Saturday, 25 June 2022



ప్రాంజలి ప్రభ.. మల్లాప్రగడ 

ఈ రోజు.......తండ్రుల దినం.

శివ శివా...ఏమిటా అప్రాచ్యపు మాటలూ?... అని ఇదైపోకండి.

ప్రపంచ తండ్రుల రోజు కదా మరి.

ప్రతి ఏడు...జూన్ 3వ ఆదివారం...

ప్రపంచ తండ్రుల దినం....ట.

ఏమిటో...అసలు ప్రతి దినం....

ఏదో ఒక దినం....ఉండేట్టుంది....నీఎంకమ్మా...

అని బ్రహ్మానందం స్టైల్ లో అనుకున్నా సరే....

ప్రతి తండ్రికి....ఈ రోజు అవసరం.

ఎందుకో...ప్రేమ....గౌరవం....విషయంలో....

నాన్నెందుకో వెనుకబడి పోయాడనిపిస్తుంది....అమ్మతో పోల్చితే....అనిపిస్తుందని...

ఓ కవిత చదివా ఆ మధ్య. అక్షరాలా నిజం.

ఈ రోజు తండ్రులందరూ జాగ్రత పడవలసిన రోజు.

జాగ్రత్త అని ఎందుకంటున్నానంటే....రాను రాను....అనుబంధాలూ...ఆప్యాయతలు మనుషుల మధ్య...మరుగున పడిపోతూ....

అవసరాలూ....ఆభిజాత్యాలూ....రాజ్యమేలుతున్నాయి.

ఈ ఒక్క రోజు...

మీనాన్న కో క్రొత్త షర్టు కొని...

ఓ మాల వేసి....

ఓ కేక్ కోయించి....

ఇంట్లో అమ్మతోనో...పెళ్ళాం తోనో పాయసం చేయించి పెట్టేసి...

ఫోటోలు...వీడియోలు గట్రా తీసేసి ఫేస్ బుక్ లో, ఇన్స్టాగ్రాం లో అప్ లోడ్ చేసేస్తే.......

అది తండ్రి దినం అయిపోదు.

నీ దినం అవుతుంది!

                                     ********

102 నాట్ ఔట్.....మూవీ చూచారా? చూడకపోతే అర్జెంటుగా చూచేయండి. అమెజాన్ ప్రైం లో ఉంది.

అదో మాస్టర్ పీస్. 

తండ్రి - బిడ్డల బంధాన్ని....

నిగ్గు తేల్చి చూపించి....

నివ్వెర పరిచే...

నిప్పులాంటి నిజం.

సౌమ్యా జోషి గుజరాతిలో వ్రాసిన నాటకానికి...గోపాల గోపాల సినిమా కు కథ అందించిన డైరెక్టర్....ఉమేష్ శుక్లా డైరెక్ట్ చేస్తే...2018 లో రిలీజ్ అయ్యింది.

గుండెను కరిగించే ఈ కథలో తండ్రి ప్రేమను ఎంత హృద్యంగా చూపించారో....చివరికి కంట నీరు చిప్పిల్లక మానదెవరికైనా!

అమితాబ్ & రిషి కపూర్ విజృంభించి జీవించారు.....నటనలో.

సినిమా మొత్తం తండ్రి కొడుకులే. కేవలం 4 పాత్రలే ఉంటాయి.

తాత - అమితాబ్ బచ్చన్...102 ఏళ్ళు....ఎంతో ఎనర్జెటిక్ గా...ఎప్పుడూ నవ్వుతూ...తుళ్ళుతూ...గడిపే పర్సనాలిటీ. ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ.

తండ్రి - రిషి కపూర్ - 75 ఏళ్ళు....ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ...వర్రీ అవుతూ....ఆత్రుతతో....అనిశ్చితంగా...గడిపే పర్సనాలిటీ. ఎప్పుడూ నెగటివ్ థాట్సే!

కొడుకు - ధర్మేంద్ర గోహిల్ - 40 ఏళ్ళు....అమెరికాలో సెటిల్ అయి ఉంటాడు. అతనికే 12 ఏళ్ళ కూతురు & 9 ఏళ్ళ బాబు(కేవలం ఫొటోలో ఉంటారు)

ధీరు- అమిత్ త్రివేది - తాత తండ్రులకిద్దరికీ....మెడిసిన్స్ తెచ్చిపెట్తూ...హెల్ప్ చేస్తూ ఉండే కారెక్టర్.

హై స్కూల్ లో మాథ్స్ టీచర్ గా చేసి రిటైర్ అయి ఉంటాడు రిషి కపూర్. 

ఒకే కొడుకు....ఎంతో గారాబంగా పెంచి....అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా సెటిల్ చేయ్యడానికి తన శాయశక్తులా కష్టపడ్తాడు. ఇక్కడ మదర్ ను అసలు చూపరు. తండ్రి పడ్డ కష్టం కూడా చూపించరు.

అమెరికా వెళ్ళిన కొడుకు....19 ఏళ్ళలో ఒక్కసారి కూడా ఇండియా వచ్చి...తల్లి దండ్రులను...తాతను చూడడు.

పైగా అమెరికా వెళ్ళిన క్రొత్తలో తండ్రి దగ్గర నుండి డబ్బు కూడా అప్పు చేయించి మరీ తీసుకుంటాడు.

ఆ తరువాత అక్కడే సెటిల్ అయిన ఇండియన్ అమ్మాయిని పెళ్ళి చేసేసుకుని....కాపురం పెట్టి...పెద్ద వాళ్ళకు చెప్తాడంతే!

ఈ లోగా అతనికి...ఇద్దరు బిడ్డలు కూడా పుట్టేస్తారు. ఫొటోలు పంపిస్తాడు.

ప్రతి సారి ఇదుగో వస్తున్నా అంటాడు...రాడు.

చివరికి తల్లికి ఆల్జీమర్స్ వ్యాధి వచ్చిందని తెలిసినా....రాడు. వీలు కాదంటాడు. 

అక్కడకు కూడా రావద్దంటాడు. ఎందుకంటే...ఇల్లు చిన్నదట. పైగా ఇద్దరూ ఉద్యోగస్తులు. మీకేమీ తోచదు. అనేస్తాడు.

తల్లి ఆల్జీమర్స్ తో చనిపోయినా....కొడుకు కు వీలు కాదు. 4 వారాలు ముందే చెప్పి ఉంటే...పర్మిషన్ తీసుకుని వచ్చేవాడట!

భార్య పోయినప్పటి నుండి....రిషి కపూర్ అసలే ఇంట్రావర్ట్....ఇంకా ఒంటరి  తనం తో ఫీల్ అవుతుంటాడు. 

కొడుకును చూచి....19 ఏళ్ళవుతుంది.

ఈ తమాషా అంతా బాగా గమనిస్తూ ఉంటాడు......102 ఏళ్ళ తాత గారు అమితాబ్ బచ్చన్.

కొడుకు...కొడుకు....అంటూ బాధ పడే రిషీకి....కొడుకు అసలు స్వరూపం చూపించాలని....అమితాబ్ నిర్ణయించుకుంటాడు.


                                       ********

వాంగ్ చంగ్ తున్ పెంగ్....అని ఓ చైనా వాడి లైఫ్ సైజు పేపర్ డాల్ ఒకటి మోసుకుంటూ వచ్చి....కొడుకు రిషి తో...

తన ఇంటి నుండి...వెళ్ళిపోమని చెప్పి.....సన్ సెట్  వృధ్ధాశ్రమం లో ఓ రూం బుక్ చేస్తాడు!

పైగా...75 ఏళ్ళ కొడుకుని వృధ్ధాశ్రమంకు పంపుతున్న 102 ఏళ్ళ ఫాదర్ గా రికార్డ్ సృష్టించ వచ్చని....తమాషా గా గొప్పలు పోతాడు!

రిషి కోపంతో ఊగిపోతే....అది తన ఇల్లని....తనెప్పుడూ...పాజిటివ్ గా ఉంటానని....నీలాంటి నెగటివ్ థాట్స్ ఉన్న కొడుకు ఉంటే...

వాంగ్ చంగ్ తున్ పెంగ్ ను బీట్ చెయ్యడం కష్టమని అంటాడు. ఇంకా 16 ఏళ్ళు గడిపితే.... ఆ రికార్డ్ బీట్ చెయొచ్చనీ  అంటాడు. ఆ వాంగ్ చంగ్...118 ఏళ్ళు బ్రతికాడట మరి!

ఏం చెయ్యాలో పాలుపొక నిస్సహాయంగా ఉన్న కొడుకు రిషికి  కొన్ని పరీక్షలు పెట్తాడు. 

చనిపోయిన భార్యకు లవ్ లెటర్ వ్రాయడం, డాక్టర్ దగ్గరకు చీటికీ మాటికీ వెళ్ళడం ఆపేయడం, ఎంతో ప్రియంగా చిన్నప్పటి నుండి దాచుకున్న దుప్పటిని....కట్ చేపించడం,.....ఇలా అర్థం లేకుండా ఉంటాయి ఆ పరీక్షలు. 


ఈ వైనమంతా ఎంతో నవ్విస్తారు మనల్ని రిషి - అమితాబ్ లు.


                                   ********


చివరి పరీక్ష...తను జూలై 21 న వస్తున్నాను అని   దాదాపు 20 సంవత్సరాల తరువాత కొడుకు అమెరికా నుండి ఫోన్ చేస్తే..... 


అతడిని...ఇంట్లోకి రానివ్వద్దని...గెట్ ఔట్ అని చెప్పాలని......అదే చివరి పరీక్ష అంటాడు అమితాబ్.


దాంతో రిషికి కోపం వచ్చి...తనకు అసలు ఆస్తి అక్కరలేదని...పత్రాలు వ్రాయించి...


అమితాబ్ ముఖాన కొట్టి...నా బిడ్డకు ...నాకూ మధ్య రావద్దు. మర్యాద నిలుపుకోమంటాడు.


ఒరే బేటా బాబూ....వాడు నీకోసం వస్తున్నాడనుకున్నావా?!....ఈ ప్రాపర్టీ కోసం వస్తున్నాడురా...నిరూపిస్తానుండు...అని.


మనవడికి ఫోన్ చేసి....అమోల్.....నువ్వు  ఎప్పుడో జూలై 21న వస్తానని చెప్పావట కదా....కాస్త ముందు రావడానికి వీలుకాదా!ఎందుకంటే ప్రాపర్టీ గురించి నీతో మాట్లాడాలిరా....అంటాడు.


మనవడు...వెంటనే....2 గంటల్లో ...ఫ్లైట్ ఉంది. నేనొక్కడినే వస్తాను. భార్యా పిల్లలు లేకుండా అంటాడు.


ఫోన్ పెట్టేసి....అమితాబ్...రిషి కపూర్ కళ్ళు తెరిపిస్తాడు.


చూశావా! బాబూ.....


నీ భార్యా పిల్లల్ని చూడాలని ఉందిరా!....వీలు కాదు!


నాన్న రిటైర్ మెంట్ ఫంక్షన్!....వీలు కాదు.


అమ్మకు బాగలేదు!....వీలుకాదు!


అమ్మ చచ్చిపోయింది!...4 వారాలు ముందే చెప్పాలి! వీలు కాదు!


ప్రాపర్టీ గురించి అంటే....వెంటనే ఫ్లైట్ ...2 గంటలు చాలు!


వెంటనే వచ్చేస్తున్నాడు!


బాబూ...నువ్వు డాక్యుమెంట్లు ఇచ్చావు...ఆస్తి అక్కర లేదని. కానీ అమెరికా నుండి వాడొచ్చేది కేవలం దానికే!


నీకు నేనొక డాక్యుమెంట్ చూపించాలి బాబూ! అని స్కానింగ్ చేసిన రిపోర్ట్ చూపిస్తాడు. 


బ్రెయిన్ ట్యూమర్ అమితాబ్ కు. ఒక నెలే ఇంక టైం అని చెప్పేస్తారు డాక్టర్లు. అందుకే అమితాబ్ బాగా ఆలోచించి ఈ డ్రామా అంతా ఆడిస్తాడు.


ఈ 118 ఏళ్ళ రికార్డ్ బ్రేక్ చెయ్యడం...కొడుకును వృధ్ధాశ్రమానికి పంపించేస్తాననడం...పరీక్షలు పెట్టడం....అంతా అమితాబ్ డ్రామా!


మనవడొక దొంగ రాస్కెల్. వాడికి... తల్లి , తండ్రి , తాత అక్కర లేదు కానీ ప్రాపర్టీ మాత్రం కావాలి!


రిషి కపూర్ కళ్ళు తెరుచుకుంటాయి.


                                      ********


ఎయిర్ పోర్ట్ లో కొడుకును రిసీవ్ చేసుకుంటాడు.


కొడుకు పాద నమస్కారం చేస్తాడు ఫార్మల్ గా...నీకోడలు..పిల్లల్ని తీసుకురాలేదు. సెలవు దొరకలేదు. ఐ హోప్ యు డోంట్ మైండ్....అంటాడు.


నెవర్ మైండ్...అంటాడు రిషి.


డాడీ...నువ్వసలు ఏం మారలేదు తెలుసా! అట్లాగే ఉన్నావు...అంటాడు తనయుడు.


లేదు...నేను మారాను. బాగా మారాను.


ప్రాపర్టీ కోసం వచ్చావు కదా! ఇదుగో...నీ ప్రాపర్టీ...అని ఓ పాత ఫోటో ఆల్బం...ఇంకా 42 రూపాయల నాణాలున్న పిగ్గీ కిడ్డీ బ్యాంక్...బొమ్మ...ముఖాన కొడ్తాడు.


ఎస్. దిసీజ్ యువర్ ప్రాపర్టీ...టేక్ ఇట్...అండ్ గో...


నెవర్ షో మి యువర్ ఫేస్ అగెయిన్.....అని....


తలెత్తుకుని....గర్వంగా వచ్చేస్తుంటే....నివ్వెరపోయి..అవమాన భారంతో కొడుకు....ఆటోలో అమితాబ్...గర్వంగా సంతోషంగా చూస్తాడు.


*ఐ వోంట్ లెట్ యువర్ సన్.....డిఫీట్ మై సన్...నెవర్*....


అని విజయానందంతో విజిల్ వేసి మరీ చూపిస్తాడు అమితాబ్.


అమితాబ్ మరణించడం....చూపించరు. ఓ విజిల్ రూపంలో సింబాలిక్ గా చూపిస్తారు.


మరణానంతరం...వినమని ఓ టేప్ ఇస్తాడు.


బాబూ....ఇదుగో...ఇక్కడ వాంగ్ చంగ్ ప్రక్కనే ఉన్నాను. ఈ జన్మలో నేనతని రికార్డ్ బ్రద్దలు కొట్టలేకపోయాను. ఆ పని నువ్వు చేయాలి.... ఓన్లీ 42 ఇయర్స్ టు గో...బాబు....అని నవ్వుతాడు.


అయిపోయింది.


                                   *********


ఈ తండ్రుల దినాన...ప్రతి తండ్రి తప్పక గుర్తుంచుకుని పాటించ వలసినవి....అని నేను ఇప్పుడు క్లాస్ పీకను!....


ఎందుకంటే....ఇంత విన్నాక...సినిమా చూచాక....నేనేమి చెప్పదలుచుకున్నానో మీకు తెలుసు.


తండ్రులారా...

దొంగ నా కొడుకులను- కోడళ్ళను.....

దొంగ నా కూతుళ్ళను - అల్లుళ్ళను.....

పూర్తిగా నమ్మకండి.


మీ జాగ్రత్త లో మీరుండండి....

తండ్రులారా.


విషింగ్ యు ఆల్ వెరీ హాపీ, హెల్థీ అండ్ ప్రాస్పరస్....


లెంగ్తీ లైఫ్  డియర్ ప్రపంచ తండ్రులారా.


                           🌹🌿🌹🌿🌹🌿🌹


మహా వైభవంగా బ్రతికి చెడ్డ.....ఓ తండ్రి....


తన బిడ్డ కోసం పాడే లాలి....


హృదయం ద్రవించేలా ఆర్ధ్రత తో మృదు మధురంగా గానం చేశారు ఘంటసాల మాస్టారు.


ఇది నా ప్రయత్నం....ఈ తండ్రుల రోజున.


చిత్రం - ధర్మదాత.(1970).

రచన - డాక్టర్. సి నారాయణ రెడ్డి.

సంగీతం - టి.చలపతి రావు.

గానం - ఘంటసాల.


జో..ఓ.. లాలి

జో..ఓ.. లాలి 


లాలి నా చిట్టి తల్లి.. లాలి నను గన్న తల్లి

లాలి బంగారు తల్లి.. లాలి నా కల్పవల్లి 


జో..ఓ.. లాలి

జో..ఓ.. లాలి 


చిరు నవ్వు కిరణాలు చిందించు మోము.. కన్నీరు మున్నీరుగా చూడలేను

చిరు నవ్వు కిరణాలు చిందించు మోము.. కన్నీరు మున్నీరుగా చూడలేను

నిను గన్న నీ తల్లి కనుమూసె గాని..

నిను గన్న నీ తల్లి కనుమూసె గాని.. నిను వీడి క్షణమైన నేనుండ గలనా

నిను వీడి క్షణమైన నేనుండ గలనా.. 


జో..ఓ.. లాలి

జో..ఓ.. లాలి 


రతనాల భవనాల నిన్నుంచలేను.. ముత్యాల ఉయ్యాలలూగించలేను

రతనాల భవనాల నిన్నుంచలేను.. ముత్యాల ఉయ్యాలలూగించలేను

కనుపాపలా నిన్ను కాపాడు కోనా..

కనుపాపలా నిన్ను కాపాడు కోనా.. నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా

నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా.. 


జో..ఓ.. లాలి

జో..ఓ.. లాలి

జో..ఓ.. లాలి


                             🌹🌿🌹🌿🌹🌿🌹

                                         

102 నాట్ ఔట్......మూవీ.....అమెజాన్ ప్రైం లింక్.


Hey I’m watching 102 Not Out. Check it out now on Prime Video!

https://app.primevideo.com/detail?gti=amzn1.dv.gti.9eb2107d-523f-db81-6e51-dc829b2ebbb2&ref_=atv_dp_share_mv&r=web


102 నాట్ ఔట్.........చిత్రం ట్రెయిలర్.


https://youtu.be/qrks9Zu0f1w


బడుంబా జుంబ జుంబా........102 నాట్ ఔట్(సాంగ్).


https://youtu.be/9-kkTYXqmrw


బచ్చీ కి జాన్ లోగే.........102 నాట్ ఔట్ (సాంగ్).


https://youtu.be/yFsPq2MRQ7E


*తండ్రి గొప్పతనాన్ని....చిత్రీకరించిన మరి కొన్ని గీతాలు వీక్షిద్దామా!

****************************************************


ఓ నాన్న...నీ మనసే వెన్న...అమృతం కన్నా.........ధర్మదాత.


https://youtu.be/dxOT7Rk5tB4


ఎవరో..ఏఊరో..ఎవరు కన్నారో........ఆత్మబంధువు.


https://youtu.be/hs5KBNZHVu0


జో లాలి...జో...లాలి...లాలి నా చిట్టితల్లి.......ధర్మదాత.


https://youtu.be/5nrUwHdOewI


మమతలు లేని మనుజుల లోన.........గాలి మేడలు.


https://youtu.be/EtLrqKtajbA


ఎవ్వడి కోసం ఎవడున్నాడు......ధర్మదాత.


https://youtu.be/48AbPoun3m8


లాలిజో లాలీజో...ఊరుకో పాపాయి......ఇంద్రుడు - చంద్రుడు.


https://youtu.be/gGzzqSAVQBo


లాలి లాలి అను రాగం సాగుతుంటే.......ఇందిర.


https://youtu.be/1NU51RCZqi0


పచ్చని చిలుకలు తోడుంటే.........భారతీయుడు.


https://youtu.be/IYx3V3REHbY


పెట్టి పుట్టిన దానవమ్మా నువ్వు......మంచివాడు.


https://youtu.be/IIROxe5AAwo


ఏమిటో ఈ లోకమంతా ..ఎంతకూ అంతు పట్టని వింత......తాత - మనవడు.


https://youtu.be/K2ZGtaKnjsc


పోతే పోనీ పోరా..ఈ పాపపు జగతి......ప్రాయశ్చిత్తం.


https://youtu.be/F2KabR0lHt8


శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడరే.......మహానది.


https://youtu.be/Hvyw8p584os


జోలాలి జోలాలి జోలాలి...జోలపాడుతా బజ్జో........రాయుడు.


https://youtu.be/YD00686f8RM


గుమ్మాడి...గుమ్మాడి....ఆడిందంటే అమ్మాడీ.........డాడీ.


https://youtu.be/pILh_KHNDTQ


తుజే సూరజ్ కహూ యా చందా...........ఏక్ ఫూల్ దో మాలి.


https://youtu.be/LhFh_O5ZuF4


మధుబన్ ఖుష్బు దేతా హై........సాజన్ బినా సుహాగన్.


https://youtu.be/dIZQveCQC00


లాలిజో..హ...లాలిజో.....నాన్న.


https://youtu.be/tc3QqhSY2-A


ప్రేమంటే తెలుసుకోండిరా.....జస్టిస్ చక్రవర్తి.


https://youtu.be/uQuALAIqh-M


చిగురు మామిళ్ళు...ఇంటింటి సిరులు.....జస్టిస్ చక్రవర్తి.


https://youtu.be/V9GS5cKbpDo


మిత్రులారా నింగి నేలా కలిపేద్దాము....ఓ తండ్రి తీర్పు.


https://youtu.be/RaE3rL7EniU


ఎక్కడి తలుపులు అక్కడే మూసెయ్....బహుదూరపు బాటసారి.


https://youtu.be/Kwx6dQBTUNY


చట్టానికి న్యాయానికి జరిగిన......జస్టిస్ చౌదరి.


https://youtu.be/3NoIbeMeuvA


ఏ కష్టమెదురొచ్చినా...........నాన్నకు ప్రేమతో.


https://youtu.be/7VY191_NiHA


పాపా కెహ్తే హై బడా నాం .........ఖయామత్ సే ఖయామత్ తక్.


https://youtu.be/FEvBiayarlc


అకేలే హం....అకేలే తుం................అకేలే హం ..అకేలే తుం.


https://youtu.be/H8FsxkW7ZC8


ఆటల పాటల ..నవ్వుల పుత్తడి బొమ్మరా...........ఆకాశమంత.


https://youtu.be/8kk8SyFbm9E


హే....ఇంకో రోజొచ్చిందండి మీకోసం...నాకోసం..............ఆ నలుగురు.

 

https://youtu.be/eeFWG5QTF8I

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా.....ఆకాశమంత.


https://youtu.be/8kk8SyFbm9E

                                                

🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿


                                                      - డాక్టర్. కె.వి.ఎస్. ప్రసాద్.

*వాకింగ్ లో రకాలు !*


1. డాక్టర్ నుండి వార్నింగ్ రాక ముందే ఉదయాన్నే చేసే నడకను "మార్నింగ్ వాక్" అంటారు.


2. డాక్టర్ నుండి వార్నింగ్ వచ్చిన తర్వాత ఉదయాన్నే చేసే నడకను "వార్నింగ్ వాక్" అంటారు.


౩. వేరే వాళ్ళ ఆరోగ్యం, ఫిట్నెస్ చూసి చేసే నడకను "బర్నింగ్ వాక్" అంటారు.


4. ప్రకృతి సౌందర్యం (కాలనీ లోని అందాలను) చూడటానికి చేసే నడకను "స్టేరింగ్ వాక్" అంటారు.


5. ఉదయాన్నే భార్య/భర్త తో కలిసి చేసే నడకను "డార్లింగ్ వాక్" అంటారు.


6. భార్య/భర్త పక్కనే ఉన్నా ఇంకా ఎవరైనా అందమైన వారు వచ్చారేమోనని దిక్కులు చూస్తూ చేసే నడకని "టర్నింగ్ వాక్" అంటారు.


7. రోడ్డు మీద ఏం వస్తున్నా చూసుకోకుండా నడవటాన్ని ''మర్''_నింగ్ వాక్ అంటారు.


8. ఉదయాన్నే నడకకని బయటపడి నడవకుండా ఎవరితోన్నా సోదేసుకుని తిరిగిరావటాన్ని "షో వాక్" అంటారు.


9. "డ్రీమ్ వాకర్" అంటే ఎలా ఉంటాడో తెలుసా నడవాలి అనుకుంటాడు, కానీ మంచం దిగడు.


అందరూ నవ్వుతూ, నవ్విస్తూ ఆరోగ్యంగా బతకాలి ! 


*మీకు మంచి ఆరోగ్యం ప్రాప్తిరస్తు !*

😝😝😝😂😂👍👍

: రుషి రుణం


భారతావని రుషిపీఠం. ఈ జాతి ధర్మ ద్రష్టలు, సంస్కృతి నిర్మాతలు రుషులే.

అంటే దర్శించేవాడని అర్ధం. ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగేవాడు రుషి, రుషి

అనే మాటకు వేదమని, వెలుగని నిఘంటువులు అర్థాలు చెబుతున్నాయి. జ్ఞానార్జనలో అత్యున్నత స్థితిని చేరిన సాధకుడు రుషి జ్ఞానం సంపాదించి, యజ్ఞాది వైదిక క్రియల ద్వారా తపస్సు ద్వారా సిద్ధింపజేసుకునే స్థితి- రుషిత్వం. మన మాతృభూమి ప్రాచీనకాలం నుంచి ఎందరో రుషులకు జన్మనిచ్చింది. ప్రకృతిలో ఇమిడి ఉన్న సృష్టి విజ్ఞానానికి, దానికి అతీతమైన శాశ్వతమైన వస్తువును కలిపి 'వేదం'గా వ్యవహరించారు. దాన్ని దర్శించి ప్రచారం చేసినవారు రుషులు, బ్రహ్మ ముఖం నుంచి వేదాలు పుట్టాయని మనం విశ్వసిస్తున్నా వాటిని మనకు ప్రసాదించింది రుషులే. యుగయుగాల భారతీయ సంస్కృతిని, విజ్ఞానాన్ని విశ్వానికి చాటినవారు రుషులు, రుషులు త్రికాలజ్ఞులుగా, నిగ్రహానుగ్రహ సమర్థులుగా గోచరిస్తారు. రుషులకు సంబంధించిన విషయాలన్నీ స్మృతి పురాణేతిహాసాల్లో కనిపిస్తాయి. జంతువుల్లో ఆహారనిద్రాభయ మైధునాలు చాలావరకు క్రమబద్ధంగా ఉంటాయి. అలాకాకుండా మనిషి తనకు తోచిన పద్ధతిగా నిర్వర్తించుకోవడంలో సమర్ధుడయ్యాడు. అంటే ఆకలిదప్పులు, రుతుధర్మాలు, దాంపత్యదర్శం మొదలైన ప్రకృతి ధర్మాలకు సంబంధించి నియమాలను ఉల్లంఘించి కర్మబంధాలను సృష్టించుకొని సంసార బద్ధుడయ్యాడు. అందువల్ల కర్మఫలమైన దుఃఖానుభూతి. అనివార్యమైంది. ఈ విధంగా నష్టమైన ధర్మంకోసం మనిషి అన్వేషణ మొదలు పెట్టాడు. ధర్మస్థితిని సంసారబద్ధులు దర్శించేందుకు రుషులు ఇచ్చిన వాక్కులే వేద సంహితలు అనంతర కాలంలో ఉపనిషత్తులు, ఇతిహాసాలు పురాణాలు ఆవతరించాయి. సృష్టిరహస్యాన్ని, జీవకోటి లక్షణాల్ని సంపూర్ణంగా అర్ధం చేసుకొని బ్రహ్మమంటే ఏమిటి, ఆత్మ ఎక్కడ, పదార్థం అంటే ఏమిటి, పంచభూతాలు ఎలా వచ్చాయి. ఈ విషయాలన్నీ గ్రహించి లోకానికి ఏది క్షేమమో అది బోధించి మానవాళిని ఉద్ధరించే ప్రయత్నం చేశారు రుషులు, నారదుడు, అంగీరసుడు, పరాశరుడు, యాజ్ఞవల్క్యుడు మొదలైన వారు ధర్మశాస్త్రవేత్తలు. వారి పేరిట స్మృతులున్నాయి. గౌతముడి న్యాయం ఒక దర్శనమైంది. సాంఖ్య దర్శనాన్ని ప్రవచించింది కపిలుడు. పూర్వమీమాంసకర్త జైమిని. తమిళనాట వారి సంస్కృతికి మూలపురుషుడిగా అగస్త్యుణ్ణ్ని భావిస్తారు. ఆగస్త్యుడి ప్రబోధంగా ఎన్నో శాస్త్రాలు, నాడీ గ్రంథాలు, స్తోత్రవాఙ్మయం మనకు ఉన్నాయి. పిప్పలాదుడు మోక్షశాస్త్రం ఉపదేశించాడు. దధీచి దేవేంద్రుడికి తన వెన్నెముకను ఆయుధంకోసం ఇచ్చాడు. వసిష్ఠుడు బ్రహ్మర్షి నారదుడు దివ్యక్తి విశ్వామిత్రుడు. సృష్టికి ప్రతిసృష్టి చేశాడు గాయత్రీ మంత్రోపదేష్ట.


.......

ప్రతి మన్వంతరంలోనూ వేరువేరుగా సప్తరులుంటారు. ఈ మహాయుగంలో మహాభారతం ప్రకారం మరీచి, అత్రి, అంగీరసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, వసిష్టుడు సప్తర్షులు, బ్రాహ్మణాల ప్రకారం- కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జనుదగ్ని, వసిష్టుడు సప్తరుషులు, రుషులు కొందరు వైద్య శాస్త్రానికి అనేక ఆధునిక విజ్ఞానశాస్త్రాలకు అంకురారోపణ చేశారు. రుషి కానివాడు కవి కాడని ఆర్యోక్తి. గంభీరమైన పితృహృదయంతో వాల్మీకి పరమ దయాళువుగా తల్లిలా వ్యాసుడు విశ్వజనీనం సార్వకాలికం అయిన సత్యాల్ని ఆవిష్కరిస్తూ రామాయణ మహాభారతాలు రచించారు. మనం తీర్చుకోవాల్సిన రుణాల్లో రుషి రుణం ఒకటి. వేదవిహితకర్మల్ని ఆచరించడం.


దర్శజీవనం సాగించడం వల్ల ఆ రుణం నుంచి విముక్తులమవుతాం.


- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు

యోగదర్శనం*


యోగం అంటే ఆత్మ పరమాత్మల అనుసంధానమనే

అర్ధం ఉన్నా, యోగశాస్త్రం దాన్ని చిత్తవృత్తుల నిరోధంగా నిర్వచించింది. చిత్తం అంటే మనసు. అది స్వాధీనమైతే, విశ్వమంతా అధీనమవుతుందనేది ఈ శాస్త్ర సారాంశం. మనిషి తనను తాను ఎలా నియంత్రించుకోవాలో, అనుకూల ప్రతికూల స్థితుల్లో స్థిరంగా ఎలా ఉండాలో సందేశాన్నిచ్చి, నేడు ప్రపంచ మేధావులందరి మన్ననలను అందుకుంటోంది. ప్రాచీన భారతీయ ఋషి మేధకు, అనితరసాధ్యమైన అంతరంగ సూక్ష్మ శోధనా సామర్థ్యానికి నేడు ప్రపంచం పలికే జేజేలు ఈ శాస్త్ర ఔన్నత్యానికి అద్దం పడతాయి. ఛాందస భావాలకు దూరంగా శాస్త్రీయ దృక్పథానికి దగ్గరగా దీని బోధనలుంటాయి. మానసిక శాంతి, శరీర ఆరోగ్యం కోసం యోగశాస్త్రం అందరూ ఆచరించదగింది. దాని ఆధారంగానే ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రాలు, వ్యక్తిత్వ వికాస గ్రంథాలు, సానుకూల దృక్పథాన్ని ప్రబోధించే కేంద్రాలు పుట్టుకొచ్చాయి. యోగం మనిషినిసంస్కరిస్తుంది. మనసును కట్టడిచేస్తుంది. దేహాన్ని దృఢం చేస్తుంది. ఆయురారోగ్యాలను పెంచుతుంది. బుద్ధిని వికసింపజేస్తుంది. చిత్తానికి శాంతిని విశ్రాంతిని ఇస్తుంది. వ్యక్తిగా మనిషిని, సమష్టిగా సంఘాన్ని సముద్ధరిస్తుంది.


యోగం ప్రస్తావన వేదాల్లో ఉన్నప్పటికీ, దాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా తీర్చిదిద్దింది, షట్ దర్శనాలలో ఒకటిగా చేర్చింది మాత్రం- పతంజలి మహర్షి న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, వేదాంత, మీమాంసలే షట్ దర్శనాలుగా ప్రఖ్యాతిగాంచాయి. క్రీ.పూ. రెండో శతాబ్దంలో జన్మించిన మహర్షి వేదాల్లో యోగవిద్యాసారాన్ని శాస్త్రీయంగా క్లుప్తీకరించి, యోగసూత్రాలను రచించారు.


దోషరహితంగా, అసందిగ్ధంగా సారవంతమైన బహు చిన్న వాక్యాలుగా ఈ సూత్రాలుంటాయి. అభ్యాస వైరాగ్యాలను మనసుకు అలవాటు చేస్తే, నిలకడ సాధ్యమవుతుందంటాయి యోగసూత్రాలు. యమ నియమాలు, ఆసన ప్రాణాయామాలు, ప్రత్యాహార ధారణలు, ధ్యానసమాధులతో కూడిన అష్టాంగయోగాన్ని అభ్యసించాలని అవి సూచిస్తాయి.

మనసుపై పట్టు సాధించాలంటే దాని మర్మం బాగా తెలియాలి. ఏది సాధించాలన్నా మనిషికి మనసే ఆధారం. నిజానికి మనసు బాహ్యరూపమే మనిషి. మనిషికి బలం బలహీనత అదే. మనసును మనసుతోనే జయించాలి. మనసు చంచల స్వభావి. స్పందించడం, చలించడం, విసుగు, విరామం, విశ్రాంతి లేకుండా సంచరించడం... మనసు నైజాలు. బాహ్య విషయ వాంఛలవైపు పోకుండా మనసును ముందు అరికట్టాలి. యోగ పరిభాషలో దాన్ని ప్రత్యాహారమంటారు. దేనిపై మక్కువ ఎక్కువ ఉంటే, దానిపైనే మనసు నిలకడగా ఉంటుంది. ధ్యానంపై మనసుకు ప్రీతి కలిగించాలి. ధ్యానించాలనే భావనను మనసు ధారణచేయాలి. తరవాత నెమ్మదిగా ధ్యానాన్ని అలవరచాలి. గాలి వెలుతురు సమంగా ఉండి, శుభ్రంగా ఉన్న ఏకాంత ప్రదేశంలో సుఖాసనంపై స్థిరంగా కూర్చోవాలి. దృష్టి నలుదిక్కులా పోకుండా చూడాలి. నడుము మెడ తలను నిటారుగా(లంబకోణంలో) ఉంచాలి. అంటే వెన్నెముక వంచకూడదు. మనసును ముక్కుకొనపై గాని, చక్కగా సాగేందుకు శరీరాన్ని దృఢంగా మనసును ఉల్లాసంగా ఉంచాలి.

.......


 ప్రాణాయామంతో 

కనుబొమల మధ్య గాని నిలపాలి. ఇదే ధ్యానం. 

ధ్యానం చక్కగా సాగేందుకు శరీరాన్ని దృఢంగా మనసును ఉల్లాసంగా ఉంచాలి. ప్రాణాయామంతో ప్రాణచలనాన్ని అరికట్టగలిగితే అది సాధ్యమవుతుంది. దీర్ఘశ్వాస తీసుకుని, బంధించి, తిరిగి నెమ్మదిగా వదలడాన్ని ప్రాణాయామం అంటారు. దానికి తోడుగా యోగాసనాలను క్రమం తప్పకుండా వేస్తే దేహాంగాల పనితీరు మెరుగవుతుంది. బ్రహ్మచర్యం, అహింస, ఈశ్వరభావన, ఆహార విహారాలలో నియంత్రణను పాటించాలి. వాటిని యమ నియమాలంటారు. వాటిని ఆచరిస్తూ ధ్యానాన్ని కొనసాగిస్తే మనసు ఆలోచనారహితమనే సమాధిని చేరుతుందంటుంది యోగశాస్త్రం.


- పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

......


కురుక్షేత్రానికి మూలమివే!


మహాభారతంలో ఆది పర్వముంటుంది. మహాభారత కథకు మొదలు ఇది. నిజానికి మహాభారతం అన్నా, భగవద్గీత సారం అన్నా అందరికీ కురుక్షేత్ర మహా సంగ్రామం గుర్తుకొస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో దాదాపు నలభై లక్షల మంది  పాల్గొన్నారు అయితే అందులో చివరకు మిగిలేది పాండవుల వైపు ఎనిమిది మంది, కౌరవుల వైపు ముగ్గరు. ఇంత ప్రాణనష్టానికి కారణమైన కురుక్షేత్రానికి మహాభారతంలో ఆధిపర్వంలోనే బీజం పడిందని అంటారు. 


ధార్తరాష్ట్రులు దుర్వృత్తం ఎంత బలంగా చిత్రింపబడితే పాండవుల సద్వృత్తం అంత ఉజ్వలంగా ప్రకాశించటానికి వీలౌతుంది. ఇది భారతకథలో సర్వత్రా పాటించే కథా మర్మమే. అయితే, దానికి బీజప్రాయమైన కథాంశాలు ఆదిపర్వంలో స్థాపింపబడ్డాయి. స్థాపింపబడటం అంటే సంఘటనలు చోటు చేసుకోవడం. ఆధిపర్వంలో జరిగినా కొన్ని సంఘటనలే క్రమంగా పెరుగుతూ పోయాయని అర్థం. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి.


1. దుర్యోధనుడు భీముని బలాన్ని సహించలేక అతడిని చంపే యత్నాలు చేయడం. భీముది బలం అంటే దుర్యోధనుడికి చెప్పలేనంత భయం. అందుకే ఎప్పుడూ భీముడిని చంపాలని ప్రయత్నాలు చేసేవాడు.

2. అర్జునుడు విలువిద్యలో అనన్యవీరుడుగా ప్రకాశిస్తూ ఉండగా, అతనికి ప్రత్యర్థిగా కర్ణుడిని అంగరాజుగా చేసి దుర్యోధనుడు ప్రోత్సహించటం. పాండవులకు ఒక అద్భుతమైన శత్రువును తయారుచెయ్యలనే ఆలోచనతో కవచకుండలాలతో పుట్టిన కర్ణుడిని చేరదీసి పాండవులకు శత్రువుగా నిలబెట్టాడు దుర్యోధనుడు. ఇతడు కౌరవులలో పెద్దవాడు అవడం వల్ల నిర్ణయాధికారం ఎక్కువగా ఉండేది. 

3. దుర్యోధనుడు కణికనీతి నాశ్రయించి ధృతరాష్ట్రుని అండదండలతో, శకునికర్ణాదుల సలహాలతో పాండవులకు ఎగ్గుచేయాలని తలపెట్టటం, లాక్షాగృహదహనయత్నం చేయటం. లాక్షాగృహం అంటే లక్క ఇల్లు. మహాభారతంలో పాండవులు నివసించడానికి దుర్యోధనుడు రహస్యంగా కట్టించి పాండవులను అందులో ఉండేలా ఉపాయం వేసి చివరకు దాన్ని అంటించి పాండవులను సజీవంగా దహనం చెయ్యాలని అనుకుంటాడు. ఆ కుట్ర నుండి పాండవులు తప్పించుకోవడం ఆసక్తిగా ఉంటుంది. 

4. పాండవులు హస్తినాపురంలో ఉంటే తనకు రాజ్యాధికారం దక్కటం అసాధ్యమని భావించి దుర్యోధనుడు తండ్రిని ప్రేరేపించి వారిని ఇంద్రప్రస్థానికి పంపించటం.

పాండవేతి వృత్తంలో ధర్మరాజాదులు ధార్తరాష్ట్రుల కుతంత్రాలనుండి తప్పించుకొనే అధ్యాయాలు కొన్ని, స్వీయ పరాక్రమాదులను ప్రదర్శించి తమ ఆస్తిత్వాన్ని స్థాపించుకొనే సన్నివేశాలు కొన్ని, ఎట్టికష్టాలలోనైనా ధర్మాన్ని పాటించే నచ్ఛీలాన్ని ప్రదర్శించే సన్నివేశాలు కొన్ని కలసి పాండవ నాయక లక్షణాలను ప్రకాశింపజేస్తూ ఉంటాయి.

కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజ్వలించే ప్రతీకారజ్వాలలకు ఆదిపర్వంలోనే అంకురారోపణం జరిగింది. భీమదుర్యోధనుల, కర్ణార్జునుల ద్వంద్వయుద్ధాలే కురుక్షేత్ర యుద్ధ పతాకలు(మూలం), పాండవులు ధర్మానికి తలలొగ్గి కష్టాలకు ఓర్చుకోవటం, అజ్ఞాతంగా మారువేషాలలో నివసించటం, శత్రువులకు అసాధ్యమైన అస్త్రశస్త్రాలను తపస్సుతో యశస్సుతో సాధించటం, అపూర్వ విజయాలతో స్వీయకల్యాణాన్ని, లోకకల్యాణాన్ని సాధించటం. శ్రీకృష్ణుని మైత్రివలన దైవానుకూల్యాన్ని సంపాదించుకోవటమూ అనే ప్రధానాంశాలు ఆదిపర్వంలోనే ప్రదర్శితాలై భావిపాండవ కథా జీవితానికి ప్రాతిపదికలుగా పరిఢవిల్లుతున్నాయి. వీటన్నిటి తాత్పర్య మేమంటే ఆదిపర్వం భారతకథకు అన్నివిధాలా బీజభూతం !

No comments:

Post a Comment