Saturday, 20 May 2017

శ్రీశైలం శ్రీ మల్లికార్జునుడు - శ్రీశైలము

శ్రీశైలం శ్రీ మల్లికార్జునుడు - శ్రీశైలము

శ్రీశైలానికి నాలుగు ద్వారాలు వున్నాయి అవి .......

ఇక్కడ మల్లికార్జునుడు స్వామి వారు ,, భ్రమరంభిక శక్తీ పిఠము - భ్రమరంభిక గా వెలిసింది

* నాలుగు ద్వారాలు -- క్షేత్రాలు

తూర్పు ద్వారం " త్రిపురాంతకం " :
శ్రీశైల మహాక్షేత్రానికి తూర్పున వున్నా ద్వారం త్రిపురాంతక క్షేత్రం .
తారకాసురుడిని చంపింది ఈ కొద పైనే కావడం తో దిన్ని కుమారగిరి అంటారు .
ఈ గిరి పైన స్వామి(శివుడు ) వారు త్రిపురాంతకేశ్వరుడుగా భక్తులకు దర్శనమిస్తారు .
ఈ క్షేత్రము లో శక్తీ శ్వరూపిణి జగదాంబ త్రిపుర సుందరి గా కొలువై వున్నారు ...
ఈ క్షేత్రానికి ఉత్తరానా పూలకొండ వుంది , ఇక్కడ తారకాసురుడు , మహా విష్ణువు పూజించిన శివలింగములు వున్నాయి , మరియు తామర తీర్ధం , జాహ్నవి తిర్దాలు ఇక్కడ కనిపిస్థాయి .
త్రిపురాంతకం క్షేత్రం నుంచి కాశికి , శ్రీశైలానికి సొరంగ మార్గము వున్నది అని చెబుతారు .
*** త్రిపురాంతకం క్షేత్రము శ్రీశైలానికి 92 k.m దూరములో వున్నది ***
ప్రపంచములోనే ఈ క్షేత్రములో శ్రీచక్రము పైనే దేవాలయము ప్రతిష్టించబడినది

దక్షిణ ద్వారము - సిద్ధవటం :
శ్రీశైల క్షేత్రానికి సిద్ధివటం దక్షిణ ద్వారము గా వ్యవహరిస్తారు . శ్రీశైల క్షేత్ర ద్వారలలో సువిశాలమైన ద్వారము .
సిద్దివటము సిద్దులకు ప్రదానమైన కేంద్రము . పెన్నా నది ఒడ్డున వున్నా ఈ క్షేత్రము కాశికి సమానమైనా క్షేత్రము గా ప్రసిద్ధి చెందింది .
ఈ నదిలో స్నానము చేసి సిద్దేశ్వరుని దర్శిస్తే విముక్తి లబిస్తుంది .
ఈ క్షేత్రము కడప జిల్లా నుంచి తిరుపతికి వెళ్ళే మార్గ మద్యలో వున్నది

పశ్చిమ ద్వారము అలంపుర క్షేత్రము :
జోగులాంబ దేవి మహా శక్తీ పిటము అలంపుర క్షేత్రము 18 శక్తీ పిఠములలో ఒకటి ఈ జోగులాంబ దేవి .
గంభీర రూపములో వున్నా ఈ అమ్మవారిని పక్కనుండి నమస్కరించాలి .
ఈ క్షేత్రము మహబూబ్ నగర్ జిల్లా తుంగభద్ర నదీ తీరములో వుంది .

ఉత్తర ద్వారం - ఉమామహేశ్వరం :
ఈ క్షేత్రము లో స్వామి ( శివుడు ) మహేశ్వరుడు గా కొలువు దిరి వున్నాడు ..
క్షేత్రనాథుడైన ఉమామహేశ్వరుడు స్వయం భూలింగము .
ఇక్కడ వున్నా రుద్ర దారము లో స్నానము ఆచరించి మహేశ్వరుణ్ణి దర్శిస్తే మరు జన్మ ఉండదు భక్తుల నమ్మకము .
ఇక్కడ ఒక రాత్రి నిదురిస్తే కాశి , ప్రయాగాది పుణ్యక్షేత్రాలలో లక్షల సంవత్సరాలు నివసిన్చినంత ఫలం లభిస్తుంది .
శివరాత్రి పర్వదినాన సకల దేవతాగణలు ఇక్కడికి వస్తాయి .
ఈ క్షేత్రము లో రుద్ర ధారా , విష్ణు ధారా , బ్రహ్మ ధారా , అనే మూడు తీర్థాలు వున్నాయి . ఇక్కడ పట్టెడు అన్నము దానము చేస్తే .. అన్నదానము లేక్కలేనింత ఫలితము వొస్తుంది ..
హైదరాబాద్ వెళ్ళే మార్గము లో మన్నూరు , రంగ పురము వద్ద 3 k.m లు నడిచి ఉమామహేశ్వరాని చేరుకోవొచ్చు ..

శిఖర దర్శనము :
శ్రీశైలము . నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరములో తూర్పు వైపున దోర్నాల మార్గములో శిఖర దర్శనము చేసుకోవొచ్చు .

సాక్షి గణపతి :
శివ పార్వతుల దర్శనము అనతరము ( తరువాత ) భక్తులు సాక్షి గణపతి ఆలయాము వద్దకు తప్పనిసరిగా వెళతారు.
పార్వతి పరమేశ్వరులను దర్సించుకున్నట్లు ఇక్కడ వారి తనయుడు ( వినాయకుడు ) సాక్షి అయి నమోదు చేసుకుంటాడు .

పాలధార - పంచదార :
ఇక్కడ ఆదిశంకర చార్యులు తపస్సు చేసిన ప్రాంతమిది , ఆలయానికి 4 k.m దూరములో సాక్షి గణపతి ఆలయము దాటాక దర్సనమిస్తున్ది . 146 మెట్లు దిగాలి . పాలధార - పంచదారకి

పాతాళ గంగ :
శ్రీశైలానికి 3 k.m దూరములో వుంటుంది . దాదాపు 900 మెట్లు దిగి వెళ్లి పాతాళ గంగ లో స్నానము చేయడము విశేష పుణ్య ఫలము.
ఇక్కడ తమ పిత్రు దేవతలకు తర్పణము వదులుతారు .

విభూతి కుండం :
వీరాశంకరాలయానికి ముందుభాగము లో కాస్త దూరములో ఒక నిటి కుండ వుంది
దీనినే విభూతి కుండ అని కొడ అంటారు .. ఈ కుండలో స్నానము చేసిన వారికి సంపదలు కలుగుతాయి , అందుకే దీనిని విభూతి కుండ అంటారు ( విభూతి అంటే ఐశ్వర్యము ) .


సృష్టి రహస్యం

సృష్టి రహస్యం
 

సృష్టి రచన
భారతీయ తాత్విక సత్య నిర్దేశనం.
- శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్య గారి సంస్కృత భాగవత ప్రవచన సారం.

కల్పాంతం, మాహా ప్రళయం తరువాత వటపత్ర శయన శాయి అయిన పరమాత్మ కొన్ని యుగాల సమయానంతరం సృష్టి చేయ ఉపక్రమిస్తారు.
 
తనలో నిక్షిప్తమై ఉన్న జీవాలు పూర్వ సృష్టి, తిరిగి చేతనావస్తకి చేరుకుంటాయి. ఏకమై ఉన్న తాను తనద్వారా తన అంశల ద్వారా అనేకులు అవుతారు. వాటిలో ప్రధమంగా తన బొడ్డు లోంచీ తామర తూడు (Umbilical Chord) సృష్టి జరగడం ఆ పద్మంలో బ్రహ్మ దేవుని రూపు అంకురార్పణ జరగడం.
దీనినే సర్గ సృష్టి అంటారు. తన నిర్దేశం మరియూ తలపు ద్వారా జరిగిన సృష్టి.
 
తన సృష్టిచే జనించిన బ్రహ్మ ద్వారా, ఆయన సృష్టి ద్వారా జరిగిన సకల భూతాల, జీవాల, బ్రహ్మాండాల, గ్రహాల, ప్రకృతి సృష్టిని విసర్గ సృష్టి అంటారు.

అలా జనించిన బ్రహ్మ తాను ఎవరో ఏం చేయాలో అన్న సందిగ్ధంలో కలియ జూసి తన ఉనికికై వెతికి జాడ తెలియక తనలో బయలుదేరిన ఓంకార నాదంపై శ్రద్ధ యోగం నిలపి తపస్సు చేయ ఉపక్రమిస్తారు. ఆ తపస్సు బ్రహ్మ కాలమానం ప్రకారం వెయ్యి సంవత్సరాలు ఉంటుంది. ఆ తరువాత విష్ణు పరమాత్మ దర్శనం జరిగి కర్తవ్య బోధ అడుగుతాడు. నీవు సృష్టి కార్య రచన చేయాలి అనగా ఎలా అని అడుగగా క్రితం సృష్టిలో ఏం చేసావో అదే తిరిగి చేయమని ముందుగా ఉన్న దాన్ని విభాగాలుగా చేసి సృష్టి రచన చేయమని ఆదేశిస్తారు పరమాత్మ.
 
ముందు తపస్సు చేయి లోకాన్ని సృష్టించే క్రమంలో నన్ను మరువకు నా గురించి తపస్సు చేసి క్రమంలో నీ సృష్టి రచన అనే కర్తవ్యం మరువకు అని బోధ చేస్తారు.
 
కాలం అనేది, మన జనన మరణ చక్రాలు, ఈ సృష్టి స్థితి లయ అన్నవి, మన అనాది సంస్కృతి ఇవన్నీ కూడా ఒక cycle లో తీరుగాడుతున్నాయి అన్న దానికి ఇది ఒక నిదర్శనం.
 
అందుకే మన సంస్కృతిని అనాది ధర్మం (ఆద్యంత రహిత సనాతన ధర్మం) అంటారు. అనాది అంటే మొదలు లేనిది.
 
(కాల చక్ర గతి వేరొక పోస్టులో)
ఆపై జరిగిన విసర్గము అనబడే సృష్టిలో ఈ క్రింది విధంగా సృష్టికార్య రచన సిధ్ధింపబడింది.
ప్రథమ సృష్టి నిర్మాణంలో ఈ క్రింది వరసలో సృష్టి కార్య రచన జరిగింది.
 
1. సనత్కుమార సనక సనందన సనస్తుజాన లు పుడతారు వారిని తిరిగి సృష్టి రచన లో పాల్గొమనగా భగవంతుని అర్చన లో మాకు ప్రీతి అని నిరాకరిస్తారు.
 
2. నిరాకరించిన క్రోధం ఆపుకొనగా బ్రహ్మ భ్రుకుటి లోంచి రుద్రుడు, ఏకాదశ రుద్రులు పుడతారు. సృష్టి రచన బదులు తామూ తమ రోదన ఫలితపు క్రోధంతో లోకల లయం చేయగా తపస్సు చేయమని ప్రభోధిస్తే తపస్సు చేస్తూ రుద్రుడు శివుడు అవుతాడు.
 
3. బ్రహ్మ గారు తిరిగి తపస్సు చేసి నవ ప్రజాపతులు, నారదుని సృష్టిస్తారు.
మరీచి అత్రి అంగీరస పులత్స్య క్రతువు భృగువు పులహుడు వశిష్ఠుడు అంగుష్టం నుండి దక్షుడు ఈ నవ ప్రజాపతులు.
 
4. వారితో బాటుగా మొదటగా సృష్టించబడినవి ఇవి
ధర్మము అధర్మము మృత్యువు కామము కోపము లోభము సముద్రాలు నిరృతి పాపములు నీడ నుంచి కర్ధముడు మొదలగునవారు.
 
5. హృదయంలోంచి సరస్వతి పుడుతుంది కానీ మోహ కారణంగా బ్రహ్మ మనో చాంచల్యం కలుగగా తన ఇతర పుత్రులైన ప్రజాపతులు హేళనగా నవ్వగా బ్రహ్మ తన శరీర త్యాగం గావిస్తారు. ఆ శరీరమే ఇప్పటికీ పొగమంచు రూపంలో ఈ భూమిపై తిరుగాడుతూ ఉంటుంది.
 
6. తిరిగి ద్వితీయ శరీర ధారణ చేసి తపస్సుతో తన సృష్టి కార్య రచన సాగిస్తారు. ఈ క్రింది సృష్టి రచన జరిగింది.
నాలుగు వేదాలు, యజ్ఞములు, ధర్మము యొక్క నాలుగు పాదాలు ఆయిన విద్య దానము తపస్సు సత్యములు, శస్త్రము ఆయుర్వేదం స్తుతి వడ్రంగి శిల్పాది కళలు, పంచమ వేదములు ఆయిన పురాణాలు ఇతిహాసాలు షోడసి యజ్ఞలు బ్రహ్మచర్య గృహస్త వానప్రస్తాది ఆశ్రమ ధర్మాలు
మనుష్యులు - అన్విక్షకి త్రయీ దండనీతి వార్త చదువులు
హృదయంలోంచి ప్రణవం, భూ భువః వంటి సప్త వ్యాహృతులు, చందస్సులు సంగీతం సప్త స్వరాలు అచ్ఛులు హల్లులు ఉష్మలు అక్షరములు బలము ఇతరములు సృష్టి చేస్తారు.
----------- ***** ---------- ***** -------------

విసర్గ సృష్టిలో జీవ జంతుజాలం మానవ సృష్టి రచన
తాను జరిపిన ఈ అఖండ విభాగ సృష్టి కార్య రచనలో ఇంత సృష్టి రచన చేసినాజీవ సంతతి తగిన విధంగా పెరగకుండా ఉండడం గమనించి బ్రహ్మ తనకు సహాయంగా reproduction అన్నది ఆడ మగల మధ్యన జరగాలి అని మిథున సృష్టి చేయాలని ప్రప్రథమంగా
 
స్వాయంభువ మనువును అలాగే తనకి తోడుగా ప్రప్రథమంగా శతరూప అనే భార్యను సృష్టిస్తారు.
వారికి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే పుత్రులు
ఆకూతి దేవహూతి ప్రసూతి అనే పుత్రికల జననం కలుగుతుంది.
ఆకూతికి రుచి అనే ప్రజాపతి ( ?? వివరణ వేరే పోస్టులో)
దేవహూతికి కర్ధమ ప్రజాపతి
 
ప్రసూతికి దక్ష ప్రజాపతి లను ఇఛ్చి వివాహం చేస్తారు.
మానవునిగా పుట్టిన జీవుల ధర్మం ఇది అని బ్రహ్మ వారికి ఉపదేశించారు.

దేవతల రుణం
కన్నతల్లి రుణం
ఋషుల రుణం
అతిధుల సత్కారం
సకల ప్రాణికోటి తగిన రీతిలో సేవ
అనే ఐదు రుణాలు మానవ జన్మ ఎత్తిన ప్రతి జీవి కర్తవ్యం.

ఇలాగ సృష్టిరచన ఆరంభం అయ్యింది అని భాగవత పురాణ ప్రవచనంలో శ్రీమాన్ శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్య గారు వివరించారు. తప్పులు ఏవైనా ఉండి ఉంటే నావిగా భావించి క్షమించగలరు.
రెండు ఎడారి మతాల ఆరు రోజుల సృష్టి రచన, పక్కటెముక ఆడాము అవ్వల సృష్టి, రెండు ఎడారి అజ్ఞానుల బల్లపరపు భూమి వివరణ
తిరిగి తమ తమ మిడి మిడి పరిమిత అజ్ఞ్యానంతో సనాతన ధర్మాన్ని నినదించే కుష్క ప్రయత్నాలను త్రిప్పి కొట్టండి.
ధర్మ పరిరక్షణ, సంస్కృతి సాంప్రదాయ ధర్మాచరణ మన అందరి ప్రధమ కర్తవ్యం కావాలని ఆశిద్దాం.
ధర్మో రక్షతి రక్షతః.
సృష్టి క్రమ వివరణ అద్భుతం గురువుగారి ధారాళ వివరణ మహత్యం
ప్రణతోమి ఆచార్యా శ్రీ శ్రీ భాష్యం అప్పలాచార్య గారు.

Friday, 19 May 2017

పరమేశ్వరుని లీలలు.


లింగోద్భవ మాలికా (1 )

పురి మధురం గిరి మాధుర్యం
గరిమధురంధరనితంబభారాఢ్యం !
స్థూలకుచం నీలకుచం
బాలకచంద్రాంకితం తేజః !!........(1)

హ్రృదితరస విదితరసా గ
తదితరసాహిత్యవాజ్నమే లగతి !
కవిలోకే న విలోకే భువి
లోకేశస్య శాహజేరుపమానమ్ !!.... (2)

లత మధురం రమ మధురం
లతరమ సుందర సుమాల ప్రేమాభ్యం !
లత మోనం రమ మోనం
భర్త సమానాంకితం తేజః.!! .......(3)

చిరు తమకం సిరి తమకం
చిరుసిరి తన్మయ ప్రభావ ప్రేమాభ్యం!
చిరు హాసం సిరి హాసం
సవ్య సుమాలాంకృతం తేజః.!!....(4)

శశి కిరణం తన్మయ సౌలభ్య విదితం
కవి నయనం హ్రృద్యయ పన్నీరు కవితం!
రివి కిరణం ప్రార్ధన అస్తమ విజయం
శివ తరుణం సద్భుధ్ధి చంద్రుని వినయం!!..... 5


పరమేశ్వరుని లీలలు.
చోళులు రాజ్యమేలుతున్న రోజులవి. తమిళనాడు రాష్ట్రంలో సత్త మంగై అనే ఊళ్లో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తుండేవి. ఆ ఊళ్లోని మఠాలలో పండితులు ప్రతి రోజూ వేదగానం చేసేవారు. మైనాజాతి పక్షులు ఆ వేద ఋక్కులను తియ్యని గొంతుతో అనుకరిస్తూ పాడేవి. 

స్త్రీలు లావణ్యాన్ని ఒలకబోస్తూ చెరువులలో దిగి స్నానాలు చేసేవారు. హంసలు ఒకదానితో మరొకటి పోటీపడి చెరువులో దూకి, ఆ సౌందర్యవతులతో ఆటలు ఆడేవి. ఈ ఊళ్లోని పురుషులు ఎంత పవిత్రమూర్తులో, వారి భార్యలు అంత పుణ్యవతులు. 

అదే ఊరిలో తిరునీలనక్కర్ అనే శివభక్తుడు ఉండేవాడు. వేదవిహిత కర్మలు తూ.చ తప్పకుండా ఆచరించేవాడు. ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి గృహిణిగా తన ధర్మాలు పాటించే ప్రేమైకమూర్తి అయిన భార్యతో పాటు, పూజాదికాలను భక్తిశ్రద్ధలతో నిర్వర్తించేవాడు. 

ఒక రోజు నీలనక్కర్ ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించాడు. అతనివెంట అతని భార్య కూడా వివిధ రంగులతో శోభించే పుష్పాలతో, బిల్వదళాలతో అనుసరించింది. వినిర్మల భక్తితో పరవశించే హృదయంతో అతను శివుని కీర్తిస్తూ మంత్రాలు పఠించేవాడు. ఆ తర్వాత ప్రగాఢమైన ధ్యానంలో మునిగిపోయాడు. 

అతని భార్య ఒక్కొక్కటిగా బిల్వదళాలను శివలింగంపై వేస్తూ అర్చించసాగింది. ఆమె కన్నులు తదేకదృష్టితో శివలింగంవైపే చూస్తున్నాయి. అంతలో విషపూరితమైన ఒక సాలెపురుగు లింగంపై గాలిలో తిరుగాడుతుండటం ఆమె కంటపడింది. ఆమె దానిని తొలగించాలని అనుకుంటుండగానే అది కాస్తా లింగంపై వాలింది

ఒక విషకీటకం లింగంపై పడడం చూడలేక ఆమె తన శక్తినంతా కూడదీసుకుని దానిపైకి ఊదింది. ఆ గాలికి సాలీడు, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాని అనుకోకుండా ఆమె నోటివెంట లాలాజలపు తుంపరులు ఆ లింగంపై పడ్డాయి. అదే క్షణంలో ఆమె భర్త కన్నులు తెరిచాడు. అతడు సాలీడును గమనించకుండా తన భార్య చేసిన పనికి కోపోద్రిక్తుడైనాడు. 

కళ్లవెంట నిప్పులు కురిపిస్తూ.. అతడు శివుపై ఎందుకు ఉమ్మివేశావు? అని నిలదీశాడు. లేదు నేనెందుకు ఉమ్మివేస్తాను? శివలింగంపై వాలిన సాలీడును ఊది తొలగించాను అంతే నాకీ అనుకోకుండా ఉమ్మి తుంపరులు లింగంపై పడ్డాయి. అంది భయంతో వణికిపోతూ.. 

ఈ శివలింగాన్ని నువ్వు అపవిత్రం చేశావు. మరోవిధంగా సాలీడును అక్కడి నుంచి తొలగించి వుండాల్సింది. శివునికే అపచారం చేసిన పాపాత్మురాలివి. నీకు నా హృదయంలోనూ, నా ఇంటిలోనూ స్థానం లేదు. 

ఇక్కడి నుంచి నుంచి వెళ్ళిపో.. అని పెద్దగా అరుస్తూ ఆ ఆలయాన్ని విడిచివెళ్లాడు. ఆమె దుఃఖిస్తూ ప్రాధేయపడింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎక్కడకు వెళ్లాలో తెలియక, ఆ ఆలయంలోనే ఆ రాత్రి గడపాలని నిశ్చయించుకుంది. తనను కాపాడమని ఆమె శివుణ్ణి వేడుకుంది. ఆ విధంగా విడిపోయిన దంపతులను చూసి శివుని హృదయం కరిగిపోయింది.

తనపట్ల వారికిగల ప్రేమకు, భక్తికి ఆయన ఎంతగానో పులకించి, వారిని తిరిగి ఒక్కటి చేయాలని తలచాడు. అర్థరాత్రి అయ్యింది. తిరునీలనక్కర్‌‌కు ఆ రాత్రి కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. నా శరీరాన్ని సరిగ్గా చూడు నీ భార్య సరైన సమయంలో నాకు సహాయమే చేసింది అన్నాడు శివుడు. అతను తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. 

తన భార్య గాలి ఊదినచోట తప్పించి, శివుని శరీరంలో మిగిలిన భాగం అంతా బొబ్బలతో, గాయాలతో కనిపించింది. ఉలిక్కిపడి అతను నిద్రలేచాడు. ఎంతటి కఠినత్ముణ్ణి నేను.. శివునిపై ప్రేమతో తన భార్య ఈ పని చేసిందని, అటువంటి ప్రేమను తాను గుర్తించలేకపోయానని తనను తాను తిట్టుకుంటూ ఆలయంలోకి పరుగు తీశాడు.

అక్కడ అతని భార్య తన విధిని తలుచుకుని శోకిస్తూ ఉంది. ఇంతటి భక్తురాలి పట్ల ఎంతటి నిర్దయతో ప్రవర్తించాననుకుంటూ పరమశివుడు నాకళ్లు తెరిపించాడు. నాతో పాటు ఇంటికి రా. మనం ఇకనుండి ఎటువంటి కలతలు లేకుండా సుఖంగా జీవిద్దాం అన్నాడు. ఇలా విడిపోయిన దంపతులను ఆ పరమశివుడు కలిపాడు.

నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం.....ఉజ్జ‌యిని

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
 Image result for ujjain temperature
నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం.....ఉజ్జ‌యిని
 
మన దేశంలో ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం ఒకటుందని మీకు తెలుసా….? 

అవును ….. మీరు చదువుతున్నది అక్షరాలా నిజం .
ఆ ఆలయం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది.
 
హిందూ ధ‌ర్మంలో పాముల‌ను ఆరాధించే సంస్కృతి అనాదిగా వస్తోంది.
హిందూ ధ‌ర్మంలో స‌ర్పాల‌ను దేవ‌త‌ల ఆభ‌ర‌ణంగా భావిస్తారు.
మ‌న‌దేశంలో ఎన్నో నాగ దేవాల‌యాలున్నాయి.
 
అందులో ప్ర‌ముఖమైంది, ఇత‌ర ఆల‌యాల‌కంటే భిన్న‌మైంది ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం.
 
ఉజ్జ‌యినిలోని మ‌హాకాల్ మందిరంలోని మూడో అంత‌స్థులో నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం కొలువై ఉంది.
 
ఈ కోవెల సంవ‌త్స‌రంలో ఒక‌రోజు మాత్ర‌మే అది కూడా శ్రావ‌ణ శుక్ల పంచ‌మి రోజు మాత్ర‌మే తెరిచి ఉంటుంది. ఆరోజు మాత్ర‌మే భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. ఆల‌యం తెరిచి ఉండే ఈ ఒక్క‌రోజున స‌ర్ప‌రాజుగా భావించే త‌క్ష‌కుడు ఆల‌యంలోనే ఉంటాడ‌ట‌.
 
నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో 11 వ శతాబ్దానికి చెందిన అద్భుత‌మైన ప్ర‌తిమ ఉంది. ఇందులో ప‌డ‌గ విప్పి ఉండే పామునే ఆస‌నంగా చేసుకొని కూర్చొని ఉన్న శివ‌పార్వ‌తులుంటారు.¬ ఈ ప్ర‌తిమ‌ను నేపాల్ నుంచి తెప్పించార‌ని చెబుతుంటారు. ఉజ్జ‌యినిలో త‌ప్ప ఇలాంటి ప్ర‌తిమ ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా ఉండ‌ద‌ట‌.
 
సాధార‌ణంగా అయితే స‌ర్పంపైన విష్ణు భ‌గ‌వానుడు మాత్ర‌మే శ‌యనిస్తాడు. కానీ ప‌ర‌మ‌శివుడు శయ‌నించిన దాఖ‌లాలు ఎప్పుడూ విన‌లేదు. కానీ ప్ర‌పంచంలో మ‌ర‌కెక్క‌డా లేని విధంగా ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో భోళాశంకరుడు శ‌య‌నించి ఉండ‌డం విశేషం. ఈ ప్ర‌తిమ‌లో శివ‌పార్వ‌తుల‌తో పాటు వారి ముద్దుల త‌న‌యుడు వినాయ‌కుడు కూడా కొలువై ఉన్న అద్భుత దృశ్యం చూడ‌డానికి రెండు క‌ళ్లూ చాల‌వు నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలోస‌ర్పంపైన ప‌ర‌మ‌శివుడు శయ‌నించి ఉండ‌డం వెన‌క ఒక క‌థ ప్ర‌చారంలో ఉంది.
 
స‌ర్ప‌రాజు త‌క్ష‌కుడు ప‌ర‌మేశ్వ‌రుడి అనుగ్ర‌హం కోసం కఠోర‌మైన త‌పస్సు చేశాడ‌ట‌. ప్ర‌స‌న్న‌మైన శివుడు త‌క్ష‌కుడికి అమ‌ర‌త్వాన్ని ప్ర‌సాదించాడ‌ట‌. ఇక అప్పటి నుంచి త‌క్ష‌కుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడ‌ని చెబుతారు. నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యానికి శతాబ్దాల చ‌రిత్ర ఉంది.
 
1050 లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆయ‌న త‌ర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మ‌హ‌రాజ్ 1732 లో ఆల‌య జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టాడు. ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శించుకుంటే చాలు స‌ర్‌యదోషాల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. అందుకే నాగ‌పంచ‌మి రోజు ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తుతారు. నాగ‌చంద్రేశ్వ‌రుడి ద‌ర్శించుకొని పునీతుల‌వుతారు. ఈ ఒక్క‌రోజే దాదాపు రెండు ల‌క్ష‌ల మంది భ‌క్తులు ద‌ర్శించుకోవ‌డం విశేషం.

Image result for ujjain temperature

మందేశ్వర స్వామి దేవాలయం మందపల్లి

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

మందేశ్వర స్వామి దేవాలయం మందపల్లి
మందేశ్వర(శనేశ్వర) స్వామి దేవాలయం,మందపల్లి, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలంలో గలదు. హిందూ దేవాలయాలలో అనేక చోట్ల శని గ్రహము "నవగ్రహాలలో" ఒక భాగంగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఒక్క శని ని మాత్రమే పూజించే మందిరాలలో మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి.
 

పురాణ గాథ
పూర్వం అశ్వత్థ, పిప్పలాదులనే రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి భక్షించేవారు. అప్పుడు వారంతా వెళ్ళి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనీశ్వరునితో మొరపెట్టుకున్నారు. వారి మొరను ఆలకించిన మందుడు ఆ రాక్షసులను హతమార్చాడు. అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకొనేందుకు మందపల్లిలో శివాలయాన్ని ప్రతిష్టించి పూజలు చేశాడు. అప్పట్నుంచీ ఆ ఆలయం శనైశ్చరాలయంగా ప్రసిద్ధి గాంచింది.
ప్రాముఖ్యత
 

మందపల్లి శనీశ్వర స్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం. వాస్తవానికి సోమేశ్వర స్వామి ఆలయం అయినా, శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాదిమంది భక్తులు వస్తుంటారు. జాతక చక్రంలో శనితో సమస్యలున్నవారు కూడా వస్తుంటారు. ఏటా శ్రావణ మాసం లోనూ, శనిత్రయోదశి వచ్చే రోజుల్లోనూ మందేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శనిత్రయోదశి నాడు,మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చేవారి సంఖ్య వేలల్లో ఉంటుంది. శనీశ్వరుడికి తైలంతో ఇక్కడ అభిషేకం చేస్తారు. నల్లటి వస్త్రాలు దానం చెస్తారు. కోర్టు కేసులు, శత్రువులు, రోగాలు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకుని, వారి కోర్కెలు తీరిన తరువాత మొక్కులు చెల్లిస్తుంటారు.
స్థల మహాత్యం
 

పూర్వకాలము అగస్త్యమహర్షి దక్షిణ దిక్కున సత్రయాగమును చేయుటకై గౌతమీ నదీ తీరమునకు చేరి సంవత్సరం సత్రయాగము చేయుటకు దీక్షితుడయెను. ఆ సమయమున కైటభుడనే రాక్షసుని కొడుకులగు ధర్మకంటకులయిన అశ్వర్ధుడు మరియు పిప్పలుడు యను యిరువురు రాక్షసులు దేవలోకంలో కూడా ప్రసిధ్ధి చెందినవారై యుండిరి. వారిరువురిలో అశ్వర్ధుడు రావిచెట్టు రూపములోనూ, పిప్పలుడు బ్రాహ్మణరూపములోను యుండి సమయము జూసి యజ్ఞమును నాశనం చేయుటకుపక్రమించిరి. వారిలో రావిచెట్టు రూపములోనున్న అశ్వర్ధుడు ఆ వృక్షం నీడలో ఆశ్రయం పొందు బ్రాహ్మణులను దినుచుండెను.పిప్పలుడు సామవేదము నేర్చుకొనుటకు వచ్చిన శిష్యులను తినుచుండెను. అంతట దిన దినము బ్రాహ్మణులు క్షీణించుటను చూచి వృద్ధులగు మహర్షులు గౌతమీ దక్షిణ తటాకమున నియత వ్రతుడై తపస్సు నాచరించుచున్న సూర్యపుత్రుడగు శనిని చూచి ఈ ఘోరమగు రాక్షస కృత్యములను నివేదించి, ఈ రాక్షసుల నిరువురిని వధించమని కోరిరి. అప్పుడు ఆ శని ఋషులతో నిట్లు పలికెను. దానికి శనిదేవుడు తన తపస్సు పుర్తి కాగానే వారిని వధించెదనని మాట యిచ్చెను. దానికి మహర్షులు తమ తపస్సును శనికి యిచ్చెదమని సంహరించమనీ ప్రార్థించిరి. అంతట శని బ్రాహ్మణ వేషమున దాల్చి వృక్షరూపముగ నున్న అశ్వర్ధుని వద్దకు వెళ్ళి ప్రదక్షినములు చేయనారంభించెను. అంతట అశ్వర్ధుడు రాక్షసుడు ఈ శనిని మామూలు బ్రాహ్మణుడే యనుకుని అలవాటు చొప్పున మ్రింగివేసెను. అప్పుడు శని ఆ రాక్షసుని దేహమున ప్రవేశించి రాక్షసుని ప్రేవులను త్రెంచివేసెను. వెంటనే అతడు భస్మీభూతుడయ్యెను.ఆ వెంటనె బ్రాహ్మణ వేషమున గల రెండవ రాక్షసుడగు పిప్పలుని వద్దకు సామవేదము అభ్యసించుటకు వచ్చినానని బ్రాహ్మణ వటరూపమున శిష్యుని వలె వినయపూర్వకముగా వెళ్ళెను. అంతట ఆ పిప్పలుడు ఈ సూర్య పుత్రుడగు శనిని అలవాటు ప్రకారముగా భక్షించెను. అంతట శని ఆ రాక్షసుని ప్రేవులు కూడా చూచిన మాత్రముననే ఆ రాక్షసుడు భస్మమాయెను.
ఆ యిరువురు రాక్షసులను సంహరించిన శనికి మహర్షులందరూ వరములనిచ్చిరి. సంతుష్టుడై శని గూడ బ్రాహ్మణులతో నిట్ల పలికెను.
 

నా వారము ఏ జనులైతే నియతవ్రతులై అశ్వత్ధవృక్షమునకు ప్రదక్షిణము చేయుదురో వారి కోరికలన్నియు నీరేడును. వారికి నా పీడ కలగదు. ఈ అశ్వత్థ తీర్థమున ఈ శనైశ్చర తీర్ధమున ఎవరైతే స్నానము చేయుదురో వారు సమస్త కార్యములు తీర్ధములు నిర్విఘ్నముగా కొనసాగును. శని వారము రోజున అశ్వద్ధ ప్రదక్షిణములు చేసిన వార్కి గ్రహపీడ కలుగదు. ఈ తీర్ధమునందు స్నానదానము చేసిన హేమదాన ఫలము లభించును అని శని వరములను యిచ్చెను. అప్పటి నుండి ఈ ప్రదేశము నందు అశ్వత్థ తీర్థము, పిప్పళ తీర్ధము, సానుగ తీర్ధము, అగస్త్యతీర్ధము, సాత్రికతీర్ధము, యగ్నిక తీర్ధము, సాముగ తీర్ధము నొదలగుగా గల పదునాలుగువేల నూట ఎనిమిది తీర్ధములు అనేకమంది ఋషులచేతను, దేవతల చేతను, కల్పించబడి ప్రసిద్ధి చెందిన స్నాన జపపూజాదులను స్వల్ప భక్తజనులకు సమస్త కార్యసిద్ధులు చేకూర్చిన సతయాగ ఫలము లభింపచేయుచున్నవి.

యిచ్చట ఈశని సామగాన కోవిదులగు బ్రాహ్మణ సంతతి వారగు రాక్షసులను సంహరించి బ్రహ్మ హత్య దోష పరిహారముకై లోక సంరక్షణకై సర్వలోకేశ్వరుడగు సర్వదురిత సంహారకుడగు, కరుణామయుడగు శివుని ప్రతిష్ట చేసెను. తనచే ప్రతీష్టింపబడిన శివునికి నువ్వులను అభిషేకము జరిపించిన వార్కి సమస్త కోరికలు నీడేరునట్లుగను తన బాధ యితర గ్రహపీడ మొదలైనవిలేకుండునట్లగను శని వరములు నిచ్చెను. అంతట శనిచే ప్రతిష్టింపబడిన ఈశ్వరునికి శనేశ్వరుడనియు కూడా ప్రసిద్ధ నామాంతరము కలిగెను. పిమ్మట ఈ మందేశ్వరునికి ప్రక్కనే సప్తమాత్రుకలు వచ్చి శ్రీ పార్వతిదేవిని ప్రతిష్టించిరి. ఈ ఈశ్వరునికి బ్రహ్మేశ్వరుడని పేరు. దీనికి ప్రక్కనే అష్ట మహానాగులలో ఒకడగు కర్కోటకుడను నాగుచే ప్రతిష్టింపబడిన ఈశ్వరునికి నాగేస్వరుడని పేరు. ఈ పక్కనే సప్త మహర్షులలో నొకడగు గౌతమి మహర్షిచే ప్రతిష్టింపబడిన శ్రీ వేణుగొపాలస్వామి మూర్తి కలదు. మొత్తము మీద ఒకే పెద్ద ప్రాకారము నందు వరుసగా ఐదు దేవాలయములు కలిగి భక్తి జనాహ్లాదకరముగా నుండును. పూజాతత్పరులకు సమస్త భక్తులకు సమస్త కోరికలు నీరేడుటయే గాక అంత్య కాలము నందు మోక్షసామ్రాజ్యము నొందెదురు.
 

పూజకు కావలసిన వస్తువులు
పసుపు
కుంకుమ
వత్తులు
ప్రమిదులు-2
నల్ల నువ్వుల నూనె-1/2 కేజి
నల్ల నువ్వులు
నవ దాన్యలు-100 గ్రాములు
మేకు-1
యెర్ర గుడ్డ
నల్ల గుడ్డ
బియ్యం-1/2 కేజి
బెల్లం
పువ్వులు
తమలపాకులు-10
అరటి పండ్లు-4
కర్పూరం
అగరబత్తి
ఒక్కలు-2
కొబ్బరికాయలు-2
ప్రత్తి గింజలు
అరటి ఆకు-1
గ్లాసులు-2
గమనిక
 

పూజ అనంతరం పై వాటిలో ఏమైన మిగిలిన వస్తువులు ఉంటే తీసుకోని రాకుడదు.ఆలయం నుంచి బయటికి వెడుతూ వెనక్కు తిరిగి చూడకూడదని , వెనక్కు తిరిగి చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని ఇక్కడి పూజారులు భక్తుల్ని పదే పదే హెచ్చరిస్తూంటారు.




తిరుచెందూర్‬ సుబ్రహ్మణ్య స్వామి


* తిరుచెందూర్‬ సుబ్రహ్మణ్య స్వామి

తిరుచెందూర్‬ సుబ్రహ్మణ్య స్వామి''మహాంబోధితీరే మహాపాపచోరే'' ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఇక్కడే మామిడి చెట్టు రూపములో ‪పద్మాసురుడు‬ (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది.

"తిరుచెందూర్" లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర మరియు సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపం తోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో అంత ‎శక్తివంతమై‬, అంతటి సుందరమైన దివ్య క్షేత్రం మరెక్కడా లేదు.

ఈ క్షేత్రం తమిళనాడు లో ‎తిరునెల్వేలి‬ నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి. ‎సుబ్రహ్మణ్య‬ క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది.

ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ‪ఆదిశంకరాచార్యుల‬ వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు ‪సుబ్రహ్మణ్యస్వామి‬ భుజంగం చేశారు.

ఈ ‪భుజంగ‬ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో ‪వంశంలో‬ తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి.

అటువంటి ‪దోషములను‬ కూడా పోగొట్టే సుబ్రహ్మణ్యస్వామి శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య ‪భుజంగము‬ ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన ‪స్తోత్రం‬ఇది. దీనిని ప్రతీ ఇంటిలో యజమాని రోజూ చదువుకోవాలి. ఈ భుజంగం ప్రభావము వలన మనకి ఉన్న సకల దోషములు పోయి మనసు ప్రశాంతత పొంది, మంచి బుద్ధి వచ్చి, ఇష్టకామ్యములు (ధర్మబద్ధమైన) నెరవేరుతాయి.

ఈ సంసారము అనే మహా ‪సముద్రము‬నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “‪మహాంబోధితీరే‬మహాపాపచోరే అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది. ఈ తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరొక లీల ఏమిటంటే 2006 లో వచ్చిన సునామి వల్ల, ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా, కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు. అది స్వామి వారి శక్తి.}

* తిరుచెందూర్ విభూతి మహిమ:

ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన ‪‎విభూతి‬ తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ ‪విభూతిని‬ సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు ‪నయం‬ అవుతాయి.

* ఈ క్షేత్రమును చేరే మార్గములు:

తిరుచెందూర్ తమిళనాడు లోని ‪‎Tuticorin‬ జిల్లాలో ఉంది. ‪‎రోడ్‬ ద్వారా: ట్యూటికోరిన్ - 40Km, తిరునెల్వేలి – 60Km, కన్యాకుమారి – 90Km, మదురై – 175Km దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ వారి బస్సులు అనేకం నడుస్తాయి.

‪‎రైలు‬ ద్వారా: చెన్నై నుంచి తిరునెల్వేలి దాకా, అనేక రైళ్ళు ఉన్నాయి. (ఉదాహరణకి కన్యాకుమారి ఎక్సప్రెస్) తిరునెల్వేలి నుంచి అనేక బస్సులు, కార్లు దొరుకుతాయి.

‪విమానము‬ ద్వారా: దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (617Km), అది కాక జాతీయ విమానాశ్రయము ట్యూటికోరిన్ లో (40Km) ఉంది.

* వసతి సదుపాయము:

ఈ క్షేత్రములో ఆలయ దేవస్థానము వాళ్లవి అనేక గెస్ట్ హౌసులు రోజుకి Rs.115/- నుంచి Rs. 350/- దాకా ఉంటాయి. ఇవి ముందుగా ‪ఆలయం‬ వారి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంతే కాక అనేక ప్రైవేటు హోటళ్ళు కూడా ఉన్నాయి. ‪‎

* ఆలయంలో‬ ఆర్జిత సేవలు:

స్వామి వారి అభిషేకము కోసం పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ క్షేత్రము వెడితే ఈ అభిషేకం తప్పక దర్శించగలరు. అద్భుతం గా ఉంటుంది. ఇవి కాక ఇంకా అష్టోత్తర అర్చన, సహస్రనామ అర్చన మొదలైన సేవలు ఉన్నాయి.

* ‪కాలము‬, సమయము, పూజ వివరాలు

ఉదయం
5.10సుప్రభాతం
5.30విశ్వరూప దర్శనం
5.45ధ్వజస్తంభ నమస్కారం
6.15ఉదయ మార్తాండ అభేషేకం
7.00ఉదయ మార్తాండ దీపారాధన
8.00 – 8.30కలశంది పూజ
10.00కలశ పూజ,
10.30ఉచికల అభిషేకం మధ్యాహ్నం
12.00ఉచికల దీపారాధన
సాయంత్రం 5.00సాయరత్చై పూజ
రాత్రి 7.15అర్థసమ అభిషేకం
రాత్రి 8.15అర్థసమ పూజ
రాత్రి 8.30 ఏకాంత సేవ
రాత్రి 8.45రాగసియా దీపారాధన
రాత్రి 9.00 నడై తిరుకప్పిదుతల్.




 

జలథీశ్వరస్వామి దేవాలయం.......ఘంటశాల


జలథీశ్వరస్వామి దేవాలయం.......ఘంటశాల
శివపార్వతులిద్దరు ఒకే పానమట్టం మీద దర్శనమివ్వడం ఈ ఆలయప్రత్యేకత. ఈ పానమట్టం ఏకఱాతిశిల. దీని నాలుగుమూలలా నాలుగు కాళ్లు ఉండి దానిపై పైనమట్టం నిలిచి ఉంటుంది.పానమట్టం భూమిని తాకక పోవడం ఒక ప్రత్యేకత.
హిమవంతుని కుమార్తె గా జన్మించిన పార్వతీదేవి పరమశివుని కోసం ఘోర తపస్సు చేసి, శంకరుని మెప్పించింది. సప్తఋషులు పెళ్లి పెద్దలుగా వెళ్లి వివాహాన్ని నిశ్చయం చేశారు. కమనీయమైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేడుకను కనులారా గాంచడానికి సమస్త ప్రాణికోటి ఉత్తరాపథానికి బయలుదేరింది. జీవకోటి భారంతో ఉత్తరాపథం కృంగి పోయే ప్రమాదం సంభవించింది.
ఆ సమయంలో పరమేశ్వరుడు స్వయంగా అగస్త్యమహర్షిని పిలిపించి, తక్షణమే దక్షిణాపథానికి వెళ్లి ఒక పవిత్ర ప్రదేశంలో శివపార్వతులను ప్రతిష్ఠించి, పూజలు జరిపితే తమ కల్యాణం చూచిన ఫలం లభిస్తుందని, వెంటనే ఆ పని చేయవలసిందని ఆజ్ఞాపించాడు. మహేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి, మహా తప స్సంపన్నుడైన అగస్త్యుడు దక్షిణాపథానికి విచ్చేసి, ఘంటసాల ను పవిత్ర ప్రదేశంగా ఎన్నుకొని పానమట్టంమిద శివపార్వతులను ప్రతిష్ఠించి, ఏకాగ్రతతో పూజాదికాలు నిర్వహించి శ్రీస్వామివారి సాక్షాత్ కళ్యాణమహోత్సవసందర్శన భాగ్యాన్ని పొందాడు. ఆనాటి నుండి దక్షిణకైలాసం గా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది.
ఈ ఆలయ గోపురం” గజపృష్టాకార గోపురం” గా పిలవబడుతోంది. అంటే సాధారణ ఆలయాల గోపురం వలే కాకుండా ఇది మూడు శిఖరాలను కలిగిఉంటుంది. తంజావూరు బృహదీశ్వరాలయ గోపురం మాత్రమే ఇటువంటి ఆకృతిని కలిగి ఉంది విమాన శిఖరం ఎత్తు కూడ 45 అడుగులవరకు ఉంటుంది. ఈ విమానగోపురం పాటిమట్టి తో నిర్మించబడి తరువాత కాలంలో సిమెంటు ప్లాస్టింగ్ చేయబడింది.
మహామేరు శ్రీ చక్రం ఈ ఆలయంలో అమ్మవారి ముందు అర్చించ బడుతోంది.32కిలోలబరువు తో,9అంగళాల ఎత్తు కలిగి పంచలోహాలతో చేయబడిన ఈ శ్రీ చక్రాన్ని కంచి పీఠాథిపతుల అనుగ్రహంతో కంచి పీఠంనుండి తెచ్చి ప్రతిష్టించడం జరిగింది . పూజ్యశ్రీ రామేశ్వరానందగిరి స్వామి వారిచే ఆలయములో అమ్మవారి పాదముల చెంత ఉంచబడి పూజించబడుతోంది.
కంచిపీఠాథిపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు జయేంద్రసరస్వతీ స్వామి వారు ఈ ఆలయంలోని పీఠాన్ని అర్థనారీశ్వర పీఠంగా నిర్థారించారు.
ఏకపీఠంపై వెలసిన శివపార్వతుల వలెనే నవగ్రహాలకు చెందిన దేవతామూర్తులు కూడ సతీసమేతులై ఈ ఆలయము నందలి నవగ్రహమండపం లో కొలువు తీరి ఉండటం మరొక ప్రత్యేకత.ఇటువంటి నిర్మాణం చాలా అరుదుగా దర్శనమిస్తుంది. ఏలినాటిశని నుండి అన్నిరకాల శనిదోష నివారణకు, రాహుకేతు పూజలకు ఈ మందిరం అత్యంత ప్రసిద్ది.




 

జగద్గురువు శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం –కాలడి


జగద్గురువు శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం –కాలడి

కేరళలో గురువాయూర్ కు 75కిలో మీటర్ల దూరం లో కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లా లో ఉంది. ఇదే జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు వారు జన్మించిన పవిత్ర క్షేత్రం. ఇక్కడి నుండే కాలి నడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు ఆమ్నాయ పీఠాలు స్తాపించి ఆర్షధర్మాన్ని నిల బెట్టారు. వైదిక మతోద్ధారణ చేశారు. అద్వైత మత స్థాపనా చార్యులు గా కీర్తి శిఖరాన్ని అధిరోహించారు.
పరమ విశిష్టమైన కాకాశ్మీర్ శారదా పీఠాన్ని సమర్ధత నిరూపించి శారదా మాత అంగీకారం తో అధిరోహించి జగద్గురువు లని పించుకొన్నారు. ఆ మహాను భావుడే లేక పోతే చైనా, పాకిస్తాన్ సరిహద్దు లో ఉన్న భారత దేశ ప్రజలు ధర్మానికి దూరమై పోయి ఉండేవారు. ఆయన ప్రబోధం సకల మానవ సోదరత్వమే. ఆధ్యాత్మిక కీర్తి పతాకని ప్రపంచం అంతా రెపరెప లాడించిన ఆ మహనీయ మూర్తి జన్మ స్థలాన్ని దర్శించాలనే తపన. ఆ మాహత్మునికి ఏమిచ్చినా హిందూ జాతి ఋణం తీరనే తీరదు. అలాంటి పవిత్ర కాలడి గురించిన విశేషాలు.
* కాలడి చూడాల్సిన ప్రదేశాలు
కాలడికి ఒక కిలో మీటర్ దూరం లో మాణిక్య మంగళం లో శ్రీ కాత్యాయిని మాత దేవాలయం ఉంది .ఇది దుర్గా మాత ఆలయం. ఇక్కడే శంకరుల బాల్యం లో తండ్రి శివ శర్మ ఏదో పని మీద వెడుతూ కొడుకు కు అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టి రమ్మని పంపాడు. అలానే బాల శంకరుడు అమ్మవారి ముందు పాల చెంబు ఉంచి నైవేద్యం పెట్టి తాగమని గోల చేశాడు అమ్మ వారు తాగక పోయే సరికి ఏడుపు లంకించుకొన్నాడు అప్పుడు అమ్మ వారు ప్రత్యక్షమై ఆ క్షీరాన్ని తృప్తిగా త్రాగి శంకరులకు ఆనందాన్ని కలిగించింది. ఈ అమ్మ వారి గురించే తరువాత ‘’సౌందర్య లహరి’’ రాశారు శంకరాచార్య .
కాలడికి రెండు కిలో మీటర్ల దూరం లో ‘’మట్టూర్ తిరు వేలు మాన్ శివ దేవాలయం’’ ఉంది. దీన్నిశంకరుల తండ్రి శివ శర్మ ప్రతిస్టించాడు. ముసలి తనం లో శంకరుని తలి దండ్రులు ఇంత దూరం వచ్చి పూజాదికాలు చేయలేక శివుడిని ప్రార్ధించారు. అప్పుడు కల లో కన్పించి ‘’నాట్యం చేసే తెల్ల జింక ‘’ను అనుసరించి వెడితే తన లింగం దగ్గరకు చేరుస్తుందని చెప్పాడు. అలానే రోజూ చేసేవారు. అందుకే ఈ గుడికి ‘’తిరువెల్ల మాన్ మల్లి ‘’అనే పేరొచ్చింది. అంటే ‘’నాట్యం చేసే తెల్ల జింక ‘’అని అర్ధం.
నయ తోడూ శంకర నారాయణ దేవాలయం కాలడికి మూడు కిలో మీటర్ల దూరం లో ఉంది. ఇది అద్వైత అర్చనకు గొప్ప స్థానం గా ప్రసిద్ధమైంది. ఈ శివాలయం లో శంకరాచార్య విష్ణువును ప్రార్ధిస్తే ఆయన ప్రత్యక్షమై ఇక్కడి శివుని లో కలిసి పోయి శివ కేశవులకు భేదం లేదని నిరూపించినగొప్ప క్షేత్రం ఇది. అందుకే ముందు శివుడికి తర్వాత విష్ణువుకు ఇక్కడ అర్చన నిర్వహిస్తారు.
మంజప్ప కు ఎనిమిది కిలో మీటర్ల దూరం లో శివ శర్మ పూజారిగా ఉన్న ‘’మంజప్ప కార్విల్లి కావు శివ టెంపుల్ ‘’ఉంది
అలాగే ‘’తెక్కే మదోం ‘’అనే చోట శ్రీ కృష్ణుని గుడి పక్కనే తిరుచ్చి శంకర మఠం ఉంది ఈ మతానికి చెందిన వారికే పూజార్హత.
శంకరుని తల్లి ఆర్యామ్బకు దహన సంస్కారాలను జరిపిన చోటు ఇప్పుడు శంకరాలయం లోనే ఉంది .పది నంబూద్రి కుటుంబాలలో శంకరునికి సాయం చేసినవి రెండే రెండు కుటుంబాలు. ఈ ప్రాంతాన్ని ‘’కపిల్లమన’’ అంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిత్య దీపారాధన జరుగుతూనే ఉండటం విశేషం.
కాలడి కరవు (ఆడట్టు కడవు )దగ్గరే నది మార్గం మారి కాలడి గ్రామం ఏర్పడింది .ఇక్కడే శంకరులు శ్రీ కృష్ణ విగ్రహం స్థాపించారు. శ్రీ కృష్ణ ఉత్సవాలలో ఇక్కడి నుండే జలాన్ని తీసుకు వెడతారు
‘’మూతల ల కడవు ‘’అంటే మొసలి ఘాట్ -క్రోకడైల్ ఘాట్ అంటారు. ఇక్కడే నదిలో స్నానం చేస్తుంటే బాల శంకరుని మొసలి పట్టుకోంది. తల్లి అనుమతి తో నీటిలోనే ఆపద్ధర్మ సన్యాస దీక్ష తీసుకొన్నాడు బాల శంకరులు. ఇవి కాక శ్రీ శంకరాచార్య యూని వర్సిటి, కాలేజి, ఇంజినీరింగ్ కాలేజి చూడ తగిన ప్రదేశాలు.
ఎర్నాకులం జిల్లాలో పెరియార్ నదికి తూర్పున ఉంది కాలడి గ్రామం ఐతే ఇప్పుడు ఈకాలడి గ్రామం చిన్న పట్నంగా మారింది. కొచ్చిన్ -- శోరనుర్ రైలు మార్గంలో కాలడి రైలు స్టేషను వుంది. కొచ్చిన్ నుంచి సుమారు ఇరవై, ఇరవైరెండు కిలోమీటర్ల దూరంలో వుంది. కొచ్చిన్ నుంచి రాష్ట్రరోడ్డురవాణా వారి బస్సు సౌలభ్యం వుంది. కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కి ఎనిమిది కిమీ.. దూరం. ఆటో వాళ్ళు నూరు లేక నూటయిరవై రూపాయలు తీసుకుంటారు.




 

శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం భద్రాచలం





==(())--
ఓం నమశివాయ...

కాశీ .........మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం.

కాశీ అన్నపూర్ణావిశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి

కాశీ విశ్వనాథుడు ఆవిర్భావం "
ఓం కార నాదంతొ కొటి బ్రహ్మాండాలూ ప్రతిద్వనిస్తుండగా... డమ డమ మంటూ... దివ్య డాంకానాదాలూ... శంఖారావాలతొ విశ్వము దద్దరిల్లుతుండగా... ఓం కార స్థితినందున్న పరమేశ్వరుడు కళ్లు మిరమిట్లు గొలుపు మహా తేజస్సుగా అవతరించాడు... ఆ శివతేజం తళ తళ మెరుపులు మెరుస్తూ... అయిదు క్రొసులు పొడవు... అయిదు క్రొసులు వెడల్పుగా... ఒక సుందర భూ ప్రదేశముగా వెలసింది...ఆ ప్రదేశపు మధ్య భాగము నందు... పరమేశ్వరుడి సంకల్పముచే... ఒక అత్యద్భుత దివ్య నగరం వెలసింది... ఆ దివ్యనగరం మధ్యన పరమేశ్వరుడు అపూర్వ తేజస్సు విరజిమ్ముతూ... జ్యొతీ స్వరూపుడై అవతరించాడు...
శంఖానాదాలూ... దమ డమ డమరక నాదాలు పెద్దపెట్టున హోరెత్తుతుండగా... "పంచక్రొశాత్మకాయ"..." మహాదేవాయ "... " ఆత్మజ్యొతి స్వరూపాయ"... "కాశీవిశ్వేశ్వరాయ"... ఓం... నమ... శివాయ... అంటూ ఆ శరీరవాణి స్తుతించింది...
ఈ కాశీపురి పరమేశ్వరుడి ఆత్మకి ప్రతిరూపం... అనేక ప్రళయాలకి ముందు... బ్రహ్మాండ సృష్టి కంటే ముందు... ఈ కాశీపురిని మహా శివుడు తన మానసం నుండి సృష్టించాడు.

కాశీపురిని... దానికి అధినాథుడైన విశ్వనాథుడిని... క్షేత్రపాలకా సమేత గంగా భవానీ... జనార్దనులను కీర్తించే... ఆ స్తొత్రాన్నీ ఆలకించిన విష్ణువు విష్మయుడయ్యాడు... అపుడు అతడి సందేహాలను నివృత్తి చేస్తూ... ఓ వైకుంఠవాసా.. ఈ కాశీపురి పరమేశ్వరుడి ఆత్మకి ప్రతిరూపం... అనేక మహా ప్రళయాలకీ ముందు... బ్రహ్మాండ సృష్టి కంటే ముందు... ఈ కాశీపురిని మహాశివుడు తన మానసము నుండి సృష్టించాడు... "కాశీ" అన్న పేరు తలచనింతనే సర్వ పాపక్షయమై కైవల్యం లభించే ఈ పుణ్య నగరమునకు క్షేత్ర పాలకుడు శివాంశా సంభూతుడైన "భైరవడు" పావనమైన గంగా తరంగణి ఈ క్షేత్రమును స్మరిస్తూ నిత్య నిరంతరంగా... ప్రవహిస్తూ... బ్రహ్మ హత్యాది మహా పాపాలను సైతం తాను స్వీకరించి జీవులను మోక్షగాములను గావిస్తుంది... ఇచటి డుండి గణపతి... విశాలాక్షి... అన్నపూర్ణలు క్శెత్ర సందర్శకులకి శుభాలను అనుగ్రహిస్తుంటారు... విశ్వనాథుడు ఇచట స్వయంభువుడై ఆత్మజ్యొతియై వెలిశాడు...ఈ "కాశీపురి" తప్ప శివుడు నుంచి ఉద్భవించిన కొటి బ్రహ్మాండ సృష్టి సమస్తమూ అతడిలొ లయమైపొయింది... ఇపుడు మరొసారి మహదేవుడు తన వినొదార్థం తాను అర్దనారీశ్వరుడై... అనంత కొటి బ్రహ్మాండములను తన మానసము నుండి నిన్నూ సృష్టించాడు... ఆ మహేశ్వరుడు ఈ కాశీపురి తప్ప సృష్టి సమస్తం అశాశ్వతం... ఇది ఎక్కడనుండి ఉద్భవించిందొ... దానియందే తిరిగి లయం అయిపొతుంది... ఇది సత్యం... ఈ కాశీనగరము నందు... జ్యోతీ స్వరూపుడై స్వయంభువుడై... వెలసిన శివుడు తనని దర్శించిన వారికి శాశ్వతముక్తిని ప్రసాదిస్తూ ముక్తేశ్వరుడు అన్న కీర్తి పొందాడు...
* దర్శన... స్మరన... మాత్రం చేతనే ముక్తిని అనుగ్రహించే ఈ పుణ్య క్షేత్రం "అవిముక్తం" అని ప్రసిద్ది పొందింది... ఇది మహా పుణ్యక్షేత్రం... వైకుంఠవాసా... గంగలొ స్నానమాచరించి... క్షేత్ర పాలకుడైన భైరవడిని... డుంఢి... గణపతిని దర్శించి... విశాలాక్షి... అన్నపూర్ణలను అర్చించి... అటుపై కాశీ విశ్వనాథుడిని సేవించి... మణికర్ణికా తీర్థం వద్ద తపొదీక్ష స్వీకరించు.. అని విపులంగా వివరించింది ఆ శరీరవాణి.

దర్శన... స్మరన... మాత్రం చేతనే ముక్తిని అనుగ్రహించే ఈ పుణ్య క్షేత్రం "అవిముక్తం" అని ప్రసిద్ది పొందింది... ఇది మహా పుణ్యక్షేత్రం...




--(())--


సంగమేశ్వర స్వామి దేవాలయం- అనిమెల, కడప

చక్కని కొండలు , గల గల పారే నీళ్ళు ,చుట్టూ పచ్చని చెట్ల మద్య లో వెలసిన పురాతన క్షేత్రం సంగామేస్వరాలయం.కడప నుండి సుమారు 50 కి మీ దూరం లో వీరపునాయనిపల్లె మండంలోని అనిమెల గ్రామానికి సమీపంలో సంగమేశ్వర ఆలయం ఉంది.14 వ శతాబ్దం లో నిర్మించినట్లు ఆదారాలు చెబుతున్నాయి . విజయనగర రాజుల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం అందమైన శిల్పకళ కనబడుతుంది .
పాపాఘ్ని, మొగమూరు నదులు సంగమం చెందే చోట వెలసిన ఈశ్వరుడు కనుక ఈ స్వామికి "సంగమేశ్వరుడు" అనే పేరు సార్థకమైంది. సంగమేశ్వర స్వామి వారి ఆలయంలోని లింగమూర్తిని స్వయంగా అగస్త్య మహాముని ప్రతిష్టించినట్లు స్థలపురాణం బట్టి తెలుస్తోంది. పూర్వం ఈ ప్రాంతంలో సప్తఋషులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకునేవారు. అలా తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో అగస్త్యమహాముని శివలింగాన్ని ప్రతిష్టించి ప్రతిరోజూ అభిషేకించి అర్చనలు నిర్వహించే వారని స్థలపురాణం చెబుతోంది. దేవాలయం లో శివ ,గణేష్ ,నటరాజ స్వామి ,రామ ,ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి . నిజమైన మూర్తులల కనిపిస్తాయి .

కానీ కలియుగ ప్రవేశంతో పుజాపునస్కారములు లేకుండా పోవడంతో కాలక్రమములో శివలింగం భూమిలో పూడిపోయింది. చాలాకాలం తర్వాత మళ్లీ శివలింగం బయటపడేందుకు మరో కథ ప్రచారంలో ఉంది. సంగమేశ్వర స్వామి వెలసిన ప్రాంతాన్ని పరిపాలించే సూర్యవంశ రాజుగారికి పెద్ద ఆవుల మంద ఉండేది.

ఈ ఆవుల మంద ప్రతిరోజూ సంగమేశ్వర స్వామి వెలసిన అడవీ ప్రాంతంలో మేత మేసి గోశాలకు చేరేవి. కానీ ఒక్క ఆవు మాత్రం గోశాలకు వెళ్లేముందు మందను వదిలి దూరంగా వెళ్లి ఒక పుట్టపై నిలబడి పాలను ధారగా వదిలి అనంతరం గోశాలకు చేరేది. దీన్ని గమనించిన పశువుల కాపరి ఆ గోవును అనుసరించసాగాడు.

పుట్టపై పాలను ధారగా వదిలే ఆవును చూసిన కాపరి చేతిలో ఉన్న గొడ్డలితో ఆవును కొట్టాడు. ఆ దెబ్బ నుంచి ఆవు తప్పుంచుకోగా, ఆ దెబ్బ పుట్టలోని శివలింగమునకు తగిలింది. ఇంకా రెచ్చిపోయిన కాపరి ఆవును కొట్టడానికి మళ్ళీ గొడ్డలిపైకి ఎత్తడంలో "నేను సంగమేశ్వరుడిని ఈ పుట్టలో ఉన్నాను. ఈ ఆవు ప్రతిరోజు నాకు పాలు ఇస్తూ ఉంది. పుట్టను తొలగించి నన్ను బయటకు తీసి ఆలయం నిర్మించి పూజలు నిర్వహించండి మేలు జరుగుతుంది" అనే మాటలు పుట్ట నుంచి కాపరికి వినిపించాయి.

ఈ విషయాన్ని పశువుల కాపరి రాజుకు తెలపగా పుట్టను తొలగించి, సంగమేశ్వర లింగాన్ని బయటకు తీసి ఆలయం నిర్మించి పూజా పునస్కారాలను ప్రారంభించినట్లు స్థలపురాణం చెబుతోంది. అప్పటి నుంచి ఎత్తైన కొండలు, గలగలా పారేనదులు వంటి సుందర ప్రకృతి దృశ్యాల నడుమ సంగమేశ్వర స్వామి ఆలయం ప్రాచీన కళావైభవానికి, అపురూప ఆధ్యాత్మిక సంపదకు ఆలవాలమై అలరారుతూ ఉంది.
మహాశివరాత్రికి ఇక్కడ ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించాబడుతాయి





--(())--

అయ్యప్పస్వామి దివ్యక్షేత్రం ద్వారపూడి..
అయ్యప్పస్వామి దేవాలయం అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కేరళ రాష్ట్రంలోని శబరిమల దేవస్థానమే ఏడాదిలో కొద్దిరోజులు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయానికి ఆ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల నుంచి దీక్ష పూనిన అయ్యప్పస్వాములు లక్షలాదిగా తరలిరావడం అందరికీ తెలిసిందే.అయితే ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లోనూ ఓ అయ్యప్పస్వామి ఆలయం ఉండడం విశేషం. తూర్పు గోదావరిజిల్లాలోని ద్వారపూడిలో గల ఈ అయ్యప్పస్వామి క్షేత్రానికి భక్తులు తరలి వస్తుంటారు. అంతేకాదు కేరళలోని శబరిమల క్షేత్రానికి వెళ్లలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా ద్వారపూడి క్షేత్రానికి వచ్చి తమ దీక్షను విరమించడం గమనార్హం.
ద్వారపూడి విశేషాలు
ఒకప్పుడు సాధారణ గ్రామంగానే అందరికీ తెలిసిన ద్వారపూడి తర్వాత కాలంలో అయ్యప్పస్వామి దివ్యక్షేత్రంగా దినదిన అభివృద్ధి చెందింది. ఈ ఊరిలోని అయ్యప్పస్వామి గుడిలోని విగ్రహాన్ని 1989 లో కంచి కామకోటి పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి ప్రతిష్టింపజేశారు. అయితే ఇక్కడ ఉన్న అయ్యప్పస్వామి ఆలయానికి 1983లోనే శంకుస్థాపన జరిగింది. స్థానికంగా ఉండే ఓ తమిళ వ్యక్తి తన కోరిక నెరవేర్చినందుకుగాను అయ్యప్పస్వామికి ద్వారపూడిలో దేవాలయాన్ని కట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇలా ద్వారపూడిలోని అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి బీజం పడింది.
సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ పరిహరాదుల దేవాలయాలతో పాటు మరెన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడి అయ్యప్పస్వామివారి దేవాలయానికి ఉన్న పద్దెనిమిది మెట్లను తమిళనాడు నుంచి తెప్పించిన ఏకశిలపై నిర్మించడం విశేషం.
కేరళలోని శబరిమల ఆలయాన్ని ఎంత భక్తి ప్రవత్తులతో నిర్వహిస్తారో ద్వారపూడిలోని క్షేత్రాన్ని కూడా అదే భక్తి ప్రవత్తులతో నిర్వహిస్తారు. అందుకే శబరిమలకు వెళ్ళలేని భక్తులు ఇరుముడి కట్టుకుని ద్వారపూడి క్షేత్రాన్నికి వెళ్ళి దర్శించుకుంటారు.








--(())--



శ్రీసుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటక
మొదటగా కుక్కే శ్రీసుబ్రహ్మణ్య క్షేత్రం చేరుకున్నాము. ఆ ఊరు పేరే సుబ్రహ్మణ్య. ఈ క్షేత్రం బెంగళూరుకి సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలో, దక్షిణకన్నడ జిల్లాలో ఉంది. తమిళనాడులో ఆరు సుబ్రహ్మహ్మణ్య క్షేత్రాలను కలిపి ఆరుపడైవీడు అని వ్యవహరిస్తారు, ఆ ఆరు క్షేత్రాలను స్వామి వారి ఆరు ముఖాలుగా చెప్తారు. అలాగే కర్ణాటకలో మూడు ప్రసిద్ధ సుబ్రహ్మణ క్షేత్రాలను విశేషంగా కొలుస్తారు.
మొదటిది ఆది సుబ్రహ్మణ్య - కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య
రెండవది మధ్య సుబ్రహ్మణ్య - ఘాటి సుబ్రహ్మణ్య (బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది).
మూడవది అంత్య సుబ్రహ్మణ్య - నాగలమడక సుబ్రహ్మణ్య (ఇది అనంతపురం నుంచి డబ్భై కిలోమేటర్ల దూరం, కర్ణాటకలోకే వస్తుంది.)
ఈ మూడు క్షేత్రాలు, స్వామిని సర్ప రూపంలో చూస్తే ఆది, మధ్య, అంత్యములుగా చెప్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రాలు.
కుక్కేలో స్వామి మొదట ఒక పుట్టగా మాత్రమే వెలిశారు. దానినే ఆది సుబ్రహ్మణ్య అని పిలుస్తారు. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చాలా అద్భుతంగా చేస్తారు. ఈ సర్పదోష నివారణ పూజ చేయించిన వారికి, కాలసర్పదోషము, ఇతఃపూర్వం పాములను చంపిన దోషము, నవగ్రహ దోషాలు శమింపబడి, స్వామి వారి కారుణ్యంతో సంతానము లేనివారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ ఇచ్చే మూల ప్రసాదం (పుట్టమన్ను) చాలా చాలా శక్తివంతమైనది. ఇది నియమముతో నలభైరోజులు, రాత్రి పడుకునే ముందు, పాలతో మూలప్రసాదం తీసుకుంటే, ఎటువంటి దోషాలు లేకుండా, చక్కని చిన్ని సుబ్రహ్మణ్యుడో, చిన్ని కృష్ణుడో, బుజ్జి రుక్మిణి అమ్మో, సీతమ్మో సంతానంగా పుడతారు.
కుక్కేలో ఉన్న ప్రథాన ఆలయాలు -
౧. ఆది సుబ్రహ్మణ్య - ఇక్కడ పుట్ట రూపములో ఉంటారు.
౨. కుక్కేసుబ్రహ్మణ్య - ఇక్కడ గర్భగుడిలో వాసుకి, ఆపైనా ఆదిశేషుడూ, ఆపైన సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉంటారు. వాసుకిని రక్షించడం కోసం స్వామి ఇక్కడ వెలిశారు. వాసుకి, ఆదిశేష, సుబ్రహ్మణ్యులను కలిసి ఒకేసారి చూడడం పరమ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఆలయానికి పశ్చిమాన ఉన్న ద్వారం నుండి ప్రవేశిస్తాము. ఆపైన ప్రదక్షిణ చేస్తూ తూర్పుద్వారం గుండా గర్భాలయంలోకి ప్రవేశిస్తాము. అక్కడ స్వామి వారి ఎదురుగా ఉన్న ధ్వజస్థంభాన్ని గరుడ స్థంభం అని పిలుస్తారు. అది వెండితో చేయబడి ఉంటుంది. ఈ స్థంభం యొక్క విశిష్టత ఏమిటంటే, వాసుకి, ఆదిశేషుల నుంచి వచ్చే శ్వాస వలన, భక్తులను రక్షించడం కొరకు ఈ ఈ గరుడ స్థంభం. ఇదే ఆలయ ప్రాంగణములో ఉమామహేశ్వరులు (పరమశివుని వామాంకముపై కూర్చుని ఉన్న అమ్మవారు..), కుక్కేలింగము, కాలభైరవ స్వామి వారు, ప్రథాన గర్భాలయము ప్రక్కగా నరసింహస్వామి వారు కొలువై ఉంటారు. ఇదేక్షేత్రములో తూర్పుద్వారానికి పక్కగా, నాగప్రతిష్ట చేసే నాగేంద్ర స్వామి వారి సన్నిధి, దాని ప్రక్కనే శృంగేరీ పీఠం వారి అన్నదానం చేసే హాలు, ఇంకా ప్రదక్షిణదిశలో ముందుకి వెడితే, దక్షిణద్వారం దగ్గర కుక్కే సుబ్రహ్మణ్య గ్రామ దేవత "హోసలిగమ్మ" వారు కొలువై ఉంటారు.
కుక్కేశ్రీసుబ్రహ్మణ్య క్షేత్రములో ఉన్న మరొక ప్రథానమైనది, కుమారధార నది (తీర్థం). ఈ తీర్థం పరమపవిత్రమైనది. కుక్కేలోపలికి వెళ్ళేటప్పుడు మొదటగా ఈ కుమారధార దాటి వెడతాము. మేము కుక్కే చేరుకునే సరికి రాత్రి పది దాటిపోవడం వల్ల, ఆ మరుసటిరోజు ఉదయాన్నే మేము ఈ తీర్థ స్నానం చేశాము. చాలా ప్రశాంతముగా, స్వఛ్చముగా ఉంటుంది ఈ తీర్థం. లోతు అంతగా ఉండదు. ఇవి కాక, ఈ కుక్కేసుబ్రహ్మణ్యా గ్రామంలోకి వెళ్ళేటప్పుడు, కుమారధార దాటిన తర్వాత మొదట దర్శనమయ్యేది "అభయగణపతి స్వామి వారు". ఈ గణపతి ఈ క్షేత్రపాలకుడు. స్వామి చాలా చాలా బృహత్ స్వరూపంలో ఉంటారు. అభయగణపతి ఆలయం ప్రక్కనే వనదుర్గా అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఇంకాస్త ముడుకి వెడితే, బస్టాండుకి దగ్గరలో కాశికట్టె గణపతి స్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ స్వామి చాలా చిన్నగా ముద్దుగా ఉంటారు. ఈ కాశికట్టె గణపతిని నారాద మహర్షి ప్రతిష్ఠించారు. ఇదే ఆలయంలో "ముఖ్యప్రాణ దేవారు" సన్నిధి కూడా ఉంటుంది. ముఖ్యప్రాణ దేవారు అంటే ఎవరో అనుకున్నారా... సాక్షాత్తు పవనసుతుడు మన స్వామి శ్రీరామదూత, హనుమయే. స్వామిని కర్ణాటక క్షేత్రాలన్నిటిలోనూ అలా ముఖ్యప్రాణదేవారు అని వ్యవహరిస్తారు.
ఇక భోజనం కొరకు, ఇక్కడ బ్రాహ్మణుల కోసం మధ్యాహ్నం పూట శృంగేరి వారి అన్నదాన సత్రం ఆలయం లోపలే ఉంది. ఇది గాక, అందరికీ ఆలయం ఎదురుగా మరొక అన్నదాన సత్రం ఉన్నది. ఇది దేవస్థానం వారిదే. కాకపోతే ఇక్కడ మధ్యాహ్నం, రాత్రి మాత్రమే ఉంటుంది. పొద్దున్న ఏ టిఫినో తినాలి అంటే, బయట దుకాణాలపై ఆధారపదవలసినదే.
ఈ క్షేత్రంలో సంతానం కోసం చేసే ప్రథానమైన సేవలు... సర్ప సంస్కార పూజ (అంటే సర్ప దోష నివారణ), నాగప్రతిష్ఠ, ఆశ్లేషబలి... పిల్లలు పుట్టాక అంగప్రదక్షిణ, తులాభారం.
బెంగళూరు నుండీ బయలుదేరి దర్శించిన క్షేత్రాలు వరుసగా....
కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య
ఉడిపి శ్రీ కృష్ణ మఠం
కొల్లూరు మూకాంబికా క్షేత్రం శృంగేరీ శారదా మఠం
హోర్నాడు శ్రీ అన్నపూర్ణేశ్వరీ క్షేత్రం



--(())---


శ్రీ కోదండరామాలయం- గొల్లల మామిడడ
-----------------------------------------
కోనసీమ అయోధ్యగా పేరుగాంచిన ఈ దేవాలయం 1889 లో నిర్మించారు . ఈ క్షేత్రాన్ని రెండో భద్రాచలం అని కూడా పిలుస్తారు . అద్బుతమైన శిల్పకళ, పెద్ద పెద్ద గోపురాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవా అన్నట్లు ఉంటాయి . శ్రీ ఆంజనేయ సమేత రామ లక్ష్మణ సీత విగ్రహాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి . ఇక్కడ ద్వజస్తంబం, ఆలయనిర్మాణం పసిడి రేకులతో కళకళలాడుతూ ఉంటాయి . ఆలయం లో ఉన్న అద్దాలమేడ లోకి ప్రవేశిస్తే ఎన్నో వింతాలు ,విశేషాలు కనిపిస్తాయి .
ప్రతి ఒక్కరు జీవిత కాలం లో తప్పకుండ ఒకసారి ఆయన ధర్సించనియ క్షేత్రం ఇది . రాముడే దిగివచ్చి కొలువున్నట్లుగా అనిపిస్తుంది .
దేవాలయం ఆవరణ లో
శ్రీ బాల గజానన దేవాలయం
శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి .
ప్రత్యేక కార్యక్రామాలు
----------------------
శ్రీ రామనవమి కి కల్యాణోత్సవం జరుపబడును ,
ధనుర్మాసం ,శ్రవణ మాసం ,కార్తిక మాసం లో ప్రత్యేక పూజలు నిర్వహించాబడుతాయి .
క్షీరాబ్ధి ద్వాదశికి తెప్పోస్తావం నిర్వహించబడును .
వైకుంట ఏకాదశి కి ఉత్తర ద్వారా దర్శనం లబిస్తుంది .

సూర్య నారాయణ స్వామి దేవాలయం- గొల్లల మామిడడ
-------------------------------------------------
తూర్పు గోదావారి జిల్లా కాకినాడ పట్టణం నుండి 20 కి మీ దూరం లో ఉన్న గొల్లల మామిడడ గ్రామం లో వెలసిన సూర్య నారాయణ స్వామి దేవాలయం ఎంతో పురాతనమైన క్షేత్రం మరియు ఈ ప్రాంతం లో ఒకప్పుడు బాగా గొల్లలు నివసిన్చేవారట .గ్రామం చుట్టూ ఎక్కువగా మామిడ చెట్లు ఉండేవి అట అందుకే గ్రామానికి గొల్లల మామిడడ అని పేరు వచ్చింది అని చెబుతారు . గోదావరి అంతర్వాహిని గ కలిగిన గ్రామం ఇది . అరసవెల్లి తరువాత బాగా ప్రసిద్దిగాంచిన సూర్య దేవాలయం ఇది .
1920 కాలం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో అద్బుతమైన శిల్ప సంపద ,అందమైన కట్టడాలు ,అద్దాల మెడ ,ధ్వజ స్థంబం , శిల్పకల నైపుణ్యం,దేవతల విగ్రహాలు బక్తులను ఎంతో గాను ఆకట్టుకుంటాయి . వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు . ఆదివారాలు ఇక్కడ భక్తులు బాగా వస్తు ఉంటారు .





--99))--


పశుపతి నాద దేవాలయము (నేపాల్)
పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశ రాజధాని ఖాట్మండు నగరం ఈశాన్య దిక్కున బాగమతి నది ఒడ్డున ఉన్నది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా హిందువులు భావిస్తారు. భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉన్నది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించ బడతారు.
శంకరాచార్యులు ఇక్కడ మానవ మరియు జంతు బలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశము సంతాప సముద్రములో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు, పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు. ఒక ఇతిహాసం ప్రకారం నేపాల మహత్యం మరియు హిమవత్‌ ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తుండగా దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగం గా ఉన్నదని ఇతిహాసం చెబుతారు
2 ఆలయ చరిత్ర ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన అధారాలు లేవు. గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ.753 సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది.. తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని,1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది. ఈ దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి మరియు బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి.నాలుగు ప్రధాన ద్వారాలకు (తలుపులకు) వెండి తాపడం చేయబడి ఉంటుంది.పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉన్నది.
ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని , ప్రధాన అర్చకుడిని మూల భట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ.దీనిని బట్టి ఈ ఆలయం ప్రాముఖ్యత మరియు ప్రధాన అర్చకుల అధికారాలు విఫులం అవుతాయి. మూల భట్ట(ప్రధాన అర్చకుడు) అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకి తెలియజేస్తుంటాడు. ఈ దేవాలయం తూర్పున వాసికినాథ్ దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం ప్రధాన గర్బ గుడికి నాలుగు ద్వారాలున్నాయి. ఏ ద్వారంనుండైనా భక్తులు దైవాన్ని దర్శించు కోవచ్చు.
ఈ ప్రాంతంలో రుద్రాక్షలు ఎక్కువగా దొరుకు తాయి. బయట అనేక చోట్ల అమ్ము తుంటారు. భక్తులు వాటిని కొని ప్రధాన ఆలయంలో వున్న అర్చకులకిస్తే వారు ఆ రుద్రాక్ష మాలలను ప్రధాన శివ లింగానికి తాకించి మంత్రాలు చదివి తిరిగి మనకిస్తారు. భక్తులు దీన్ని పవిత్ర కార్యంగా భావించి రుద్రాక్ష మాలలను తెచ్చి ఆర్చకులకిచ్చి శివ లింగానికి తాకించి తీసుకొని మెడలో వేసు కుంటారు. నేపాలి ప్రజలకు ఈ దేవాలయం చాలా పవిత్రమైనది.ఇక్కడ ఉన్న బాగమతి నది ఒడ్డున ఆర్యాఘాట్ అనే ప్రదేశంలో స్మశాన వాటిక ఉన్నది.
పశుపతినాథ్ దేవాలయానికి నేపాల్ దేశం నుండి భారత దేశం నుండి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకంటారు. ఏకాదశి, సంక్రాంతి,మహా శివరాత్రి, రాఖీ పౌర్ణమి గ్రహణం రోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజు పశుపతి నాథ్ దేవాలయం నేతి దీపపు కుందులతో కన్నులపండుగా ఉంటుంది. వేలాది భక్తులు శివరాత్రి రోజు బాగమతి నదిలో స్నానము చేసి, శివరాత్రి పండుగ జరుపుకొంటారు. హిందు మతస్థులను మాత్రమే ఈ దేవాలయంలోనికి ప్రవేశించనిస్తారు. అన్యమతస్థులు బాగమతి నది ఒడ్డునుండి మాత్రమే దేవాలయం దర్శించే అవకాశం ఉన్నది.
ఇక్కడ భాగమతి నది ఒడ్డున (దేవాలయానికి అనుసందానంగా వున్న) శ్మసానంలో నిత్యం శవ సంస్కారాలు జరుగుతూనే వుంటాయి. ప్రదాన ఆలయం ప్రక్కన నేపాల్ దేసపు రాజు ప్రతిమ వున్నది. ఆలయ గర్బ గుడి కెదురుగా అతి పెద్ద నంది విగ్రహం వున్నది. ఇది బంగారపు పూతతో వెలిగి పోతుంతుంటుంది. ఇక్కడ ఒక మండపంలో భక్తులు తమ పూర్వీకులకు తర్పణలు ఇస్తుంటారు. నేపాలీ ప్రజలు అను నిత్యం ఈ దేవాలయానికొచ్చి పూజలు చేస్తుంటారు. అలాగె భారత దేశస్తులు యాత్రకొరకు వచ్చిన వారు ఈ ఆలయం లొ ఎక్కువ గా కనబడు తుంటారు.






గురువాయూరు

పవిత్రమైన విష్ణుక్షేత్రం.దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". ఆలయం

ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది.

గురువాయూరు

కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం మరియు పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారుశ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు.

* పాతాళశిల!

ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి.

ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్‌. వెుదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు.

* నారాయణీయం!

గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేద శాస్త్రాలు ఔపోసన పట్టాడట. ఇరవై యేడేళ్లకే పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయురప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట.

భక్తులు గురువాయురప్పని కన్నన్‌, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌... అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం లేకపోయినప్పటికీ వేదపద్ధతిలో పూజలు నిర్వహించడంవల్లే వైష్ణవులకు గురువాయూర్‌ పరమపవిత్ర ప్రదేశంగా మారింది.

* అన్నప్రాశన

గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామిసమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు.

* గజేంద్ర సేవ!

గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని వూహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్‌, కేశవన్‌ల గురించిన గాథలెన్నో. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్‌ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందట. పద్మనాభన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్‌. అచ్చం దానిలానే స్వామిని సేవించేదట. తిడాంబుని ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగులశాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగులవరకూ ఉన్నాయి. ఇందులో కేశవన్‌ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు

* వ్యుత్పత్తి

శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు.
శ్రీకృష్ణ దేవుడిని 'గురువాయూరప్పన్' అని భక్తిభావంతో పిలుస్తారు.
దక్షిణ భారతంలో 'అప్ప' అనగా తండ్రి అనీ ప్రభువు, దేవుడు అనీ అర్థాలున్నాయి.





జాపాలి తీర్థం :......
.
దట్టమైన అటవీ ప్రాంతంలో, ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కటి జలపాతాలతో,దివ్య తీర్థలిలతో,పక్షుల కిలకిలారావాలతో,బెట్లుడుతల ఉయ్యాలాటలతో,దివ్య సుగంధాలతో,ఔషధీ మూలికల సంపదతో,కారణ జన్ముల కర,పాద స్పర్శతో తిరుమలకు వాయవ్యంగా సుమారు 5కి.మీ దూరంలో పాపవినాశం పోయే దారిలోఉన్నఒక సుందర చరిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం,ప్రసిద్ధ హనుమత్ క్షేత్రం.

ఈ తీర్థ మహిమ వరాహ,స్కాంధ పురాణాలలో వర్ణితం.33కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహా విష్ణువు,రామావతారం దాల్చినప్పుడు, రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో,దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకొనెను.అప్పుడు జాపాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం గావించుకొనుటకు ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వేంకటాచలంలో అనగా తిరుమలలో జప,హోమాలు చేయసాగెను.అతని భక్తికి మెచ్చి భగవంతుడు తనయొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని(ప్రస్తుతమున్న సింధూరకవచంలేని  రూపాన్ని) స్వయంభువుగా అవతరించి చూపించెను.జపంవల్ల అవతరించినందున ఈ స్థలం ‘జాపాలి’ అయింది.అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందున జాపాలి తీర్థం అని పేర్కొనబడుచున్నది. ఇక్కడికి అతి సమీపంలో ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారానకు సంకల్పించినది.హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లున్నది.అలా మారిన శేషగిరిపై శ్రీ వేంకటేశ్వరస్వామి తన అభయ హస్తములతో చరణదాసుడైన హనుమంతుని చూపుతున్నట్లుగా అర్చావతారంగా నిలిచాడు.

అయోధ్యకాండలో జాపాలి ఋషి తనయొక్క ధర్మవిరుద్ధమైన మాటలకు వాక్కుదోషాన్ని మూటగట్టుకొని, జపాలి తీర్థములో తపస్సుచేసి రామగుండములో స్నానమాచరించి వాక్కుదోష విముక్తుడయ్యెను.శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెడుతూ సీతాసమేతంగా ఈ తీర్థములోనే స్నానమాచరించెను.అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థం రామగుండంగా ,సీతామాత స్నానం చేసిన తీర్థం సీతాగుండమనే పేర్లతో అలరారుతున్నాయి. భక్త ధ్రువుడు మొట్టమొదట ఇచ్చోటనే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువతారయై వెలుగొందుతున్నాడు. ఇందుకు ప్రతీకగా నేటికీ ధ్రువతార అనేక ఔషధ గుణములతో నిరంతరాయంగా ప్రవహించుచూ ధ్రువతీర్థమనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈ నీటిని ఆంజనేయస్వామి నిత్య కైంకర్యాలకు వాడటం జరుగుచున్నది. పంచమహాపాతకములు,భూతప్రేత పిశాచాది బాధలు,బ్రాహ్మణత్వం కోల్పోయినవారు,బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థములో స్నానమాచరించడం వల్ల కష్టాలు తీరుతాయని స్కాంధ పురాణంలోని వేంకటాచల మహాత్మ్యములో చెప్పబడినది.ఎటువంటి కష్టమైనా స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పక కష్టాలు తీరుతాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సత్యం.జన్మ శనిగలవారు వారి పుట్టిన రోజున స్వామివారికి పూజ మరియు అభిషేకం చేస్తే శనిగ్రహం వల్ల కలిగే అనేకానేక విపత్తులు కలుగవు.

శ్రీశ్రీశ్రీ హథీరాంజీ బావాజీవారు ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు. ప్రస్తుతం ఈ స్థలం మహంతు శ్రీశ్రీశ్రీ 1008 అర్జునదాసుగారి పర్యవేక్షణలో ఉన్నది. పూజారి 108 శ్రీ రామదాసు బాలాజీ(88 సంవత్సరములు) ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి విచ్చేసి సరైన దారులు, వసతులు లేని సమయం నుంచి శ్రీ జపాలి ఆంజనేయున్ని కొలుస్తూ ఆంజనేయస్వామి ప్రభావాన్ని భక్తులకు తెలియజేస్తూ సేవ చేస్తున్నారు. ఈ చోటు ఎందరో మహాత్ములు,సాధువులు,యోగులు సిద్ధిపొందిన చోటు.దేవతలు నడయాడిన చోటు. ఇంకా ఎన్నో లీలావిశేషాలకు, అశోకవనంలో ఆంజనేయుడు సీతమ్మ వారిని సంతోషపరచినట్లు ఎందరో జీవితాలలో ఆనందాన్ని నింపుతున్న చోటు. నేడు ఎంతోమంది ఉన్నత స్థానములలో ఉన్న చాలా మంది ఈ స్వామి భక్తులే. వారి జాబితాకు అంతే లేదు.

జాపాలి తీర్థమందు జై సీతారామ్ నామాన్ని స్మరించండి. మనస్సును స్వామియందే లగ్నం చేయండి. జపాలి ప్రకృతిని వీక్షించండి. నిశ్శబ్దం వల్లే ఇది సాధ్యం. జపాలి పర్యావరణాన్నిపరిరక్షించండి. సాధువుల ఆశీర్వాదాన్ని పొందండి.







ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ: 

కార్తీక మాస సందర్భముగా దేవాలయాల విశేషములు తెలుసుకొని దేవునికృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము 

శ్రీ సంగమేశ్వరాలయం – సంగాం

శ్రీకాకుళ జిల్లాలోని 56 కి.మీ దూరములో వంగర మండలంలో సంగాం గ్రామము కలదు . ఇక్కడ అతి పూరతన మైన శ్రీ సంగమేశ్వరాలయము వున్నది . .

ఇది నాగావళి , స్వర్ణముఖి , వేదవతి నదుల సంగమించే పవిత్ర ప్రదేశము . కాబట్టి దీనికి సంగాం అనే పేరు వొచింది .

పరుశురాముడు మహా భారత యుద్దము తరువాత ప్రతిష్టించిన పంచ లింగముళ క్షేత్రములో ఇది ఒకటిగా స్థానికులు చేప్తారు .

“ నాగావళి నది తీరములో ద్వాపరయుగములో బలరాముడు ప్రతిష్టించిన ఐదు శివలింగాలని మహా శివరాత్రి రోజున సూర్యోదయము నుండి సూర్యాస్తమయములోగా దర్శించిన వారికి పాపాలన్నీ పోవడమే కాకుండా , వారికి పునర్జన్మ లేకుండా వుంటుందని భక్తుల నమ్మకము . “

స్థల పూరణము :-

ద్వాపరయుగములో ప్రజలు కరువుకాటకాలతో ఈ ప్రాంతములో అలమటిస్తున్నప్పుడు ఈ ప్రాంతములో బలరాముడు పర్యటిస్తు౦డగా , ప్రజల కష్టాలని చూచి , భీమిలో నాగలి పెట్టి ఒరిస్సా నుండి శ్రీకాకుళము జిల్లా లోని కళ్లేపల్లి వరకు గంగను తీసుకు వొచ్చాడని , అలా నాగలితో వచ్చిన గంగ కు నాగావళి అని పేరు వొచ్చినది . అయితే గంగను నాగలితో బందించి బలరాముడు తెచ్చినందుకు గాను పాప పరిహారము కొరకు ఈ నాగావళి నది తీరములో ఐదు శివలింగములని ప్రతిష్టించాడు .
ఈ ఐదు శివలింగములు ప్రతిష్టించిన ప్రదేశములు పుణ్య క్షేత్రములుగా విరాజిల్లుతున్నాయి .
ఈ ఐదు శివలింగములో . :-
రెండు శివలింగ క్షేత్రములు ఒరిస్సా రాష్ట్రములోని పాయకపాడులో వున్నాయి .
ఇంకో ఒక శివలింగ క్షేత్రము విజయనగరము జిల్లా లోని పార్వతీపురము దగ్గరలోని గుంప క్షేత్రము .

మిగిలిన మూడు శివలింగ క్షేత్రములు శ్రీకాకుళము జిల్లాలోని వంగర మండలములోని ఈ సంగాం సంగమేశ్వరునిగా ,
శ్రీకాకుళము జిల్లా లోని ఉమా రుద్రకోటేశ్వరుని గా , శ్రీకాకుళము జిల్లాలోని కళ్లేపల్లి వద్ద మణినాగేశ్వర స్వామి పేర్లతో ఈ క్షేత్రములు ప్రసిద్ది చెందాయి .
ఈ సంగాం క్షేత్రములో శివుడు సంగమేశ్వరుని గా భక్తులచే పూజలు అందుకుంటున్నాడు .. ఈ స్వామి వారికి మహా శివరాత్రి రోజున బ్రాహ్మాండమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు .

నమో పార్వతి పతయే హర హర మహా దేవ శంభో శంఖర




సర్పవరం

సర్పవరం, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ(గ్రామీణ) మండలానికి చెందిన గ్రామము. సర్పవరం గ్రామము తూర్పు గోదావరి జిల్లా రాజధాని కాకినాడ కు 5 కి.మీ దూరము లో ఉన్నది.

* స్థల పురాణము

01. సర్పాలు ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రాంతానికి 'సర్పవరం' అనే పేరు వచ్చిందని అంటారు.
02. సర్పవరం స్థల పురాణము బ్రహ్మవైవర్త పురాణము లో చెప్పబడినది. అగస్త్య మహర్షి సర్పవరం గాథ ని సనకసనందనాదుల కు చెబుతాడు.

* ఆలయాలు

పంచభావనారాయణ క్షేత్రాలలో ఒకటైన పాతాళభైరవాలయం ఇక్కడ ఉంది. ఈ ఆలయానికి ఒక విశిష్ఠత ఉంది. నారదుడు ముందుగా స్నానం చేసి స్త్రీ రూపాన్ని పొందిన కొలను . ఆ తరువాత స్నానం చేసి స్త్రీ రూపాన్ని వదిలించుకున్న కొలను నేటికీ ఇక్కడ పక్కపక్కనే దర్శనమిస్తాయి. విశాలమైన ప్రాంగణం. శిల్ప కళా శోభితమైన గాలి గోపురం ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ క్షేత్ర మహిమ గురించి శ్రీ నాథుడు తన కావ్యాల్లో ప్రస్తావించాడు. 'వైశాఖ శుద్ధ ఏకాదశి' రోజున స్వామివారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరుపబడుతుంది. శేష, గజ, అశ్వ వాహనాలపై ఊరేగే లక్ష్మీ నారాయణులను చూడటానికి భక్తులు ఈ ఉత్సవంలో విశేష సంఖ్యలో పాల్గొంటారు.

* ఆలయం వెనుక చరిత్ర

ఈ క్షేత్రానికి సంబంధించిన పురాణ సంబంధమైన కథ ఒకటి ప్రచారంలో వుంది. పూర్వం ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడితో సమావేశమైనప్పుడు విష్ణు మాయ గురించిన ప్రస్తావన వచ్చింది. అందరూ కూడా విష్ణుమాయను కనుగొనడం ఎవరివల్లాకాదనే నిర్ధారణకి వచ్చారు. అయితే అక్కడే ఉన్న నారదుడు వారితో ఏకీభవించకుండా, అనుక్షణం విష్ణు నామాన్ని జపించే తనకి ఆయన మాయను తెలుసుకోవడం సులభమే అని అన్నాడు. ఈ సంగతి కాస్తా విష్ణు మూర్తికి తెలిసింది. ఆ తరువాత కొంతకాలానికి నారదుడు భూలోక విహారానికి వెళ్లాడు. సంధ్యావందన సమయం కావడంతో ఓ కొలనులోకి దిగాడు. ఆ నీటిలో మునిగి లేచిన నారదుడు తాను స్త్రీగా మారిపోయినట్టు తెలుసుకుని ఆశ్చర్య పోయాడు. గట్టున పెట్టిన మహతి (వీణ) కానీ, కమండలం కానీ కనిపించకపోవడంతో అయోమయానికి లోనయ్యాడు.

నారదుడిగా సర్వ శక్తులను కోల్పోయి గతం మరిచిపోయి ఇష్టానుసారంగా తిరగసాగాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుని చూసి మోహించిన పీఠికాపురం ( పిఠాపురం) పాలకుడైన నికుంఠ మహారాజు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ రాజు శత్రు రాజుల చేతిలో హతుడయ్యాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు పారిపోయి అడవుల్లో తిరుగుతూ ఆకలితో ఓ చెట్టు నుంచి పండును కోయడానికి ప్రయత్నిస్తూ, అది అందక ఇబ్బంది పడసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మారువేషంలో అక్కడికి వచ్చి అక్కడికి దగ్గరలోని కొలనులో స్నానం చేసి వస్తేనే గాని ఆ పండు అందదని చెప్పాడు.

దానితో నారద స్త్రీ కొలనులోకి వంగిన ఓ చెట్టుకొమ్మ పట్టుకుని నీళ్ళలోకి దిగి ఓ మునకవేయగానే స్త్రీ రూపం పోయి నారద రూపం వచ్చినప్పటికీ, కొమ్మని పట్టుకోవడం వలన తడవని చేతి గాజులు మాత్రం అలాగే ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్య పోతూ ఒడ్డుకువచ్చిన నారదుడికి అదంతా విష్ణుమాయ అని అర్థమైంది. దానితో శ్రీ మహా విష్ణువు అనుగ్రహం కోసం ఈ ప్రదేశంలో పాతాళ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించి, వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు, ఆయన మాయకు ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ ప్రదేశంలో కొలువుదీర వలసిందిగా నారదుడు కోరడం వలన భావనారాయణ స్వామిగా ఆయన అక్కడ వెలిశాడు.

ఆ తరువాత రాజ్య లక్ష్మీ అమ్మవారిని స్వామివారికి ఎదురుగా ప్రతిష్ఠించారు.





--(())--

జోగులాంబ దేవాలయం - ఆలంపూర్
శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. మహామహిమాన్వితమైన ఆ శక్తిపీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్. జోగులాంబ ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనిమస్తుంటారు. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఇక్కడి జోగులాంబ ఆలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన, ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణాకఠాక్షాలను చూపుతున్నారు.
స్థల పురాణం
అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది. ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.
విశిష్టరూపం
పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.
విశిష్ట నిర్మాణం
అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం, భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు.
ప్రత్యేక పూజలు
శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మికం సంరంభం కనిపిస్తుంది. రోజూవారీ పూజలతో పాటు, ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖయ్లో భక్తులు వస్తుంటారు. సంతాన సమస్యలు, అనారోగ్యసమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ అపాద్భాంధవ పాత్ర పోషిస్తుంది.
విశేషరోజులు :
ఆలంపూర్ క్షేత్రంలో కార్తీకమాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీకమాసంలో జోగుళాంబ అమ్మవారిని విశేష పూజలో పాల్గొనేందుకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ జరిగే నవ వర్ణార్చన, కన్య పూజల కోసం మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కన్నుల పండుగగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ మాసంలో విఐపిల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే శివరాత్రి పర్వదినాన బాలవూబహ్మేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. శివరాత్రి పర్వదినం రోజు ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు తెలంగాణ, రాయలసీమకు చెందిన ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.
ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళతాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వేస్టేషన్ కర్నూలు.
జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణాలోచన ఆలంపురీ స్థిత మాతా సర్వత్రా ఫల సిద్ధిదా..!



--(())--

కార్తీక మాస సందర్భముగా దేవాలయాల విశేషములు తెలుసుకొని దేవునికృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము 
రాజ రాజేశ్వర స్వామి దేవాలయం -వేములవాడ

కరీంనగర్ పట్టణానికి 35 కి మీ దూరం లో ఉన్న వేములవాడ పట్టణం లో వెలసిన రాజ రాజేశ్వర స్వామి దేవాలయం చాళుక్యుల కాలం నాటిది . వేయి సంవత్సరాల చరిత్ర గల ఈ దేవలయం
శ్రీశైల శికారం దర్శనం చూడడం వాళ్ళ ముక్తి కలుగుతుంది అని ,కాశి లో మరణిస్తే మోక్షం లబిస్తుంది అని ఇతర క్షేత్రాలలో తపస్సు చేస్తే మోక్షం కలుగుతుంది అని పురాణగాథలు కానీ, ధర్మగుండం పేరు వింటేనే మోక్షం కలుగుతుంది అని ప్రతిక .
స్థలపురాణం
అర్జనుడి మనవడు అయన నరేంద్రుడు పొరపాటున లేడి అనుకోని ఒక ఋషిని చంపాడట . అతనికి కలిగిన పాపం ఎన్ని పూజలు చేసిన పోలేదు . ఆలా తిరుగుతూ దప్పికాయ ధర్మగుండం లో దీగి స్నానం చేసి దోసిట తో నీరు త్రాగాగానే పాపపరిహారం పొందాడు అని, స్వామి అతనికిస్వప్నం లో కనిపించి ధర్మగుండం అడుగున రాజేశ్వర రూపం లో తను ఉన్నని అని దానిని తీసి ప్రతిష్టించాలని ఆనతిచ్చాడు . నరేంద్రుడు అలాగే ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం . ఈ స్వామి ద్వాపర యుగం లో పండువాలు అర్చించారని మారో గాథ చెబుతుంది .
శ్రీ రాజ రాజేశ్వర స్వామి నీలలోహిత లింగాకార రూపం లో వేలియగా , అమ్మ వారు ,నందీశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు .
ఈ ఆలయం లో 22 శివలింగాలు ఉన్నాయి కోదండ రామాలయం , కాశి విశ్వేశ్వర ఆలయం ,మహిససురమర్ధిని ఆలయం చూడదగినవి . ఇక్కాడ ఉన్న శ్రీ రాజ రాజేశ్వర స్వామి ని రాజన్న అని కూడా పిలుస్తారు . శ్రీ రాజ రాజేశ్వర దేవాలయంతో పాటు అనంత పద్మనాభ స్వామి దేవాలయం, శ్రీ రామ చంద్ర స్వామి దేవాలయాలు కూడా కొలువై ఉన్నాయి .



--(())--
చౌడేపల్లి మృత్యు౦జఆలయం
చుట్ట్టూ కొ౦డలు,ఆహ్లదకరమైన వాతావరణ౦ నడుమ మహిమాన్వితుడు గా మృత్యు౦జయుడు పూజల౦దు కొ౦టున్నాడు.ఆలయ నిర్మణ కర్త అయిన పు౦గనురు జమి౦దారు మరణశయ్య ను౦చి స్వామి వారి కటక్ష౦తో మృత్యువును జయి౦చడ౦తో పాటు
పుర్తి స్దాయి లో ఆలయ నిర్మాణ౦ పుర్తి చేశాడు .రాష్త్ర౦ లోనే ఏ ప్రా౦త౦ లోను లేని విద౦గా మృత్యు౦జయుని ఆలయ౦ నిర్మి౦చబడి౦ది. రాష్త్ర౦ ను౦డే కాకు౦డా కర్ణాటక,తమిలనాడుల ను౦చి విశేష స౦ఖ్య లో భక్తులు తరలి వచ్చి మృత్యు౦జయున్ని దర్శి౦చుకు౦టారు.
ఆలయ స్థల పురాణ౦:
పు౦గనూరు జమి౦దారుల ఏరుబడిలో ఈ ప్రా౦త౦ ఉ౦డేది. క్రీ.శ. 600 శతాబ్డ౦లో రాజా చిక్కరాయలు ఈ ప్రా౦తన్ని పాలి౦చేవారు. పు౦గనూరుకు 30 కిలోమీటర్ల దూర౦లో ఆవులపల్లి దుర్గాలలో జమి౦దారులు వేసవి విడిది కొస౦ వేళ్ళేవారు. ఈ నేపద్య౦లో ఓ వేసవిలో చిక్కరాయలు తన పరివార౦తో విడిది కోస౦ ఆవుల పల్లి దుర్గాలకు వేళ్ళాడు.అక్కడ నిద్రిస్తు౦డగా రాయలకు శివుడు కలలో కనిపి౦చాడు.ఇక్కడ సమీప౦లోని ఓ కోనేరు వద్ద తమ విగ్రహలున్నాయనీ వాటిని తీసి ఆలయన్ని నిర్మి౦చాలని రాయలకు ఆదేశి౦చాడు.వె౦టనే రాయలు వెళ్ళి కొనేరులో తవ్వి౦చి చూడగా శివ,పార్వతిల విగ్రహలు లభి౦చాయి.తమ స౦స్థాన౦తో ఆలయాన్ని నిర్మి౦చాలనే ఉద్దేశ్య౦తో స్వామి వారి విగ్రహలను పు౦గనూరుకు తరలి౦చే ప్రయత్న౦ చేస్తూ౦డగా చుట్టుకొ౦డలు,ఆహ్లదకరమైన వాతావరణ౦ గల ఓ ప్రా౦తానికి వచ్చేసరికి పొద్దు పొవడ౦తో అ౦దరూ విశ్రా౦తి తీసుకోసాగారు.నిద్రిస్తూన్న రాయల వారి కలలో శివుడు ప్రత్యక్షమై ఈ ప్రా౦త౦ తనకు నచ్చి౦దని ఇక్కడే ఆలయన్ని నిర్మి౦చాలని రాయలకు ఆదేశి౦చాడు. ది౦తో చిక్కరాయలు స్వామివారికి ఆలయన్ని నిర్మి౦చే౦దుకు సిద్దపడ్దారు.ఇతర ప్రా౦తాల ను౦చి కూలీలను తీసుకొచ్చి ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు.పనులు జరుగుతున్న సమయ౦లో రాయలకు అస్వస్థతకు గురిఅయ్యాడు..ఆలయన్ని నిర్మి౦ణ౦ పుర్తయ్యేవరకు తనను బ్రతికి౦చాలని రాయలు శివున్ని ప్ర్ర్ర్రార్ద్౦చాడు.వె౦టనే ఆయనకు జబ్బు ను౦చి విముక్తి లభి౦చి౦ది.కొరిన కొర్కెలు తీర్చి మృత్యవు ను౦చి కాపాడాదు కాబట్టి శ్రీ అభీష్టదమృత్య౦జయేశ్వర స్వామిగా స్వామివారు ప్రసిద్దికెక్కారు.ఆలయ నిర్మాణ౦ పుర్తియి ద్వజస్త౦బఒ నిలబెట్టేస్దాయికి పనులు జరిగాయి .60అడుగులు పొడవుతో ఏకశిలగా రూపొ౦ది౦చిన ద్వజస్త౦బాన్ని ఎవరూ నిలబెట్టలేక పోయారు.దీ౦తో ఆలయ నిర్మాణ౦ అర్ధా౦తర౦గా నిలిపేసి మనస్ధాప౦తో రాయలు పు౦గనూరుకు వెనుదిరిగాడు.కొ౦తదూర౦ వేళ్ళేసరికి ఓక బ్రాహ్మణుడు చిక్కరాయలుకు ఎదురుపడి సమాచార౦ అడిగి తెలుసుకొన్నాడు .అతను రాజా ఓ సారి వెనుదిరిగి చుడమని బ్రాహ్మణుడు చెప్పగా రాయలు తిరిగి చూశాడు.ఆలయ౦ వద్ద ద్వజస్త౦బ౦ నిలబడి ఉన్న దృశ్య౦ ఆయనకు కనిపి౦చి౦ది. వె౦టనే బ్రాహ్మణుడుని చూసేసరికి అతను మాయమయ్యడు.శివుడే తనకు ఎదురుపడ్డాడాన్ని తలచిన రాయలు అక్కడ ఓ కొనేరు తవ్వి౦చి గాలి గోపురాన్ని ఏర్పాటు చేశాడు. ప్రస్తుత౦ ఆప్ర్రా౦తాన్ని దొరబావిగా పిలుస్తున్నారు.అప్పటి ను౦చి ఏవరు అయితే గుడి యొక్క అబివృద్దిని చేస్తారో వారి పాదుకులను రాజు తన యొక్క తల మీద పెట్టుకు౦టానని రాయలవారు శిలాశాసన౦ న౦దు లిఖి౦చబడ్డారు.
మొదట చౌడేపల్లి ని చిక్కరాయపుర౦ అని పిలిచేవారు.గ్రామదేవతగా చౌడేశ్వరమ్మ ఆవిర్బావ౦తో అటూ పిమ్మట చౌడపురిగా అ తర్వాత కాల క్రమేణా చౌడేపల్లి గా రుపా౦తర౦ చె౦దిది.
చుట్ట్టూ కొ౦డలు,ఆహ్లదకరమైన వాతావరణ౦ నడుమ మహిమాన్వితుడు గా మృత్యు౦జయుడు పూజల౦దు కొ౦టున్నాడు.ఆలయ నిర్మణ కర్త అయిన పు౦గనురు జమి౦దారు మరణశయ్య ను౦చి స్వామి వారి కటక్ష౦తో మృత్యువును జయి౦చడ౦తో పాటు
పుర్తి స్దాయి లో ఆలయ నిర్మాణ౦ పుర్తి చేశాడు .రాష్త్ర౦ లోనే ఏ ప్రా౦త౦ లోను లేని విద౦గా మృత్యు౦జయుని ఆలయ౦ నిర్మి౦చబడి౦ది. రాష్త్ర౦ ను౦డే కాకు౦డా కర్ణాటక,తమిలనాడుల ను౦చి విశేష స౦ఖ్య లో భక్తులు తరలి వచ్చి మృత్యు౦జయున్ని దర్శి౦చుకు౦టారు.
ఆలయ స్థల పురాణ౦:
పు౦గనూరు జమి౦దారుల ఏరుబడిలో ఈ ప్రా౦త౦ ఉ౦డేది. క్రీ.శ. 600 శతాబ్డ౦లో రాజా చిక్కరాయలు ఈ ప్రా౦తన్ని పాలి౦చేవారు. పు౦గనూరుకు 30 కిలోమీటర్ల దూర౦లో ఆవులపల్లి దుర్గాలలో జమి౦దారులు వేసవి విడిది కొస౦ వేళ్ళేవారు. ఈ నేపద్య౦లో ఓ వేసవిలో చిక్కరాయలు తన పరివార౦తో విడిది కోస౦ ఆవుల పల్లి దుర్గాలకు వేళ్ళాడు.అక్కడ నిద్రిస్తు౦డగా రాయలకు శివుడు కలలో కనిపి౦చాడు.ఇక్కడ సమీప౦లోని ఓ కోనేరు వద్ద తమ విగ్రహలున్నాయనీ వాటిని తీసి ఆలయన్ని నిర్మి౦చాలని రాయలకు ఆదేశి౦చాడు.వె౦టనే రాయలు వెళ్ళి కొనేరులో తవ్వి౦చి చూడగా శివ,పార్వతిల విగ్రహలు లభి౦చాయి.తమ స౦స్థాన౦తో ఆలయాన్ని నిర్మి౦చాలనే ఉద్దేశ్య౦తో స్వామి వారి విగ్రహలను పు౦గనూరుకు తరలి౦చే ప్రయత్న౦ చేస్తూ౦డగా చుట్టుకొ౦డలు,ఆహ్లదకరమైన వాతావరణ౦ గల ఓ ప్రా౦తానికి వచ్చేసరికి పొద్దు పొవడ౦తో అ౦దరూ విశ్రా౦తి తీసుకోసాగారు.నిద్రిస్తూన్న రాయల వారి కలలో శివుడు ప్రత్యక్షమై ఈ ప్రా౦త౦ తనకు నచ్చి౦దని ఇక్కడే ఆలయన్ని నిర్మి౦చాలని రాయలకు ఆదేశి౦చాడు. ది౦తో చిక్కరాయలు స్వామివారికి ఆలయన్ని నిర్మి౦చే౦దుకు సిద్దపడ్దారు.ఇతర ప్రా౦తాల ను౦చి కూలీలను తీసుకొచ్చి ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు.పనులు జరుగుతున్న సమయ౦లో రాయలకు అస్వస్థతకు గురిఅయ్యాడు..ఆలయన్ని నిర్మి౦ణ౦ పుర్తయ్యేవరకు తనను బ్రతికి౦చాలని రాయలు శివున్ని ప్ర్ర్ర్రార్ద్౦చాడు.వె౦టనే ఆయనకు జబ్బు ను౦చి విముక్తి లభి౦చి౦ది.కొరిన కొర్కెలు తీర్చి మృత్యవు ను౦చి కాపాడాదు కాబట్టి శ్రీ అభీష్టదమృత్య౦జయేశ్వర స్వామిగా స్వామివారు ప్రసిద్దికెక్కారు.ఆలయ నిర్మాణ౦ పుర్తియి ద్వజస్త౦బఒ నిలబెట్టేస్దాయికి పనులు జరిగాయి .60అడుగులు పొడవుతో ఏకశిలగా రూపొ౦ది౦చిన ద్వజస్త౦బాన్ని ఎవరూ నిలబెట్టలేక పోయారు.దీ౦తో ఆలయ నిర్మాణ౦ అర్ధా౦తర౦గా నిలిపేసి మనస్ధాప౦తో రాయలు పు౦గనూరుకు వెనుదిరిగాడు.కొ౦తదూర౦ వేళ్ళేసరికి ఓక బ్రాహ్మణుడు చిక్కరాయలుకు ఎదురుపడి సమాచార౦ అడిగి తెలుసుకొన్నాడు .అతను రాజా ఓ సారి వెనుదిరిగి చుడమని బ్రాహ్మణుడు చెప్పగా రాయలు తిరిగి చూశాడు.ఆలయ౦ వద్ద ద్వజస్త౦బ౦ నిలబడి ఉన్న దృశ్య౦ ఆయనకు కనిపి౦చి౦ది. వె౦టనే బ్రాహ్మణుడుని చూసేసరికి అతను మాయమయ్యడు.శివుడే తనకు ఎదురుపడ్డాడాన్ని తలచిన రాయలు అక్కడ ఓ కొనేరు తవ్వి౦చి గాలి గోపురాన్ని ఏర్పాటు చేశాడు. ప్రస్తుత౦ ఆప్ర్రా౦తాన్ని దొరబావిగా పిలుస్తున్నారు.అప్పటి ను౦చి ఏవరు అయితే గుడి యొక్క అబివృద్దిని చేస్తారో వారి పాదుకులను రాజు తన యొక్క తల మీద పెట్టుకు౦టానని రాయలవారు శిలాశాసన౦ న౦దు లిఖి౦చబడ్డారు.
మొదట చౌడేపల్లి ని చిక్కరాయపుర౦ అని పిలిచేవారు.గ్రామదేవతగా చౌడేశ్వరమ్మ ఆవిర్బావ౦తో అటూ పిమ్మట చౌడపురిగా అ తర్వాత కాల క్రమేణా చౌడేపల్లి గా రుపా౦తర౦ చె౦దిది.




--(())--

అహోబిళం
పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలంను అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలం నందు ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలం నందు వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించినాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబిల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో కలదు. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలం లో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్ధంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరప భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం. దిగువ అహోబలం నందు వెలసిన ప్రహ్లదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవసించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి కలవు. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి. వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్టించి ఆరాధించినాడు కావున ఈ ఐదిక్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం కలదు. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచినారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది. రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు. పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్ధం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి.
అహోబిల మహత్యం
ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలక్షేత్రము. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతం నందు బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడినది.

దర్శనీయ స్థలాలు
జ్వాలా నరసింహ
అహోబిల నరసింహ: గరుత్మంతునికి దర్శనమిచ్చిన నరసింహ స్వామి.
మాలోల నరసింహ: లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహస్వామి
క్రోద నరసింహ (వరాహ నారసింహ)
కారంజ నరసింహ
భార్గవ నరసింహ
యోగానంద నరసింహ
క్షాత్రపత నరసింహ (ఛత్రవట నారసింహ)
పావన నరసింహ

అహోబిలంలో వసతి సౌకర్యములు ఇంకా సరిగ్గా లేవు. వసతి కోసం మూడు అవకాశములు ఉన్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానము వారి అతిథి గృహములో ఉండవచ్చు
లేదా అహోబిలం మఠంలో ఉండవచ్చు.
దగ్గరలోని పట్టణం, ఆళ్ళగడ్డలో ఉండవచ్చు. అది 30 కి.మీ దూరంలో ఉంది లేదా 70 కి.మీ దూరంలో వున్న నంద్యాలలో వుండవచ్చు.



--(())--

జైనాథ్ ఆలయం
రవి కిరణాలు సోకే నారాయణుడి పాదాలు

జైనాథ్ టెంపుల్ తెలంగాణా లోని అదిలాబాద్ జిల్లాలో వుంది. ఉత్తర తెలంగాణాలో అదిలాబాద్ లో ఉన్నఈ ఆలయం పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది. అదిలాబాద్ జిల్లాలో చుట్టు పక్కల దర్శనీయ స్థలాలు చాలా వున్నాయి. వాటిలో ఈ ఆలయం ఒకటి.
ఆలయ ముఖద్వారం ఆలయంలోపలి స్తంభాలపై శిల్పాలు
జైనాధ్ ఆలయం అదిలాబాద్ కు 21 కిలోమీటర్ల దూరంలో జైనాధ్ గ్రామంలో వుంది. హైదరాబాదు నుండి కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్ మీదుగా 315 కిలోమీటర్ల దూరం లో వుంది . ఆలయ మూలవిరాట్టు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి. చాలా మహిమాన్విత ఆలయం ఇది. భక్తులకు ఆ నారాయణుడు తన కృపావీక్షణాలతో అలరారుతుంటాడు. అక్కడ ఉన్న శిలాశాసనాలను బట్టి, ఆలయ గోడలపై చెక్కిన దాదాపు 20 శ్లోకాలను బట్టి ఈ ఆలయం పల్లవ రాజులచే కట్టబడింది అని ఆలయ చరిత్ర చేబుతోంది. క్రీ.శ.4 నుండి 9వ శతాబ్దం నాటి వరకు పల్లవ సామ్రాజ్యం అని చెప్పచ్చు.

పల్లవులు దక్షిణ భారతావనిని దాదాపు 500 ఏళ్ళు పరిపాలించారు. వారు పరాక్రమ వీరులే కాదు వారిలో ఉన్న కళానైపుణ్యం కూడా గొప్పది, హస్త కళలలో, శిల్పకళలలోను సిద్ధహస్తులు. రాతిని చెక్కి అందమైన శిల్పాలుగా మార్చే కళ లో ప్రసిద్ధులు. వారి కాలంలో అనేక ఆలయాలు చెక్కబడి అందమైన శిల్పసౌందర్యంతో అలరారే అధ్భుతమైన కళాఖండాలు ఉన్నాయి. వాటిలో ఈ జైనాధం ఆలయం ఒకటి. ఈ ఆలయం జైన్ సంప్రదాయంతో అలరారుతుండేదని ఆలయ శిల్ప కళని బట్టి తెలుస్తుంది. అందుకే ఆలయానికి జైనథ్ అని పేరు వచ్చిందని కూడా చెప్పచ్చు. ప్రకృతి సిద్ధంగా లభించే నల్ల రాతితో ఈ ఆలయం నిర్మితమైంది. చాలా పురాతనమైన ఆలయం ఇది.

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
స్వామివారి బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో శుద్ధ అష్టమి నుండి బహుళ సప్తమి వరకు జరుగుతుంటాయి ప్రత్యేక పూజలు, జాతరలు కార్తీక మాసంలో జరుగుతుంటాయి. ఆలయం భక్తుల రాకతో, యాత్రికులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంటుంది, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం చాల ప్రసిద్ధి చెందింది.

రవి కిరణాలు సోకే నారాయణుడి పాదాలు
ప్రతి ఏటా ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగష్టు, మాసాలలోనూ దసరా అనంతరం వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఉదయం లేలేత లక్ష్మీనారాయణుని పాదాలు ఉదయ కిరణాలు తాకుతుంటాయి. ఈ అధ్భుతదృశ్యం చూడటాని కి భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తుంటారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

ఆలయ విశిష్ఠత
సంతాన సాఫల్యత, కోరిన కోర్కలు తీర్చే దేవుడని భక్తుల నమ్మకం. అంతే కాదు ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ నారాయణ స్వామి అని, నారయణ మూర్తి అని, శ్రీ, లక్ష్మి ఇలాటి పేర్లతో పిలవబడుతుంటారు.

ప్రపంచంలోని అన్ని ప్రాంతాల టూరిస్ట్ లను ఆకర్షిస్తుంది ఈ గ్రామం చిన్నది. జైనాధ్ మండల పరిధిలో 52 గ్రామాలున్నాయి. వాటిల్లో 29 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.జైనధ్ గ్రామంలో మాత్రం జనాభా 5,000 లోపే .

ప్రభుత్వాలు పూనుకుని ఈ ఆలయంకి రాకపోకలు పెంచి, రహదారి, ఆలయం పరిసరాలు, వసతి గృహాలు ఇత్యాది వన్నీ సమకూర్చితే ఇంకా అభివృద్ధి చెందుతుంది. . అందరికీ ఈ ఆలయం గురించి తెలుస్తుంది.









--(())--

సప్తనదీ సంగమం......సంగమేశ్వర ఆలయం-

ఏడునదులు కలిసే ప్రదేశం-8 నెలలపాటు నీటిలో-4 నెలలు -దర్శనభాగ్యం

ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం

జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ... నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది.

పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో... ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు .. ప్రతిష్ట సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.

ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా... అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు.

అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు.

ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు.
ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది . అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి.

ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.

కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న 'మచ్చుమర్రి' గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని , అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు. స్వంతవాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్‌.టి.సి.వారు బస్సులను నడుపుతారు.మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు.







--(())--

అగస్థీశ్వర స్వామి ఆలయం, తొండవాడ

తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే దారిలో 12 కి.మీటర్ల దూరంలో స్వర్ణముఖీ నదీ తీరానతొండవాడ అనే గ్రామం ఉంది. ఈ ప్రదేశాన్నే ముక్కోటి అని పిలుస్తారు. ఇక్కడ 3 పుణ్యనదులు కలుస్తాయి. అవి స్వర్ణముఖి ,భీమా ,కళ్యాణి .. ఇక్కడి లింగాన్ని అగస్తీశ్వరమహాముని ప్రతీష్ఠించారు కాబట్టి అగస్తీశ్వరలింగం గా ప్రఖ్యాతి. ఇది చాలా ప్రాచీన సాంప్రదాయ కట్టడము.పక్కనే చిన్న కోనేరు. నదీమధ్యలో ఓ మండపము.పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

అగస్థ్య మహర్షి ని దర్శించు కోవటానికి కళ్యాణ వేంకటేశ్వరుడు పద్మావతి సమేతంగా ఇక్కడకు విచ్చేసాడు. ఇక్కడ అగస్థ్య మహర్షి ప్రతిష్ఠిత శివ లింగమే అగస్థీశ్వర స్వామి గా ప్రసిద్ది చెందింది. అగస్థీశ్వర స్వామిని ఆకాశరాజు, ధరణి దేవి మరియు పద్మావతి దేవి దర్శించుకొనే వారని ప్రతీతి. అగస్థ్య మహర్షి ఇక్కడే ఉన్న ఐదు వృక్షాలూ కలిసి ఉన్నన ప్రదేశం లో తపస్సు చేసుకొనే వారని చెప్తారు. ఇక్కడ మరో విశేషం కూడ ఉంది. వేంకటేశ్వర స్వామి మొట్టమొదట తిరుపతి లో అడుగు పెట్టిన ప్రదేశం ఇక్కడే ఉంది. అదే శ్రీ పాదం అని పేరు.



--(())--

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం.... శ్రీనివాస మంగాపురం

శ్రీనివాస మంగాపురం తిరుపతి కి 12 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీనివాసుడు ... పద్మావతీ అమ్మవారు నడయాడిన ప్రదేశాలు ఎంతో పుణ్యప్రదమైనవి ... అత్యంత పవిత్రమైనవి. అలాంటి ప్రదేశాలను చూడటం ... అక్కడి నేలను స్పర్శించడం వలన జన్మజన్మాల పాపం నశిస్తుంది ... ముందు జన్మాలకి తరగని పుణ్య ఫలాలను అందిస్తుంది. అలాంటి విశిష్టమైన క్షేత్రమే 'శ్రీనివాస మంగాపురం'. ఇది తిరుపతికి సమీపంలో 'చంద్రగిరి' మండల పరిధిలో 'సువర్ణముఖీ' నదీ తీరంలో ఆవిర్భవించింది.
పూర్వం ఆకాశరాజు - ధరణీదేవిల కుమార్తె అయిన పద్మావతీ దేవిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నాడు. పద్మావతీదేవిని వెంటబెట్టుకుని 'నారాయణవనం' నుంచి తిరుమలకు బయలుదేరిన ఆయన, మార్గమధ్యంలో అగస్త్య మహర్షి ఆశ్రమం చెంత ఆగాడు. అగస్త్య మహర్షి అభ్యర్థన మేరకు ఆరుమాసాలపాటు ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఇందుకు నిదర్శనంగానే స్వామి ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరుడిగా కొలువుదీరాడు. ఒకప్పుడు 'అలమేలు మంగాపురం'గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం, ఇప్పుడు ' శ్రీనివాస మంగాపురం' గా వెలుగొందుతోంది.
శిధిలావస్థలో వున్న ఇక్కడి ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడైన తాళ్లపాక చిన్న తిరుమలాచార్యులు పునరుద్ధరించాడు. ఒకానొక సమస్యను పరిష్కరించడానికిగాను చిన్న తిరుమలా చార్యులు సాక్షాత్తు అలమేలు మంగమ్మను పిలిచాడట. అక్కడున్న గ్రామస్తులందరికీ వినిపించేలా అమ్మవారు అదృశ్య రూపంలో న్యాయం చెప్పిందట. న్యాయం పొందినవారు ఇచ్చిన విరాళానికి మరికొంత కలిపి చిన్న తిరుమలా చార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్టు చరిత్ర చెబుతోంది.
ఎత్తైన రాజగోపురం ... పొడవైన ప్రాకారాలు ... కళ్యాణ మంటపం ... యాగశాల ... కోనేరు ఆలయ వైభవాన్ని చాటిచెబుతూ వుంటాయి. 40 స్తంభాలు కలిగిన మహా మంటపం ... అర్థమంటపం ... సేనా మంటపం శోభాయమానంగా దర్శనమిస్తుంటాయి. అంతరాళంలో ఒకవైపున శయన ముద్రలో శ్రీ రంగనాథుడు ... మరో వైపున లక్ష్మీనారాయణుడు కొలువై వుంటారు. గర్భాలయంలో కళ్యాణ వేంకటేశ్వరుడు నయనమనోహరంగా కనిపిస్తూ ఉంటాడు.
తాళ్లపాక అన్నమయ్య పూజామందిరంలో కొలువై ఆయన పూజలు అందుకున్న ప్రతిమలు ... ఆయన ఉపయోగించిన 'చిడతలు' స్వామివారి సన్నిధిలో కనిపిస్తాయి. పంచబేరాలతో దర్శనమిచ్చే స్వామికి నిత్యోత్సవ .. వారోత్సవ .. మాసోత్సవ ... వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వుంటారు.
ప్రశాంతమైన వాతావరణంలో పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ క్షేత్రదర్శనం, అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

--((***))--

శ్రీ ప్రసన్న కామాక్షి సమేత శ్రీమొగిలీశ్వరా లయం- మొగిలి

మొగిలీశ్వరుడు-మొగిలి గ్రామం(చిత్తూరు జిల్లా)

ఆంధ్రప్రదేశ్‌లో మల్లిఖార్జున ఆలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం, ద్రాక్షారామం, భీమేశ్వరాలయం ఎంతో ప్రాముఖ్య తను పొందాయి. వాటితో పాటు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజక వర్గంలోని బంగారు పాళ్యం మండల పరిధిలోని అటవీ ప్రాంతా నికి దగ్గరగా దక్షిణ కాశీగా పేరొందిన మొగి లి గ్రామం కూడా ప్రసిద్ధమైనదే. ఇక్కడ వెలసి న శ్రీ ప్రసన్న కామాక్షి సమేత శ్రీమొగిలీశ్వరా లయం పంచ క్షేత్రాల్లో మొదటిగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.

ప్రతి ఏడాది మహశివరాత్రి సందర్భంగా పది రోజుల పాటు అత్యంత వైభవంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మో త్సవాలకు చిత్తూరు జిల్లా వాసులేగాక తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. దేవాలయం చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి పొలాలు, ప్రకృతి ప్రసాదించినట్లుగా చల్లటి గాలితో ఆహ్లాదకరంగా కనిపించే వాతావరణం వుంటుంది. ఇక్కడి పకృతి పచ్చదనాని కి ఆకర్షితులై కూడా అనేక మంది పర్యాట కులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

* ఆలయ చరిత్ర :

ప్రస్తుతం పుష్కరిణిగా ఉన్న ప్రదేశంలో మొగిలిపొద ఎక్కువగా ఉండేది. ఈ పుష్కరిణిలో ఆనాటి నుంచి నేటి వరకు కూడా నంది విగ్రహం నోటి నుంచి నీరు కరువులోను నిరంతరాయంగా వస్తూ ఉంటుంది. ఈ నీటిని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరికీ అంతుబట్టలేదు. అప్పట్లో ఓ మొగిలి పొదలు మధ్య ఒక నీటి దారువ ఉండేదని, మేత మేసిన పశువులు ఈ పొదల మధ్య సేద తీర్చుకొని పక్కన ఉన్న నీటి ధారలో నీళ్ళు తాగుతూ ఉండేవని చెబుతుంటారు. ఒక రోజు నీటి ధారలో నల్లటి రాయి పశువులు తాగే నీటికి అడ్డు రావడంతో మొగిలప్ప ఆ రాయిని తొలగించడానికి ప్రయత్నించాడు. ఆ రాయి కదలక పోవడంతో తన వద్దనున్న గొడ్డలతో రాయిపైకొట్టగా ఆ దెబ్బకు ఆ రాతి నుంచి రక్తం కారడంతో భయభ్రాంతులకు గురయ్యాడు. దెబ్బ తగిలిన ఆ రాతికి అతను ఆకు పసురుతో చికిత్స చేసి ప్రతి రోజు భక్తితో పూజలు నిర్వహిస్తూ వచ్చాడు.

మొగిలప్పకు చెందిన ఆవుల్లో ఒక ఆవు పాలు పితకనివ్వక తంతూ గ్రామానికి దక్షిణ దిశలో మూడు కిలో మీటర్లుదూరంలో గల దేవర కొండకు వెళుతూ ఉండేది. ఆ రహస్యం తెలసుకోవడానికి ఓ రోజు మొగిలప్ప ఆవును వెంబడించగా ఆవు కొంతదూరం వెళ్ళి స్వరంగ మార్గం గుండా వెళ్ళింది. ఆ ప్రదేశంలో సాక్షాత్తు కైలాసాన్ని మరుపింప చేసే అద్బుత దృశ్యాన్ని చూసి చీకట్లో అలాగే నిశ్చేష్టుడై ఉండి పోయాడు. పార్వతి దేవి అక్కడ ఉన్న శివలింగానికి పాలభిషేకం చేస్తూ చీకట్లో నిలబడి ఉన్న మొగిలిప్పను చూసింది. అందుకు భయభ్రాంతులకు గురైన మొగిలప్ప శరణు కోరగా ఈ రహస్యాన్ని ఎక్కడా బయటకు చెప్పరాదని చెప్పింది. దీంతో అతను దైవ చింతనా పరాయణుడిగా మారిపోయాడు. భర్త దైవచింతనను గమనించిన భార్య గ్రామ పెద్దలతో పంచాయితీ నిర్వహించింది. తాను నిజం చెబితే మరణిస్తానని మొగిలప్ప ఎంత చెప్పినా వారు వినకపోవడంతో విధిలేని పరిస్ధిలో మొగిలప్ప చితిపేర్చమని చెప్పి, చితిపై కూర్చోని తాను చూసిన సంఘటలన్నీ వివరించాడు. వెంటనే మొగిలప్ప తల పగిలి మృతి చెందాడు.

ఇతని పేరుమీదనే ఈ దేవాలయంలోని దేవునికి మొగిలీశ్వరుడు అనే నామం ఏర్పడింది. కర్నాటక రాష్ట్రానికి చెందిన కొంతమంది వ్యాపారులు ఈ దారిగుండా వెళ్తూ శివలింగాన్ని దర్శించుకొని వ్యాపారంలో అధిక లాభాలు అర్జించేవారు. తమ భక్తికి నిదర్శనంగా మొగిలీశ్వరునికి మొగిలివద్ద ఆలయం నిర్మించారు. ఆ నాటినుండి నేటి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొగిలిలో అతి వైభవంగా జరుగుతున్నాయి.












--((***))--

శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం భద్రాచలం
శ్రీమహావిష్ణువు సీతా లక్ష్మణ సహితంగ శ్రీరామచంద్రుడిగా భద్రాచలంలో కొలువుదీరిఉన్నారు.
ఒక్క భద్రాచలం లోనే సీతమ్మవారు రాముడి ఎడమతొడపై కూర్చుని దర్శనం ఇస్తారు. భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు.
అల వైకుంఠపురంబులో నగరిలో
ఆ మూల సౌధంబు దావల
మందారవనాంతరామృత నర:
ప్రాంతేందుకాంతోపలోత్సల పర్యంక
రమావినోదియగు ఆపన్నప్రసన్నుండు
విహ్వల నగేంద్రము పాహి పాహి యన
కు య్యాలించి సంరంభియై
శ్రీ రామచంద్రుడు కుడిచేతులలో పాంచజన్యం, బాణం, ఎడమచేతులలో సుదర్శన చక్రం, ధనస్సు ధరించి, వామాంకమ్మున సీతా సహితంగా, చతుర్భాహువులతో, సౌమిత్రి సహితంగా, ఆదిశేషుడు గొడుగుగా, పద్మాసీనుడై నయన మనోహరంగా దర్శనమిస్తాడు.
శ్రీసీతారామచంద్ర స్వామి ఉత్సవ మూర్తులకి ఆలయ ప్రాగణంలో సహస్రనామం మరియు కళ్యాణం జరుపుతారు. ఆర్జిత సహస్రనామం మరియు కళ్యాణం లేనివాళ్ళు కూడా ఈసేవలను ప్రాంగణంలో కూర్చుని వీక్షించవచ్చు.
క్యూ లైనులో ధ్వజస్థంభం దగ్గర భక్తులకి నుదిటిపై తిరునామంతో అలంకరిస్తారు.
శ్రీమహాలక్ష్మి దేవి కూడా యీ ఆలయ ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నారు.
యీ ఆలయ ప్రాంగణంలో భద్రుని కొండను, ఆ కొండపై రామ పాదాలను దర్శించవచ్చు.
ధ్వజస్థంభం దగ్గర ఎడమవైపున శ్రీసీతారామచంద్ర స్వామి ఆభరణాల ప్రదర్శనశాలకు వెళ్ళటానికి టికెట్స్ యిస్తారు.
ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్ర
నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్ర
చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్ర
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర
భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర
శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్ర
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్ర
లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర
కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్ర
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర
నీ తండ్రి దశరథ మహరాజు పెట్టెనా రామచంద్ర
లేక నీ మామ జనక మహరాజు పంపెనా రామచంద్ర
అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్ర
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్ర
భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్ర
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్ర
భద్రాచలంలో బస్సులు ఆలయం ప్రవేశ మార్గం దగ్గర ఆగుతాయి. అక్కడ నుంచి ఆటోలో ఆలయం చేరుకోవచ్చు. ఒక్కొక్కరికి 10/- రూపాయలు తీసుకొంటారు.
వసతి కావాలనుకొంటే CRO కార్యాలయంలో సంప్రదించవచ్చు. CRO కార్యాలయంలో ఆలయం ప్రవేశ మార్గం నుంచి ఆలయానికి వెళ్ళే దారిలో వస్తుంది. ఉచిత వసతి సదుపాయం కూడా CRO కార్యాలయంలో లోపల ఉంది. లాకర్ సౌకర్యం కూడా యిక్కడే ఉంది.లాకర్ సౌకర్యం ఉపయోగించుకోవటానికి 5/- రూపాయలు చెల్లించాలి. 200/- రూపాయలు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. ఒకసారి లాకర్ తీసుకొంటే 12 గంటలు ఉపయోగించుకోవచ్చు.
గోదావరిలో స్నానం ఆచరించటానికి స్నాఘట్టాలు ఉన్నాయి.
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీస్టదాయ మహిత మంగళం
కోశలేశాయ మందహాసదాసపోషనాయ వాసవాదివినుత సర్వరాయమంగళం
చారుకుంకుమోపేత చందనాదిచర్చితాయ హారకాశోభితాయ భూరిమంగళం
లలితరత్నకున్దలాయ తులసీవనమాలికాయ జలజసద్రుసదేహాయ చారుమంగళం
దేవకీపుత్రాయ దేవదేవోత్తమాయ చావజాతగురువరాయ భవ్యమంగళం
పుండరీకాక్షాయ పూర్నచంద్రాననాయ అండజాతవాహనాయ అతులమంగళం
విమలరూపాయ వివిధవేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభ్రమంగళం
రామదాసాయ మృదుల హృదయకమలవాసాయ స్వామిభద్రగిరివరాయ సర్వమంగళం





--((***))--