🙏🙏🙏🙏🙏
*శివరాత్రి సందర్భంగా 108 నామాలు ఒకసారి చదువుకోండి*
🙏మహిమాన్విత 108 లింగాలు🙏
1. ఓం లింగాయ నమః
2. ఓం శివ లింగాయనమః
3. ఓం శంబు లింగాయనమః
4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః
5. ఓం అక్షయ లింగాయనమః
6. ఓం అనంత లింగాయనమః
7. ఓం ఆత్మ లింగాయనమః
8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః
9. ఓం అమర లింగాయనమః
10. ఓం అగస్థేశ్వర లింగాయనమః
11. ఓం అచలేశ్వర లింగాయనమః
12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః
13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః
14. ఓం అపూర్వ లింగాయనమః
15. ఓం అగ్ని లింగాయనమః
16. ఓం వాయు లింగాయనమః
17. ఓం జల లింగాయనమః
18. ఓం గగన లింగాయనమః
19. ఓం పృథ్వి లింగాయనమః
20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః
21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః
22. ఓం ప్రణవ లింగాయనమః
23. ఓం పగడ లింగాయనమః
24. ఓం పశుపతి లింగాయనమః
25. ఓం పీత మణి మయ లింగాయనమః
26. ఓం పద్మ రాగ లింగాయనమః
27. ఓం పరమాత్మక లింగాయనమః
28. ఓం సంగమేశ్వర లింగాయనమః
29. ఓం స్పటిక లింగాయనమః
30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః
31. ఓం సువర్ణ లింగాయనమః
32. ఓం సుందరేశ్వర లింగాయనమః
33. ఓం శృంగేశ్వర లింగాయనమః
34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః
35. ఓం సిధేశ్వర లింగాయనమః
36. ఓం కపిలేశ్వర లింగాయనమః
37. ఓం కాపర్డేశ్వర లింగాయనమః
38. ఓం కేదారేశ్వర లింగాయనమః
39. ఓం కళాత్మక లింగాయనమః
40. ఓం కుంభేశ్వర లింగాయనమః
41. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః
42. ఓం కోటేశ్వర లింగాయనమః
43. ఓం వజ్ర లింగాయనమః
44. ఓం వైడుర్య లింగాయనమః
45. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః
46. ఓం వేద లింగాయనమః
47. ఓం యోగ లింగాయనమః
48. ఓం వృద్ధ లింగాయనమః
49. ఓం హిరణ్య లింగాయనమః
50. ఓం హనుమతీశ్వర లింగాయనమః
51. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః
52. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః
53. ఓం భాను లింగాయనమః
54. ఓం భవ్య లింగాయనమః
55. ఓం భార్గవ లింగాయనమః
56. ఓం భస్మ లింగాయనమః
57. ఓం భిందు లింగాయనమః
58. ఓం బిమేశ్వర లింగాయనమః
59. ఓం భీమ శంకర లింగాయనమః
60. ఓం బృహీశ్వర లింగాయనమః
61. ఓం క్షిరారామ లింగాయనమః
62. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః
63. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః
64. ఓం మహా రుద్ర లింగాయనమః
65. ఓం మల్లికార్జున లింగాయనమః
66. ఓం మహా కాళేశ్వర లింగాయనమః
67. ఓం మల్లీశ్వర లింగాయనమః
68. ఓం మంజునాథ లింగాయనమః
69. ఓం మరకత లింగాయనమః
70. ఓం మహేశ్వర లింగాయనమః
71. ఓం మహా దేవ లింగాయనమః
72. ఓం మణికంధరేశ్వర లింగాయనమః
73. ఓం మార్కండేయ లింగాయనమః
74. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః
75. ఓం ముక్తేశ్వర లింగాయనమః
76. ఓం మృతింజేయ లింగాయనమః
77. ఓం రామేశ్వర లింగాయనమః
78. ఓం రామనాథేశ్వర లింగాయనమః
79. ఓం రస లింగాయనమః
80. ఓం రత్నలింగాయనమః
81. ఓం రజిత లింగాయనమః
82. ఓం రాతి లింగాయనమః
83. ఓం గోకర్ణాఈశ్వర లింగాయనమః
84. ఓం గోమేధిక లింగాయనమః
85. ఓం నాగేశ్వర లింగాయనమః
86. ఓం ఓంకారేశ్వర లింగాయనమః
87. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః
88. ఓం శరవణ లింగాయనమః
89. భృగువేశ్వర లింగాయనమః
90. ఓం నీలకంటేశ్వర లింగాయనమః
91. ఓం చౌడేశ్వర లింగాయనమః
92. ఓం ధర్మ లింగాయనమః
93. ఓం జోతిర్ లింగాయనమః
94. ఓం సైకత లింగాయనమః
95. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః
96. ఓం జ్వాలా లింగాయనమః
97. ఓం ధ్యాన లింగాయనమః
98. ఓం పుష్యా రాగ లింగాయనమః
99. ఓం నంది కేశ్వర లింగాయనమః
100. ఓం అభయ లింగాయనమః
101. ఓం సహస్ర లింగాయనమః
102. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః
103. ఓం సాలగ్రామ లింగాయనమః
104. ఓం శరభ లింగాయనమః
105. ఓం విశ్వేశ్వర లింగాయనమః
106. ఓం పథక నాశన లింగాయనమః
107. ఓం మోక్ష లింగాయనమః
108. ఓం విశ్వరాధ్య లింగాయనమః.🙏
(సేకరణ)
ఒకసారి లక్షీదేవి ఒక వ్యక్తి పై కోపగించుకొని “ఈ ఇంటినుండి వెళ్లి పోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను. అడుగు!” అని అంటుంది.
అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు… “అమ్మా నీవు వెళ్లుతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు వున్నచోట ఒకరు వుండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ *మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే వుండేటట్లు వరం ఇవ్వమ”ని అంటాడు.*
‘తథాస్తు!’ అని లక్ష్మీదేవి ఆ ఇంటినుండి వెళ్లిపోతుంది.
కొన్నిరోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్ళలో వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది.
కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమై పోతుంది.
ఇంకొంతసేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తనుకూడ ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరేపనిలో పడిపోతుంది.
ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు తమ పనిలోపడి ఉప్పు వేశారో లేదో అని తనూ కొంత వేస్తుంది.
మధ్యాహ్నం ఆవ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువయిందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమి మాట్లాడకుండా తిని లేస్తాడు.
కొంత సేపటికి ఆ వ్యక్తి పెద్దకొడుకు కూడ భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి ‘నాన్న గారు తిన్నారా?’ అని భార్యను అడుగుతాడు.
’తిన్నారు!’ అని చెబుతుంది.l
దానితో ‘నాన్న ఏమీ అనకుండ తిన్నాడు. నేనెందుకు అనాలి?’ అని ఏమి మాట్లాడకుండ తనూ తిని లేస్తాడు.
ఇలా ఆ ఇంటి వాళ్లంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండ వుంటారు.
ఆరోజు సాయంత్రం *దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ‘నేను ఇక్కడ ఉండలేను వెళ్లిపోతున్నాను. ఉప్పు కశాయం అయిన వంట తిని కూడ మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటు వంటి చోట నేనుండను!’ అని వెళ్లిపోతుంది.*
*దరిద్ర దేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొంటుంది.*
*కనుక, ఏ ఇంటిలో ‘ప్రేమ, అప్యాయతలు మరియు శాంతి’ కళకళలాడుతూ వుంటాయో ఆ ఇల్లు లక్ష్మీనివాసం’ అవుతుంది.*
*"""""*
ఎలా మాట్లాడాలి ??
అకారణంగా ఒక్కొక్కసారి మిత్రులు కూడా శత్రువులు అవుతారు.
అంతకుముందు వరకూ మనల్ని గౌరవిస్తూ వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా దూరంగా వెళ్ళిపోతారు. సహోద్యోగులు, బంధువులు కూడా దూరదూరంగా తప్పించుకుని తిరగాలనుకుంటారు.
ఎందుకిలా జరుగుతోంది అని ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు అనేక సందర్భాలలో సులభంగా అర్థమవుతుంది. మన వాగ్ధోరణే మన మానవ సంబంధాల్ని దెబ్బతీస్తోందని.
మాట్లాడడం అనేది జీవన కళలో ప్రధానమైనది. భావవ్యక్తీకరణ సాధనం వాక్కు – అన్నది నిజమే అయినా, సందర్భానుగుణంగా దానిని వినియోగించడంలోనే జీవితంలోని మానవసంబంధాలు, కార్యసాఫల్య వైఫల్యాలు ఆధారపడి ఉన్నయి.
‘వాగ్ఘి సర్వస్వ కార్యణమ్’ అంటోంది శాస్త్రం.
ఒకేభావాన్ని రకరకాల మాటలతో చెప్పవచ్చు. కుండబద్దలు కొట్టినట్లో, బుజ్జగింపు ధోరణిలోనో, నచ్చజెప్పే విధంగానో, కఠినంగానో, కోమలంగానో ఒకే భావాన్ని పలురీతులలో వ్యక్తపరచవచ్చు.
వాక్కు మన సంస్కారాన్ని చాటి చెబుతుంది.
వాల్మీకి తన రామాయణ కావ్యంలో ఆదినుండి వాక్సంస్కారంపై ఎన్నో మంచి విషయాలను పేర్కొన్నాడు.
‘వాగ్విదాం వరః’, ‘వాక్య కోవిదః’, ‘మృదుభాషీ’, ‘మధురభాషీ’, ‘పూర్వభాషీ’, ‘స్మితభాషీ’, అంటూ ఉత్తమ వాగ్లక్షణాలను చక్కగా తెలియజేశారు.
మాటలో స్పష్టత, నిష్కపటత్వం ప్రధానం. ఒక్కొక్కసారి నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, మాట్లాడడం మన స్వభావం అని గొప్పగా చెప్పుకుంటూంటాం.
కానీ అవతలివారు అదే నిక్కచ్చితనం మనపట్ల చూపిస్తే సహించగలమా?
బాధించే విధంగా సత్యాన్ని కూడా పలుకరాదు. ప్రయోజనం ప్రధానం. అలాగని అబద్ధం చెప్పనవసరం లేదు. నిజం చెబితే ప్రమాదమనే చోట తటస్థవైఖరి క్షేమం.
మాట్లాడే నైపుణ్యం గురించి మన శాస్త్రాల ఆధారంగా గమనిస్తే ఈ క్రింది విషయాలు స్పష్టమౌతాయి.
🌷మాట అవతలి వారికి ఉద్వేగం కలిగించకూడదు.
🌷అవతలి వారి పేరును పలికి సంభాషిస్తే, వారికి ఆదరంగా వుంటుంది.
🌷మనమే ముందు మాట కలపడం స్నేహానికి, కార్యసాఫల్యానికి ముఖ్యం.
🌷ప్రియంగా, హితంగా, సత్యంగా మాట్లాడడం ‘మధుర’వాక్కు అనిపించుకుంటుంది.
🌷కసిరికొట్టినట్లుగాను, వెకిలితనంతోను మాట్లాడడం శత్రువులను పెంచుతుంది.
🌷అతి సంక్షిప్తమూ, అతి విస్తారమూ – రెండూ పనికిరావు.
🌷ఉచ్చారణ తేటగా ఉండాలి.
🌷చిరునవ్వుతో మాట్లాడడం, ఆప్యాయంగా పలకరించడం అవతలి వారిని వినేటట్లు చేస్తుంది.
🌷వడివడిగా పలకడం, అతి నెమ్మదిగా నాన్చడం – రెండూ రాణించవు.
🌷సద్గ్రంథపఠనం, మంత్రజపం, మౌనం – ఇవి మాటకి శక్తినిస్తాయి.
🌷ఎప్పుడూ సకారాత్మకంగా (Positive) మాట్లాడడం శ్రేష్ఠం.
🌷మన గురించి మనమే ప్రశంసించుకుంటూనో, అలాగని అతి వినయంతో హీనపరుచుకుంటూనో మాట్లాడడం నిరాదరణకు గురిచేస్తుంది.
🌷ఒక విషయంపై మాట్లాడేటప్పుడు దానిపై అవగాహన కలిగి ప్రారంభించాలి.
🌷తక్కువ సమయంలో విషయాన్ని స్పష్టంగా, సానుకూలంగా చెప్పగలిగే రీతిని అలవరచుకోవాలి.
🌷ప్రతికూల పరిస్థితుల్లో భీతి, ఉద్వేగం, శత్రుత్వం లాంటివి మాటల్లో ప్రకటిస్తే అది ప్రమాదహేతువౌతుంది. మనం దుర్బలత్వాన్ని చూపిస్తే, అది ఎదుటివాడిలో తెగింపును పెంచుతుంది.
🌷అవతలి వారిని పొగడడంలో కూడా కొన్ని మెలకువలున్నాయి. పొగడ్త మంచిదే. కానీ అందులో స్వాభావికత, సముచిత వైఖరి అవసరం. స్వార్థం, మితిమీరినతనం – రెండూ ప్రశంసలో లేకుండా జాగ్రత్తపడాలి.
🌷ప్రశంసతో కూడిన మాటలు, ఎదుటివారిలోని మంచినో, గొప్పతనాన్నో గుర్తించామన్న భావాన్ని కలిగిస్తాయి. దానితో వారు మన పట్ల సానుకూలంగా స్పందిస్తారు.
🌷శరీరంలో బాణాలు గుచ్చుకుంటే మెలకువతో వాటిని తొలగించి చికిత్స చేయవచ్చుగానీ, మనసులో గుచ్చుకొనే నిష్ఠూరవాక్కుల స్వభావాన్ని నివారించడం మాత్రం అసాధ్యం – అంటోంది మహాభారతం.
గాయపడే విధంగా సంభాషించడం ఒక హింసాత్మక పాతకం.
🌷మనసా, వాచా, కర్మణా – ఈ త్రికరణాలలో రెండవదైన ‘వాక్కు’ అనే ఉపకరణం ఎంతో ముఖ్యం. మనస్సుకీ, కర్మకీ వంతెన వంటిది మాట.
శ్రీరామ హనుమంతుల సంభాషణలో ఆంజనేయుని వాగ్వైఖరిని వాల్మీకి ఎంత అద్భుతంగా తెలియజేశాడో సుప్రసిద్ధం.
🌷మాటలు సంబోధనలకి ప్రాధాన్యం ఉంది. గాఢ పరిచయం ఉన్న వారితో సంబోధించే వైఖరి వేరు. ఎంతో ప్రగాఢ పరిచయస్థులైనా ఏకాంతంలో సంబోధనలకీ, పదిమంది మధ్యలో సంబోధనలకీ మార్పులుంటాయి.
ఒక ప్రసిద్ధ వ్యక్తిని మనం కలుసుకోవచ్చు. అతడు బాల్యంలో స్నేహితుడు కావచ్చు. అది కూడా ‘ఒరేయ్’, ‘ఏమిరా’ అనేటంత చనువు కలిగిన మిత్రత్వం కావచ్చు. కానీ సంఘంలో అతడో ఉన్నతస్థానంలో ఉన్నప్పుడు, నలుగురి నడుమ అటువంటి సంబోధనలు చేయడం స్నేహాన్ని పెంచదు సరికదా, ఆత్మీయతను తుంచుతుంది.
అదేవిధంగా – కొందరితో ప్రేమతో చేసే సంబోధనలు, మాటతీరు బహిరంగంగా ప్రదర్శించడం చుట్టూ వున్న వారికీ, వారికీ కూడా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు.
No comments:
Post a Comment