష్టలన్నీ కుతంత్రాలే! నిజం చెప్పనా? ఆ శిరస్సూ, ధనుస్సూ రాముడివి కావమ్మా! అంతా మాయ.’’ అన్నది సరమ.‘‘నిజమా’’ అంది సీత. కన్నీరు తుడుచుకుంది.‘‘నిజం తల్లీ! ఆ శిరస్సూ, ధనుస్సూ రెండూ మాయే.’’ గట్టిగా చెప్పింది సరమ.‘‘మెల్లిగా మాట్లాడమ్మా! లేకపోతే నా వల్ల నీకు లేనిపోని ప్రమాదం.’’ అన్నది సీత. అటూ ఇటూ భయంగా చూసింది.‘‘తల్లీ! నీ సేవలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నాకేం కాదు గాని, నీకు ఓ నిజం తెలుసా తల్లీ! ద్వారపాలకుడు రాగానే రావణుడు ఎందుకంత ఆందో ళనగా ఇక్కణ్ణించి వెళ్ళిపోయాడో తెలుసా?’’ అడిగింది సరమ.
తెలియదన్నట్టుగా తలూపింది సీత.‘‘నీ భర్త రాముడు లంకపై దండెత్తి వస్తున్నాడు. ఆ మాట చారులు చెబితే మంత్రులతో మంతనాలు సాగించి, యుద్ధానికి సిద్ధమవుతున్నాడు రావణుడు.’’అందుకు ఆనందించాలో, దుఃఖించాలో తెలియని స్థితిలో ఉంది సీత. అయోమయంగా చూసింది.‘‘నీతిశాస్త్రం, ధర్మపరత, ప్రతాపాల్లో సాటిలేని నీ రాముడికి ఎలాంటి ఆపదా రాదు తల్లీ. నీకు తెలుసా? నీ భర్తను పెద్దపెద్ద వృక్షాలూ, కొండలూ పట్టుకుని వానరులు కాపలా కాస్తున్నారు.’’ అన్నది సరమ.అవునా? అని ఆశ్చర్యంగా చూసింది సీత.‘‘ఓ శుభవార్త చెబుతాను, వినమ్మా! నేను కళ్ళతో చూసింది చెబుతున్నాను. రాముడు సముద్రమధ్యంలో సేతువు నిర్మించాడు. దానిపై నడచి వచ్చి అపార సేనావాహినితో లంకలో విడిది చేశాడు.’’ అంది సరమ. ఆనందంగా చూసింది సీత. అంతలో యుద్ధ సన్నాహాన్ని తెలియజేస్తూ భేరీ, శంఖధ్వనులూ వినవచ్చాయి. కవచాలు ధరిస్తున్న సైనికులు అటూ ఇటూ తిరగడం కనిపించింది. గుర్రాల సకిలింపులూ, ఏనుగుల ఘీంకారాలు కూడా వినవచ్చాయి.‘‘విన్నావా? అవన్నీ మనకు మంగళవాద్యాలే.’ అన్నది సరమ.
సీతకు ధైర్యాన్ని కలిగించింది. ఆమెకు మరింత ఆనందాన్ని కలిగించేందుకు అన్నదిలా సరమ.‘‘తల్లీ! నువ్వు కావాలనుకుంటే నేను అదృశ్యంగా పోయి నీ రాముణ్ణి కలుసుకుంటాను, నీ క్షేమాన్ని తెలియజేసి వస్తాను.’’‘‘ఆ సంగతి తర్వాత. ముందు నాకు ఓ చిన్న సాయం చేయమ్మా.’’ అడిగింది సీత.‘‘చెప్పమ్మా’’‘‘రావణుడు ఈ సమయంలో ఏం చేస్తున్నాడో, నన్ను ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకుని రా.’’‘‘తప్పకుండా’’ అన్నది సరమ. అక్కణ్ణుంచి అదృశ్య మైంది. రెండు గడియల్లో తిరిగి వచ్చింది. వచ్చిన సరమను గట్టిగా కౌగలించుకుంది సీత.‘‘రావణుడిప్పుడేం చేస్తున్నాడు? నన్నేం చేయాలనుకుంటున్నాడు?’’ అడిగింది మళ్ళీ.‘‘రావణుడు ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నా డమ్మా! ఆ విషయమై మంత్రులతో మంతనాలు చేస్తున్నాడు. రాముడు దండెత్తి వస్తున్నాడన్న వార్త తెలుసుకున్నదేమో! రావణుని తల్లి కైకసి వచ్చిందక్క డకి. ఆమెసహా వృద్ధమంత్రి అవిర్థుడూ వచ్చాడు. ఇద్దరూ రాముని పరాక్రమాన్ని రావణునికి వివరించారు. ఒంటి చేత్తో ఖరదూషణాదులను రాముడు హతమార్చిన సంగతి గుర్తు చేశారు.రాక్షసజాతీ, లంకా క్షేమంగా ఉండాలంటే రాముడితో యుద్ధం వద్దన్నారు. తప్పు ఒప్పుకుని, నిన్ను నీ భర్తకు అప్పగించమన్నారు. రాముణ్ణి శరణు వేడుకోమన్నారు.’’‘‘రావణుడు అందుకు ఒప్పుకున్నాడా?’’ అడిగింది సీత.‘‘లేదమ్మా! ఆ మూర్ఖుడు తల్లి కోరినా కాదన్నాడు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను వదలనన్నాడు.’’ అన్నది సరమ. ఆ మాటకు ఏడవసాగింది సీత.
***
No comments:
Post a Comment