Saturday, 20 May 2017

సృష్టి రహస్యం

సృష్టి రహస్యం
 

సృష్టి రచన
భారతీయ తాత్విక సత్య నిర్దేశనం.
- శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్య గారి సంస్కృత భాగవత ప్రవచన సారం.

కల్పాంతం, మాహా ప్రళయం తరువాత వటపత్ర శయన శాయి అయిన పరమాత్మ కొన్ని యుగాల సమయానంతరం సృష్టి చేయ ఉపక్రమిస్తారు.
 
తనలో నిక్షిప్తమై ఉన్న జీవాలు పూర్వ సృష్టి, తిరిగి చేతనావస్తకి చేరుకుంటాయి. ఏకమై ఉన్న తాను తనద్వారా తన అంశల ద్వారా అనేకులు అవుతారు. వాటిలో ప్రధమంగా తన బొడ్డు లోంచీ తామర తూడు (Umbilical Chord) సృష్టి జరగడం ఆ పద్మంలో బ్రహ్మ దేవుని రూపు అంకురార్పణ జరగడం.
దీనినే సర్గ సృష్టి అంటారు. తన నిర్దేశం మరియూ తలపు ద్వారా జరిగిన సృష్టి.
 
తన సృష్టిచే జనించిన బ్రహ్మ ద్వారా, ఆయన సృష్టి ద్వారా జరిగిన సకల భూతాల, జీవాల, బ్రహ్మాండాల, గ్రహాల, ప్రకృతి సృష్టిని విసర్గ సృష్టి అంటారు.

అలా జనించిన బ్రహ్మ తాను ఎవరో ఏం చేయాలో అన్న సందిగ్ధంలో కలియ జూసి తన ఉనికికై వెతికి జాడ తెలియక తనలో బయలుదేరిన ఓంకార నాదంపై శ్రద్ధ యోగం నిలపి తపస్సు చేయ ఉపక్రమిస్తారు. ఆ తపస్సు బ్రహ్మ కాలమానం ప్రకారం వెయ్యి సంవత్సరాలు ఉంటుంది. ఆ తరువాత విష్ణు పరమాత్మ దర్శనం జరిగి కర్తవ్య బోధ అడుగుతాడు. నీవు సృష్టి కార్య రచన చేయాలి అనగా ఎలా అని అడుగగా క్రితం సృష్టిలో ఏం చేసావో అదే తిరిగి చేయమని ముందుగా ఉన్న దాన్ని విభాగాలుగా చేసి సృష్టి రచన చేయమని ఆదేశిస్తారు పరమాత్మ.
 
ముందు తపస్సు చేయి లోకాన్ని సృష్టించే క్రమంలో నన్ను మరువకు నా గురించి తపస్సు చేసి క్రమంలో నీ సృష్టి రచన అనే కర్తవ్యం మరువకు అని బోధ చేస్తారు.
 
కాలం అనేది, మన జనన మరణ చక్రాలు, ఈ సృష్టి స్థితి లయ అన్నవి, మన అనాది సంస్కృతి ఇవన్నీ కూడా ఒక cycle లో తీరుగాడుతున్నాయి అన్న దానికి ఇది ఒక నిదర్శనం.
 
అందుకే మన సంస్కృతిని అనాది ధర్మం (ఆద్యంత రహిత సనాతన ధర్మం) అంటారు. అనాది అంటే మొదలు లేనిది.
 
(కాల చక్ర గతి వేరొక పోస్టులో)
ఆపై జరిగిన విసర్గము అనబడే సృష్టిలో ఈ క్రింది విధంగా సృష్టికార్య రచన సిధ్ధింపబడింది.
ప్రథమ సృష్టి నిర్మాణంలో ఈ క్రింది వరసలో సృష్టి కార్య రచన జరిగింది.
 
1. సనత్కుమార సనక సనందన సనస్తుజాన లు పుడతారు వారిని తిరిగి సృష్టి రచన లో పాల్గొమనగా భగవంతుని అర్చన లో మాకు ప్రీతి అని నిరాకరిస్తారు.
 
2. నిరాకరించిన క్రోధం ఆపుకొనగా బ్రహ్మ భ్రుకుటి లోంచి రుద్రుడు, ఏకాదశ రుద్రులు పుడతారు. సృష్టి రచన బదులు తామూ తమ రోదన ఫలితపు క్రోధంతో లోకల లయం చేయగా తపస్సు చేయమని ప్రభోధిస్తే తపస్సు చేస్తూ రుద్రుడు శివుడు అవుతాడు.
 
3. బ్రహ్మ గారు తిరిగి తపస్సు చేసి నవ ప్రజాపతులు, నారదుని సృష్టిస్తారు.
మరీచి అత్రి అంగీరస పులత్స్య క్రతువు భృగువు పులహుడు వశిష్ఠుడు అంగుష్టం నుండి దక్షుడు ఈ నవ ప్రజాపతులు.
 
4. వారితో బాటుగా మొదటగా సృష్టించబడినవి ఇవి
ధర్మము అధర్మము మృత్యువు కామము కోపము లోభము సముద్రాలు నిరృతి పాపములు నీడ నుంచి కర్ధముడు మొదలగునవారు.
 
5. హృదయంలోంచి సరస్వతి పుడుతుంది కానీ మోహ కారణంగా బ్రహ్మ మనో చాంచల్యం కలుగగా తన ఇతర పుత్రులైన ప్రజాపతులు హేళనగా నవ్వగా బ్రహ్మ తన శరీర త్యాగం గావిస్తారు. ఆ శరీరమే ఇప్పటికీ పొగమంచు రూపంలో ఈ భూమిపై తిరుగాడుతూ ఉంటుంది.
 
6. తిరిగి ద్వితీయ శరీర ధారణ చేసి తపస్సుతో తన సృష్టి కార్య రచన సాగిస్తారు. ఈ క్రింది సృష్టి రచన జరిగింది.
నాలుగు వేదాలు, యజ్ఞములు, ధర్మము యొక్క నాలుగు పాదాలు ఆయిన విద్య దానము తపస్సు సత్యములు, శస్త్రము ఆయుర్వేదం స్తుతి వడ్రంగి శిల్పాది కళలు, పంచమ వేదములు ఆయిన పురాణాలు ఇతిహాసాలు షోడసి యజ్ఞలు బ్రహ్మచర్య గృహస్త వానప్రస్తాది ఆశ్రమ ధర్మాలు
మనుష్యులు - అన్విక్షకి త్రయీ దండనీతి వార్త చదువులు
హృదయంలోంచి ప్రణవం, భూ భువః వంటి సప్త వ్యాహృతులు, చందస్సులు సంగీతం సప్త స్వరాలు అచ్ఛులు హల్లులు ఉష్మలు అక్షరములు బలము ఇతరములు సృష్టి చేస్తారు.
----------- ***** ---------- ***** -------------

విసర్గ సృష్టిలో జీవ జంతుజాలం మానవ సృష్టి రచన
తాను జరిపిన ఈ అఖండ విభాగ సృష్టి కార్య రచనలో ఇంత సృష్టి రచన చేసినాజీవ సంతతి తగిన విధంగా పెరగకుండా ఉండడం గమనించి బ్రహ్మ తనకు సహాయంగా reproduction అన్నది ఆడ మగల మధ్యన జరగాలి అని మిథున సృష్టి చేయాలని ప్రప్రథమంగా
 
స్వాయంభువ మనువును అలాగే తనకి తోడుగా ప్రప్రథమంగా శతరూప అనే భార్యను సృష్టిస్తారు.
వారికి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే పుత్రులు
ఆకూతి దేవహూతి ప్రసూతి అనే పుత్రికల జననం కలుగుతుంది.
ఆకూతికి రుచి అనే ప్రజాపతి ( ?? వివరణ వేరే పోస్టులో)
దేవహూతికి కర్ధమ ప్రజాపతి
 
ప్రసూతికి దక్ష ప్రజాపతి లను ఇఛ్చి వివాహం చేస్తారు.
మానవునిగా పుట్టిన జీవుల ధర్మం ఇది అని బ్రహ్మ వారికి ఉపదేశించారు.

దేవతల రుణం
కన్నతల్లి రుణం
ఋషుల రుణం
అతిధుల సత్కారం
సకల ప్రాణికోటి తగిన రీతిలో సేవ
అనే ఐదు రుణాలు మానవ జన్మ ఎత్తిన ప్రతి జీవి కర్తవ్యం.

ఇలాగ సృష్టిరచన ఆరంభం అయ్యింది అని భాగవత పురాణ ప్రవచనంలో శ్రీమాన్ శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్య గారు వివరించారు. తప్పులు ఏవైనా ఉండి ఉంటే నావిగా భావించి క్షమించగలరు.
రెండు ఎడారి మతాల ఆరు రోజుల సృష్టి రచన, పక్కటెముక ఆడాము అవ్వల సృష్టి, రెండు ఎడారి అజ్ఞానుల బల్లపరపు భూమి వివరణ
తిరిగి తమ తమ మిడి మిడి పరిమిత అజ్ఞ్యానంతో సనాతన ధర్మాన్ని నినదించే కుష్క ప్రయత్నాలను త్రిప్పి కొట్టండి.
ధర్మ పరిరక్షణ, సంస్కృతి సాంప్రదాయ ధర్మాచరణ మన అందరి ప్రధమ కర్తవ్యం కావాలని ఆశిద్దాం.
ధర్మో రక్షతి రక్షతః.
సృష్టి క్రమ వివరణ అద్భుతం గురువుగారి ధారాళ వివరణ మహత్యం
ప్రణతోమి ఆచార్యా శ్రీ శ్రీ భాష్యం అప్పలాచార్య గారు.

1 comment: