Friday, 19 May 2017





12. కోణార్క్ సూర్యదేవాలయం.
మహోన్నతమయినది ఒరిస్సా రాష్ట్రలోని కోలార్లో ఉంది.
సూర్యుని రథం ఆకారంలోనిర్మించిన కోణార్క్ ఆలయం విశిష్టతలు
భారతదేశంలో ప్రసిద్ధిచెందిన ఆలయాలలో కోణార్క్ ఆలయంఒకటి. సూర్యునిరథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం...
13వ శతాబ్దంలో నల్లగ్రానైట్ రాళ్లతో కట్టడం జరిగింది. ఈ ఆలయాన్ని తూర్పు గంగా రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవ (క్రీ.శ. 1236 - క్రీ.శ. 1264) నిర్మించినట్లు చారిత్రాత్మక కథనాల్లో పేర్కొనబడింది.
దీని నిర్మాణం ఎంత అద్భుతంగా వుంటుందంటే.. 24 చక్రాలు కలిగిన ఒక భారీరథాన్ని ఏడు అశ్వాలు లాగుతున్నట్లుగా కనువిందు చేస్తుంటుంది. దీనిని ఆనాటికాలపు నగిషీలు ఎంతో అద్భుతంగా అలంకరించారు. మత సంబంధిత (బ్రాహ్మణులకు చెందిన) వాస్తుశాస్త్రానికి ఈ ఆలయం ఒక అద్భుత స్మారక
చిహ్నం. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రక్షింప బడుతోంది.
స్థలపురాణం :
పురాణ కాలంలో.. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు శాపగ్రస్తుడై కుష్టురోగం బారినపడ్డాడు. అప్పుడతడు కోణార్క్ దేవాలయానికి దగ్గరలో వున్న చంద్రభాగ తీర్ధం వద్ద కూర్చుని సూర్యుని స్మరిస్తూ తపస్సు చేశాడు. ఆ సమయంలో అతడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా.. అందులో సూర్యభగవానుడి విగ్రహం లభించింది. దాంతో సూర్యభగవానుడు తనని అనుగ్రహించాడని భావించి సాంబుడు కోణార్క్ ఆలయం ఉన్న ప్రదేశంలో ఆ విగ్రహాన్ని
ప్రతిష్టించాడు. అలా ఆవిధంగా ఇక్కడ ఆలయం ఏర్పడింది. అయితే ప్రస్తుతమున్న ఆలయంలో పురాణకాలంలో స్థాపించబడ్డ విగ్రహం మాత్రం కన్పించదు. అసలు ఆ విగ్రహం ఏమైందన్న విషయం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ప్రస్తుతం కోణార్క్ లో ఉన్న ఆలయాన్ని గంగవంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఆరోజుల్లో దాదాపు 12 వందల మంది శిల్పులు పన్నెండేళ్లపాటు కష్టపడి ఈ ఆలయాన్ని
నిర్మించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
ఆలయ విశేషాలు :
దేవాలయ ప్రధానద్వారం వద్ద ఉండే రెండు సింహపు విగ్రహాలు యుద్ధ ఏనుగును తొక్కివేస్తున్న ట్టుగా దర్శనమిస్తాయి.
పైనుంచి చూసినప్పుడు ప్రతి ఏనుగు మానవ శరీరం మాదిరిగా కనిపిస్తుంది. ప్రధాన ద్వారం వద్ద ఒక నృత్య మందిరం కూడా కనిపిస్తుంది. సూర్య భగవానుడికి వందనం సమర్పించేందుకు దేవాలయ నృత్యకారులు ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. దేవాలయం మొత్తం మీద వివిధ రకాల పుష్ప సంబంధిత, రేఖాగణిత నమూనాలు దర్శనమిస్తాయి. శృంగారాన్ని ఆస్వాదించే రూపంలో మనుష్యులు, దేవతలు, పాక్షిక దైవత్యం కలిగిన రూపాలు సైతం దేవాలయంలో కనిపిస్తాయి.
సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ దేవాలయానికిఇరువైపులా 12 జతల చక్రాలు చెక్కబడి ఉన్నాయి. అలాగే వారంలోని ఏడురోజులను సూచించే విధంగా ఏడుగురర్రాలూ ఉంటాయి. ఈచక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా స్థానికులు ఖచ్చితమైన సమయాన్ని చెప్పగలరు. సూర్య పరిభ్రమణాన్ని చూపించే విధంగా ఈ చక్రాలు చెక్కబడడం ఓ గొప్ప విశేషం.
కోణార్క్లో సూర్యుని దేవాలయంతో పాటు అఖండాలేశ్వర దేవాలయం, అమరేశ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీనారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి.
అద్భుతమైన శిల్పకళకు, ఆధునిక పరిజ్ఞానికి గుర్తుగా కోణార్క్ దేవాలయాన్ని పేర్కొనవచ్చు. నమో సూర్యదేవాయ నమః .
--((***))--

11. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము
సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున విశాఖ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సింహాద్రి అప్పన్న గా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయము సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది.
ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయము. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ద తదియ నాడు (మే నెలలో) వస్తుంది.
ఈ ఆలయం అనేక విశేషాలతో కూడి ఉన్నది. రాజగోపురము, కోరిన కోర్కెలు తీర్చే కప్పస్తంభము. మాధవధార వంటి అనేక ధారలు. సింహాచలం పైడితల్లమ్మ, మాధవస్వామి దేవాలయం, శివాలయం. ఇలా ఎన్నో ఆలయాలు. స్వామివారి పుష్కరిణి, స్థలపురాణం. చందనయాత్ర, 42కి.మి నడకసాగే గిరిప్రదక్షణం. ఇలా ఏన్నో విశేషాలతో కూడి ఉన్న క్షేత్రం.
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, సింహాచలము
సింహాచలము అనే గ్రామంలో విశాఖపట్టణము నకు 11 కి.మీ...
--((***))--
10. మంజునాథ సన్నిధి ధర్మస్థలం
శివుడు లీలామయుడు. సర్వాంతర్యామి. ఆయన లీలలు అనంతం. అనన్య సామాన్యం. శివుని లీలావిశేషాలతో పునీతమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ‘్ధర్మస్థల’ ఒకటి. దేశంలోని అతి పురాతన శైవధామంగా, శివుని సుందర క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ‘బెల్తంగడి’ తాలూకాలో వుంది. బెంగళూరు నగరానికి సుమారు 350 కిలోమీటర్లు దూరంలోఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తూ మహేశ్వరుడు శ్రీ మంజునాథ స్వామిగా పూజలందుకుంటున్నాడు.
విశాలమైన వన సంపద, మది పులకించిపోయే ప్రకృతి అందాలు ఈ క్షేత్రం సొంతం. ఇక్కడకు వెళ్ళే భక్తులకు ఓ సుందరవనంలో విహరించామన్న అనుభూతి కల్గుతుంది. శివుని లీలావిశేషాలతో పునీతమవుతున్న ధర్మస్థల దివ్యక్షేత్రం ‘నేత్రావతి’ నదీమతల్లి ఒడ్డున అలరారుతోంది. ప్రకృతి అందాలకు వేదికగా భాసిల్లుతున్న నేత్రావతి నదీమతల్లి భక్తులకు, పర్యాటకులకు కావలసినంత మానసికానందాన్ని, ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేస్తాయి. ఈ ఆలయానికి వచ్చే భక్తులంతా ముందుగా ‘నేత్రావతి’నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. నదీస్నానం వల్ల పాపాలన్నీ పోయి సమస్త సుఖ సంతోషాలు సొంతమవుతాయ.
మంజునాథస్వామి ఆలయ ప్రాంగణం చూపరులను దృష్టిమరల్చనీయదు. ఈ ఆలయం కేరళ సంప్రదాయ రీతిలో ఉంటుంది. ఆలయానికి సంబంధించిన గోపురాదులు ఏవీ భక్తులకు కనిపించవు. ప్రధానాలయం ఆలయానికి ముందుభాగంలో పెద్దదిగా ఉన్న గంట భక్తులను ఆకట్టుకొంటుంది. అలనాటి కాలం నాటిదిగా దీనిని చెబుతారు. ప్రధానాలయమంతా భక్తులతో కిటకిటలాడుతుంది. గర్భాలయ మండపం పైన మధ్యభాగంలో పరమేశ్వరుని మూర్తి ఉంది. శ్రీ మంజునాథస్వామి ఆలయం కొన్ని ఆలయాల సమూహం, స్వామివారి ఆలయానికి ఎడమవైపు భాగంలో విఘ్ననాయకుడి మందిరం ఉంది. దీనికి సమీపంలోనే ‘అణ్ణప్పస్వామి’ ఆలయముంది. శ్రీ మంజునాథస్వామికి అచంచల భక్తుడు ‘అణ్ణప్ప’. ఈ కారణంగా స్వామివారి గర్భాలయానికి సమీపంలోనే అణ్ణప్పస్వామివారి ఆలయం నిర్మించారు. శ్రీ మంజునాథ స్వామివారి గర్భాలయం నిత్యనూతనంగా, తేజోవిరాజమానమవుతుంది. సమస్త ఆభరణాయుక్తుడైన మంజునాథ స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్వామి ఆలయానికి సమీపంలో ‘అమ్మనవరు’ ఆలయముంది. ‘అమ్మనవరు’ దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్ర్తిలు సౌభాగ్యసిద్ధికోసం, సంతానం కోసం ‘అమ్మనవరు’ను దర్శించుకుని భక్తితో పూజిస్తారు.
పురాణగాథ: ధర్మస్థల క్షేత్రానికి సంబంధించి పురాణగాథ ఒకటి ప్రచారంలో వుంది. సుమారు ఐదువందల సంవత్సరాల క్రితం నెల్యాదివీడులో అమ్మాదేవి బళ్ళారి, బ్రహ్మన్న ప్రెగ్గడెలనే పుణ్యదంపతులుండేవారు. ఆ దంపతులిద్దరూ అత్యంత దయామయులు. ధర్మాన్ని కాపాడుతూ, ధర్మపరిరక్షణ కోసం నిత్యం తపనపడుతూ వుండేవారు. ఒకసారి ధర్మదేవతలు మానవ రూపం ధరించి ‘నెల్యాదివీడు’ను తమకిచ్చి, సమీపాన ఒక గృహాన్ని నిర్మించి అందులో నివసించమని, అలాచేస్తే వారి ఐశ్వర్యం పదింతలవుతుందని చెప్పి అదృశ్యమయ్యారుట, ధర్మదేవతల అభీష్టంమేరకు ఆ దంపతులు అలాగే చేశారట. అనంతరం ధర్మదేవతలు ఆ దంపతులకు స్వప్నంలో కనిపించి తాము ‘కాలరాహు’, ‘కాలర్కై’, ‘కుమారస్వామి’, ‘కన్యాకుమారి’అనే ధర్మదేవతలమని, తమకు గుడులను కట్టించి ధర్మాన్ని కాపాడమని కోరారట. అయితే ధర్మదేవతలతోపాటు ఇతర దైవాలను కూడా పూజించనిదే ఫలసిద్ధి కల్గదని భావించి, ఆ దంపతులు ధర్మదేవతల అభీష్టంమేరకు ‘కదిరి’నుంచి మంజునాథ స్వామి లింగాన్ని తెప్పించి, ప్రతిష్ఠించారట.
ఆనాటినుంచి ఆ దంపతులు మంజునాథస్వామిని, ఇతర దేవతలను భక్తిశ్రద్ధలతో పూజించారు. ‘మంజుల’అంటే అభిరామం లేదా అందమని అర్థం. నాథుడనగా అధిపతి దేవుడు. అంటే మంజునాథుడంటే మంజుదైవతమని అర్థం. మంజునాథస్వామి పేరు బోధిసత్వ మంజునాథుని నుంచి ఏర్పడి ఉండవచ్చని, అతడు జైన, హిందువుల నమూనాలో ఉన్న దేవుడంటారు. ధర్మస్థల శ్రీ మంజునాథస్వామి ఆలయం నిత్యం వేలాదిమంది భక్తులతో సందడిగా ఉంటుంది. నిత్యం స్వామి నామస్మరణంతో మారుమోగుతున్న ఈ దివ్యాలయంలోకి ప్రవేశించే పురుషులు శరీరంపై పైవస్త్రాలు ధరించాలి.
ఆలయానికి వచ్చే భక్తులందరికీ అన్నదానం చేస్తారు. దీన్ని శ్రీ మంజునాథస్వామి ప్రసాదంగా భావించి భక్తితో స్వీకరిస్తారు. అపురూపశిల్ప సమన్విత స్తంభాలు, ప్రాకారాలతో ఈ ఆలయం అలరారుతోంది. ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గోమఠేశ్వరస్వామి ఆలయం ఉంది. ప్రకృతి అందాలు, విరబూసిన వనాలు, కొండలు ఈ ఆలయానికి ఆభరణాలుగా భాసిల్లుతాయ. ఈ ఆలయ ప్రాంగణంలో గోమఠేశ్వరస్వామి (బాహుబలుని) విగ్రహం ఉంది.
ఈ విగ్రహం 39 అడుగుల ఎత్తులో ఏకశిలగా దర్శనమిస్తుంది. ధర్మస్థల శ్రీ మంజునాథస్వామి క్షేత్రంలో ఏటా లక్ష దీపోత్సవాన్ని అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఏటా కార్తీక బహుళ దశమి మొదలుకుని అమావాస్యవరకూ ఐదు రోజులపాటు లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తారు.
--((***))--
9. నైమిశారణ్యం
ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు సుమారు 150 కి.మీ దూరంలో సీతాపూర్ జిల్లాలో నైమిశారణ్య క్షేత్రం ఉంది.
మన దేశంలోని పరమ పుణ్యమైన పుణ్యతీర్థాలలో నైమిశారణ్య దివ్య క్షేత్రాన్ని మొదటిగా చెప్పుకోవచ్చు. పవిత్ర గోమతీ నదీతీరంలో అలరారుతున్న ఈ దివ్య ధామంలోని పాదధూళి సైతం అత్యంత పవిత్రమైనదని పురాణాల ద్వారా అవగతమవుతోంది. సూత, శౌనకాది మహా మహర్షులు నివశించిన ఈ దివ్య ధామం మహా ఋషుల యజ్ఞాల వల్ల యజ్ఞ భూమిగా ప్రశస్తి పొందింది. సమస్త పురాణాలకు పుట్టినిల్లుగా భాసిల్లిన ఈ దివ్య ధామం ఆ మునుల తపశక్తితో మరింత పవిత్రతను ఆపాదించుకుంది. అందుకే నైమిశారణ్య క్షేత్రాన్ని
తీర్థానాముత్తమం తీర్థం
క్షేత్రాణాం క్షేత్రముత్తమం అని పిలుస్తారు.
సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలు, సహజమైన వనసంపదతో ప్రశంతంగా ఆధ్యాత్మకాను భూతులను ప్రోది చేసే దివ్యధామంగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రాన్ని స్థానికులు నీమ్ సార్ గా, నీమ్ చార్ వ్యవహరిస్తుంటారు.
స్థల పురాణం :
ఒక సారి మునులంతా బ్రహ్మ వద్దకు వెళ్లి కలిప్రభావం సోకని పుణ్య ప్రదేశం ఎక్కడైనా వుంటే ఆ ప్రాంతంలో తాము తపోయజ్ఞ కార్యనిర్వహణ చేసుకుంటామని ప్రార్థించారు. బ్రహ్మ కలియుగంలో సత్పురుషులను దృష్టిలో వుంచుకుని ఒక చక్రాన్ని సృష్టించి ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అక్కడ మునులను నివసించమని చెప్పాడు. ఆ చక్రం అన్ని లోకాలు తిరిగి చివరకు నైమిశారణ్య ప్రాంతంలో ఆగింది. చక్రం నేమి (అంచు) తాకిన భూప్రదేశం నైమిశంగా పిలవబడింది. చక్రం స్పృశించిన ప్రాంతం అరణ్యం కావడం వల్ల నైమిశారణ్యం అనే పేరు వచ్చింది. చక్రం భూమిని చీల్చుకుని దిగడం వల్ల అక్కడో నీటిగుండం ఏర్పడింది. ఫలితంగా భూమి నుంచి పవిత్ర జలధారలు పెల్లుబికాయి. ఈ పవిత్ర తీర్థాన్ని చక్ర తీర్థంగా పిలుచుకోవడం జరుగుతుంది. చక్రాకారంలో వున్న ఈ తీర్థంలో రోజూ వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అమావాస్య సోమవారం రెండూ కలిసిన రోజున సోమవతీ అమావాస్య అని పిలవడం జరుగుతుంది. అలాంటి పర్వదినాన లక్షలాది మంది భక్తులు చక్రతీర్థంలో పుణ్యస్నానాలు చేసి తరిస్తారు. చక్రతీర్థం ఒడ్డున చేసే దానాలు, జపాలు అఖండమైన పుణ్యాన్ని ఆపాదించి పెడతాయని పురాణాలు చెబుతున్నాయి. నైమిశారణ్యం దివ్యక్షేత్రం. అనేక మంది దేవీదేవతల కొలువుతో పవిత్ర తీర్థరాజంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రాన అన్ని సంప్రదాయాలతో పాటూ హిందూ ధార్మిక విధానాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అనుక్షణం భగవంతుని నామస్మరణతో మారుమ్రోగే ఈ దివ్యధామం ఓ ఆధ్యాత్మిక లోకాన్ని స్ఫురణకు తెస్తుంది.
అలాగే దధీచి మహర్షి లోక కళ్యాణార్థం తన దేహాన్ని త్యాగం చేసిన స్థలంగా నైమిశారణ్యానికి మరో పురాణ వృత్తాంతం ప్రచారంలో వుంది. వృత్తాసురుడనే రాక్షసుడ్ని సంహరించేందుకు దేవతలకు ఓ దివ్యాస్త్రం కావల్సి వచ్చింది. దాంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువుని వేడుకోగా దధీచి మహముని ఎముకలు నారాయణ తేజస్సుతో ప్రకాశిస్తాయని, ఆయన వెన్నెముక దివ్యాస్త్రంగా రూపొందుతుందని శ్రీ మహావిష్ణువు దేవతలకు చెప్పారట. దేవతల అభీష్టం తెలుసుకున్న దధీచి మహాముని ప్రాణత్యాగం చేసి పూజ్యనీయుడయ్యాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ దధీచి మహర్షి లోకకల్యాణార్థం తన ప్రాణాన్ని త్యాగం చేసిన దివ్యస్థలం నైమిశారణ్యమేనని పురాణాల ద్వారా అవగతమవుతోంది.
దేవాలయాలు :
నైమిశారణ్యంలో చక్రతీర్థం సమీపంలో భూతేశ్వరనాథ్ ఆలయం వుంది. ఇక్కడ భూతేశ్వరనాథ్ స్వామికి ముఖం వుండటం విశేషంగా చెబుతారు. ఫణి ఫణాచత్రముతో, త్రిశూల చిహ్నాముతో అభిముఖంగా వున్న నందీశ్వరునితో భూతనాథుడు భక్త కల్పవృక్షమై విరాజుల్లుతున్నాడు. ఈ స్వామికి చేసే అభిషేకం ద్వాదశ జ్యోతిర్లింగాలకు చేసిన అభిషేక ఫలంతో సమానమని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. ఈ ఆలయంలో వున్న వినాయకుడ్ని గణేశ్ జీ అని పిలుస్తారు. విక్రమాదిత్యుడు ప్రతిష్టించినట్టుగా చెప్పబడుతున్న ఈ వినాయకుడికి ముందు ప్రణామాలు చేసిన అనంతరమే భక్తులు నైమిశారణ్య దర్శనం చేసుకుంటారు.
సూత, శౌనుకాది మహా మునులు తపస్సు చేసిన పవిత్ర భూమిగా విరాజిల్లుతున్న నైమిశారణ్య దివ్యక్షేత్రంలో ప్రతీ అడుగు మహిమాన్విత దేవీదేవతల ఆలయాలతో విరాజిల్లుతోంది. భూతేశ్వర్ నాథ్ మందిరానికి సమీపంలో వున్న మందిరాలలో బదరి నారాయణుడి (దేవ రాజన్ ) మందిరం చెప్పుకోదగినది. ఈ భూలోకంలో ఉన్న 108 వైష్ణవక్షేత్రాలలో బదరీనారాయణుడి ధామం కూడా ఒకటిగా ప్రసిద్ధి నొందినది. దీనితో పాటూ రాధాకృష్ణ, గోపాల్ , కాలభైరవుడు మొదలైన మందిరాలు ఈ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిస్తాయి.
నైమిశారణ్యంలో ఉన్న మరో పవిత్రమైన దివ్యధామం లలితామాత ఆలయం. దేశంలో ఉన్న శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యధామంలో లలితామాత దర్శనమిస్తుంది. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యాలయం అతి పురాతనమైంది.
అలాగే వ్యాసుడు తపమాచరించిన తపస్థలి వ్యాసగద్ది, సూతుడు తపమాచరించిన తపస్థలి సూతగద్దిలు కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణంలో అలరారుతూ ఆధ్యాత్మికానురక్తిని పెంచేవిగా వున్నాయి. అలాగే వాలి ,సుగ్రీవులు విశ్రాంతి తీసుకున్న హనుమత్ టిలామహేశ్వరాలయం తదితర ఆలయాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఈ క్షేత్రంలో పాండవులు సైతం సంచరించారని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే ఈ క్షేత్రంలో విజయవాడ వైఖానన సమాజం వారు నిర్మించిన బాలాజీ మందిరం కూడా ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయంలో తిరుపతిలో మాదిరి అర్చనా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం వల్ల ఉత్తరాదిలోసైతం శ్రీ వేంకటేశ్వర స్వామిని స్వయంగా దర్శించుకునే మహద్భాగ్యం భక్తులకు కలిగింది.
నైమిశారణ్యం సందర్శనం బహు జన్మల పుణ్యఫలం. హిందువుగా పుట్టిన ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో ఒకసారైనా దర్శించాల్సిన మహిమాన్విత పుణ్య స్థలం ఇది.
--((***))--
8. భద్రాద్రి నిలయం రామం నత్వపాపైః ప్రముచ్యుతే
భద్రాచల నిలయుడైన శ్రీరాముని సేవించినవారు,సకల పాపా విముక్తులై తరిస్తారు
శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యకి ఎంతటి ప్రదన్యథొ ఉందొ అంతటి ప్ర్రదన్యథ భద్రాచల క్షేత్రానికి ఉన్నది . క్రీ .శ 1658-87 సంవత్సరాల మద్య కాలం లో గోల్కొండ కోటను రాజదానిగా పాలించే తానాషా వద్ద మంత్రులగా ఉండిన అక్కన్న-మాదన్న ల మేనల్లుడైన కంచర్ల గోపన్న (భక్త రామదాసు ) భద్రాద్రికి తహసిలదుర్గ ఉంటూ అలయమను కట్టించారు అని చరిత్ర ఆదరంగా తెలుస్తుంది .
శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్యం కల క్షేత్రం భద్రాచల దివ్య క్షేత్రం. భద్రుడు (రాముడు)అచలుడు (కొండ). రాముడు కొండ పైన నేలువున్నాడు కనుక క్షేత్రం భద్రాచలం గ ప్రసిద్దిచెందింది .
ఇతర క్షేత్రాలలో కోటిమందికి అన్నదానం చేస్తే కలుగు పుణ్యఫలం కాశి క్షేత్రం లో వేయిమందికి చేస్తే కలుగు పుణ్య ఫలం శ్రీ భద్రాచల దివ్య క్షేత్రం లో ఒకరికి అన్నదానం చేసిన కలుగుతుంది అని బ్రహ్మ పురాణం చెబుతుంది .
ఎవరు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు కల్యానముర్తి ఆయన శ్రిరమచంద్రస్వామి వారిని సేవించుటకై భద్రాచల క్షేత్రానికి విచ్చేస్తారో వారు అక్షయమైన ఫలాన్ని పొందుతారు అని బ్రహ్మ పురాణం చెబుతుంది .
భద్రాచలం దగ్గరలో సీతారాములు అరణ్యవాసం చేసిన పర్ణశాలను "శ్రీరాముడు కూర్చున్న రాతిబండ" " అమ్మవారి నారా చీరాల గుర్తులు " చూస్తుంటే మనసు ఎంత పులకించి పోతుందో
--((***))--
7. త్రిపురాంతకం
ప్రకాశం జిల్లా మార్కాపురానికి 40 కి. మీ. కర్నూలు - గుంటూరు రహదారిలోని వినుకొండకు 35 కి. మీ. రక్తనగాఖ్య నగరానికి (యర్రగొండపాలెం) 19 కి. మీ. దూరంలో ఉంది. త్రిపురాంతకం బాలా త్రిపూరాసుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంటకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడినాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది. స్వామి వారి గర్భాలయం, పంచముఖ స్వయంభుజాల లింగం, మేరు చక్రం మధ్యగల జలలింగం పై, అభిషేకం చేయబడ్డ జలం భూచక్రపిఠము గుండా క్రిందకు జారి పాతళచక్రము మధ్య రాసాలింగం పై పడటం ఒక అద్భుత దృశ్యం ఇది చూసి తీరాలి.
గర్భాలయానికి ఆగ్నేయదిశలో నాగారేశ్వరస్వామి, దక్షిణ భాగంలో అపరాధేశ్వరస్వామి ఉన్నారు. నైరుతి దిశలో ఆగస్త్యమహార్షి చే నిర్మించబడిన ఒక బిల మార్గం ఉంది. ఈ బిలము గుండా మునులు, తాపసులు, కాశీ,రామేశ్వరం, శ్రీశైలంకు ప్రయాణించే వారని ప్రతీతి. కానీ ఆది ప్రస్తుతం రాళ్లతో, విరిగిపోయిన దులములతొ మూసుకుపోయి ఉంది. ఆలయానికి చుట్టూ కోటికి పైగా శివలింగాలు, శతాధిక జలాశయాలు ఉన్నాయని పూర్వీకులు చెబుతారు.
శ్రీ శైల క్షేత్రానికి తూర్పు ద్వారమైన 'త్రిపురాంతకం'లో శివుడు ... త్రిపురాంతకుడిగా, పార్వతీ దేవి ... త్రిపుర సుందరీ దేవిగా భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడి 'కుమారగిరి'పై వెలసిన స్వామివారి ఆలయం నుంచి నైరుతి దిశగా చూస్తే ... కింది భాగంలో చెరువు ... దాని మధ్యలో కదంబ వృక్షాల మధ్య వెలసిన అమ్మవారి ఆలయం కనిపిస్తుంది.
గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తి కొన్ని వేల సంవత్సరాలనాటిదని చెబుతారు. ఇది తపో సంపన్నులకు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. గణపతి దేవుడి చెల్లెలు 'మైలాంబ' వేయించిన శాసనమును బట్టి ఈ ఆలయ నిర్మాణం 1209 లో జరిగిందనీ ... ప్రస్తుతం పూజలు అందుకుంటోన్న అమ్మవారి విగ్రహాన్ని ఆమే ప్రతిష్ఠింపజేసిందని స్పష్టమవుతోంది. ఈ అమ్మవారు రౌద్రమూర్తి గా కనిపించడమే కాకుండా, గతంలో ఇక్కడ జంతుబలులు విపరీతంగా జరిగేవనడానికి నిదర్శనాలు కనిపిస్తున్నాయి. విశేషమైనటువంటి పుణ్య దినాల్లో అమ్మవారు పులి ... సింహ ... గజ ... అశ్వ ... శేష ... నెమలి వాహనాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తుంటుంది.
ఈ క్షేత్రంలో వందకు పైగా శిలా శాసనాలు కనిపిస్తాయి. అయ్యవారికి ... అమ్మవారికి సంబంధించిన వివిధ సేవలకుగాను దాతలు సమర్పించిన వాటి వివరాలు ఈ దాన శాసనాల్లో కనిపిస్తుంటాయి. ఇక ఇక్కడి స్వామివారు మహా సత్యవంతుడనే విషయం మనకి 'బసవపురాణం'లో కనిపిస్తుంది. పూర్వం ఈ ఆలయం దగ్గర ఒక వ్యక్తి ఒక మూగ జీవిని రక్షించడం కోసం మరో వ్యక్తిని హత్య చేశాడు. అయితే అతని మాటలను ఆ గ్రామస్థులు నమ్మలేదు. అతను చెబుతున్నది నిజమేనంటూ స్వామివారి గర్భాలయం నుంచి వినిపించిందట. అందువల ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భావించి భక్తులు విశేష సంఖ్యలో పూజలు జరుపుతుంటారు.
--((***))--
'6' కామాక్షీ తాయి అంటేనే కంటి చూపులతో కోరికలు తీర్చే తల్లి అని అర్ధము, ఆ తల్లికి సంబంధించిన అద్భుతమైన లీలలు కొన్ని ...
నెల్లూరులోని జొన్నవాడలో కొలువై ఉన్న కామాక్షీ అమ్మవారు, పిలిస్తే పలికే దైవం, ఈ అమ్మవారిని దేవతలా పూజించడం కన్నా కన్నతల్లిలా భావించేవారే ఎక్కువ. మా ఊరు కూడా నెల్లూరు కావడం వలన అనేక సార్లు అమ్మవారి దర్శనం చేసుకునే సౌభాగ్యం కలిగింది నాకు. సాధారణంగా అమ్మవారి పేర్ల చివర దేవి అని ఉండడం మనందరికీ తెలిసిందే, పార్వతీ దేవి, సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి ఇలా కానీ ఇక్కడి అమ్మవారి చివర 🙏" కామాక్షీ తాయి "🙏 అని ఉంటుంది, ఆ పిలుపులోని మాధుర్యము అమ్మ యొక్క వాత్సల్యాన్నీ, ప్రేమను, కరుణను ప్రతిబింబిస్తుంది అంతే కాదు ఇక్కడి అమ్మకు శిక్షణ, దండనే కాకుండా " అలక " కూడా ప్రత్యేకమే ... కామాక్షీ తాయి లీలలు ఇన్నని చెప్పలేము, మల్లికార్జున స్వామి వారితో కొలువై ఉన్న అమ్మవారికి కొద్ది దూరంలోనే ఆవిడ అన్నగారైన నరసింహ స్వామి వారు కూడా ఒక చిన్న కొండపై కొలువై ఉన్నారు. ఈ ముగ్గురు దేవతా మూర్తులు కలిసి ప్రదర్శించిన అద్భుత లీలలు ఎన్నో చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాను వాటిలో కొన్ని తెలుసుకుందామా ...
సుమారు 1960లో జరిగిన సంఘటన ... హైదరాబాద్ కు చెందిన ఒక కుటుంబం అది, వారి ఇలవేలుపు శ్రీ నృసింహ స్వామి వారు. భర్త మిలిటరీ లో పని చేస్తున్నాడు. కాశ్మీరు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు తను, అది చలి కాలం మంచు ఎక్కువగా కురుస్తుంటుంది, అనుకోకుండా మంచు తుఫాను సంభవించింది. ఒకరితో ఒకరికి మాట్లాడే అవకాశాలు లేవు, జవాన్ల ఆచూకీ ఎవరికీ తెలియలేదు. ఇతను పని చేస్తున్న చోట అధికంగా మంచు పడుతుండడంతో తుఫాను తగ్గేంత వరకూ ఎవరూ ఆ స్థలానికి చేరుకోలేకపోయారు. దాదాపు నాలుగు రోజులు అతని గురించిన వివరాలు తెలియలేదు. మిలిటరీ వారు తన కోసం క్షుణ్ణంగా గాలించిన తరువాత అతని ఆచూకీ తెలియలేదని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ విషయం తెలిసి వారు పడిన బాధ వర్ణనాతీతం. నమ్ముకున్న దైవాన్నే కాపాడమని ప్రార్ధించారు. భర్త ఆచూకీ తెలియడం లేదు అనే విషయం తెలిసిన క్షణం నుండీ అతని భార్య పచ్చి గంగైనా ముట్టక రోధిస్తూ భగవంతుడిని వేడుకుంటూనే ఉన్నది. మరుసటి రోజు రాత్రి ఆవిడకు శోష వచ్చి పడిపోయింది. అప్పుడు స్వప్నంలో శ్రీ నృసింహ స్వామి వారు సాక్షాత్కరించి ఇలా అన్నారు, " నీ భర్త మీ దగ్గరకు రావాలంటే నువ్వు నెల్లూరులోని జొన్నవాడ క్షేత్రంలో కొలువై ఉన్న 🙏కామాక్షీ తాయిని🙏 ఆరాధించు, అక్కడే ఉంటూ 21 రోజులు దీక్షగా ఆరాధిస్తే నీ భర్త నీకు దక్కుతాడు." స్వప్నంలోనే జొన్నవాడ క్షేత్రాన్ని దర్శింపచేసి , క్షేత్ర మహత్యం కూడా వివరించారు శ్రీ నృసింహ స్వామి వారు.
పూర్వం కశ్యప మహర్షి " జన్న " యజ్ఞం నిర్వహించాడు. జన్న హోమం చేసిన చోటు కనుక జన్నవాడగా ప్రసిద్ధి గాంచింది ఈ క్షేత్రం, కాల క్రమంలో అది జొన్నవాడ అయ్యింది. ఆ హోమానికి సంప్రీతుడైన మహా దేవుడు సాక్షాత్కరించి ఏదైనా వరం కోరుకోమనగా, పరమ శివుడ్ని అక్కడే కొలువై ఉండమని కోరాడు కశ్యప మహర్షి. అందుకు అంగీకరించిన శివుడు అక్కడే ఉండిపోయాడు, ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన పార్వతీ దేవి శివుడ్ని కలిసి కైలాసానికి రమ్మని కోరగా కశ్యపునికి ఇచ్చిన వరం కారణంగా ఇక్కడే ఉంటాను అన్నాడు శివుడు, అప్పుడు కశ్యప మహర్షి పార్వతీ దేవిని ప్రార్ధించి తల్లీ నువ్వు కూడా ఇక్కడే కొలువై ఉండమని కోరగా, పార్వతీ దేవి కూడా ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయింది. పరమ శివుని కోసం అనేక లోకాలు వెతుకుతూ వచ్చిన పార్వతీ దేవి కళ్ళు జోన్నవాడలో స్వామి వారిని చూడగానే అమితానందం పొంది ఆనందబాష్పాలు రాలాయి. అవి ప్రక్కనే ప్రవహించే పెన్నా నదిలో పడటం వలన అది నిత్య పుష్కరిణిగానూ పేరు గాంచింది. అటువంటి ఆనందకరమైన కళ్ళతో భక్తుల కోరికలు తీరుస్తుంది కనుక తను " కామాక్షీ తల్లి " అని స్తోత్రం చేసారు ఆది శంకరాచార్యులు. ఇంత విపులంగా శ్రీ నృసింహ స్వామి వారు ఈ భక్తురాలికి వివరించి జొన్నవాడకు వెళ్ళమని ఆదేశించారు.
స్వామి వారి ఆదేశం అత్తమామలకు చెప్పి, జొన్నవాడకు వచ్చి 21 రోజులు నియమ నిష్టలతో అమ్మవారిని సేవించింది ఆ భక్తురాలు. దీక్ష పూర్తయిన రోజున ఆమె భర్త జొన్నవాడకు చేరుకుని తనకు జరిగిన విపత్తును వివరించాడు. మంచు తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసి తన గుడారానికి వెళుతుండగా కాలుజారి లోయలో పడిపోయాడట. అక్కడి ఆటవికులు అతన్ని తమ గ్రామానికి తీసుకునిపోయి వైద్యం చేయడానికి ప్రయత్నించారు కాని, ఏదీ పని చేయలేదట, కానీ నాలుగు రోజుల క్రితం తనకు వైద్యం చేస్తున్న ఇంటికి ఒకావిడ వచ్చి, ఏదో తీర్ధము, కుంకుమ ఇచ్చి, తీర్ధం త్రాగిస్తూ ఉండమని, కుంకుమ పెట్టమని చెప్పి, నేను స్పృహ లోకి రాగానే ఒక చిన్న కాగితం ఇవ్వమని చెప్పిందట. ఆవిడ చెప్పిన విధంగానే నాకు స్పృహ వచ్చాక వారు జరిగినదంతా చెప్పి ఆ కాగితం ఇచ్చారు, అందులో " నీ కోసం నీ భార్య నెల్లూరు లో జొన్నవాడలో వేచి చూస్తోంది, అక్కడికి వెళ్ళి కలువు అని వ్రాసి ఉంది. " నేను మిలిటరీ వాళ్ళకు తెలియజేసి ఇక్కడకు వచ్చాను అన్నాడట. అలా అమ్మవారు ఆ దంపతులను కలిపింది. మరొక లీలను చూద్దామా ...
నెల్లూరు లోనే ఒక శ్రీమంతుల కుటుంబం ఉండేది. వారికి పెళ్లై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. జొన్నవాడ కామాక్షీ తాయిని వేడుకున్నాక, అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చి " మీరు జోన్నవాడలో ఒక అన్నదాన సత్రం కట్టిస్తామంటే, మీకు పిల్లలను అనుగ్రహిస్తాను" అని చెప్పింది. అప్పట్లో జోన్నవాడలో ఒక ఆలయంలోనూ అన్నదానం ఉండేది కాదు, ఊరిలో ఒక్క హోటలు కూడా ఉండేది కాదు. చాలా చిన్న గ్రామం కనుక ఇల్లు కూడా ఒకటి రెండు మాత్రమే ఉండేవి. అమ్మవారు కలలో చెప్పిన వాటికి వారు అంగీకరించి భక్తులకు నిత్యాన్నదానం చేయడం ప్రారంభించగానే అతని భార్య గర్భవతి అయ్యింది. అమ్మవారి అనుగ్రహం వలన వారికి ఒక అమ్మాయి పుట్టింది. ఆ కుమార్తె కామాక్షీ తాయి అనుగ్రహం వల్ల జన్మించింది కనుక " కామాక్షీ " అని అమ్మవారి పేరే పెట్టుకున్నారు. కామాక్షికి అమ్మవారంటే చిన్నప్పటి నుండి ఎంతో భక్తి. ఒక దేవతలా కాకుండా తల్లిలానే భావిస్తుండేది కామాక్షి. వాళ్ళ నాన్నగారు కూడా ఏది కొన్నా తన కూతురు కామాక్షికీ , అమ్మవారికీ ఒకే విధమైనవి కొనేవారు. అమ్మవారికి సమర్పించాకే కామాక్షి వాటిని ధరించేది. ఎన్నో అనుభవాలు నిత్యం కలుగుతుండేవి కామాక్షికి. వాటిలో కొన్ని, ఒకసారి కామాక్షి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోగానే అమ్మవారికి కట్టిన చీర బాగా నచ్చింది, " నీ చీర చాలా బాగుంది నాకు ఇవ్వు " అని అడిగింది కామాక్షి. ఆ మరుసటి రోజు ఉదయం ఆలయ అర్చకుడు వీళ్ళ ఇంటికి వచ్చి, " నిన్న రాత్రి అమ్మవారు కలలో కనిపించి మీ అమ్మాయికి ఈ చీర ఇవ్వమన్నారు, తనకు ఇది బాగా నచ్చిందట " అని చెప్పి ఇచ్చి వెళ్ళారు. మరొకసారి అమ్మవారి దర్శనానికి కామాక్షి వెళ్ళింది. ఆ రోజు రాత్రి అమ్మవారు కలలో కనిపించి " నువ్వు పెట్టుకున్న కమ్మలు బాగున్నాయి నాకూ అలాంటివి చేసి పెట్టు " అని అడిగింది
కామాక్షికి పెళ్లి కుదిరింది, పెళ్లి కోసం నగలు, చీరలు కొన్నారు. అమ్మవారి కోసం కూడా ఒక చీర, ఒక బంగారు నగ కొన్నారు. కానీ కామాక్షికి మాత్రం అమ్మవారి కోసం కొన్న చీర బాగా నచ్చింది, కనుక తన చీర అమ్మవారికిచ్చి, అమ్మవారి చీర తను తీసుకుందాం అనుకున్నది. పెళ్లి పత్రిక అమ్మవారికి ఇవ్వడానికి వెళ్ళే రోజు పొద్దున్న బీరువా తెరవాలనుకుంటే ఎంతకీ తెరుచుకోలేదు. తాళం సక్రమంగానే ఉన్నది కానీ ఎందుకు తెరుచుకోవడం లేదో వాళ్ళ అమ్మాన్నాన్నలకు అర్ధం కాలేదు. కానీ కామాక్షి మాత్రం ఇలా చీరలు మార్చాలనుకున్నది అని వారికి తెలియదు. అప్పుడు వారి ఇంటికి ఒక సోది చెప్పే ఆవిడ వచ్చి, వాళ్ళ నాన్నగారిని పేరు పెట్టి పిలిచింది. ఆశ్చర్యంతో ఆవిడను లోపలకు రమ్మని చెప్పారు, అప్పుడు ఆవిడకు దేవత ఆవహించి " నీ కూతురు తన చీరను నాకు ఇచ్చి, నా చీర తను తీసుకుందాం అనుకుంటోంది, నా చీర నాకే ఇవ్వాలి " అని అడిగింది. కామాక్షిని అడిగితే నిజమే అని చెప్పింది, అప్పుడు సోది చెప్పే ఆవిడ బీరువా దగ్గరకు వెళ్ళి తీయగానే తలుపు తెరుచుకుంది, వెంటనే అమ్మవారి చీరను, బంగారు నగను తీసుకుని అందరినీ పక్కకు పంపి ఆ చీర కట్టుకుని నగ పెట్టుకుంది. వీళ్ళకు ఏమి చేయాలో అర్ధం కాలేదు, ఆవిడకు అమ్మవారు ఆవహించారు కనుక ఏమీ అనలేక చూస్తుండిపోయారు. ఆవిడ వాటితోనే వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారు అలాంటి చీర, బంగారు నగ మరల కొని అమ్మవారి ఆలయానికి వెళ్ళి చుసేసరికి, సోది చెప్పే ఆవిడ తీసుకెళ్ళిన చీర, నగ అలంకరింపబడి ఉన్నాయి. అర్చక స్వామిని కనుక్కుంటే, అమ్మవారు కలలో కనిపించి, రేపు పొద్దున్న గర్భ గుడిలో ఉండే చీరను, నగను పెట్టమని చెప్పారట. నిజంగానే అవి కనిపించడంతో వాటితోనే అలంకరించారు. మరొక లీలను చూద్దామా ...
కావలిలో నివాసముండే ఒక కుటుంబంలోని కోడలికి పిల్లలు పుట్టగానే చనిపోతున్నారు. ఇలా మూడుసార్లు జరిగింది. ఎన్నో పూజలు, వ్రతాలు చేసారు. దోష నివారణలు, ప్రయశ్చిత్తాలు చేసారు. అయినా నాలుగవ ప్రసవంలోనూ అలానే జరిగింది. అప్పుడు జోన్నవాడలో దీక్ష చేయమని ఎవరో చెబితే ఆ కుటుంబం వారంతా ఆలయంలో నిద్రలు చేస్తూ, అమ్మవారిని సేవిస్తున్నారు. ఒక వారం రోజులు గడిచాక ఆ కోడలికి కలలో అమ్మవారు కనిపించి, " నీకు పూర్వ జన్మ దోషం వలన పిల్లలు బ్రతకడం లేదు, ఒక భూతము నీ పిల్లలను బలి తీసుకుంటోంది, అది శాంతించాలంటే ఒక పని చెయ్యి, ఆ భూతం ఒకరిని ఆవహించి ఉంది, అది రేపు మధ్యాహ్నం ఆలయానికి వస్తుంది, అప్పుడు దానికి తృప్తిగా భోజనం పెట్టు, నేను దాన్ని వదలగోడతాను, నీకు దోషం పోతుంది, దానికి విముక్తి కలుగుతుంది " అని చెప్పింది. మరుసటి రోజు నిజంగానే ఆ భూతం ఆవహించిన ఆవిడను తీసుకుని ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో అటువంటి భూత ప్రేతాలను అమ్మవారు వదలగొడుతుంది అని ప్రతీతి. అమ్మవారు చెప్పిన విధంగా ఆ భూతానికి భోజనం పెట్టిన తరువాత, " నాకు బాగా ఆకలిగా ఉండేది, అందుకే నీ పిల్లలను తిన్నాను, ఇప్పుడు నా ఆకలి తీరింది, నేను వెళ్ళిపోతున్నాను, కామాక్షీ తాయి నువ్వు చెప్పినట్లు వింటాను, ఇక ఈవిడ జోలికి రాను " అని అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆ కోడలికి కలిగిన సంతానం వృద్ధి చెందింది.
వేంకటగిరికి చెందిన ఒక స్త్రీకి గర్భాశయంలో కాన్సర్ ఉందనీ, అది తొలగించాలనీ, కానీ తను ఇకపై పిల్లలని కనలేందనీ డాక్టర్లు చెప్పారు. నలుగురైదుగురు డాక్టర్లను సంప్రదించినా అందరూ అదే పరిష్కారం అని తేల్చి చెప్పి, ఆపరేషన్ కూడా వెంటనే చేయాలనీ లేకపోతే ప్రాణాపాయం అని చెప్పారు. ఆ స్త్రీకి ఇంకా పెళ్లి కాలేదు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుందో ఊహించండి. ఇక చేసేది లేక ఆపరేషన్ కు సిద్ధపడ్డారు. వాళ్ళు జొన్నవాడ కామాక్షీ అమ్మవారిని ఎన్నో ఏళ్ళగా సేవిస్తూనే ఉన్నారు. రేపు ఆపరేషన్ అనగా ముందురోజు సాయంత్రం వారి ఇంటికి ఒక ముత్తైదువ వచ్చి ఆ అమ్మాయితో " నువ్వేమీ భయపడకు, వెంటనే జొన్నవాడకు వెళ్ళి అక్కడే నిద్రచేస్తూ, కామాక్షీ తాయిని సేవించు, నీ ఆరోగ్యం బాగుంటుంది " అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి తన తల్లికి చెప్పింది. బంధువులందరూ, "ఇది ఒట్టి చాదస్తం చావుబ్రతుకుల్లో ఉన్న దాన్ని తీసుకుని గుళ్ళు గోపురాలు తిరుగుతూ సమయం వృధా చేయకు, వెంటనే ఆపరేషన్ చేయించి, ఆరోగ్యం కుదుట పడ్డాక తీరికగా వెళ్ళి సేవ చేసుకోవచ్చు" అని వారించారు. కానీ ఆ తల్లీ కూతుళ్ళు వాళ్ళ మాటను పట్టించుకోకుండా జొన్నవాడకు వెళ్ళి అతి కష్టం మీద సేవ చేస్తూ ఉన్నారు. ఒకరోజు రాత్రి ఆ అమ్మాయికి కలలో కామాక్షీ తాయి కనిపించి నీ సేవ పూర్తయ్యింది అని చెప్పి, ఒక డాక్టర్ లా ఆపరేషన్ చేసి, నీకు ఆరోగ్యం బాగుపడింది, నీ గర్భసంచి అలానే ఉంది, నీకు పిల్లలు కూడా పుడతారు, కుట్లు పచ్చిగా ఉన్నాయి కనుక పత్యం పాటించు, నీ సంచిలో మాత్రలు పెడుతున్నాను అవి అయిపోయేంత వరకూ వేసుకో, ఎలా వేసుకోవాలో చీటిలో చూసుకో అని చెప్పి, అంతర్ధానం అయ్యింది . ఉదయం లేచి చూడగానే ఆపరేషన్ చేసినట్లు కట్టు కూడా కట్టి ఉంది, జాగ్రత్తగా ఇల్లు చేరి ఆ మందులు వాడాక మరల కామాక్షీ తాయి స్వప్న దర్శనం ఇచ్చి, " ఇప్పుడు కట్లు విప్పుతున్నాను, ఇక పత్యం అవసరంలేదు" అని చెప్పింది. వాళ్ళ బంధువులు పరీక్షించడానికి ఈ అమ్మాయిని తీసుకుని ఇది వరకు వెళ్ళిన హాస్పిటల్స్ కు మళ్ళీ వెళ్ళగా, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు.
ఇటువంటి లీలలు ఎన్నో జన్నవాడ కామాక్షీ తాయివి ఉన్నాయి, వ్రాస్తున్న కొద్దీ ఇంకా ఎన్నో గుర్తొస్తూనే ఉన్నాయి కానీ ఎన్నని వ్రాయగలను, ఆ కామాక్షీ తాయి ప్రసాదించిన శక్తి మేరకు వ్రాసాను. ఒక్కొక దేవతా స్వరూపాన్ని స్మరించినంతనే ఎన్నెనో అత్యద్భుతమైన లీలలు గుర్తొస్తుంటాయి. ఇవి కొందరిలో అయినా భక్తి బీజాలు నాటుతాయేమో అనే ఒకే ఒక్క ఆశతో పోస్ట్ చేస్తున్నాను. మీకు తెలిసిన లీలలు కూడా పోస్ట్ చేస్తూ ఉండండి. ఇటువంటి లీలలు దయచేసి షేర్ చేస్తూ అందరికీ తెలిసేలా చేయండి
వీలైతే నెల్లూరు వెళ్ళి కామాక్షీ తాయిని, మల్లికార్జున స్వామి వారిని దర్శించండి. చూపుతోనే కోరికలు తీర్చే కల్పవల్లి మన అమ్మ శ్రీ కామాక్షీ తాయి ...
మనందరికీ అమ్మవారి అనుగ్రహం, అయ్యవారి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ...
#ఓం_శ్రీ_మల్లికార్జున_సమేత_శ్రీ_కామాక్షితాయినే_నమః
చిత్రంలోని అంశాలు: లోపలి ప్రదేశం
--((***))--
సంతాన మూర్తిగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం మోపిదేవి , కృష్ణ జిల్లా (5)
పుట్టలో సర్పరూపంలో వెలసిన శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయ రహస్యం కోసం మీకు తెలుసా ? శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఒకేచోట కొలువుదీరి భక్త జనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవక్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరఆలయం.పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలసిన కార్తికేయుడు నిజంగా భక్తులపాలిట కొంగుబంగారమే.దీపావళి అనంతరం వచ్చే నాగులచవితిన ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి లక్షలసంఖ్యలో భక్తజనులు తరలివచ్చి ఇక్కడి పుట్టకి విశేషపూజలు నిర్వహిస్తారు. మరియు అక్కడ స్వామి స్వయంభూగా ఎలా వెలసాడు? ఈ ఆలయం ఎక్కడుంది?ఈ ఆలయవిసేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణభారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల సరసన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతోంది కృష్ణాజిల్లా మోపిదేవి కుమారక్షేత్రం. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం. స్కాందపురాణంలోని సహ్యాద్రిఖండంలో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించు సందర్భంలో ప్రస్తావించబడిన ప్రముఖ క్షేత్రమైన మోపిదేవి క్షేత్ర విశేషాలు.
అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్ట వలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలో కి చొచ్చుకొని పోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించసాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపో యాయి. ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమ హర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమ హర్షికి, విషయాన్ని వివరించారు.
యోగదృష్టితో సర్వము తెలిసిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంత మైనా తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరించాడు. లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వ తం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరిం చింది. తాను మరలి వచ్చేవరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరాడు అగస్త్యుడు.
పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరం లోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళాంద్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు."వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్‌ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్‌" అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది. ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు.
ఒకపుట్ట నుండి దివ్యతేజస్సుని గమనించి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని, ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తికే సుబ్రమణ్యమనెడి పేరని మాండమ్యడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు.కుమారస్వామి ఉరగ (పాము) రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరిం చారు అగస్య్త మహర్షి. సనక, సనకస, సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారు గానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ భగవదారాధనలోనే కాలం గడుపుతుంటారు.
వారు ఒక పర్యా యం పరమేశ్వర దర్శ నానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో లేడు. లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయంలో శచీ, స్వాహా మొదలైన దేవతాస్ర్తీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీదేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. ‘‘కుమారా! ఏల నవ్వుచున్నావు? వారు నేనులా కన్పించలేదా? ఆ తాపసులు మీ తండ్రివలే లేరా? భేదమేమైననూ కన్పించినదా?’’ అని జగదంబ కుమారుని ప్రశ్నించినది. ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడినాడు. తల్లి పాదాలపైబడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాపపరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపంతో తపస్సు ప్రారంభించాడు.
ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగ వలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. ‘అత్రస్నానంతు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్‌’ అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్రతో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి. కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకడు. ఇతను మహాభక్తుడు. అతనికి స్వామి కలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి, ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు.
తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టితో స్వామికి ఇష్టమైన వాటిని తయారుచేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు.అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమై పోగా మిగిలిన నంది, గుర్రము ఈ నాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవిగ స్ధిరపడిందని చెపుతారు.
క్షేత్రము మరియు విశిష్టత విశిష్టత :
స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన, అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగుతుంది. ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామి వారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవగా భక్తులు భావిస్తారు.
సంతానం లేనివారికి సంతానం కలిగించడం, చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మసంబంధ వ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు. స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర్రమొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడి ప్రత్యేకతలు.
విశేష పూజలు మరియు విధానం :
నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి వంటి పర్వదినాల తోపాటు ఆదివారం, గురువారం స్వామిని భక్తులు విశేషంగా సందర్శించి, మొక్కులు తీర్చుకుంటారు. స్వామి వారికి పర్వదినాల్లో మహన్యాసపూర్వక రుదభ్రిషేకంతో పాటు ప్రత్యేకఅర్చనలు జరుగుతాయి.
రవాణా సౌకర్యం :
కృష్ణాజిల్లాలో విజయవాడకు 70 కిలోమీటర్ల దూరం లోనూ, మచిలీపట్టణానికి 35 కి.మీ.ల దూరం లోనూ, గుంటూరు జిల్లా రేపల్లెకు 8 కి.మీ.ల దూరం లోనూ మోపిదేవి క్షేత్రం ఉంది. అతి సమీపంలోని రైల్వేష్టేషన్‌ రేపల్లె.
--((***))--
🕉కదిరి నృసింహ స్వామి🕉 (4)
నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన కదిరి లక్ష్మీనరసింహుని ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉన్న దివ్యక్షేత్రం. కదిరినే ఖాద్రి అనికూడా అంటారు. కులమత భేదాలు లేకుండా అన్ని మతాలవారూ, అన్ని కులాలవారూ స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం ఇక్కడి విశేషం. ఖదిర అంటే చండ్ర చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి కదిరి అన్న పేరు వచ్చింది. ఈ కదిరి నృసింహ క్షేత్రం అనంతపురం జిల్లాలో ఉంది. కదిరి నృసింహ క్షేత్రం హైదరాబాదుకు దాదాపుగా 500 కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. ఇక్కడికి చిత్తూరు, గుంతకల్లు మరియు అనంతపురం మీదుగా బస్సు, మరియు రైలు సౌకర్యాలుకూడా ఉన్నాయి. దగ్గరలో పుట్టపర్తి విమానాశ్రయం కూడా కలదు.
కదిరి ఆలయం 13 వ శతాబ్దం లో నిర్మింపబడినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయం ఎంతో విశాలంగా, ఎత్తైన ప్రహారీ గోడ తో అద్భుతమైన శిల్పకళ తో విరాజిల్లుతుంది. ఆలయానికి నలువైపుల గోపురాలు ఉంటాయి. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ మంటపం, రంగమంటపం ఉన్నాయి. ఇక్కడున్న ప్రధానమైన కోనేరును భృగు తీర్థం అంటారు. భృగు తీర్థం మాత్రమే కాకుండా ఇక్కడ ద్రౌపది తీర్థము, కుంతి తీర్ఠము, పాండవ తీర్థము, వ్యాస తీర్థము మొదలైన తీర్థాలు ఉండేవి. ఇక్కడి స్వామివారు అమ్మతల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనిమిస్తారు.

నవనారసింహ క్షేత్రాలలో ఎక్కడా లేని విధంగా కదిరి క్షేత్రం లో నృసింహస్వామితోపాటుగా ప్రహ్లాదుడు కూడా దర్శనమిస్తాడు. కదిరికి దగ్గరలోని గూటిబయలు గ్రామం లో 600 సంవత్సరాలనాటి తిమ్మమ్మ మర్రిమాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. మహాయోగి అయిన వేమన గారి సమాధిగల కటారిపల్లే కదిరికి సమీపం లోనే ఉంటుంది.
కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి. ఎక్కడెక్కడినుంచో ప్రజలు బ్రహ్మోత్సవాలను దర్శించడానికి తరలివస్తారు.
--((***))--
కంచి కైలాసనాథర్ ఆలయ శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది..!! (3)
కంచి లేదా కాంచీపురం అనగానే మనకు టక్కుమని గుర్తుకువచ్చేది కంచి పట్టు చీరలు, బంగారు, వెండి బల్లి మాత్రమే కాదు, సుమారు వెయ్యికిపైగా దేవాలయాలు కలిగి ఉన్నాయి. తమిళనాడులోని కాంచీపురంలో ఎంటర్ అవ్వగానే మనం కొన్ని దశాబ్ధాలు వెనక్కి వెళ్లిపోతాం. చెన్నైకి 72కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవ రాజుల రాజధానిగా వెలుగొందింది. ఈ నగరానికి కంజీవరం అనే పేరు కూడా ఉంది.
హిందువులకు మోక్షప్రదానమైన ఏడు నగరాల్లో కాంచీపురం ఒకటి. మోక్షభూమి, శక్తి భూమిగా ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువుల నమ్మకం. గరుడ పురాణం ప్రకారం మోక్షన్ని ఇచ్చే నగరాలు ఏడు అవి వరసగా అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, అవంతికా, ద్వారక, కంచి. అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అడుగడుగునా దేవాలయాలే దర్శనమిస్తాయి.
కంచి నగరంలో ఎక్కువగా ఆ పరమశివుడు మరియు విష్ణు ఆలయాలు కనిపిస్తాయి. అందుకే కంచీపురంను 'శివకంచి' మరియు 'విష్ణు కంచి' అనే రెండు నగర భాగాలు ఉన్నాయి. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉండటం విశేషం. అంతే కాదు ఇక్కడ ప్రసిద్ది చెందిన ఏకాంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం కైలసనతార్ లేదా కైలాసనాథ్ ఆలయాలు కూడా సందర్శించతగినవి. మరి ఈ రోజు కైలాసనాథర్ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం...
కైలసనతార్ ఆలయం లేదా కైలసనాథ్ ఆలయం
కైలసనతార్ ఆలయం లేదా కైలసనాథ్ ఆలయం బహుశా నగరంలోని అతి పురాతన ఆలయం. 567వ సంవత్సరంలో కట్టారు, రాజసింహ పల్లవ రాజు 7వ శతాబ్దంలో విస్తరించారు. పల్లవులు నిర్మించిన ఈ ఆలయం అతిపురాతనమైనది. ఈ ఆలయం వాస్తు సంపదకూ, శిల్ప సంపదకూ, ఎన్నో అపురూప శిల్పాలకు ఎంతో ప్రసిద్ధమైనది. కైలాసనాథర్ ఆలయం శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది.
ఈ ఆలయం పల్లవ రాజు నరసింహవర్మన్ నిర్మించారు
ఈ ఆలయంను శివుని మీద భక్తితో ఎనిమిది శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మన్ నిర్మించారు. చారిత్రక ప్రసిద్ధిని పొందిన ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పురాణ గాధ గురించి తెలియకున్నా నిర్మాణ విశేషాలు మాత్రం తరగనివే !
ఇసుకరాయితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధమనోహరంగా
మిగిలిన ఆలయాల మాదిరి కొండరాతితో కాకుండా ఈ ఆలయం ఇసుకరాయితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధమనోహరంగా ఉన్నాయి. ఈ శిల్పాలు సున్నితమైన నైపుణ్యానికి ఒక ఉదాహరణ. మరో విశేషమేమిటంటే రాతి మీద నిర్మింపబడిన తొలి పల్లవ ఆలయంగా చరిత్ర కారులు పేర్కొనడం!అంతకు ముందు పల్లవులు నిర్మించినవి చాలా వరకు
సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశన ఉండే
సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశన ఉండే ఈ ఆలయ ప్రాంగణం లోనికి దక్షిణ దిశగా ప్రవేశ ద్వారం ఉంటుంది. గర్భాలయ వెలుపల చెక్కిన నిలువెత్తు సింహ (?) రూపాలు అబ్బుర పరుస్తాయి. . ప్రధాన ఆలయానికి ఎదురుగా తూర్పున పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది.
గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాలు గల లింగ రూపంలో
గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాలు గల లింగ రూపంలో శ్రీ కైలాస నాథర్ దర్శనమిస్తారు. ఎదురుగా నంది. నేటికీ నిత్య పూజలు జరగడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
ఈ ఆలయ నిర్మాణం
సాధారణంగా ఆ సమయంలో నిర్మాణాలు మరియు భవనాలు నిర్మించడానికి ఉపయోగించిన ద్రావిడ నిర్మాణ సమకాలీకరణ ఉంది. ఆలయం చుట్టు పక్కల శివలీలలు, శివుని వివిధ స్వరూపాలు అద్భుతంగా మలచబడి ఉన్నాయి. ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దగా ఉంది.
మరో విశేషమేమింటంటే
మరో విశేషమేమింటంటే శివలింగం పక్కన ఉండే బిలంలోకి వెళ్ళి బయటకి వస్తే మరుజన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఈ బిలం లోకి పాకుతూ సులభంగానే వెళ్ళవచ్చుకానీ బయటికి రావటం కొంచెం కష్టం.
సంపూర్తిగా పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయం
సంపూర్తిగా పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయం వెలుపలి ప్రకారం, ప్రదక్షిణ ప్రాంగణం మరియు గర్భాలయం అనే మూడు భాగాలుగా ఉంటుంది. గర్భాలయాన్ని ముఖమండపాన్ని కలుపుతూ ఒక అర్ధమండపం ఉంటుంది. అవ్వడానికి విశాల ప్రాంగణం అయినా ప్రధాన ఆలయం చిన్న రాతిని కూడా వదల కుండా చెక్కిన శిల్పాలతో కిక్కిరిసి పోయినట్లుగా కనపడుతుంది.
ప్రాకారానికి లోపలి వైపున ఎన్నో శివ రూపాలను చెక్కారు.
ఆలయం పై 'విమానం'
సున్నితమైన నిర్మాణంతో పాటు, ఆలయం పై 'విమానం' మరియు మందిరంపై గోపురం ప్రసిద్ధి చెందింది. ఆలయం కూడా నటరాజ్ భంగిమలో ఉన్న శివుడి యొక్క నగిషీలు చెక్కి ఉన్న ప్యానెల్లు ఉన్నాయి.
భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఝాన కళా వైభవానికి కలికితురాయి
ధ్యాన, నర్తన, అసుర సంహార,త్రిపురాంతక, రుద్ర, గంగాధర, లింగోద్భవ, భిక్షందార్, అర్ధనారీశ్వర ఇలా ఎన్నో ! అదే విధిగా శ్రీ గణపతి, శ్రీ కార్తికేయ, శ్రీ దుర్గ, శ్రీ విష్ణు రూపాలు కూడా కనపడతాయి. ఇవన్నీ మన భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఝాన కళా వైభవానికి కలికితురాయి ఈ కైలాసనాథర్ దేవాలయం
మండపం లోను, మండప స్తంభాల పైన ఎన్నో శాసనాలు
మండపం లోను, మండప స్తంభాల పైన ఎన్నో శాసనాలు కనపడతాయి. వీటిల్లో చాలావరకు పల్లవ రాజులు శ్రీ కైలాస నాథర్ స్వామికి సమర్పించు కొన్న కానుకల వివరాలు మరియు వారి శివభక్తి తెలిపేవే !
రాజరాజచోళుడు ఈ కైలాసనాథార్ దేవాలయాన్ని దర్శించి ముగ్ధుడై
రాజరాజచోళుడు ఈ కైలాసనాథార్ దేవాలయాన్ని దర్శించి ముగ్ధుడై, తంజావూరులో బృహధీశ్వరాలయం నిర్మించారని ప్రతీతి. 1400 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం వేదావతి నదీ తీరంలో కంచి పట్టణానికి పడమర దిక్కున బస్సు స్టాండ్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయం ఇప్పుడు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది
నారధుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం
నారధుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం. ఇక్కడ శివలింగం చుట్టూ ప్రదిక్షణ చేస్తే పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుందని చెబుతారు. ఈ ఆలయ గర్భగుడిలో నల్ల గ్రానైట్ నుండి చెక్కబడిన ఏకైక 16-వైపుల శివలింగం (శివుడిని సూచించే చిహ్నంగా) కలిగి ఉంది. ఏది ఏమయినప్పటికీ, నిర్మాణం యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణం దాని ఉప-పుణ్యక్షేత్రాలు, అనేక స్తంభాలు చిన్న దేవతల శిల్పాలతో లేదా ఉపఆలయాలతో అలంకరించబడి ఉంటాయి.
అన్నింటి లోనికి కొన్ని శిల్పాలను అపురూపమైనవిగా
అన్నింటి లోనికి కొన్ని శిల్పాలను అపురూపమైనవిగా పేర్కొనాలి. వీణ ధరించిన పరమేశ్వరుడు. నటరాజ నాట్య విన్యాసాన్ని తిలకిస్తున్న గణాలు, శ్రీహరి, విధాత ఇతర దేవతలు, సోమస్కంద మూర్తి, శ్రీ ఉమామహేశ్వరుడు ముఖ్యమైనవి. అన్నింటినీ వీక్షిస్తూ ప్రదక్షిణ పూర్తి చేసుకొని గర్భాలయానికి చేరుకోడానికి సన్నని మార్గం గుండా వెళ్ళాలి. దర్శనానంతరం మరో సన్నని మార్గం గుండా వెలుపలికి రావాలి. వీటిని జీవి పుట్టుక మరణానికి నిదర్శనాలుగా పేర్కొంటారు.
ఈ గుడి నిర్మాణంలో ఈ సొరంగం ఎంతో దోహద పడి ఉండవచ్చు
ఈ గుడి నిర్మాణంలో ఈ సొరంగం ఎంతో దోహద పడి ఉండవచ్చు? కాని సుమారు *90 కిలోమీటర్లు సొరంగం* చెయ్యడము, దాన్ని ఉపయోగించడము, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, నిపుణత ఆ కాలంలో ఉండేవో, అలాంటివి మనం ఎంత కోల్పోయామో ఇప్పటి తరాలకు కనీసం తెలియజేసిన చాలు.
ప్రత్యేకతలు
కంచీపురం పట్టు చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ శిల్కు సొసైటీలు ఉన్నాయి. వివిధ రకాలకు చెందిన శిల్కు వస్త్రాలు, ముఖ్యంగా చీరలు ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ కంచి కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఇక్కడకు నిత్యం దేశ, విదేశాలకు చెందిన యాత్రికులు, వ్యాపారులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఎలా వెళ్లాలి
కర్నూలు నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచీపురానికి వెళ్లాలంటే ముందుగా తిరుపతి లేదా చిత్తూరుకు చేరుకోవాలి. అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో వెళ్లవచ్చు. లేదంటే కర్నూలు నుంచి నేరుగా చెన్నై వెళ్లి అక్కడి నుంచి కంచికి చేరుకోవచ్చు.
బస్సు సౌకర్యం
చెన్నై నుంచి కంచి 65 కిలోమీటర్లు ఉంటుంది. జిల్లాలో ఎమ్మిగనూరు నుంచి కంచికి నేరుగా ఆర్‌టీసీ బస్సు సౌకర్యం ఉండేది. అయితే పలు కారణాల వల్ల రద్దు అయ్యింది. రైలు మార్గం ద్వారా వెళ్లాలంటే కర్నూలు నుంచి తిరుపతికి వెళ్లాలి. అక్కడి నుంచి బస్సు సౌకర్యం ఉంది.
శుభ శుభోదయం మిత్రులారా...
చిత్రంలోని అంశాలు: మొక్క మరియు పుష్పం
💐💐💐శ్రీ మల్లిఖార్జున-భ్రమరాంబ జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీశైలం , ఆంధ్రప్రదేశ్.💐💐💐 (2)
శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రము. మెలికలు తిరుగుతూ, లోయలు దాటుతూ దట్టమైన అరణ్యాల మధ్య భక్తజనులను బ్రోచేందుకు వెలసిన పరమేశ్వరుని దివ్యధామం అయిన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి.
శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, మరియు దశ భాస్కర క్షేత్రములలో శ్రీశైలం ఆరవది.
చరిత్ర :
ఇక్ష్వాకులు, పల్లవులు, విస్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీమల్లికార్జునుని పవిత్రధామం. శ్రీశైల దేవస్థానమునకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ఠ కట్టడము నిర్మించారు. నాలుగు వైపులా నాలుగు పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన నాలుగు గోపురాలు,అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు.
స్థల పురాణం :
పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతీ భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాకలో వింత ఏమి లేదని చెపుతాడు.
అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.
ఆలయవిశిష్టత:
శ్రీశైలంలో దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. దీనిలో శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్ లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.
పాతాళ గంగ:
శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినపుడు పాతాళగంగ అనునది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు.
2004లో పాతాళగంగకు వెళ్ళుటకు రోప్ వే ఏర్పాటు చేయబడింది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. త్రేతాయుగ కాలం నాటి ఆంజనేయ స్వామి గుడి తప్పనిసరిగా చూడవలసిన వాటిలో ఒకటి.
సాక్షి గణపతి ఆలయము:
ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని.ఇతనిని సాక్షి గణపతి అంటారు.
శ్రీశైల శిఖరం:
శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.
పాలధార, పంచధారలు:
శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటకేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉంది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులులనుండి పంచధార (ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కథార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకథార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది.
హటకేశ్వరం:
హటకేశ్వరం, కర్నూలు జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామము. శ్రీశైలమల్లికార్జునదేవస్థానమునకు మూడు కిలోమీటర్ల దూరములో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయము ఉంది. ఈ పరిశరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు నివసించారు. పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు)లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిశరాలలో పలు ఆశ్రమములు, మఠములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చెందుకు శ్రీశైలం దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు ఉన్నాయి.
శిఖరం:
శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు,అక్కడ ఉన్న నందిని రోలుమాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపైనున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి.అలా చూసే క్రమంలో ఆవ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు మరియు పునర్జన్మ నుండి విముక్తులవుతారు.
కదళీవనము :
శ్రీ దత్తాత్రేయ స్వామి అవతార పరంపరలో 3వ అవతార పురుషుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాష్ట్రలోని కరంజా నగరంలో జన్మించి నర్సోబవాడాలోను, కర్ణాటకలోని గాణాగాపురంలోనూ తపమాచరించి చివరకు కదళీవనంలో అంతర్ధానమయ్యారు. వీరశైవ సంప్రదాయానికి చెందిన అక్క మహాదేవి కూడా ఇక్కడే అవతార సమాప్తి గావించారని ప్రతీతి.
భీముని కొలను :
శ్రీశైలంలోని సాక్షి గణపతి గుడి దాటాక కుడివైపు పాపనాశనం తీర్థం ఉంటుంది. దీనికి ఎదురుగా ఉన్న కాలిబాట భీముని కొలనుకు దారితీస్తుంది. ఈ మార్గంలో శతాబ్దాల కిందట రెడ్డిరాజులు మెట్లు కట్టించడం విశేషం. మెట్ల దారిలో ఒక కిలోమీటర్‌ వెళ్లాక.. దట్టమైన అడవితో విశాలమైన లోయ కనిపిస్తుంది. ఇక్కడున్న మహాద్వారం.. అందమైన లోకంలోకి స్వాగతం పలుకుతుంది. పెద్ద పెద్ద మెట్లు.. వీటికి ఇరువైపులా చెట్లు.. వాటికి అల్లుకున్న లతలు.. మనిషంత ఎత్తుండే పుట్టలు.. దారి పొడుగునా కనిపించే దృశ్యాలివి. ఈ దారిలో రెండు కిలోమీటర్లు నడక సాగిస్తే.. త్రివేణీ, త్రి పర్వత సంగమానికి చేరుకుంటారు.వందల అడుగుల లోతున్న లోయల మధ్య తూర్పు నుంచి ఒక సెలయేరు, దక్షిణం నుంచి మరో సెలయేరు వచ్చి.. చిన్న చిన్న జలపాతాలుగా దూకుతుంటాయి లపాతాలు ఏర్పరిచే కొలను మనోహరంగా ఉంటుంది. అదే భీముని కొలను. అంటే పెద్ద కొలనని అర్థం. అయితే ఇది మరీ అంత పెద్దగా ఏం ఉండదు. కానీ చాలా ప్రత్యేకమైనది. తూర్పు సెలయేరు, దక్షిణ సెలయేరు సంగమించి.. జలపాతంగా మారి ఒక గుండంలో దూకుతాయి. అక్కడ దూకిన జలాలు.. అనూహ్యంగా మాయమవుతాయి. ఒక పరుపు బండ కింది నుంచి రెండు వందల అడుగులు ప్రయాణించి మళ్లీ బయటకు వస్తాయి. భారీ పరుపు బండ మీద నిలబడితే.. దాని కింది నుంచి నీళ్లు పారుతున్న శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. పరుపు బండ కింది నుంచి వెలుపలకు వచ్చిన నీళ్లు కొలనులోకి చేరడంతో నిరంతరం అలలు పుడుతుంటాయి. వేసవిలోనూ ఇక్కడ నీటి జాడ కనిపించడం విశేషం. అహోబిలం నరసింహస్వామి.. చెంచులక్ష్మిని వరించి భీముని కొలనులో సయ్యాటలాడాడని స్థానిక కథనం. కొలను ఒడ్డున భీమాంజనేయుల విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడికి సమీపంలోని పురాతన శివాలయం ఉంది. దీనిని సందర్శించి.. మరోసారి లోయల అందాలను చూస్తూ.. పొద్దుగూకే లోగా శ్రీశైల క్షేత్రానికి చేరుకోవచ్చు.
శ్రీశైలం-రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు నుండి శ్రీశైలం 212 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణించటానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి.
గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) కొండల మధ్యగా చాలా బాగుంటుంది.🙏.. పూర్తి సేకరణ,మిత్రుల నుండి.
ఫోటో వివరణ అందుబాటులో లేదు.
నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం.....ఉజ్జ‌యిని (1) 
మన దేశంలో ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం ఒకటుందని మీకు తెలుసా….? 
అవును ….. మీరు చదువుతున్నది అక్షరాలా నిజం . 
ఆ ఆలయం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది.
హిందూ ధ‌ర్మంలో పాముల‌ను ఆరాధించే సంస్కృతి అనాదిగా వస్తోంది. 
హిందూ ధ‌ర్మంలో స‌ర్పాల‌ను దేవ‌త‌ల ఆభ‌ర‌ణంగా భావిస్తారు.
మ‌న‌దేశంలో ఎన్నో నాగ దేవాల‌యాలున్నాయి. 
అందులో ప్ర‌ముఖమైంది, ఇత‌ర ఆల‌యాల‌కంటే భిన్న‌మైంది ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం. 
ఉజ్జ‌యినిలోని మ‌హాకాల్ మందిరంలోని మూడో అంత‌స్థులో నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం కొలువై ఉంది. 
ఈ కోవెల సంవ‌త్స‌రంలో ఒక‌రోజు మాత్ర‌మే అది కూడా శ్రావ‌ణ శుక్ల పంచ‌మి రోజు మాత్ర‌మే తెరిచి ఉంటుంది. ఆరోజు మాత్ర‌మే భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. ఆల‌యం తెరిచి ఉండే ఈ ఒక్క‌రోజున స‌ర్ప‌రాజుగా భావించే త‌క్ష‌కుడు ఆల‌యంలోనే ఉంటాడ‌ట‌. 
నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో 11 వ శతాబ్దానికి చెందిన అద్భుత‌మైన ప్ర‌తిమ ఉంది. ఇందులో ప‌డ‌గ విప్పి ఉండే పామునే ఆస‌నంగా చేసుకొని కూర్చొని ఉన్న శివ‌పార్వ‌తులుంటారు.¬ ఈ ప్ర‌తిమ‌ను నేపాల్ నుంచి తెప్పించార‌ని చెబుతుంటారు. ఉజ్జ‌యినిలో త‌ప్ప ఇలాంటి ప్ర‌తిమ ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా ఉండ‌ద‌ట‌.
సాధార‌ణంగా అయితే స‌ర్పంపైన విష్ణు భ‌గ‌వానుడు మాత్ర‌మే శ‌యనిస్తాడు. కానీ ప‌ర‌మ‌శివుడు శయ‌నించిన దాఖ‌లాలు ఎప్పుడూ విన‌లేదు. కానీ ప్ర‌పంచంలో మ‌ర‌కెక్క‌డా లేని విధంగా ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో భోళాశంకరుడు శ‌య‌నించి ఉండ‌డం విశేషం. ఈ ప్ర‌తిమ‌లో శివ‌పార్వ‌తుల‌తో పాటు వారి ముద్దుల త‌న‌యుడు వినాయ‌కుడు కూడా కొలువై ఉన్న అద్భుత దృశ్యం చూడ‌డానికి రెండు క‌ళ్లూ చాల‌వు నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలోస‌ర్పంపైన ప‌ర‌మ‌శివుడు శయ‌నించి ఉండ‌డం వెన‌క ఒక క‌థ ప్ర‌చారంలో ఉంది. 
స‌ర్ప‌రాజు త‌క్ష‌కుడు ప‌ర‌మేశ్వ‌రుడి అనుగ్ర‌హం కోసం కఠోర‌మైన త‌పస్సు చేశాడ‌ట‌. ప్ర‌స‌న్న‌మైన శివుడు త‌క్ష‌కుడికి అమ‌ర‌త్వాన్ని ప్ర‌సాదించాడ‌ట‌. ఇక అప్పటి నుంచి త‌క్ష‌కుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడ‌ని చెబుతారు. నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యానికి శతాబ్దాల చ‌రిత్ర ఉంది. 
1050 లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆయ‌న త‌ర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మ‌హ‌రాజ్ 1732 లో ఆల‌య జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టాడు. ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శించుకుంటే చాలు స‌ర్‌యదోషాల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. అందుకే నాగ‌పంచ‌మి రోజు ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తుతారు. నాగ‌చంద్రేశ్వ‌రుడి ద‌ర్శించుకొని పునీతుల‌వుతారు. ఈ ఒక్క‌రోజే దాదాపు రెండు ల‌క్ష‌ల మంది భ‌క్తులు ద‌ర్శించుకోవ‌డం విశేషం.
--((***))--

No comments:

Post a Comment