Friday, 9 May 2025


*10-May-25, ప్రాంజలి ప్రభ

*సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం*

  

*ఒకసారి స్వామి వివేకానంద మండు వేసవిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రైల్వేస్టేషన్‌లో ఉండగా ఒక సంఘటన చోటుచేసుకుంది. వివేకానందుడు సన్యసించారు, కనుక వారికి భగవత్ ప్రసాదంగా లభించినదే భుజిస్తుండేవారు.భిక్షగా ముడి సామాన్లు లభిస్తే వండుకుని భుజించేవారు లేదా భిక్షాటన చేస్తుండేవారు.*

వివేకానందుడికి ఒకరోజు తినటానికి ఏమీ దొరకలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఆకలి బడలికలతో దాహార్తితో నేలపై కూర్చొని ఉన్న స్వామీజీని గమనించి ఒక ధనవంతుడు చులకనగా మాట్లాడనారంభించాడు. అతని ఆలోచన ప్రకారం సన్యాసులు అంటే ఏ పనీ చేయకుండా, సోమరిలా తిరుగుతూ, ఊరిలో వారిపై భోజనానికై ఆధారపడుతూ, ప్రజలను మభ్యపెట్టి ధనం అపహరిస్తూ ఉంటారని. ఇటువంటి భావం కలిగి  స్వామీజీతో అతడిలా అన్నాడు.

ఓ స్వామీ! చూడు చూడు నేనెంత మంచి భోజనం చేస్తున్నానో, నా వద్ద త్రాగటానికి చల్లని నీళ్ళు ఉన్నాయి కూడా. నేను డబ్బులు సంపాదిస్తాను. కాబట్టి నాకు మంచి మంచి వంటకాలు, వగైరాలు అన్నీ సమకూరాయి. ఇటువంటి భోజనం నువ్వు కనీసం కలలో అయినా పొందగలవా...? ఏ సంపాదనా లేకుండా దేవుడు,దేవుడూ అంటూ తిరిగేవాడివి. అందుకే నీకు ఈ బాధలు. అయినా నువ్వు నమ్ముకున్న నీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడయ్యా... ఆకలి బడలిక తప్ప..!” అని దెప్పి పొడవటం మెుదలుపెట్టాడు.* 

*స్వామీజీ ముఖంలోని ఒక్క కండరం కూడా కదలలేదు. విగ్రహంలా కూర్చొని భగవంతుని పాదపద్మాలనే తలచుకుంటున్నారు.*

*అప్పుడు ఒక అద్బుతం జరిగింది ...*

*ప్రక్క ఊరి జమీందారు ఒక వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి స్వామీజీ పాదాలపై వాలిపోయాడు. అతను స్వామితో ఇలా అన్నాడు, *మీ పాదాలను సేవించి స్పృశించే భాగ్యం కలగడం నా పట్ల   శ్రీ రామ చంద్రమూర్తి అనుగ్రహం. దయచేసి మీరు ఈ భోజనం స్వీకరించండి!" అని ప్రాధేయపడ్డాడు.*

*స్వామీజీ “ఎవరు నాయనా నీవు? నేను నిన్ను ఎరుగనే.. పొరబడుతున్నట్లున్నావు. నీవు వెతుకుతున్న వ్యక్తిని నేను కాదు!” అని అంటూ ఉంటే,  ఆ వ్యక్తి స్వామీజీ ముందు వెండి పీట వేసి భోజనం ఒక బంగారు అరటి ఆకు మీదకు మారుస్తూ... లేదు స్వామీ నేను కలలో చూసింది మిమ్మల్నే..!”*

*”శ్రీరామచంద్రమూర్తి స్వయంగా నా కలలో కనిపించి మిమ్మల్ని చూపించి నా బిడ్డ ఆకలితో ఉంటే నీవు హాయిగా తిని నిద్రిస్తున్నావా.. లే.. లేచి అతనికి భోజనం పెట్టు!  అని ఆజ్ఞాపించారండి. ఆహా.. ఏమి నాభాగ్యం మీ వలన నాకు రామదర్శనం కలిగింది. తండ్రీబిడ్డలు ఇరువురుది ఏమి గాంభీర్యం, ఏమి సౌందర్యం ఒక్కసారి చూస్తే చాలు ఎవరూ మరచిపోలేరు.”*

*”నేను పొరబడటం లేదు స్వామీ.. దయచేసి వేడి చల్లారక ముందే ఆరగించండి. చల్లటి నీరు కూడా తెచ్చాను అన్నాడు.* 

*స్వామీజీ కనుల వెంబడి జలజల నీరు కారింది.     ఏ అభయ హస్తమైతే తన జీవితమంతా ఆయనను కాపాడుతూ వస్తుందో. అదే అభయ హస్తమిది.*

*ఎదురుగా నోరు వెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న ఆ ధనవంతుడు ఉన్నపళంగా స్వామి వారి పాదాలపైపడి, కన్నీటి ధారాలతో స్వామి పాదాలను అభిషేకిస్తూ క్షమాపణ కోరాడు. సన్యాస జీవితమంటే భగవంతుని వడిలో నివసించటం అని అర్థమయింది. నిజమైన సన్యాసిని దూషించటం అంటే భగవంతుని దూషించినట్లే అని తెలుసుకున్నాడు.*

*తనని నమ్ముకున్న వారిని కంటికి రెప్పలా ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. యోగులు హృదయాలలో సదా నివసిస్తుంటాడు ఆ పరమాత్మ.*

*ఇది కేవలం స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన మాత్రమే, ఇంతకు మించినవి, ఎంతో ఆశ్చర్యం కలుగజేసేవి, భగవంతుని పట్ల, యోగుల పట్ల సడలని విశ్వాసం కలుగజేసేవి మరెన్నో...!*

*అందరికీ తెలిసేలా మన భారతీయ ధర్మాన్ని వ్యాప్తిచెయ్యాలి.*

_-[స్వామి_వివేకానంద జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన..]-_

🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*సర్వేజనా సుఖినోభవంతు*

*లోకా సమస్త సుఖినోభవంతు*

 *శుభం భూయాత్*

*ఓం శాంతి శాంతి శాంతిః*

*స్వస్తి*

*****

 అనిమిత్త భయం

మహాభారత ఇతిహాసం ఒక శునకం కథతో ప్రారంభమవుతుంది! కుక్క అంటే అది సామాన్యమైన కుక్క కాదు... మాట్లాడే ఆడ కుక్క.. దేవతల కుక్క... పేరు సరమ కోసం పనికిరాదని, నియమనిష్టలతో యాగాలు చేసిన వారికంటే కోపం లేనివాడే ఘనుడని చెప్పే కథ ఇది. ఎదుటివాళ్లు కానిమాటలు మాట్లాడినా పట్టించుకొనకపోవడం, ప్రతీకారానికి పూనుకోకపోవడం బుద్ధిమంతుల లక్షణం' అని హితం ఉపదేశించే దివ్యగాథ సరమది. స్నేహంతో ఉన్నవారిని ఆకారణంగా తూలనాడేవారికి సమీపంలో ఉండరాదని సలహా ఇస్తున్నది సరమ చరిత్ర. బలహీనులపట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఎప్పటికైనా ఆ పాపం కట్టి

కుడుపుతుందని వ్యాసమహర్షి భారతం ప్రారంభంలోనే హెచ్చరించాడు. భయాలు రెండు విధాలు... నిమిత్త భయం, అనిమిత్త భయం. కొన్ని భయాలకు కారణం ఉంటుంది. కొన్నింటికి ఉండదు. నిరపరాదులను బాధిస్తే, ఏ సూచన లేకుండానే భయాలు కలుగుతాయి. మనుషుల మధ్య ఏదో ఒక కారణంతో శత్రుత్వం కలుగుతుంది. జంతువులకు పుట్టుకతోనే వైరం ఉంటుంది.

ఎలుకకు పిల్లిని చూస్తే భయం పిల్లికి కుక్కను చూస్తే భీతి పాములు, పులులను చూస్తే మనిషికి భయం! మనిషిని చూస్తే ప్రాణులన్నింటికీ భయమే! చివరికి సాటి మనిషిని చూసి మనిషే భయపడు తున్నాడు. బలహీనులను చూసి ఎవరూ భయపడరు. కానీ, బలహీనుల పట్ల అమానుషంగా ప్రవర్తించేవారికి అనిమిత్త భయం కలగక తప్పుడు. దీనికి విరుద్ధ స్థితిలో కలిగేవి నిమిత్తభయాలు.

అంతర్యామి చెప్పే సందర్భం గా

సరమ సంగతి రుగ్వేదంలోన వరాహపురాణంలోను కనిపిస్తుంది. నిరుక్తకారులు 'మాధ్యమిక వాణి'గా సరమను పేర్కొంటారు. దీని అర్ధం 'మేఘగర్జన'. వర్షాలు లేక బాధపడే ప్రజలు హఠాత్తుగా మేఘగర్జన విన్నప్పుడు ఆశ్చర్యపడే దృశ్యాన్ని గురించి వేదంలో ఈ పదం ఉంది. వరాహపురాణంలో సరమ పాత్ర ప్రవేశిస్తుంది. దేవతల గోవులకు కాపలా కాస్తూ ఉంటుంది. రాక్షసులు సమయం ఆ గోవులను కాజేశారు. దేవతలు ఇంద్రుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఇంద్రుడు గోవులకు కాపలాగా ఉన్న సరమను పిలిచి ప్రశ్నించాడు. సమ నాకు తెలియదు' అని అబద్ధం చెప్పింది. సరమ రాక్షసుల వద్ద లంచం తీసుకొని ఆవులను అసురులకు ఇచ్చింది. ఇంద్రుడు కోపించి సరమను కొట్టాడు. దానితో సరమకు బుద్ధి వచ్చి జరిగింది చెప్పింది. 'అయితే నువ్వే వెళ్ళి గోవులను తీసుకొని రా!' అని ఇంద్రుడు ఆజ్ఞాపించాడు. 'మరి నేను వెళ్లిపోతే నా పిల్లలకు పాలు ఎలా? దయతో వాటికి అవ్వ పాలను ఇప్పించు!" అని సరమ ప్రార్ధించగా ఇంద్రుడు అంగీకరించాడు.

ఇక భారతంలో సరమ కథ జనమేజయుడు కురుక్షేత్రంలో దీర్ఘసత్రయాగం ప్రారంభించాడు. ఆ సమయంలో సరమ కుమారుడు ఆడుకుంటూ ఆ యాగ ప్రాంతానికి వెళ్ళాడు. జనమేజయుడి తమ్ముళ్లు పసివాడని చూడకుండా సరమ కొడుకును కొట్టి హింసించారు. ఈ సంగతి సరమకు తెలిసింది. 'అభంశుభం తెలియని పసిబిడ్డ అయిన నా ముద్దుల కొడుకును అనవసరంగా నీ తమ్ముళు కొట్టి హింసించారు. పేదవారిని, సాధువులను, బలహీనులను హింసించేవారికి అనిమిత్త భయాలు కలుగుగాక!' అని శపించి సరమ అదృశ్యం అయింది. దీన్ని భారత నీతిగా మనం గ్రహించవచ్చు:

****

No comments:

Post a Comment