Monday, 20 June 2022

331---335


తరతరాలుగా మనం  వింటున్న, క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. . *


💎 సోమవారం తలకు నూనె 

       రాయరాదు.


 💎 ఒంటి కాలీపై నిలబడ రాదు.


 💎 మంగళ వారం పుట్టినింటి నుండి 

       కూతురు అత్తారింటికి వెళ్లరాదు.


💎 శుక్రవారం నాడు కొడలిని 

       పుట్టినింటికి పంపరాదు.


 💎 గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి 

        తేవాలీ.


 💎 ఇంటిలోపల గోళ్ళు కత్తిరించరాదు.


💎 మధ్యాహ్నం తులసి ఆకులు 

       కోయరాదు.


💎 సూర్యాస్తమయం తరువాత 

      కసవువూడ్చరాదు, తల దువ్వరాదు.


 💎 పెరుగును ఉప్పును అప్పు 

       ఈయరాదు.


💎 వేడి వేడి అన్నంలోనికి  పెరుగు 

       వేసుకోరాదు.


💎 భోజనం మధ్యలో లేచిపోరాదు.


 💎 తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు.


💎 గడపపై పాదం పెట్టి వెళ్లరాదు.


💎 ఇంటినుండి బయటకు 

      వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు


💎 గోడలకు పాదం ఆనించి 

       పడుకోరాదు.


 💎 రాత్రీ  వేళలో బట్టలుతకరాదు.


💎 విరిగిన గాజులు వేసుకోరాదు.


💎 నిద్ర లేచిన తరువాత పడుకున్న 

       చాపను మడిచి పెట్టాలి.


💎 చేతి గోళ్ళను కొరకరాదు.


 💎 అన్న తమ్ముడు,తండ్రి కొడుకు 

        ఒకే సారి క్షవరం చేయించుకోరాదు.


 💎 ఒంటి (సింగల్) అరిటాకును 

        తేరాదు.


💎 సూర్యాస్తమయం వేళలో నిద్ర 

       పోరాదు.


💎 కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను 

      మరచిపోరాదు.


 💎 ఇంటి గడపపై కూర్చోరాదు.


💎 తిన్న తక్షణమే పడుకోరాదు.


💎 పెద్దల సమక్షంలో కాలుపై కాలు 

      వేసుకుని / కాళ్ళు చాపుకుని 

      కూర్చోరాదు.


💎 చేతులు కడిన పిమ్మట 

      ఝాడించరాదు.


 💎 రాత్రి భోజనం తరువాత పళ్ళెం 

       కడుక్కోవాలి.


💎 ఎంగిలీ చేతితో వడ్డించరాదు.


 💎 అన్నం, కూర చారు వండిన 

        పాత్రలలో తినరాదు.


💎 సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు 

      కడగరాదు.


💎 ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, 

      ముత్తైదువలకు పసుపు కుంకుమ 

      ఇవ్వకుండా  పంపరాదు.


💎 చిరిగిన అంగీలు, బనియన్లు 

      తదితరలో దుస్తులను ధరించరాదు.


💎 ఇంటి లోపలికి చెప్పులు/ Shoes 

      ధరించిరారాదు.


 💎 దేవాలయాలలో చెప్పులు పోతే 

       మరచిపొండీ. వేరే వాళ్ళది వేసుకొస్తే

       దారిన పోయే దరీద్రాన్ని ఇంటికి 

       తెచ్చినట్టే.


 💎 చిన్న జంతువులకు  (కుక్కలు, 

       దూడలు లాంటివి) పాచిపోయిన

       పదార్థాలు పెట్టకండి.


💎 ఒకరు వేసుకున్న బట్టలు, 

      ఆభరణాలు మరొకరు ధరించరాదు.


💎 ప్రయాణాల్లో అపరిచితులనుండి 

       పానీయాలు, తీడి పదార్థాలు 

       తీసుకోవద్దు.


💎 శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు.


💎 అనవసరంగా కొత్త చెప్పులను 

       కోనరాదు.


💎ఇంటిలో వాడకుండా పడివున్న గోడ 

      గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు 

      మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి.


💎 భగవంతుణ్ణి అది కావాలి ఇది 

      కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు

      కాకండి. మీకు రావలసివుంటే 

      అవే వస్తాయి.


💎 అర్హులకు మాత్రమే గుప్త దానం 

      చేయండి.


💎మఠాలు దేవాలయాకు చెందిన 

     వస్తువులు దురుపయోగం చేస్తే 

     మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష 

     పడుతుంది.


💎 ఇతరులను అనవసరంగా 

      విమర్శించడం, మిమ్మలిని మీరు 

      పొగడుకోవడం మానండి.


💎 మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం 

      కావు. ఇతరులను ఎదగనివ్వండి. 

      మీరు వారికి గురువులాగా 

       ప్రవర్తించండి.


మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి.


కారు మేఘాలు కమ్ముతున్నాయి 

ఏక్షణంలో అయినా... 

వర్షం విపరీతంగా కురుస్తుంది...! 

వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !అయినా..ఆమె ముగ్గువేస్తోంది... !

      *అదీ..సంప్రదాయం!* 

             ....................


అంతర్జాతీయ ఖ్యాతినార్జించి

అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా 

పాఠాలు చెప్పిన పంతులుకు 

పాదాభివందనం చేస్తాడు…! 

        *అదీ .. సంస్కారం !* 

              .....................


ఖగోళ శాస్త్రాన్ని 

నమిలి మింగిన నిష్ణాతుడు.  

నిష్టగా ఉంటూ

గ్రహణం విడిస్తేగానీ... 

ఆహారం గ్రహించడు…! 

       *అదీ .. నమ్మకం  !* 🙏

             ....................


పరమాణు శాస్త్రాన్ని 

పిండి పిప్పిచేసిన పండితుడు. 

మనవడి పుట్టు వెంట్రుకలు 

పుణ్యక్షేత్రంలో తీయాలని 

పరదేశం నుండి పయనమై వస్తాడు…! 

        *అదీ .. ఆచారం !* 

            ..............................


అంతరిక్ష విజ్ఞానాన్ని

అరచేతబట్టిన  అతిరధుడు. 

 అకుంఠిత నిష్ఠతో

పితృదేవతలకు 

పిండ ప్రదానం చేస్తాడు…!

 *అదీ .. సనాతన ధర్మం!* 

           ........................


అత్తింటికి వెళ్లేముందు 

ఇంటి ఆడబడుచు 

పెద్దలందరికీ 

పాదాభివందనం చేసి 

పయనమవుతుంది…! 

       *అదీ .. పద్ధతి !* 

         ........................


పెద్ద చదువులు చదివినా 

పెద్ద కొలువు చేస్తున్నా 

పేరు ప్రఖ్యాతులున్నా 

పెళ్లి పీటలమీద .. వధువు

పొందికగా ఉంటుంది…!

     *అదీ .. సంస్కృతి!*

       ...........................


భార్య పక్షవాతానికి లోనయ్యింది. 

మంచం దిగలేని పరిస్థితి 

తనంతట తానుగా.. 

తనువీడ్చలేని స్థితి.

భర్త భరోసాగా నిలచి..భారమంతా మోస్తాడు-అన్నీతానై .. అలిని  సాకుతాడు…!

       *అదీ .. దాంపత్యం!*

             .....................


బ్రతికే అవకాశం తక్కువ

వెంటిలేటర్ పై వేచిచూస్తే

బ్రతికితే బ్రతకొచ్చు!

లక్షల ఖర్చు భరిస్తూ

వెంటిలేటర్ పై పెడతారు… !

          *అదీ .. అనుబంధం!*


*ఇవి భారతీయుల తరతరాల ఆచారాలు, సంప్రదాయలు, విలువలు, ఔన్నత్యం కొన్ని మాత్రమే*

[17/06, 3:49 pm] Mallapragada Sridevi: *స్వేచ్ఛ..!*


మాటల్ని వల్లించడం సత్యం కాదు. శాస్త్రాల్ని తెలిసి ఉండడం సత్యం కాదు. మనిషి మాటల్లో మునిగిపోయాడు. మనిషి చెఱసాలలో ఉన్నాడు. కానీ తాను స్వేచ్ఛగా ఉన్నానని అనుకుంటున్నాడు. 


అట్లాంటి మనిషికి స్వేచ్ఛ ఇచ్చినా అతను దాన్ని అనుభవించలేడు. బానిసత్వానికి అలవాటు పడితే మనిషికి స్వాతంత్య్రమిచ్చినా స్వీకరించలేడు. 


వాదాలతో, శాస్త్రాలతో, మాటలలో సత్యం మరుగున పడిపోయింది. అందువల్ల మనం వాటికి అలవాటు పడిపోయాం. సత్యాన్ని గుర్తించే అర్హతను కోల్పోయాం. 


దీన్ని బట్టి ఎవరయితే అస్థిత్వాన్ని గుర్తించలేరో, తమ లోలోతుల్లోకి వెళ్లి తమ అసలు స్వరూపాన్ని చూడలేరో వాళ్లు సత్యాన్ని గ్రహించలేరు. 


ఒక పర్వతం మీద ఒక సత్రం ఉండేది. దూర ప్రయాణాలు చేసేవాళ్లు అందులో బస చేసేవాళ్లు. పుణ్యక్షేత్రాలు దర్శించుకునే వాళ్లు ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్లు. ఎందుకంటే ఆ పర్వతం మీద గొప్ప ఆలయముంది. ఆలయాన్ని సందర్శించాలనుకున్న వాళ్లు ఆ సత్రంలో దిగేవాళ్లు.


ఆ సత్రం యజమాని దగ్గర ఒక చిలుక ఉండేది. దాన్ని పంజరంలో పెట్టి సత్రం ముందు పంజరాన్ని వేలాడదీశాడు. దాన్ని ఎంతో ముద్దుగా చూసుకునేవాడు. దానికి పళ్ళు, ఫలాలు తినిపించేవాడు. దానికి స్వేచ్ఛ అన్నమాట నేర్పించాడు. అది ఎప్పుడూ ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటల్ని వల్లిస్తూ ఉండేది. 


సత్రంలో దిగిన వాళ్లకు గొప్ప వినోదంగా ఉండేది. వాళ్ళు కూడా దానికి తినడానికి ఏమైనా పెట్టేవాళ్లు. వాళ్ళు పెట్టినది తింటూ అది ‘స్వేచ్ఛ,స్వేచ్ఛ’ అని అరుస్తుండేది. రాత్రయినా పగలయినా అవే మాటల్ని వల్లిస్తూ ఉండేది. 


నిజానికి ఆ పక్షికి స్వేచ్ఛ అనే మాటకు అర్థం తెలీదు. అది ఉన్నది పంజరంలో. తను స్వేచ్ఛగా లేనని, పంజరంలో ఉన్నానని, స్వేచ్ఛ అనే మాటకు తనకు అర్థం తెలీదని దానికి స్పృహ లేదు.


ఇట్లా ఉంటే ఒక సారి …. వివేకవంతుడయిన ఒక వ్యక్తి ఆ సత్రంలో దిగాడు. చీకటిపడుతుండగా ”స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటలు వినిపించడంతో చుట్టూ చూశాడు. సత్రం ముందు పంజరంలో చిలుక ఆ మాటలు వల్లిస్తున్నట్లు తెలుసుకుని విస్తుపోయాడు. 


పంజరం దగ్గరకు వచ్చి నిలుచున్నాడు. అతన్ని చూసి చిలుక ”స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అంది. 


అది స్వేచ్ఛగా లేదని ఆమాటకు దాని అర్థం తెలీదని అది పంజరంలో ఉందని అతనికి తెలుసు. 


అతనికి స్వేచ్ఛ అంటే ఏమిటో స్వాతంత్య్రమంటే ఏమిటో తెలుసు. 


అతను వెంటనే పంజరం తలుపు తెరచి చిలుకను బయటకు లాగడానికి ప్రయత్నించాడు. 


ఆ చిలుక బయటకు రావడానికి ఇష్టపడలేదు. అతను బలవంతంగా బయటకు తీసి వదిలిపెట్టినా మళ్లీ పంజరంలోకి వెళ్లింది. ఎప్పటిలా ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అని అరవడం మొదలుపెట్టింది. 


రెండుమూడు సార్లు అతను ప్రయత్నించాడు. చివరకు నాలుగోసారి దాన్ని పట్టుకుని దూరంగా వెళ్లి ఆకాశంలోకి వదిలిపెట్టాడు. అది ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అంటూ ఎగిరిపోయింది.


ఆవ్యక్తి ఆనందంతో సత్రానికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. తెల్లవారు జామునే ‘స్వేచ్ఛ!స్వేచ్ఛ!’ అన్న మాటలు వినిపించాయి. 


నిద్రమత్తు వదిలించుకుని అతను లేచి సత్రం ముందుకు వచ్చి చూశాడు. చిలుక పంజరంలో దూరి ‘స్వేచ్ఛ!స్వేచ్చ!’ అంటూ ఉంది.

[17/06, 3:55 pm] Mallapragada Sridevi: ఓ వ్యక్తి నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు భగవంతుడిని ఇలా ప్రార్ధిస్తుంటాడు.. “భగవంతుడా. నాకోసం ఒక్క సహాయం చెయ్యి, కేవలం ఒకే ఒక్కటి, ఈ సహాయం తప్ప నాకు ఇంకేమి వద్దు.. నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడు నిన్ను ఏ కోరికా కోరను, ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు”. “ఈ లోకంలో నాకున్న కష్టాలు ఇంకెవ్వరికి లేవు, నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాశ నాకు లేదు, కాని నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చి అతని కష్టాలు నాకివ్వు చాలు (ఎందుకంటే తన కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ కష్టాలు అని అతని భ్రమ)..” నాకు ఇంకేమి వద్దు.. ఈ ఒక్క కోరిక తీర్చు..! అని ఆ వ్యక్తి ప్రతిరోజు వేడుకుంటాడు.


నెలల తరబడి ఆ వ్యక్తి అడుగుతున్న కోరిక భగవంతునికి చేరింది.. ఆరోజు రాత్రి భగవంతుడు అతని కలలోకి వచ్చి ఇలా చెప్పాడు. “కుమారా.. నువ్వు ప్రతిరోజు నాకు చెబుతున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతున్నా.. అందుకోసం ముందుగా నువ్వు ఒక పని చెయ్యాలి.. నీ కష్టాల చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నా దేవాలయానికి తీసుకురా” అని చెప్పాడు. ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్ని ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టాడు.. ఆ కష్టాలు ఒక్క కాగితంలో సరిపోలేదు.. అతనికున్న కష్టాలన్ని రాసేసరికి ముందుగా అనుకున్న ఒక్క కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి.. ఆ కాగితాలన్ని ఒక కట్టగా కట్టి మరుసటిరోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు.


ఆనందంతో దేవాలయానికి వెళుతున్న ఆ వ్యక్తికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది.. అదే దారిలో తన లాగే పేపర్ల కట్టలు కట్టుకుని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు. ఆ వ్యక్తికి అప్పుడే అర్ధమయ్యింది, “నా ఒక్కడికే కాదు నాతో పాటు భగవంతుడు వీరందరి కలలోకి వచ్చి నాకు చెప్పిందే చెప్పాడన్నమాట” అని. అక్కడున్న మిగిలిన వారి పేపరు కట్టలన్ని తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు తనతో పరిచయమున్న వారందరు ఆ కట్టలతో వచ్చేస్తున్నారు.. ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది “వీరందరికి నాకన్నా మంచి బట్టలున్నాయి, డబ్బులున్నాయి.. ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతు మాట్లాడతారు.. కాని తన కన్నా వారి దగ్గరున్న కష్టాల కట్టలు ఎక్కువ ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది. గుడి తలుపులు సమీపిస్తున్న కొద్ది ఆ వ్యక్తిలో భయంతో కూడుకున్న అలజడి మొదలయ్యింది. ఈ అలజడి ఆ వ్యక్తికి మాత్రమే కాదు అక్కడున్న గ్రామస్తులందరికి పాకింది.


అనుకున్న సమయం రానే వచ్చేసింది.. గ్రామస్తులంతా ఆ గుడిలోనికి ప్రవేశించారు. అప్పుడే భగవంతుడు అదృశ్యవాణిగా ఇలా చెప్పాడు.. “మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్ని కింద పెట్టండి”. చెప్పినట్టుగానే అందరు వారి కట్టలన్ని కింద పెట్టారు. అప్పుడు భగవంతుడు.. “ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడున్న ఏదో ఒక కట్టను తీసుకోండి, మీరు కోరుకున్నట్టుగానే ఆ కట్టలో రాసివున్న కష్టాలన్ని మీకు బదిలి చేయబడతాయి” అని అన్నాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది. “అదే భయంలో అందరు ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడున్న వారంత ఎవరి కట్టను వారు తీసుకోడానికి ప్రయత్నించారు”. ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయో, మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు కాని మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే..? అని అందరు ఆలోచిస్తూ ప్రాణ భయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా అదే ప్రయత్నిస్తున్నాడు.. ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్టుగా ఉంది అక్కడి దృశ్యం.


అక్కడున్న వారంత ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలు ఉన్నాయో అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు.. అప్పటివరకు ఏదో మృత్యువు తరుముతున్నట్టుగా ఉన్న వారంత తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు. అందరు చాలా ఆనందంగా ఉన్నారు.. ఆ వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వారందరికి స్పష్టంగా ఒక విషయం అర్ధమయ్యింది. “తమ కష్టాలే చిన్నవి, అనవసరంగా భయపడ్డాము..” వీటికి పరిష్కార మార్గాలను వెతకాలి, పోరాడాలి, విజయం సాధించాలి అని ధృడ సంకల్పంతో ముందుకు కదిలారు.


🌾🌻🌾🌻🌾🌻🌾

 [20/06, 12:35 pm] +91 90526 93310: సంస్కృతం లో రక్త సంబంధీకుల పేర్లు...మీకోసం


👇 .👇

1. పితా (తండ్రి) 

2. పితామహా (తాత)

3. ప్ర పితామహా (ముత్తాత)

4. మాతా (తల్లి)

5. పితామహి (బామ్మ)

6. ప్రపితామహి (బామ్మ అత్తగారు)

7. సాపత్ని మాతా (సవతి తల్లి)

8. మాతామహ (తల్లి తండ్రి)

9. మాతా పితామహ (తల్లి తాత)

10. మాతుః ప్రపితామహ (తల్లి ముత్తాత)

11. మాతామహి (అమ్మమ్మ)

12. మాతుః పితామహి (అమ్మమ్మ అత్త)

13. మాతుః ప్రపితామహి (అమ్మమ్మ అత్తగారి అత్త)

14. ఆత్మపత్ని (తన భార్య)

15. సుతః (కుమారుడు)

16. భ్రాత (సోదరుడు)

17. జ్యేష్ట పితృవ్యః (పెద తండ్రి)

18. కనిష్ట పితృవ్యః (పిన తండ్రి)

19. మాతులః (మేనమామలు)

20. తత్పత్నిః (వారి భార్యలు)

21. దుహిత (కుమార్తె)

22. ఆత్మ భగినీ (తోబుట్టువులు)

23. దౌహిత్రః (కూతురు బిడ్డలు)

24. భాగినేయకః (మేనల్లుళ్లు)

25. పితృష్వసా (తండ్రి తోబుట్టువులు)

26. మాతృష్వసా (తల్లి తోబుట్టువులు)

27. జామాతా (అల్లుళ్లు)

28. భావుకః (తోబుట్టువు భర్త)

29. స్నుష (కోడలు)

30. శ్వశురః (మామగారు) 

31. తత్పత్నీః (వారి భర్యలు)

32. స్యాలకః (బావమరుదులు)

33. గురుః (కుల గురువు)

34. ఆర్ధినః (ఆశ్రితులు)

[20/06, 4:00 pm] Kant's Rso: సమావేశంలో కుల ప్రస్తావన - విలేఖరికి తగిన సమాధానం. 


విలేఖరి : సార్ మీది ఏ కులం??

ఉపన్యాసకుడు: 

నేను ఏ వయస్సు లో.


విలేఖరి : అంటే, వయస్సు బట్టి కులం వుంటుందా??

ఉపన్యాసకుడు: వుంటుంది! 

బాల్యంలో బాలకులం,

యవ్వనంలో యువకులం,

వృద్ధాప్యంలో పండుటాకులం,

రాలిపోయే ఎండుటాకులం.


విలేఖరి : అది కాదు, మామూలుగా మీది ఏ కులం??

ఉపన్యాసకుడు: 

ఎవరూ లేకుంటే ఏకాకులం.

ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులం.

 పెళ్లి అయ్యాక సంసారికులం.

కానప్పుడు బ్రహ్మచారికులం.


విలేఖరి : అది కాదండీ కమ్మ, కాపు, ఆలా మీది  ఏ కులం??

ఉపన్యాసకుడు:  : ధనముంటే దనికులం,

లేకుంటే బీదకులం, దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం,

నమ్మకుంటే నాస్తికులం.


విలేఖరి : మీకు ఆసలు కులం లేదా??

 ఉపన్యాసకుడు: ఎందుకు లేదు,

ప్రయాణిస్తే ప్రయాణికులం,

యాత్రలు చేస్తే యాత్రికులం,

మాయలు చేస్తే మాంత్రికులం,

ఉపన్యసిస్తే ఉపన్యాసకులం,

హాస్యం పండిస్తే విధూషకులం,

పాడితే గాయకులం,

సభలో ఉంటే సభికులం

సినిమాహాల్లొ ప్రేక్షకులం,

టీవీ ల ముందు వీక్షకులం.


విలేఖరి : మీరు ఎక్కడ చదివారు??

ఉపన్యాసకుడు : చదివింది గురుకులం,

అభ్యసిస్తే అభ్యాసకులం,

బోధిస్తే బోధకులం,

వృత్తిరీత్యా 

అధ్యాపకులం.

పత్రికల పాఠకులం.

నేర్పించే శిక్షకులం.


విలేఖరి : అసలు మీరు ఎవరండీ ఇలా చంపుతున్నారు??

ఉపన్యాసకుడు : నాగరికత నేర్పిన నాగరికులం,

నాయకులని నమ్మే అమాయకులం,

మూఢత్వం పోని మూర్ఖులం.


విలేఖరి : అసలు మీ వయస్సు ఎంతండి బాబు??

ఉపన్యాసకుడు: కొందరికి పూర్వీకులం,

మరికొందరికి సమకాలికులం.

ప్రస్తుత వర్తమానికులం.


విలేఖరి : అసలు మీది ఏ దేశం??

ఉపన్యాసకుడు:  

భరత జాతి వంశీకులం. 

భావి భారత రథ సారథికులం.


విలేఖరి : మీకు దణ్ణం బాబు,ఏదో నాలుగు కులాలలో ఏదో ఒకటి చెప్తారని అనుకున్నాను,

చాలా కులాలున్నాయి, బాగా చెప్పారు. ఇంకెప్పుడు ఎవరిని, మీది ఏ కులం అని మాత్రం అడగను.




రామకృష్ణ పరమహంస కోల్‌కతా దక్షిణేశ్వరంలో పూజారిగా ఉన్నరోజుల్లో, ఒకసారి ప్రముఖ సంఘసేవకుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ను కలిశాడు. పరమహంసకు విద్యాసాగర్‌ ఆతిథ్యమిచ్చి, ఎన్నో ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. అందులో భాగంగా వారి మధ్య ‘అవిద్య’ అన్న అంశం చర్చకు వస్తుంది. అప్పుడు రామకృష్ణులు అవిద్య అన్న పారమార్థిక పారిభాషిక పదానికి వివరణ ఇస్తూ.. ‘మనిషిని ప్రాపంచిక మోహంలో పడదోసి, భగవంతుడికి దూరం చేసే గుణాలను కలిగి ఉండేదే అవిద్య. అది మహా మాయ. ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే భక్తి, జ్ఞానం, దయ, ప్రేమ, వైరాగ్యం ఇవి ‘విద్య’ లక్షణాలైతే, భగవంతుడిపై విశ్వాసం లేకపోవటం, అజ్ఞానం, కాఠిన్యం, ప్రేమరాహిత్యం, భోగాసక్తి ఇవన్నీ ‘అవిద్య’ స్వభావాలు’ అని వివరించాడు. మనిషి తన సహజ స్వభావమైన ఆనందాన్ని కాదని, సంసార దుఃఖాల్లో కూరుకుపోవటానికి ఈ అవిద్య కారణమని పరమహంస విస్పష్టం చేశాడు.

ఒక సందర్భంలో ఓ శిష్యుడు ఆది శంకరాచార్యులతో ‘గురువర్యా! నిద్రలో ఎంతో ప్రశాంతతను, సుఖాన్ని అనుభవిస్తున్నాను. కానీ మెలకువలో ఉన్నప్పుడు ఆ సుఖశాంతులు మాయమైపోతున్నాయి? పైగా వాటిస్థానంలో అశాంతి, దుఃఖం వచ్చిచేరుతున్నాయి. కారణమేంటి?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ఆదిశంకరులు ‘నాయనా! నీవు మేల్కొన్నప్పుడు ఇంద్రియాలు కూడా మేల్కొంటున్నాయి. వేటి కోసమో వెంపర్లాడుతున్నాయి. దీన్నే ‘అవిద్య’ అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే అసంసారివి అయినా సంసారి అనుకోవటం, దేనికీ నీవు కర్తవు కాకపోయినా, ‘నేను’ కర్తను అనుకోవటం, నీవు భోక్తవు కాకపోయినా భోక్తను అనుకోవటం, నీవు ఆత్మరూపంగా శాశ్వతుడవైనా.. శరీరానికే పరిమితమై అశాశ్వతుడనని భ్రమపడటం వీటిని ‘అవిద్య’ అంటారు. నీవు మరలా, మరలా పుట్టడానికి, చావడానికి ఈ ‘అవిద్యే’ కారణమ’ని శంకరాచార్యులు ఉద్ఘాటించాడు. వారి ‘ఉపదేశ సాహస్రి’లో ఈ అంశంపై విపుల వ్యాఖ్యానం చూడవచ్చు.

అయితే వివిధ తత్త్వవిధులు వేర్వేరుగా ‘అవిద్య’ను నిర్వచించారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమించే మాయనే అవిద్య అన్నారు అద్వైతులు. తత్త్వజ్ఞానం లేకపోవటమే ‘అవిద్య’ అని వ్యాఖ్యానించారు విశిష్టాద్వైతులు. బౌద్ధమత గ్రంథాల్లో కూడా ‘అవిద్య’ అన్న ఆధ్యాత్మిక పారిభాషిక పదం ప్రస్తావన కనిపిస్తుంది. ‘క్షణికమైన వాటిని శాశ్వతమని తలచటమే అవిద్య’ అంటారు బౌద్ధమత గురువులు. పతంజలి యోగసూత్రాల్లో కూడా ‘అవిద్య’ పై వివరణ కనిపిస్తుంది. ‘అనిత్యాశుచి, దుఃఖానాత్మను నిత్యశుచి సుఖాత్మ ఖ్యాతిరవిద్యా’ అనిత్యం, అశుచి, దుఃఖం, అనాత్మలను నిత్యం, శుచి, సుఖం, ఆత్మ అనుకోవటం ‘అవిద్య’ అని పతంజలి యోగసూత్రాల్లో సాధన యోగంలోని అయిదో సూత్రం పునరుద్ఘాటిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే చీకట్లో తాడును చూసి పాము అనుకొని భయపడ్డట్లు, అశాశ్వతమైన ప్రపంచాన్ని, శాశ్వతమని భ్రమించటమే ‘అవిద్య’.

ఇక రమణ మహర్షి తాను తనువు అనుకోవటమే ‘అవిద్య’ అంటారు. తను ఆత్మ అని తెలుసుకోవటమే ‘విద్య’ అని పేర్కొన్నారు. ‘కూలీ కోసం లగేజీ మోసేవాడు దానిని దింపే స్థలం వరకు మోసుకొని వస్తాడు. స్థలాన్ని చేరగానే సంతోషంగా బరువు దింపుతాడు. బరువు వదిలిందిరా నాయనా’ అనుకుంటాడు. అంతేకానీ, విచారించడు. వదిలించుకున్న బరువు కేసి చూడడు. జీవన్ముక్తునికి ఈ శరీరం లగేజీ లాంటిది. కూలీ వాడికి తాను మోసే లగేజీపై ‘నేను, నాది’ అనే భావం ఎలా ఉండదో, అలాగే జీవన్ముక్తునికి దేహంపై అభిమానం, మమకారం ఉండవు. మానవ శరీరంతో జన్మ ఎత్తినందుకు పరమ ప్రయోజనమైన ఆత్మజ్ఞానం పొందాలి. పొందాక శరీరభావాన్ని విడవాలి. భోజనం అయ్యాక, ఎంగిలి ఆకును అవతల పారేసినట్లు, శరీర భావాన్ని తోసివేయాలి. అంతేకానీ, ఇంకా దాన్ని పట్టుకొని వేలాడటం ఏమిటి? అదే అవిద్య. ఇలా మన సనాతన ధర్మం ‘అవిద్య’ మానవ దుఃఖానికి, జనన మరణ చక్రభ్రమణానికి, భగవంతుడికి మనిషికి మధ్య దూరానికి ప్రధాన కారణమని తేల్చిచెప్పింది.

No comments:

Post a Comment