Sunday, 19 June 2022

నేటి కధలు 361 నుండి 365 వరకు



*పిడుగులు ఎందుకు పడతాయి?..361

 మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?*


ఏటా పిడుగు పాటు కార‌ణంగా దేశంలో వంద‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మూగ జీవాలు చ‌నిపోతున్నాయి.

అయితే, పిడుగులు ఎప్పుడు, ఎక్క‌డ ప‌డ‌తాయో ముందే అంచ‌నా వేయ‌డంతో పాటు, పిడుగుల బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌జ‌లు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తే ప్రాణ‌, ఆస్తి న‌ష్టాన్ని చాలా వ‌ర‌కు త‌గ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, పిడుగు అంటే ఏమిటి? అవి ఎలా పుడ‌తాయి? వ‌ంటి విష‌యాలు తెలుసుకోవ‌డం కూడా ముఖ్యం.

పిడుగులు ఎలా పుడతాయి?

ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు నీరు ఆవిరిగా మారి ఆకాశంలో దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు మేఘాలు ఏర్పడతాయి.

అయితే, పై నుంచి సూర్యరశ్మి అధికంగా తాకడం వల్ల తక్కువ బరువున్న ధనావేశిత(+) మేఘాలు పైకి వెళ్తాయి.

అధిక బరువుండే రుణావేశిత (ఎలక్ట్రాన్లు అధికంగా ఉన్న) మేఘాలు కిందికి వస్తాయి. అంటే, ఎప్పుడూ మనకు కనిపించే దట్టమైన మబ్బుల్లో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉంటాయన్నమాట.

సైన్స్ ప్రకారం, రుణావేశిత మేఘాలలోని ఎలక్ట్రాన్లు సమీపంలోని ధనావేశిత మేఘాలవైపు ఆకర్షితమవుతుంటాయి.

అయితే, ధనావేశిత మేఘాలు చాలా ఎత్తుకు వెళ్లిపోయినప్పుడు దగ్గరలో మరే వస్తువు ఉన్నా అటువైపు ఎలక్ట్రాన్లు ప్రయాణిస్తాయి.

ఆ క్రమంలోనే మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు ఒక్కసారిగా విడుదలై విద్యుత్‌ క్షేత్రంగా మారి భూమి మీదకు దూసుకొస్తాయి. దాన్నే 'పిడుగు పడటం' అంటారని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ విభాగంలో పనిచేస్తున్న నిపుణులు హరి కిరణ్ వివరించారు.

మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే సమయంలోనే ఉరుములు, మెరుపులు పుడతాయని ఆయన తెలిపారు.

భూమి మీదే ఎక్కువ

అలా మేఘాల నుంచి పడే 'పిడుగు'లో దాదాపు 30 కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది, అది మనిషిని అక్కడిక్కడే కాల్చి బూడిద చేయగలదు.

ప్రధానంగా ఎండా కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దాంతో ఆ ప్రాంతాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని నాసా పరిశోధనలో తేలింది.

అందులోనూ సముద్రంలో కంటే భూమిపైనే పిడుగులు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి.

పిడుగుపాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తోంది.

అందుకోసం అమెరికాకు చెందిన ఎర్త్‌నెట్ వర్క్‌తో పాటు, ఇస్రో సహకారం తీసుకుంటోంది. ఎర్త్ నెట్‌వర్క్ ద్వారా రాష్ట్రంలో సెన్సర్ల ఏర్పాటు చేశారు.

ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశముందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజల ఫోన్లకు ఎస్సెమ్మెస్‌లు పంపి అప్రమత్తం చేస్తున్నారు.

దీని ద్వారా 30 నుంచి 40 నిమిషాల ముందే పిడుగు పడబోయే ప్రాంతాన్ని గుర్తించొచ్చని హరి కిరణ్ బీబీసీకి చెప్పారు.

పిడుగుల నుంచి తప్పించుకోవడం ఎలా?

ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదే. కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం.

పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి.

భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి.

చెట్ల కిందకు, టవర్ల కిందకు వెళ్లకూడదు.

సెల్‌ఫోన్‌, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు.

ఒకవేళ తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నించాలి. మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద తక్కువగా పడే అవకాశం ఉంటుంది.

భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలి.

ఒకవేళ నీటిలో ఉన్నట్టయితే సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్లాలి.

ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది.

ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి.

ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిస్తే బయటకు వెళ్లకుండా పనులను వాయిదా వేసుకోవాలి.

ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు స్నానం చేయడం, పాత్రలు కడగటం ఆపేస్తే మంచిది. ఎందుకంటే లోహపు పాత్రలు, పైపుల ద్వారా ఒక్కసారిగా పెద్దమొత్తంలో విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది.

పిడుగు బారిన పడినప్పుడు శరీరంపై రెండు చోట్ల గాయాలవుతాయి. ప్రధానంగా విద్యుత్ ప్రవహించిన చోట, మళ్లీ బయటకు వెళ్లిన చోట(ఎక్కువగా అరికాళ్లపై) గాయాలు అవుతాయి.

బాధితులను ముట్టుకుంటే షాక్ తగులుతుందని కొందరు చెబుతుంటారు. కానీ అందులో నిజం లేదు.

బాధితులకు వెంటనే ప్రథమ చికిత్స అందించాలి.

*సేకరణ :*

*-- మల్లాప్రగడ రామకృష్ణ శర్మ 

'గుంటూరు చరిత్ర'..361

*

(సమాచార సేకరణ : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు)

గుంటూరు అంటే మిరపకాయ బజ్జీలు, జిన్నా టవరు, గోలీ సోడా లేక శంకర్ విలాస్ మాత్రమేనా?

శతాబ్దాల చరిత్ర నా గుంటూరు ....

ధాన్యకటకం రాజధానిగా క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలోనే విశాల సామ్రాజ్యాన్ని ఏలిన శాతవాహనుల చరిత్ర నా గుంటూరు. వీరికి కోటిలింగాల, జున్నూర్ అనే ప్రాంతాలలో కూడా రాజధానులు ఉండేవి.

కవిత్రయంలోని తిక్కన నడయాడిన చరిత్ర నా గుంటూరు.

మాచర్ల చెన్నకేశవుడి ఆశీస్సులతో ౘాపకూడు సిధ్ధాంతం ద్వారా సామాజిక న్యాయం కోసం నిలబడ్డ పల్నాటి బ్రహ్మనాయుడి చరిత్ర నా గుంటూరు.

కృష్ణరాయలుకే కొఱుకుడు పడని కొండవీటి రెడ్డి రాజుల చరిత్ర నా గుంటూరు.

అష్ట దిగ్గజాలకే తలమానికమైన రామకృష్ణ కవి నా గుంటూరు.

'కృష్ణం కలయసఖి సుందరం బాల కృష్ణం కలయసఖి సుందరం' అంటూ 'తరంగాలు' అందించిన నారాయణ దాసు నా గుంటూరు.

జ్యోతిష్యం లో మల్లాప్రగడ లక్ష్మణ రావు,  వ్యాఖ్యానంలో మల్లాప్రగడ రంగారావు, రామారావు 

అమరావతి కేంద్రంగా సుపరిపాలన అందించిన రాజా వాసిరెడ్డి వేంకట్రాది నాయుడు చరిత్ర నా గుంటూరు.

ముచుకుంద మహర్షి తపమాచరించిన గుత్తికొండ బిలం నా గుంటూరు. 

త్రేతాయుగంనాటిదని పేరు గాంచిన సీతానగరం నా గుంటూరు.

శిబి చక్రవర్తి తన తొడను కోసి పావురాన్ని రక్షించిన క్షేత్రం కపోతేశ్వరాలయమున్న చేజెర్ల చరిత్ర నా గుంటూరు.

అక్కరలో ఉన్నవారిని చేదుకునే కోటయ్య వెలసిన పుణ్య క్షేత్రం కోటప్పకొండ చరిత్ర నా గుంటూరు.

పానకాల స్వామిగా వినుతికెక్కిన నృసింహ క్షేత్రం మంగళగిరి నా గుంటూరు.

పంచారామాలలో ఒకటైన అమరావతి చరిత్ర నా గుంటూరు.

వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న పాత గుంటూరు అగస్తేశ్వరాలయం నా గుంటూరు.

ఇరవై నాలుగు అడుగుల ఆంజనేయుడు అండగా నిలబడిన పొన్నూరు నా గుంటూరు.

పేరెన్నికగన్న భావనారాయణుడు కొలువైన బాపట్ల నా గుంటూరు.

అనంతపద్మనాభుడు కొలువైన ఉండవల్లి గుహలు నా గుంటూరు.

సుదూర తీరాలనుండి వచ్చే వలస పక్షలు సంరక్షణ కేంద్రం ఉప్పలపాడు నా గుంటూరు.

ఆంగ్లో-ఫ్రెంచ్ యుధ్ధం జరిగిన ప్రాంతం (నేటి హిందూ కాలేజ్ ఉన్న ప్రాంతం) నా గుంటూరు.

'నీరు పెట్టావా, నారు పోసావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఎందుకు కట్టాలిరా శిస్తు?' అని బ్రిటీషు వారిని ఎదుర్కొని ముప్ఫై ఏళ్ళ ప్రాయంలోనే కన్నెఱ్ఱ చేసి ప్రాణత్యాగం చేసిన కన్నెగంటి హనుమంతు చరిత్ర నా గుంటూరు.

సామాజిక ఆనాచారం వల్ల శివ దర్శనానికి నోచుకోని ఒక అభాగ్యుడి వేదనను 'గబ్బిలం' ద్వారా వినిపించిన మహా కవి జాషువా చరిత్ర నా గుంటూరు.

కొప్పరపు కవుల చరిత్ర నా గుంటూరు.

పువ్వులంటే ముచ్చట పడే మహిళల చేతనే కన్నీరు పెట్టించిన కరుణశ్రీ నా గుంటూరు.

సంస్కృతాంధ్ర భాషల్లో అగ్రగణ్యులైన జమ్మలమడక మాధవరాయశర్మ, శ్రీ కృష్ణాచార్యుల చరిత్ర నా గుంటూరు. 

ప్రవచనాలకు నాంది పలికిన బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి నా గుంటూరు.

మహా కవులు, రచయితలు అయిన 'తెలుగులెంక' తుమ్మల సీతారామశాస్త్రి,  సత్యం శంకరమంచి, మునిమాణిక్యం నరసింహారావు, కొడవటిగంటి కుటుంబరావు, చలం, కవిరాజు త్రిపురనేని రామస్వామి,  రాయప్రోలు సుబ్బారావు, బలిజేపల్లి లక్ష్మీకాంతారావు, పండిత సత్యదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, ప్రముఖ రచయిత సంజీవ దేవ్, అధరాపురపు తేజోవతి, పాపినేని శివశంకర్, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఓల్గా,  దేవీప్రియ, శార్వరి వంటి వారిని కన్న నేల నా గుంటూరు.


జ్ఞానపీఠ్ ఎవార్డు గ్రహీత రావూరి భరద్వాజను కన్న నేల నా గుంటూరు. 


వేయి వసంతాల మానవ జీవన యానం, చరిత్రకెక్కని స్వాతంత్ర్య సమరయోధుల గురించి వ్రాసి నాకు మార్గదర్శకం చేసిన మా నాన్న గారు స్వర్గీయ విఠల్ రావు గారు నా గుంటూరు చరిత్ర.


మాంటిస్సొరి ఎడ్యుకేషన్ కు నాంది పలికి ఈనాడు మహావృక్షమైన శ్రీ వేంకటేశ్వర బాల కుటీర్, చేతన, ఉషోదయ, సంధ్యారాగం, రక్ష వంటి సంస్థల వ్యవస్థాపకులు మంగాదేవి గారు నా గుంటూరు.


ఎమ్సెట్ లేని రోజుల్లో మెడికల్ ఎంట్రన్స్ కు కోచింగ్ ఇవ్వడంద్వారా తెలుగునేల అంతా చిరపరిచితమైన సింహం శ్రీ చతుర్వేదుల విశ్వనాధమ్ ఎలియాస్ సివియన్ ధన్ గుంటూరు.


నాటక రంగంలో లబ్దప్రతిష్టులైన స్థానం నరసింహారావు, ఏ.వి. సుబ్బారావు, ఈలపాట రఘురామయ్య, కాళిదాసు కోటేశ్వరరావు, స్థానం వారి తరువాత స్త్రీ పాత్రలలో స్థానం సంపాదించిన బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి,  మాడభూషి వేంకట శేషాచారిలను అందించిన నేల నా గుంటూరు.


శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్ధ మహా సన్నిధానం నా గుంటూరు.


కుర్తాళం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిధ్ధేశ్వరానంద భారతి స్వామి నా గుంటూరు.


క్రీస్తు పూర్వం రెండు వందల ఏళ్ళ నాడే అబ్రకాన్ని కనుగొన్న భౌతిక వాది, బౌధ్ధుడు, రసాయనిక శాస్త్రాన్ని ఔపోసన పట్టిన నాగార్జునుడి చరిత్ర నా గుంటూరు.


సూర్య మండలంలో హీలియమ్ గ్యాస్ ను కనుగొన్న చరిత్ర నా గుంటూరు.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూరు వజ్రానికి పుట్టినిల్లు నా గుంటూరు.


బుఱ్ఱకధా పితామహుడు నాజర్ నా గుంటూరు.


బౌధ్ధ భిక్షువులకు ఆలవాలమైన భట్టిప్రోలు చరిత్ర నా గుంటూరు.


బ్రహ్మదేవునికి ఉన్న రెండే రెండు దేవాలయాల్లో ఒకటైన చేబ్రోలు నా గుంటూరు.


చేత వెన్న ముద్ద తో దర్శనమిచ్చే ప్రపంచంలోని ఏకైక శ్రీ కృష్ణ దేవాలయం ఉన్న సొలస గ్రామం నా గుంటూరు.


బ్రిటీషు వారి తుపాకులకు ఎదురొడ్డి నిల్చిన ఆంధ్రకేసరి పుట్టినిల్లు అలనాటి నా అవిభాజ్య గుంటూరు.


కోట్ల విలువైన ఆస్థిని స్వాతంత్ర్యం కోసం దేశానికి ఇచ్చివేసిన దేశభక్త కొండా వెంకటప్పయ్య నా గుంటూరు.


చీరాల-పేరాల ఉద్యమాన్ని నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నా గుంటూరు.


మూడు సార్లు నిషేధానికి గురైన నవల 'మాలపల్లి' రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నవ లక్ష్మీ నారాయణ నా గుంటూరు.


బాల వితంతువులను చేరదీసి విద్యాబుధ్ధులు గరిపి గౌరవప్రదమైన బ్రతుకులను ఇచ్చిన ఉన్నవ లక్ష్మీబాయమ్మ నా గుంటూరు.


నిస్వార్ధ సేవకు నిరుపమానమైన ఉదాహరణ వావిలాల గోపాలకృష్ణయ్య నా గుంటూరు.


దేశంలోనే మొట్టమొదటిసారిగా మునిసిపల్ ఆఫీసుపై మువ్వన్నెల ౙండా ఎగురవేసి బ్రిటీష్ అధికారాన్నే సవాలు చేసిన నడింపల్లి నరసింహారావు నా గుంటూరు.


రైతు లేనిదే దేశం లేదని అహర్నిశలు వారి శ్రేయస్సుకై పాటుబడ్డ గోగినేని రంగనాయకులు (N.G.Ranga) నా గుంటూరు.


ఐదుగురు ముఖ్యమంత్రులను, నలుగురు అసెంబ్లీ స్పీకర్లను అందించిన చరిత్ర నా గుంటూరు.


కేంద్ర కేబినెట్ లో ఒకే సమయంలో ఒకే జిల్లానుండి ఇద్దరు మంత్రులు ఉన్న ఏకైక జిల్లా నా గుంటూరు.


పొగాకు, మిర్చి, పత్తి, పసుపు వంటి వాణిజ్య పంటలకు నెలవు నా గుంటూరు. 


శాకంబరీదేవీ ప్రసాదం, ఆంధ్రశాకం గోంగూర నా గుంటూరు.


భగభగ మంటలు మండించే మిరప్పళ్ళ కారం నా గుంటూరు.


గలగలా పారే కృష్ణమ్మ కెరటాలతో సస్యశ్యామలమైన కృష్ణా డెల్టా నా గుంటూరు.


విద్యారంగానికి పంచ మాతృకలుగా విరాజిల్లుతున్న 135 సంవత్సరాల ఆంధ్ర క్రైస్థవ కళాశాల, వంద సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ కళాశాల, యాభై సంవత్సరాల వయసున్న జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల, తెల్లాకుల జాలయ్య పోలిశెట్టి సోమసుందరం కళాశాల, (మునిసిపాలిటీ ఆధ్వర్యంలో మహిళలకు కళాశాల ప్రారంభించి, తరువాత బ్రిటీష్ ప్రభుత్వానికి అంటగట్టిన లౌక్యుడు తెల్లాకుల జాలయ్య గారు) ప్రభుత్వ మహిళా కళాశాలల వైభవంతో Oxford of Andhra అని పేరుగన్నది నా గుంటూరు.


దేశ విదేశాలలో స్థిరపడ్డ తెలుగు వైద్యులలో అధిక శాతం గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్ధులే అన్నది జగమెరిగిన సత్యం. అది నా గుంటూరు.


గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ అంటే సామాన్య జనం నుండి కోటీశ్వరుడి వరకు అందరూ కోరుకునేదే.


Guntur is considered as Medical Hub of AP.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ, ప్రొ॥ వాసిరెడ్డి శ్రీ కృష్ణ, ప్రొ॥కె.సచ్చిదానంద మూర్తి, ప్రతి ఇంటా వినిపించే సుందరకాండ ఎమ్మెస్ రామారావు, ప్రవచన కర్త శ్రీ మైలవరపు శ్రీనివాసరావు నా గుంటూరు.


మెడికల్, ఇంజనీరింగ్ .... ఇప్పుడు CA కోచింగ్ లకు పుట్టినిల్లు నా గుంటూరు.


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చార్టర్డ్ ఎకౌంటెంట్, ICFAI Founder Governor నండూరి జ్యోతిర్మయి యశస్వి (N J YASASWI) నా గుంటూరు. 


శాస్త్రీయ సంగీత దిగ్గజం మంగళంపల్లి బాల మురళి గారి గురువు, త్యాగరాజ స్వామి శిష్య పరంపరలో ఒకరైన పారుపల్లి రామకృష్ణయ్య, పురాణం పురుషోత్తమ శాస్త్రి, కొమండూరి శేషాద్రి, కర్లపాలెం చంద్రమౌళి మరియు వారి శిష్యులైన నాదస్వర విద్వాంసులు షేక్ సుభానీ, కాలీషా దంపతులు (పద్మశ్రీ అవార్డుల గ్రహీతలు), రాజనాల వేంకట్రామయ్య, వింజమూరి వరదరాజయ్యంగారు,  సంస్కృతాంధ్ర పండితులు శ్రీమాన్ కొమండూరి సీతారామాచార్యులు నా గుంటూరు.


సినీ ప్రముఖులైన చక్రపాణి, వేమూరి గగ్గయ్య, గోవిందరాజుల సుబ్బారావు, నాగయ్య, ముక్కామల, కాంచనమాల, ఛాయా దేవి, సావిత్రి, జమున, కొంగర జగ్గయ్య, శారద, ప్రభ, దివ్యవాణి, జయలలిత, సుమలత, రాగిణి, బాలయ్య, గుమ్మడి, ధూళిపాళ, డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ, ఏవియస్, వీర నరసింహాపుర అగ్రహారీకురాలైన భానుమతి, కొసరాజు రాఘవయ్య, ముదిగొండ లింగమూర్తి, సియస్సార్, వంగర వెంకట సుబ్బయ్య, కె. విశ్వనాధ్, గాన కోకిల ఎస్. జానకి, మాధవపెద్ది సత్యం, గోఖలే, బ్రహ్మానందం, జీవా, ప్రదీప్ శక్తి, బోయపాటి శీను, కొరటాల శివ, పోసాని, సంగీత 'చక్రవర్తి', గాయని సునీత, గాయకుడు మనో, సినీ రచయిత మాడభూషి దివాకర బాబు, సంగీత దర్శకుడు, గేయ రచయిత వోగేటి నాగ వేంకట రమణ మూర్తి (స్వర వీణాపాణి), హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి, సూర్యదేవర రామమోహనరావు, సినీ, టి.వి. సీరియల్ రచయితలు గూడూరు విశ్వనాధ శాస్త్రి, మాడభూషి వేంకటేష్, సినీ రచయితలు, దర్శకులు అయిన బుర్రా సాయి మాధవ్, రాజేంద్ర భరద్వాజ, క్రిష్ జాగర్లమూడి, కే.యస్. రవీంద్ర, బయ్యవరపు వేంకటేశ్వరరావు, గుంటూరు శాస్త్రిగా ప్రసిధ్ధి చెందిన GSRK శాస్త్రి, నాటక, సినీ రచయిత ృశ్నేశ్వరరావు, నాటక రంగ ప్రముఖుడు నాయుడు గోపి నా గుంటూరు.


పారిశ్రామికవేత్తలలో సుప్రసిధ్ధులైన వెలగపూడి రామకృష్ణ ICS నా గుంటూరు.


యువ డాషింగ్ & రెబల్ క్రికెటర్ అంబటి రాయుడు నా గుంటూరు. చదరంగంలో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక నా గుంటూరు.


పిడుగురాళ్ళ, రాగి నిక్షేపాల అగ్నిగుండాల, నరుకుళ్ళపాడు, ఫిరంగిపురం .... ఈ పేర్లు వింటేనే ప్రత్యర్ధికి కాళ్ళు వణుకుతాయి. అదీ నా గుంటూరు.


శిల్పకళకు నెలవు దుర్గి నా గుంటూరు.


విప్లవ నాయకుడు అక్కిరాజు హరగోపాల్ నా గుంటూరు.


మొట్టమొదటగా 1913 లో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నినదించింది నా గుంటూరు ....


గోంగూరంటే ముందుంటాం. మిరప్పళ్ళ కారం మాదేనంటాం.


దేనికైనా ముందుంటాం .... 


మాటలో సూటిదనం, నిక్కచ్చితనం, పొగరు, విగరు ఉన్నదే నా గుంటూరు ....


ఇంతటి ఘన చరిత్ర ఉన్న ప్రాంతాన్ని మీకు పరిచయం చేసిన #అధరాపురపు_మురళీ_కృష్ణ పుట్టి పెరిగిన ఊరు గుంటూరు ....


ఇదీ గుంటూరు అంటే ....


(ఈ సమాచార సేకరణకు సహకరించిన Divakara Babu Madabhushi గారికి, 'గుంటూరు నాటకరంగ చరిత్ర' గురించి తెలియచేసిన శ్రీ కందిమళ్ళ సాంబశివరావుగారికి, వికీపీడియా వారికి, ప్రోత్సహించిన Sai Ram Bulusu గారికి, శ్రీ అచ్యుత్ కు కృతజ్ఞతలు)


(10-11-2021 నాడు మొదలపెట్టిన కధనం 18-06-2022 నాటికి పూర్తయింది).

*🧘‍♂️చిదానంద రూప శివోహం శివోహం🧘‍♀️*362.


వ్యక్తి మనసులో ఏ కాంక్షలు లేకుండా ఉండాలి. మనసు శూన్యంగా మారాలి. నిర్మలత్వంతో నిండిపోవాలి. అప్పుడు అతను అపూర్వ శక్తితో నిండిపోతాడు. అద్భుతమైన చైతన్యం అతన్ని ఆవహిస్తుంది. అతనికి ఆ స్పృహ ఉండదు. అప్పుడు అతనిలో ప్రతీదీ సహజంగా పరివర్తన చెందుతుంది. సూర్యోదయం జరిగినట్లు, చంద్రుడు 🌒 ఉదయించినట్లు, పూలు వికసించినట్లు, నది ప్రవహించినట్లు ప్రతీదీ అప్రయత్నంగా నిర్నిమిత్తంగా జరిగిపోతుంది. అక్కడ అన్ని చలనంలో ఉంటాయి. అన్ని సహజంగా జరుగుతాయి. కానీ వాటన్నిటినీ నిర్వహిస్తున్నాను అన్న అహంకారం అతనికి ఉండదు. 

ఒక ప్రాచీన రోమన్ కథ ఉంది. అది గొప్ప కథ. గొప్ప సత్యాన్ని నిక్షిప్తం చేసుకున్న కథ. ఒక సన్యాసి ఉదాత్తమైన జీవితం గడిపాడు. అతనికి ఎలాంటి స్వార్థ చింతన లేదు. ఏ కోరికలూ లేవు. ఏదో సాధించాలి అని అతను ఎప్పుడూ అనుకోలేదు. నిర్మలంగా , నిశ్చింతగా జీవించాడు. అతని సహజ జీవితం స్వర్గం దాకా వ్యాపించింది. అతను సాధారణంగా జీవించాడు. కానీ లోక దృష్టిలో అది అసాధారణం . కాంక్షలు లేని మనిషిని లోకం విచిత్రంగా చూస్తుంది. ఆ వ్యక్తి జౌన్నత్యానికి దేవతలు ఆశ్చర్యపడ్డారు. అటువంటి వ్యక్తి కోసం ఏమైనా చేయాలని సంకల్పించారు.

ఒక రోజు దేవతలు అతని ముందు ప్రత్యక్షమయ్యారు. దేవతలను చూస్తూనే అతను భక్తితో, నమ్రతతో వాళ్ళకు ప్రణమిల్లాడు. “ నాలాంటి సామాన్యుడి పట్ల దయతో మీరు రావడం నా అదృష్టం . మీరు నన్ను ఏం చేయమంటారో ఆజ్ఞాపించండి " అన్నాడు. దేవతలు " మేం నీకు ఆజ్ఞలివ్వడానికి, ఆదేశాలు జారీ చేయడానికి రాలేదు. నువ్వు నీదంటూ ఏమీ లేనివాడివి! నీ గురించి ఎప్పుడూ ఆలోచించని వాడివి. నిస్వార్థపరుడివి. నిరాడంబరుడివి. అలాంటి నీ కోసం ఏమైనా చేయాలనిపించి మేము వచ్చాం! నీకు ఇష్టమైన కోరికను కోరుకో. నువ్వు ఏమీ అడిగినా ఇస్తాం" అన్నారు దేవతలు! 

దానికి ఆ సన్యాసి " మీరు నా పట్ల ఇంత దయగా ప్రవర్తించినందుకు ధన్యవాదాలు. నాకు సంబంధించిన కోరికలు అంటూ ఏమి లేవు. దైవం ఏది సంకల్పించిందో అదంతా యథాతథంగా జరుగుతోంది. మీరు ఇంతగా అడుగుతున్నారు. కాదంటే బాగుండదు. కానీ నాకు ఏమి అడగాలో తెలియడము  లేదు. నేను ఊహించినవే కాదు. నేను ఊహించనవి కూడా దైవం నాకు ఇచ్చింది" అన్నాడు.

అతని వినమ్రతకు దేవతలు మరింతగా అతన్ని ఇష్టపడ్డారు. కారణం అతను కాంక్షా తీరానికి అతీతంగా ఉన్నాడన్న విషయం వాళ్ళకు తెలిసి వచ్చింది. కానీ అతనికి ఏదో చేయాలన్న తపన వాళ్ళలో పెరిగింది. " నువ్వు వద్దు అంటున్నావు. కానీ మాకు ఏదైనా నీ కోసం చేయాలని ఉంది. కాబట్టి దయచేసి ఏదైనా  కోరుకో. మేం నీకు వరం ఇవ్వనిదే కదలం" అన్నారు.

సన్యాసి సంకటంలో పడ్డాడు. తప్పించుకునే వీలు లేదు. సరే! ఏం కోరాలో నాకయితే తెలియదు. మీకు ఏది మంచిది అనిపిస్తే ఆ వరం ఇవ్వండి" అన్నాడు. దేవతలు అతను ఒప్పుకున్నందుకు సంతోషించి " నీకు గొప్ప వరం ఇస్తున్నాం. మరణించిన వారిని నువ్వు తాకితే వాళ్ళు బతికి లేచి కూర్చుంటారు" అన్నారు.! ఆ వరంతో సన్యాసి ఆలోచనలో పడ్డాడు. " మీరు అన్యధా భావించకండి. ఇలా చనిపోయిన వాళ్ళను బతికిస్తున్నాను అన్న స్పృహ ఉంటే నాలో అహంకారం పెరుగుతుంది. దయచేసి మీరు ఏ వరం ఇచ్చినా ఆ వరం యొక్క స్పృహ నాకు లేకుండా చేయండి" అని ప్రార్థించాడు.

ఆ మాటలు విని దేవతలు మరింతగా ఆనందించి " నీ నీడ ఎక్కడ పడినా అక్కడ చనిపోయిన అన్నీ తిరిగి బ్రతుకుతాయి" అని వరం ఇచ్చి అదృశ్యం అయ్యారు.

వాళ్ళు వరం ఇచ్చారు.! ఆ వరం యొక్క స్పృహ ఆ సన్యాసికి లేదు. ఆయన తన పనుల్లో తాను ఉండేవాడు. ఆయన నీడ పడిన చోట ఎండిపోయిన పచ్చిక చిగురించేది. చనిపోయిన ప్రాణులు బ్రతికేవి. కానీ ఇదంతా ఆయనకు తెలిసేది కాదు. ఆయన తన దారంటే తాను వెళుతూ ఉండేవాడు. నీడ పడిన చోట నిత్యవసంతం ఉండేది. ఆ సన్యాసి  స్వర్గానికి వెళ్ళినప్పుడు దేవతలు “ మీకిచ్చిన వరం ఎంతవరకూ పని చేసింది? “ అని అడిగారు. అదేమీ తెలియదు - గుర్తించలేదు అన్నాడు తత్వజ్ఞాని. అహంకారం ఉన్నప్పుడు కాంక్షలు ఉంటాయి. అవి ఏమీ లేనప్పుడు సర్వమూ శూన్యంగా ఉంటాడు తత్వవేత్త అయిన జీవన్ముక్తుడు. 

బంధాలు కలిపేది మాటే....

                     బంధాలు తెంచేది మాటే....

                     గాయాలు చేసేది మాటే..... 

                   గాయాలు మాన్పెది మాటే.... 

                      ప్రాణం పోసేది మాటే.....

                      ప్రాణం తీసేది మాటే.....    

                  మాటే నిన్ను గెలిపిస్తుంది.... 

                  మాటే నిన్ను ఓడిస్తుంది..... 

                  మాట్లాడే ముందు జాగ్రత్త...!!!

త్రికరణ శుద్ధితో జీవించు ! 

త్రిగుణాతీతుడవై జీవించు ! 

త్రిగుణరహితుడవై బయలున బయలై ఉండుము ! 

*కర్మలు భక్తి తో చేయవచ్చు. నిష్కామముగా చేస్తే అది, ఫలాపేక్ష లేని కర్మలు చిత్తము శుద్ధమగుటకు ఉపయుక్తమై నిరాకారమైన  పరమాత్మ స్థితిని పొందుటను అనుభూతి చెందుతారు.*

*నిర్విరామముగా నిర్వికారము - నిరాకారము అయిన పరమాత్మ యందు ఏకాగ్రత - అనన్య భక్తి - చిదానంద రూప శివోహం అనెడి స్వరూప జ్ఞానమే లక్ష్యము - లక్షణము - కోహం - సోహం - కట్ట కడపటికి నాహం - అజం - అచలం.*

......

* అగ్నిపధ్ .. 363

కేంద్రం సైన్యం లో చేరాలని దేశ సేవ చేయాలని ఉన్న వారి కోసం అగ్నిపధ్ అనే నియామక ప్రక్రియ నీ తీసుకొని వచ్చింది...మోడీ ఏమీ చేసిన వ్యతిరేకం అనే ప్రతిపక్షాలు దీన్ని కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి...కాంగ్రెస్ దాని తోక పార్టీ లు ఇప్పుడే కాదు కాశ్మీర్ కి ఆర్టికల్ 370d రద్దు చేసి కాశ్మీర్ నీ భారత్ లో కలిపిన కూడా దేశ వ్యాప్తం గా గొడవ లు చేశాయి....

అసలు అగ్నిపధ్ వల్ల ఉపయోగం ఎంటో చూద్దాం...

ఇజ్రాయిల్ లాంటి దేశాల లో 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి సైన్యం లో  మూడు నాలుగు పని చెయ్యాలి.... అలా ఉండటం మూలం గానే ఇజ్రాయిల్ లాంటి దేశాల లో 100 శాతం దేశ భక్తులు ఉంటారు...ఇజ్రాయిల్ చుట్టూ మొత్తం ముస్లిం దేశాలు ఉన్న కూడా ఇజ్రాయిల్ వైపు కన్ను ఎత్తి కూడా చూడలేవు......ఎందుకంటే ఆ దేశం లో ప్రతి వ్యక్తి సైన్యం లో పని చేసి బయటకు రావడం మూలం గా  అందరూ దేశం కోసమే పని చేస్తారు...

ఇప్పుడు మన దేశం లో ప్రవేశ పెట్టిన అగ్ని పద్ కూడా అటువంటిదే...
18 ఏళ్ల నుండి 21 ఏళ్ల యువకులకు సైన్యం లో తీసుకొని ఎంపిక అయిన వారి కి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి నెల కు 30000 ల నుండి 40000 రూపాయల జీతం ఇచ్చి 4 ఏళ్ల తరువాత వారి లో సామర్ధ్యం ప్రతిభ నీ బట్టి 25 శాతం మంది  నీ వారు మళ్ళీ అప్లై చేస్తే శాశ్వతం గా సైన్యం లోకి తీసుకుంటారు...4ఏళ్లు నిండిన వారికి 12 లక్షల రూపాయలు సర్టిఫికేట్ ఇచ్చి గౌరవం గా
పంపిస్తారు....
దీని లో కేంద్రం ఉద్దేశం ఎంటి అంటే...


 18 ఏళ్ల నుండి 21 ఏళ్ల లో ఖాళీ గా ఉండే యువత చెడు దారుల కు వెళ్లకుండా సైన్యం లో చేరితే మంచి వాడు గా ఉంటాడు..దేశ భక్తుడు అవుతాడు...18 ఏళ్ల నుండి 21 ఏళ్ల మధ్యలో మంచి గా సంపాదన పరుడు అవుతాడు బాధ్యత కల పౌరుడు అవుతాడు అనే మంచి ఉద్దేశం తో ఈ పథకం పెట్టారు...జాబ్ లు రాక 30 ఏళ్ల వరకు వేచి చుచే కంటే ఈ పథకం బాగానే ఉంది కదా...అలాగే 4 ఏళ్లు పూర్తి గా సైన్యం లో పని చేసిన వారి నీ  అన్ని ప్రవైట్  కంపెనీ లు తీసుకుంటాయి....లేదా ప్రభుత్వం ఇచ్చే 12 లక్షల తో ఎదైన వ్యాపారం చేసుకోవచ్చు....
 

కాంగ్రెస్ ప్రతిపక్షాల భయం ఎంటి అంటే యువత ఇలా సైన్యం లో జాయిన్ అయితే వారికి ఎవ్వరూ ఓటు వెయ్యరు...వారు ఇచ్చే బీర్ బిర్యానీ కి డబ్బు లకు సైన్యం లో పని చేసిన వచ్చిన వాడు ఎవ్వరూ ఆశ పడి ఓటు ,..అయిన బస్ లు రైల్ లు తగల బెట్టే వారు..ప్రభుత్వ ఆస్తులు తగల Bette వారు సైన్యం లోకి ఎలా వెళ్తారు..దేశ భక్తుడు ఎలా అవుతాడు.....కాంగ్రెస్ కి ఇటువంటివి అన్నీ అలవాటే...రాహుల్ గాంధీ నీ స్కాం లో ED ప్రశ్న లు వేస్తే అలా ఎందుకు పిలుస్తారు అంటూ దేశం మొత్తం గొడవ చేస్తున్నారు అంటే ఎంత సైకోగాల్లో అర్థం అవుతుంది...మోడీ గుజరాత్ సీఎం గా ఉన్నపుడు ఆ రోజు కేంద్రం లో అధికారం లో ఉన్న కాంగ్రెస్ సీబీఐ తో 10 గంటలు విచారణ చేయించారు..అమిత్ షా నీ కూడా అంతే... అయిన ఆ రోజు బీజేపీ వారు ఎక్కడ గొడవ లు చెయ్యలేదు..విచారణ ఎదురుకొని బయటకు వచ్చారు...కాంగ్రెస్ దేశం లో చాలా మంది నాయకుల పై సీబీఐ కేసు లు పెట్టింది...అంటే కాంగ్రెస్ ఉద్దేశం లో సీబీఐ ed కేసు లు ఉన్న వారు మొత్తం బస్ లు రైల్ లు తగల పెట్టాలి అని ఉద్దేశమా....తప్పు చెయ్యని వారికి విచారణ కు వెళ్లి చెప్పటానికి భయం ఎందుకు...?దేశ వ్యాప్తంగా గొడవ లు చెయ్యటం ఎంటి...? ఇలా చేసే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది.... sekarana vadsp 

___((()))___


* ఓం నమ:శివాయ -- 364

* అర్హ పరమార్ధ యెఱుకయు ఆట కాదు
శివుని ఆజ్ఞ లేనిది ఏది స్థిరము కాదు
జ్ఞానులను చుల కన వల్ల జ్ఞప్తి పోవు
చీమనుంచి బ్రహ్మవరకు చేష్ట లు శివ   
              
’శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు!' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే.    సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం.

శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం.

అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.

* శివ శివాను నాలుక సృష్టి సేతు బంధు  
శివ శివాను కన్నుల రక్తి సిరుల చూపు
శివ శివాను చేతులు శక్తి స్థిరముచేయు
శివ శివాను స్మరణ యుక్తి సేవ కొరకు

శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే…శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు,  శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు..

పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు.

ఓం ఓం ఓం
హరాశంకరా వందనందిగంబరా వందితాపురంధరా
యిందుధరా దురంధరా  హిమాచల గ్రమందిరా

ఓం నుమ::శివాయ -- ఓం నుమ::శివాయ--ఓం నుమ::శివాయ
 
అదే 'శివసిద్ధి'.

అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు.

పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే. శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.

జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.
___((()))___
 

 
* ఇదే లోకమ్ తీరు ---365
                 అన్ని తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు.. చీమలు, పక్షులు, పశువులు..
ఆ చెట్టుకిందకి  నీడ కోసం వస్తాయ్....
            జీవితం కూడా అంతే సమయం వచ్చే వరకు వేచివుండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక మాత్రమే.....        
          లైఫ్ లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు.. జీవితంలో ఉన్న వాళ్ళు
శ్వతం అని భావించకు..
           ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు...  నీకు నీవే ధైర్యం కావాలి.....
 నీకు నువ్వే తోడుగా నిలబడాలి...

           లోకులు కాకులు, మనిషిని చూడరు, మనస్సును చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు.
  కనిపించింది,  వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు,
   ఒక్కోసారి మన కళ్ళే  మనల్ని మోసం చేస్తాయి  మరొకసారి చెప్పుడు మాటలు                      జీవితాలను  తలకిందులు చేస్తాయి
అబద్దాలతో, మోసాలతో కీర్తి, ప్రతిష్టలను  ఎంత గొప్పగా నిర్మించుకొన్నా..   అవి కుప్పకూలి పోవడానికి  ఒక్క "నిజం"చాలు. అందుకే కష్టమైనా సరే  నీతిగా బ్రతకడమే మనిషికి  ఉత్తమ మార్గం. ఒక చిన్న మొక్కనాటి  ప్రతిరోజూ వచ్చి కాయకాసిందా అని  చూడకూడదు.

             ఎందుకంటే అది పెరగాలి  మొక్క వృక్షం కావాలి  పుష్పించాలి, పిందెలు రావాలి
 అవి కాయలై , పండితే తినగలం.  అలాగే నేను ఇది కావాలి  అనే కోరిక కూడా మొలకై
 వృక్షమై ఫలవంతం అవుతుందని తెలిసి   మసలుకోండి సన్నిహితులారా

        జీవితంలో కష్టము, కన్నీళ్ళు, సంతోషము, బాధలు  ఏవి శాశ్వతంగా ఉండవు,
 కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు  ఆనందం, ఆవేదన కూడా అంతే.

              నవ్వులూ, కన్నీళ్ళూ  కలగలసినదే జీవితం  కష్టమూ శాశ్వతం కాదు,
సంతోషమూ శాశ్వతమూ కాదు.                 

                   ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే  జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి
చెడిపోతే ఎలా  బాగుపడాలో? నేర్చుకోవాలి,   గెలుపును ఎలా పట్టుకోవాలో  తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే  గొప్ప వారు నేస్తమా !

              దెబ్బలు తిన్న రాయి  విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది....  ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసిన వాడు  మహనీయుడు అవుతాడు...  ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు   ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు...  డబ్బుతో ఏమైనా   కొనగలం అనుకుంటున్నారా?

             *అయితే కొనలేనివి ఇవి ఉన్నాయి.  మంచం పరుపు కొనవచ్చు  కానీ నిద్ర కాదు గడియారం కొనవచ్చు  కానీ కాలం కాదు, మందులు కొనవచ్చు  కానీ ఆరోగ్యం కాదు, భవనాలు కొనవచ్చు  కానీ ఆత్మీయత  కాదు, పుస్తకాలు కొనవచ్చు  కాని  జ్ఞానం కాదు, పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు  కాని  జీర్ణశక్తిని కాదు
      
ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి, స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే పాప విముక్తులు కావాలి,తలక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమైతే ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి,
ఇదే లోకమ్ తీరు  

No comments:

Post a Comment