🙏 జై హనుమాన్ 🙏
యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షశాంతకామ్
💫🌹"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములు నిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును"శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.
🌻 విశేషాలు: 🌻
💫🌹ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దినములు - శనివారం, మంగళవారం ఇంకా గురువారం. పురాణకథ ప్రకారం, ఒకసారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు.
💫🌹అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి
పూజ చేసుకొనవచ్చు.
☘️ స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు: తమలపాకుల దండ: ☘️
💫🌹ఒక కథ ప్రకారం, ఆశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గరలో పువ్వులు కనిపించక!
💫🌹అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
🌻 మల్లెలు 🌻
💫🌹గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.
🌻 పారిజాతాలు: 🌻
💫🌹స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.
🌻 తులసి: 🌻
💫🌹తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
🌻 కలువలు: 🌻
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజలకుడ, కేరళలో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.
🌻 పంచముఖ హనుమాన్: 🌻
💫🌹శ్రీశ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరం ఇలా చెప్పబడింది. తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
💫🌹పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి,దుష్ట ప్రభావలను పోగొట్టి, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అప్లైశ్వర్యాలు కలుగజేస్తాడు..
💫🌹ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.
🌼🌴🌼🌴🌼🌴🌼🌴🌼🌴🌼🌴 శ్రవేంకటేశ్వర: 🙏 వెంకటేశ్వరస్వామికి నామాలు (ఊర్ధ్వపుండ్రం)ఎందుకు పెడతారు 🙏
🍃🌺శ్రీ మహావిష్ణువు ధరించి, మానవుడు తన ఉజ్జీవనానికి ఇలా ధరించాలని చెప్పినదే ఊర్ద్వ పుండ్రం. "పూడి - ఖండనే " అనే సంస్కృత దాతువును అనుసరించి అజ్ఞానాన్ని, కర్మపాశాన్ని ఖండించేది పుండ్రం. సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో, ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్ల నామాలు సత్వగునాన్ని, దానివల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి.
🍃🌺అది పునాదిగా ఉండాలని క్రింద పాదపీతం ఉంటుంది. సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకు వెడుతుందని సూచించేదే నిలువు బొట్టు. సత్వగుణానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు కనుక రెండు తెల్లని ఊర్ద్వ పుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహిస్తారు. ఇక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు . అనురాగానికి, ప్రేమకు మూలం లక్ష్మీ దేవి. శుభకరమైన ఆ లక్ష్మీ స్వరూపానికి చిహ్నంగా నిలువ…
శ్రవేంకటేశ్వర: 🌻 గుళ్ళో ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? 🌻
🍃🌺గుడికి వెళ్ళిన ప్రతీవారు కాళ్ళు కడుక్కొని మొట్టమొదట చేసే కార్యక్రమం గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం. సాధారణంగా ఎక్కువమంది మూడు సార్లు చేస్తుంటారు. కనీసం మూడుసార్లు ప్రదక్షిణ చేయడం మన సంప్రదాయం.
🍃🌺అయితే అయిదుసార్లు కానీ, పదకొండుసార్లు కానీ, ఇరవై ఒకటిసార్లు గానీ ఇలా వారివారి ఓపిక, సమయాన్ని బట్టి ప్రదక్షిణలు చేస్తుంటారు.
🍃🌺ఏ దేవుడి గుడికి వెళితే ఆ దేవుడి స్తోత్రాలనుకానీ, మంత్రాలనుకానీ చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. అంతేకానీ పక్కవారితో మాట్లాడుకుంటూ కానీ, మనిషి దేవాలయంలో ఉన్నా మనసు ఎక్కడో పెట్టి అర్థంపర్థంలేని ఆలోచనలతో ప్రదక్షిణలు చేయకూడదు.
🍃🌺ఇలా చేయడంవల్ల శరీరానికి వ్యాయామం మాత్రమే కలుగుతుంది. మనసుకి ప్రశాంతత లభించదు. ప్రదక్షిణలు ఎక్కువసార్లు చేస్తే చాలా మంచిది.
🍃🌺శరీరానికి వ్యాయామం అవసరమే. కానీ గతంలో డాక్టర్లు చెబితేనే నడిచేవారు. చక్కటి ఆరోగ్యానికి నడక సరైనమార్గం. ఆరోగ్యవంతుల్లో నడిచేవారి సంఖ్య తక్కువ. ఆ రోజుల్లో ఇంట్లో ఉండే పెద్దవారు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసేవారు.
🍃🌺అదే వారి శరీరానికి మంచి వ్యాయామంగా వుండేది. ఈ కాలంలో కూడా నడిచేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వర్షాకాలం, శీతాకాలంలో వాకింగ్ కి వెళ్ళడానికి బద్ధకించే వారు కొంచెం పొద్దెక్కాక గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తే శరీరానికి వ్యాయామం లభించడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
] శ్రవేంకటేశ్వర: 🙏 శ్రీ వేంకటేశ్వర శతకము 99 🙏
🍃🌹నమ్మిన స్నేహితుడు మోసం చేస్తే ఎలా వుంటుందో ఈ పద్యం వివరించింది.
ఉ. జీవసమానమిత్రుడనిజేరిన నాతనిమోసబుద్ధితో భావమునందుకష్టముల పాలొనరింపదలంచు టెట్లనన్ సేవయొనర్ప శ్రేయమును
శ్రీయును నాయువు నిచ్చునంచు నా దేవుని మ్రొక్కు వేళ గుడి దెబ్బున గూలుటె వేంకటేశ్వరా!
🍃🌹శ్రీ వేంకటేశ్వరా! ప్రాణసమాన మిత్రుడని స్నేహితుని నమ్మి యొకడు తన స్నేహితుని వద్దకు రాగా-ఆతడుమోసబుద్ధితో వీడిని నానాకష్టాలు పెట్టాలని యనుకోవడం ఎటువంటిదంటే
🍃🌹దేవునికి సేవచేస్తే ఆ పూజవలన ఆయువు. పెరుగుతుంది. శ్రేయస్సు లభిస్తుంది. అని యెన్నో ఆశలతో వచ్చి దేవునికి నమస్కరిస్తున్న సమయంలోనే ఆదేవాలయం కూలిపోయి వాడి నెత్తిపై కూలితే ఎలా వుంటుందో అలాగ వుంటుంది. ప్రాణాలు గాలిలో తేలిపోతాయి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనం చేసే పెద్ద పొరపాటు
వివేకముతో ఆలోచిస్తే మనం వేరు. మన శరీరం వేరు. మనం జన్మ తీసుకొంటున్నామంటే (పుడుతున్నామంటే) శరీరాన్ని ధరించి భూమి పైకి వస్తున్నాం. చనిపోతున్నామంటే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. విశేషమేమిటంటే పుట్టుక నుండి చావు వరకూ మనము, మన శరీరము ఒకటిగానే జీవిస్తున్నాము. శరీరము లేకుండా జీవితమనేదే లేదు. చావుపుట్టుకలు మన చేతిలో లేవు గాని ఆ రెండింటి మధ్యన వుండే జీవితం మన చేతిలోనే వుంది. అలాంటి జీవితం ఆరోగ్యంగా, సుఖంగా సాగినా లేదా అనారోగ్యంతో, బాధలతో సాగినా దానికి మనమే బాధ్యులం తప్ప శరీరానికి సంబంధం లేదు. ఈ శరీరానికి ఏ ఇబ్బందులు వచ్చినా ఆ తప్పు మనదే. శరీరం మనం ప్రయాణిస్తున్న వాహనం కాబట్టి మనం చెప్పినట్లు అది నడవాలి. అలాగే మనం దాన్ని ఇబ్బంది లేకుండా నడిపించుకోవాలంటే అది చెప్పినట్లు కూడా మనం వింటూ వుండాలి. అపుడే జీవితమనే ప్రయాణం గమ్యం చేరే వరకు సుఖంగా సాగుతుంది. కాని మనందరం చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే శరీరం చెప్పినట్లు మనం వినడం లేదు. దాని అవసరాల్ని మనం పట్టించుకోవడం లేదు. అందుచేతనే రకరకాల రోగాలతో ఇబ్బందులు పడుతున్నాము. మన ఇష్టాఇష్టాలు దానిమీద రుద్దుతున్నాము తప్ప దానిగోడు వినిపించుకోవడం లేదు. ప్రతి జీవి శరీరము ఒక ఆటోమాటిక్ యంత్రము లాంటిది. శరీరానికి తనంతట తనే బాగుచేసుకునే శక్తి పుట్టుకతోనే వచ్చింది. ఆ శక్తి పనిచెయ్యాలంటే శరీరము చెప్పినట్లుగా మనం విని దానికి అనుకూలంగా మనం ప్రవర్తించాలి. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులుంటే, అవి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వాటి శరీరాన్ని ఏ డాక్టరుకి అప్పగిస్తున్నాయి? ఏ రకాల రక్తపరీక్షలు, ఎక్సరేలు తీయించుకుంటున్నాయి? వాటి ఆరోగ్య రహస్యం ఏమిటి? నూటికి నూరుశాతం అవి ఆరోగ్యాన్ని పొందడానికి అవి ఆచరించే ఆరోగ్య రహస్యం ఒక్కటే. అదే శరీరం చెప్పినట్లుగా వినడం.
మనిషి కూడా కొన్ని వేల సంవత్సరాలు ఇదే ధర్మాన్ని ఆచరించి డాక్టరు లేకుండా, రోగం రాకుండా జీవించగలిగాడు.
ఇంతమంది వైద్యులు, ఇన్ని రకాల వైద్య విధానాలు ఉంచుకుని కూడా పూర్తి ఆరోగ్యాన్ని ఎందుకు పొందలేక పోతున్నాడు? మనకి వైద్యుడికి అవకాశమిద్దామని తెలుస్తోంది కాని వైద్యుడి కంటే ముందు శరీరానికి అవకాశమిద్దామని తెలియడం లేదు. అసలు శరీరానికి జబ్బులు తగ్గించుకొనే గుణం ఉన్నట్లే చాలా మందికి తెలియదు. మనం తయారు చేసిన వాహనానికి ఏదైనా రిపేరు వస్తే తనంతట తను బాగుచేసుకోలేదు. దానిని తయారు చేసినది మనిషే కాబట్టి చివరికి మనిషే దానిని రిపేరు చేయవలసి వస్తున్నది. మరి మన శరీరాన్ని మనం తయారు చేసామా? మనం తయారు చేసినది కాదు కాబట్టే మన ఊహకు అందని, మన తెలివితేటలకు సాధ్యంకాని అద్భుతమైన యంత్రాంగం ఈ శరీరంలో ఉంది. ఆటోమాటిక్ గా నడిచే కార్లు ఇంతవరకు మనిషి కనిపెట్టలేక పోయాడు కాని మనం ప్రయాణించే ఈ శరీరమనే కారు మాత్రం ఆటోమాటిక్ గా నడుస్తుంది. అలానే ఆటోమాటిక్ గా రిపేరు చేసికొనే శక్తి కూడా దానికి వుంది. ఆ శక్తిని మనం చెడగొట్టకుండా ఉంటే చాలు, దాని పని అదే చేసుకొని పోతుంది. మనకు తెలియకుండానే మనం శరీరానికి ఎన్నో ఇబ్బందులు కలిగిస్తూ వుంటాము. దానికి నీళ్ళు కావలసి వచ్చినపుడు నీళ్ళు త్రాగం. మనకి ఇష్టమైనపుడు త్రాగుతాం. ఆకలి వేసినపుడు అన్నం పెట్టం. నాకిపుడు రెస్ట్ తీసుకొనే టైము అయ్యింది నేనిక అరిగించలేను అని అది చెప్తున్నా వినకుండా రాత్రి ప్రొద్దుపోయి అన్నం పెడతాము. మనం తిన్నదంతా అరిగించి మిగిలిన వేస్ట్ విసర్జించడానికి రెడీగా పెట్టుకొని ఉన్నా దానిని బయటకు పంపకుండా ఆపేస్తాము. ఏదైనా రోగ పదార్థము లోపలికి ప్రవేశించినపుడు దానిని బయటకు పంపే ప్రయత్నంలో జ్వరం రూపంలో, నోరు చేదు రూపంలో మనకి అది సూచనలిచ్చినా పట్టించుకోకుండా, దానికి బాగు చేసుకొనే అవకాశం ఇవ్వకుండా డాక్టరు దగ్గరకు వెంటనే పరిగెడతాం. డాక్టరు ఏదో మందు వేస్తాడు. దానితో తను చెయ్యాల్సిన పని ఆపేస్తుంది. ఇలా మందులు వేస్తూ వుండటం వల్ల శరీరానికి వున్న రోగాన్ని నిరోధించుకొనే శక్తి క్రమంగా తగ్గిపోతుంది. జబ్బులను తగ్గించే అవకాశము ముందు మన శరీరానికిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరమే ఒక గొప్ప డాక్టరు అని గ్రహించాలి. మన శరీరము తగ్గించలేనపుడు మందు వేసుకోవడం తప్పు కాదు. ముందు శరీరం కోరినట్లుగా మనం మారడం, దానికి అనుకూలంగా బ్రతకడం అలవాటు చేసుకుందాం.
******
నేటి జీవిత సత్యం.
జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడూ విజయాలే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒకోసారి పరాజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపదసోపానాలుగా మల్చుకుంటే బతుకు కావడికుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలు ఏమిటో!
డబ్బు విలువ నేర్పుతుంది
చాలా పరాజయాలు ధననష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకూ ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చుపెట్టేసిన బంగారుబాబులకి దరిద్రం ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చని తెలిసొస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమవుతుంది. వెరసి... డబ్బు విలువ తెలిసొస్తుంది.
మనుషుల విలువ నేర్పుతుంది
‘విజయానికి బంధువులు ఎక్కువ’ అని పెద్దలు అంటూ ఉంటారు. కాస్తంత కష్టం రాగానే తుపాకీ దెబ్బకి కూడా దొరక్కుండా మన చుట్టుపక్కల జనాలంతా కనిపించకుండా పోవచ్చు. అలాంటి కష్ట సమయాల్లోనే ఎవరు మనవారో, ఎవరు కాదో అర్థమవుతుంది. ఇతరుల దృష్టిలో మన విలువ ఏమిటో తెలిసొస్తుంది. ఎవరి తత్వం ఏమిటో బోధపడుతుంది.
వినయం విలువ నేర్పుతుంది
అంతాబాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాము. మనంతటి వాడు లేడని మిడిసి పడుతూ ఉంటాము. ఒక్కసారి ఎదురుదెబ్బ తగిలితే కానీ మనం కూడా సాధారణ మనుషులమే అని తెలిసిరాదు. కష్టాలకీ, కన్నీళ్లకీ, పరాజయాలకీ, పరాభవాలకీ ఎవ్వరూ అతీతం కాదని తెలిసొస్తుంది. అంతేకాదు! ఇతరులని కూడా ఇక నుంచి గౌరవంగా చూడాలనీ, వినయంతో మెలగాలనీ అనిపిస్తుంది.
లక్ష్యం విలువ నేర్పుతుంది
కష్టపడితే ఏదీ కాళ్లదగ్గరకి రాదు. అలా వచ్చేదానికి విలువ ఉండదు. లక్ష్యం ఎంత అసాధ్యంగా ఉంటే దాని ఛేదనలో అంత తృప్తి ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆ లక్ష్యాన్ని తప్పిపోయినప్పుడు దాని విలువ ఏమిటో తెలిసొస్తుంది. దాన్ని ఏలాగైనా ఛేదించి సాధించాలన్న పట్టుదలా పెరుగుతుంది.
జీవితం విలువ నేర్పుతుంది
అప్పటివరకూ ఎడాపెడా సాగిపోయిన జీవితం పరాజయంతో ఒక్కసారిగా నిలిచిపోయినట్లు అవుతుంది. ఆ క్షణంలో మనకి కాలం, కష్టం, కరుణ, దురలవాట్లు, సంతోషం, అడ్డంకులు, ప్రణాళికలు... వంటి అనేక విషయాల గురించి అవగాహన ఏర్పడుతుంది. మన వ్యక్తిత్వం గురించీ, ఆలోచనా విధానం గురించి ఒక స్పష్టత కలుగుతుంది.
సేకరణ. మానస సరోవరం
*****
మనిషిని చదవాలి!
మనం ఎన్నో విధాలైన పుస్తకాలు చదువుతాం. ఎంతో నేర్చుకుంటాం. తెలిసిన జ్ఞానం పది మందికీ పంచుతాం. మనం మనిషిని సరిగ్గా చదవడం లేదు. మనిషిని చదవడం అంటే ఎదుటి మనిషి స్వభావాన్ని, మాట తీరును, ప్రవర్తనను, మంచి-చెడులను అర్థం చేసుకోవడం. మనిషి సంఘజీవి. అన్ని విషయాల్లోనూ సామాజిక అవసరాలు తీర్చుకోవడానికి సాటివారి మీద ఆధారపడక తప్పదు. పంట ఒకడు పండిస్తున్నాడు. ఇల్లు వేరొకడు కడుతున్నాడు. గుడ్డ మరొకడు నేస్తున్నాడు. వేర్వేరు వస్తువులను వేర్వేరు వ్యక్తులు తయారు చేస్తున్నారు. మన దగ్గర డబ్బే ఉంది. ఆ డబ్బు ఖర్చుచేసి, అన్నీ కొని తెచ్చుకుంటున్నాం. అందుచేత చాలా మందితో మనకు అనుబంధం ఉంటుంది. సంబంధం ఉంటుంది. ఈ సంబంధాలను, అనుబంధాలను ఎంత వరకు కొనసాగ…
*******
నీ నిజస్థితే నీ జీవనప్రమాణం......
నీ నిజస్దితి గురించిన అవగాహన లేదా అవసరం నీకు ప్రాణావసరంగా ఉండాలి.
అది తప్ప వేరు అవసరం నీకు ఉండకూడదు.
అది ఎంత బలమైనదిగా ఉండాలంటే దానికి సమానమైనది మరేదీ ఉండకూడదు.
అత్యంత విలువైనదిగా ఉండాలి. నీనిజస్థితే నీజీవనప్రమాణంగా అత్యుత్తమమైనదిగా నీకు అవసరం పడాలి.
దానికోసం ప్రతీ లిప్తనూ, ప్రతీ క్రియనూ అంతఃకరణమునకు నివేదన చేస్తుండు.
సర్వశక్తులనూ, ఇతరమైన చేష్టలనూ అంతఃకరణమునకు నివేదన చేస్తుండు.
అనంతమైన అవగాహనతో , శ్రద్దతో , విధేయతతో , సమర్దతనంతటినీ అంతఃకరణమునకు నివేదన చేస్తుండు .
నీకు (దేహమునకు) నీవే కాస్త ఎడంగా ఉంటుండు .
నీవు అత్యంతసమర్దతతో అంతఃకరణమునకు వసమౌతుంటే నీలో దేహభావన సడలిపోతుంది.
దీనిగురించి మాటలతో, చేష్టలతో, విశ్లేషణలతో, సమయాన్నీ వృధా చేసుకోవద్దు. నీనిజమైన సంపద అంతా లోదృష్టిలోనే ఉంది .
"నాకు లోదృష్టి అలవడటం లేదు అనేది నీకు దానిపై ఉన్న అశ్రద్ద మాత్రమే".
నాకు కుదరడం లేదు అనేది కూడా ఒకరకమైన అపనమ్మకమే.
నీకు నీవు సదా చేరువయ్యే ఉన్నావు.
నీకు నీవు ఎప్పుడు ఎడం కానే కాదు .
స్వయమును ఇతరముగా అనుభవించడం మానేయ్యి .
"ఉన్నది" ఏదైతే ఉన్నదో అది చేరువగానే,
సరళంగానే ఉన్నది .
లే అంతఃర్ముఖుడవు కమ్ము
నీవు నీగురించిన అనుభవపు ఆవరణలోనికి పోయి
నీలోవున్న నిశ్శబ్దంలోనికి తొంగిచూడు.
వస్తుజాలం లేశమైనా లేని అనంత సౌధంలోనికి పో, అక్కడ
నీ విషయజ్ఞానం, పరాయితనమంతా భగ్గున కాలి బూడిదౌతుంది.
తుదకు నీలో నేను (అనే దేహభావన)అనే శేషమంతా హరించబడుతుంది.
******
ఒకసారి పీఠాదిపతి అరణ్యంగుండా వెళుతున్నారు. చీకటి పడితే ఆ అరణ్యంలో ఒక చోట గుడారులు వేసుకుని పూజ చేసుకుంటున్నారు. ఫారెస్టు రేంజర్ వచ్చాడు అక్కడికి, వచ్చి నమస్కారం చేసి నిలుచున్నాడు. పీఠాదిపతి త్రికాలవేది, మనిషిని చూడగానే అతనిలో ఉన్నది అంతా చెప్పేస్తారు. అతన్ని చూడగానే ఒక మాటన్నారు.
'నేను మూడు లక్షణాలు చెబుతాను, ఇందులో నీవేస్థాయిలో ఉన్నావో నీవు చెప్పు.' అడగండి అన్నాడతను, 'అసలు నీ మనసులోకి ఒక అభిప్రాయం రాగానే అవతలి వాడిని వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపయే అంత కోపమున్నవాడివా? నీ మనసులో ఒక అభిప్రాయం వచ్చిన తరువాత వివరణ చేసి విరుచుకుపడే కోపమున్నవాడివా? అసలు విచారం అన్నదే లేకుండా కోప్పడిపోయి వెళ్లిపోతుండడమే నీ ఐశ్వర్యం అనుకునే స్వభావం ఉన్నవాడివా?' అని అడిగారు అది ఎందుకడిగారో అడిగినాయనకు తెలుసు, విన్నాయనకు తెలుసు, ఆయనన్నారు నేను మొదటి కోవకి చెందినవాణ్ణి. నాకు కోపం వస్తే అవతలివాడు తప్పు చేశాడని నమ్మేస్తాను. ఆయనన్నారు. ' నీవు నా దర్శనానికి వచ్చావు కదా! నేను నీకిచ్చే కానుక ఒకటే నీవు రెండవ స్థితిలోకి మారు. నీకు కోపం వచ్చేయగానే ఒక్కసారి ఆగు, 'ఎందుకిలా చేశావ్' అని అడుగు, నీ జీవితంలో నీవెన్నితప్పులు చేశావో తెలుస్తుంది.
అతను ఇంటికి వెళ్లిపోయాడు, వెళ్లిపోయేసరికి బాగా చీకటి పడింది. వంటవాడిని 'బాగా ఆకలిగా ఉంది ఫలహారం పెట్టు' అన్నాడు. వేపుడు ముక్కలు కూడా లేకుండా రెండే గోధుమ రొట్టెలు తీసుకువచ్చి వణికిపోతూ అక్కడ పళ్లెంలో పెట్టాడు. ఈయనకు ఎక్కడాలేని కోపం వచ్చింది. అతను ఓ ఏడెనిమిది రొట్టెలు తింటాడు.
ఓ రెండు కూరల్తోటి రెండు పలుచని రొట్టెలు, అంటే నేను రాననుకొని వీడు తినేశాడు అనుకుని వెంటనే లేచి అతన్ని కొట్టబోయాడు. పీఠాధిపతి మాట గుర్తుకొచ్చింది.
ఇవాళ రెండో స్థాయికి మారి చూద్దామని, 'ఎందుకు రెండు రొట్టెలు తెచ్చావ్?' అని అడిగాడు. అతనన్నాడు. 'మీ అటెండర్ ని పంపించి కదా! సరుకు తెప్పించుకుంటాం, అతను ఏ కారణం చేతనో ఇవాళ సరుకు తేలేదు. నాకోసం మిగుల్చుకున్న ఈ రొట్టెలు నాకు చచ్చేంత ఆకలిగా ఉన్నా మీరు తిని వస్తారో, రారో అని అట్టే పెట్టాను. రెండు రొట్టెలే పెట్టిన నా దోషాన్ని మన్నించండి' అన్నాడు. నిజంగా ఆ రెంజర్ వలవలా ఏడ్చేశాడు. నేను ఇలా తొందరపడి కొట్టేసి ఉంటే? ఇలా ఎందరిని నా కోపం చేత కొట్టానో, నేను ఇలా అడిగితే వీడు నా కోసం పడ్డ కష్టం తెలిసిందే, ఇంతలా నా కోసం కష్టపడ్డ వీణ్ణి కొట్టబోయాను. నిజంగా మహానుభావుడు ఈ మూడు తరగతులలో దేనికి చెందినవాడవని ప్రశ్నించి ఒకటి నుంచి రెండవస్థికి మారమని చెప్పి వెళ్లిపోయాడు.నేను రెండోస్థాయికి వస్తే నా దోషాలు కనపడ్డాయి. నేను ఎంతమందిని కొట్టానో అని ఏడ్చి, ఆ రెండు రొట్టెలు వంటవాడికి పెట్టాడాయన.
మీకు ఎందుకు మనవి చేస్తున్నామంటే.,
మీరు దుర్గుణాలను మీరు గ్రహించగలరు. మీలో ఉన్న దుర్గుణాలను మీ ముందు ఎవరూ చెప్పలేరు. మీ లోపాలని మీరు దిద్దుకోవడం ప్రారంభిస్తే, సమాజానికి ఎంతో సేవచేసిన వాళ్లు అవుతారు. మిమ్మల్ని మీరు దోషరహితంగా దిద్దుకోగలిగితే ఈ దేశానికి నీడనిచ్చే చెట్టులాంటి వారు అవుతారు. మీ నీడన ఎందరో సేద తీరుతారు.
బాగా పనిచేసేవాళ్లని అభినందించండి. సంకుచితత్వ్తంతో మీకు బాగా ఇష్టమున్న వాళ్లని మాత్రమే అభినందించకండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అతని వ్యక్తిత్వం నచ్చినా నచ్చకపోయినా, ఆ పనిని అతను సమర్థంగా చేస్తాడనుకుంటే ఆ పనిని అతనికే అప్పగించాలి
తాళపత్రనిధి
*మనసులోని నిర్మ్యాల్యం తొలగించుకొనేది ఎలా*...????
మనం నిత్యమూ ఆనందం, సుఖ సంతోషాలు కలుగాలని కోరుకుంటాము...
కానీ ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాము...
మనలోనే ఉండిన వీటికోసం ఎక్కడెక్కడికో తిరుగుతున్నాము...
రోగము వలన కలిగే బాధలు ఎక్కడ నుండి వచ్చాయి? కాశీ నుండా? రామేశ్వరం నుండా?!
అవి మన నుండియే వచ్చాయి కదా!!!
బాధలు మన నుండియే వచ్చినపుడు సుఖ సంతోషాలు కూడా మన నుండియే రావాలి కానీ ఎక్కడో బయట నుండి ఎలా వస్తాయి!??
కాలికి ముల్లు గుచ్చుకుంటె బాధ అంటున్నాం.
అదే రోడ్ మీద ఐదు వందల నోటు దొరికితే సంతోషిస్తున్నాము...
అంటే సుఖ దుఃఖాలు దొరికే వస్తువు బట్టి మనలో నుండియే వస్తున్నాయి కదా!
అంటే బాధలు, సంతోషాలు అన్నీ మనలోనే ఉన్నాయి.
మరి మనలో ఉండిన వాటికోసం బయట ఎందుకు వెతకడం?!
ఇది కేవలము భ్రమ, నిజమునకు మనలో లేనిదేది బయట లేదు.
పాలలో అంతరముగా ఉన్న వెన్న రావాలంటే కవ్వం పెట్టి చిలకాలి.
అలానే మనస్సును భగవన్నామము అనే కవ్వం పెట్టి చిలికితే అపుడు అనందమనే వెన్న రావడం జరుగుతుంది.
లోపల సాధన చేయనిదే బయట తిరుగుతూ అది కావాలి ఇది కావాలి అంటే ఏమొస్తుంది?!.
"మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనోమూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు. మనోమూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది."
దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీనిలోపల ఆత్మయే దైవం.
భగవంతుడ్ని చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు.
దీనిని బట్టి మనకి తెలుస్తుందేమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. కానీ మనకి కానరావడం
లేదు.
ఎందుకనీ?
మన మనస్సులో ఉన్న మాలిన్యాల వలన.!
మనలో ఉన్న దేవుడు కనబడకపోవడానికి ప్రధాన
కారణాలు రెండే రెండు తలంపులు!
మొదటిది ' నేను' అనే తలంపు.
రెండవది ' నాది' అన్న తలంపు.
మొదటిది అహంకారం, రెండవది మమకారం!
ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు.
మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు. ఆ పరమపవిత్రుడుని
పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి..
ఎలా?
ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి
చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనోమాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమును నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి.
(కర్తృత్వ భావనను తొలగించుకోవాలి).
మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యమును తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరుఅడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి.
సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదవగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.
మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియా
లను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే, మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం.
మనలో అనేక బలహీనతలుంటాయి. అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి
హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా దానిని
గురించి ఆలోచించం.
ఇదే మాయ. శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వక ముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి.
మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి. అవి ఒకటి ప్రేమ, రెండుజ్ఞానం. ఈ రెండు ఉన్నప్పుడే ఏకత
.......
*స్ఫూర్తిదాతలు*
రాదు, కాదు, లేదు జరగదు, చేతకాదు, తెలియదు. ఇలాంటివి పలాయన వాదులు చెప్పే మాటలు. కాబట్టి 'దు' చివరగా ఉండే ఇలాంటి పదాలు చేదు అన్నాడొక కవి.
అవయవాలు, అవకాశాలు, అవస్థలు లాంటివన్నీ సరిగ్గా ఉన్నా ఏదో ఒక నెపం పెట్టి పనుల్ని వాయిదా వెయ్యడం, తప్పించుకోవడం లాంటివి చేస్తూంటారు చాలా మంది. పైగా తాము చేయని పనులను సమర్ధించుకోవడానికి ఏవో సాకులు చెబుతూ ఉంటారు. నిజానికి ఏ అవకాశం లేని వారు, అన్ని దారులూ మూసుకుపోయిన వారు సైతం అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపించారు. "మనసుంటే మార్గం ఉంటుంది ఆలోచన ఉంటే అవకాశం కనబడుతుంది" అనే నానుడిని నిజం చేశారు.
తినగ తినగ వేప తియ్యగా అనిపించినట్టే, పాడగా పాడగా రాగం వినసొంపుగా వస్తుంది. కావలసిందల్లా 'సాధన. అది ఉంటే 'అన్ని పనులు జరుగుతాయని వేమన ఒక పద్యంలో వివరించాడు.
సుందరకాండలో సీతమ్మవారి తెలుసుకోవడం కోసం హనుమంతుడు ఎన్నో ఇక్కట్లు పడ్డాడు. అనుభవించిన వేదన, పొందిన అవమానాలు- నైరాశ్యాలు, ఆమె జాడ తెలియక పోవడంతో ప్రాణ త్యాగం చేసుకోవాలని తీసుకున్న నిర్ణయాలు... వీటన్నింటినీ అధిగమించి తనకు తానే స్ఫూర్తి పొంది సీతమ్మవారి జాడ తెలుసుకోవడంలో కృతకృత్యుడయ్యాడు.
బాలుడైన వరదరాజ్' మందబుద్ధి. గురువు చెప్పినవి ఏవీ తలకెక్కని కాదు. చదువు రాదని నిరాశ చెంది ఇంటిదారి పట్టాడు. తోవలో దాహం తీర్చుకునేందుకు నూతి దగ్గరకు వెళ్ళాడు రాపిడి వల్ల ఏర్పడిన తాళ్ల జాడలున్న నూతి గట్టు, కుండల అడుగు భాగపు రాపిడి వల్ల అరిగి జాడలు ఏర్పడ్డ రాళ్లను చూసి నేను వీటికంటే మందబుద్ధినా!' అనుకుని గురువు దగ్గరకు తిరిగి వెళ్ళి పట్టుదలతో విద్యాభ్యాసం చేశాడు. పాణినిగా పేరు మారిన అతడు సంస్కృత భాషకు ప్రామాణిక వ్యాకరణమైన 'పాణినీయం' రచించాడు.
ఏకలవ్యుడికి విద్య నేర్పడానికి నిరాకరించాడు ద్రోణుడు. అయినా ఆయన మూర్తిని ఏర్పాటు చేసుకుని దాన్నే గురువుగా నిలిపి విలువిద్యలో ప్రవీణుడయ్యాడు.
స్టీఫెన్ విలియం హాకింగ్ సుప్రసిద్ధ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. 21 ఏళ్ల వయసులో నాడీ మండలానికి సంబంధించిన జబ్బు మొదలై క్రమేపీ అతడి అవయవాలన్నీ పూర్తిగా చచ్చుబడేలా చేసింది. మెదడు మాత్రం చక్కగా పనిచేస్తూ ఉండేది. ఆ స్థితిలోనే కృష్ణబిలాలకు(బ్లాక్ హోల్) సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని, సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. శరీరం కదల్చడానికి కుదరని స్థితిలోనూ చేసిన పరిశోధనా కృషి ఆయనకు ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది.
లక్కోజు సంజీవరాయ శర్మ జన్మతః అందుడు, బ్రెయిలీ లిపి కానీ, అందుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేని కాలమది. అతడి అక్క పాఠశాలలో చదివిన విషయాలను ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, వాటిని విని, గుర్తు పెట్టుకుని, గణితంలో అపార విజ్ఞానం సాధించాడు. గణిత మేధావిగా గణనకెక్కాడు. ఇలా... ఎన్నెన్నో ఉదంతాలు, ఉదాహరణలు ఇవన్నీ అమిత స్ఫూర్తి దాయకాలు.
- అయ్యగారి
......
*గదా యుద్ధం*
భీముడూ, దుర్యోధనుడూ గదాయుద్ధానికి సిద్ధమయ్యారు.
ఇద్దరూ బరిలోకి దిగారు.
వాళ్ళిద్దరూ తన శిష్యులే కాబట్టి వాళ్ళపోరు చూడాలని వచ్చాడు బలరాముడు.
అందరూ ఆయనకు గౌరవంగా నమస్కరించారు.
భీముడూ, దుర్యోధనుడూ గదాహస్తాలతోనే మొక్కారు.
"మహాత్మా! అన్నదమ్ములు పోరాడుతున్నారు చూడు!" అన్నాడు ధర్మరాజు.
బలరాముడు మట్లాడలేదు. చిరునవ్వు నవ్వి, వెళ్లి దూరంగా కూర్చున్నాడు.
భీమదుర్యోధనులు యుద్ధం మొదలు పెట్టారు.
భూమి గడగడ వణికింది.
గ్రహణసందర్భం కాకపోయినా రాహువు సూర్యుణ్ణి పట్టాడు.
నక్కలు భయంకరంగా అరిచాయి. ఆకాశంలో మబ్బు లేకుండా పిడుగు పడింది. గదాఘాతాల చప్పుళ్ళతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. కాసేపటికి ఇద్దరి శరీరాలూ నెత్తురుతో తడిసి మోదుగువృక్షాల్లా ఉన్నాయి.
భీముడు రెండుసార్లు మూర్చపోయాడు.
అది చూసి అర్జునుడు భయపడి "బావా! దుర్యోధనుడితో మనవాడు చాలలేడంటావా?" అని కృష్ణుణ్ణి అడిగాడు.
కృష్ణుడు నవ్వి, "గురూపదేశ సమన్వయం ఇద్దరికీ సమానమే. భీముడికి బలం ఎక్కువ. దుర్యోధనుడికి చాతుర్యం ఎక్కువ. బలం కలిగి కూడా భీముడు దుర్యోధనుడి ఒడుపులకు చాలలేకపోతున్నాడు. దుర్మార్గుల్ని మోసం చేసి చంపడం తప్పుకాదు. అయినా ఇంతకంటే తెలివితక్కువతనం ఉంటుందా! అందరూ చచ్చి రాజ్యం మీద ఆశ విడిచి, మడుగులో దాక్కున్నవాణ్ణి వెతికి పిలిచి ఒంటరి కయ్యానికి రమ్మంటారా ఎవరైనా? మీరు లేని పదమూడు సంవత్సరాలూ భీముణ్ణి జయించాలనే దుర్యోధనుడు గదాయుద్ధ పరిశ్రమ చేశాడు. ధర్మారాజుకు కౌరవుల మీద అనుగ్రహం ఎక్కువై ఆలోచన అడుగంటింది. ఆఖరికి ఇది పందెపు యుద్ధమైంది" అన్నాడు.
అర్జునుడి మనస్సు చివుక్కుమంది.
హిడింబ బకాసురులను చంపి, జరాసంధుణ్ణి సంహరించి, కిమ్మీరుని వధించి, కీచకుణ్ణీ వాడి నూటైదుగురు తమ్ముళ్ళనీ ఒకేఒక్క రాత్రిలో శవాలను చేసిన భీమసేనుడు ఇప్పుడు దుర్యోధనుడి గదాఘాతాలకు తట్టుకోలేక బిక్కుబిక్కుమంటూ తమ్ముళ్ళవైపు చూస్తున్నాడు.
"ఇప్పుడేం చెయ్యడం" అన్నాడు అర్జునుడు ఎటూ పాలుపోక.
"గదా యుద్ధంలో నాభికి దిగువ భాగాన కొట్టకూడదు. కాని అంతకుమించి మార్గం కనబడటం లేదు" అన్నాడు కృష్ణుడు.
ఆ మాటలు విని, భీముడు తనవైపు చూసినప్పుడు చేత్తో తొడలు చరిచాడు అర్జునుడు. ఆ సంజ్ఞ తెలుసుకున్నాడు భీముడు.
గద తిప్పుతూ దుర్యోధనుడు పైకి ఎగిరేసరికి అదే అదుననుకుని బలం కొద్దీ అతని తొడలమీద మోదాడు. తొడలు విరిగి దుర్యోధనుడు కుప్పకూలాడు.
అంతటా గందరగోళం చెలరేగింది.
"పాంచాలిని సభలోకి ఈడ్చి, చీరలు విప్పి అవమానించినట్టు లేదూ.." అంటూ భీముడు ఎడంకాలితో దుర్యోధనుడి తలమీద బలంగా తన్నాడు.
బలరాముడు ఇదంతా చూస్తూనే వున్నాడు. పట్టలేనంత ఆగ్రహం వచ్చిందాయనకు. కోపంతో ముఖం ఎర్రబడింది.
"ఓ మహారాజులారా! చూశారా భీముడు చేసిన అన్యాయం! గదాయుద్ధంలో నాభికి దిగువ భాగాన్ని నొప్పించరాదనే నియమం మీరు వినలేదా? భీముడు ఎంత అన్యాయానికి తెగించాడో చూడండి" అంటూ ఎలుగెత్తి అరిచాడు హలాయుధుడు.
గబగబ తన రథం దగ్గరకు వెళ్లి నాగలి భుజాన వేసుకుని భూమి అదిరిపోయేటట్లు భీమసేనుడి వైపు నడిచాడు. కృష్ణుడు ఒక్కక్షణం వూరుకుని "దుర్యోధనుడి తొడలు విరగ్గొడతానని భీముడు ప్రతిజ్ఞ చేసిన సంగతి నీకు తెలుసు. చేసిన ప్రతిజ్ఞ చెల్లించుకోవడం రాజులకు పరమధర్మమని నువ్వే ఒకసారి నాతో అన్నావు. అదీగాక దుర్యోధనుని తొడలు భీముని వల్ల విరిగి పడతాయని మైత్రేయ మహాముని శపించాడు. ఇప్పుడదే జరిగింది. ఇందులో తప్పేముంది?" అన్నాడు.
బలరాముడు మండిపడ్డాడు.
"ధర్మార్థ కామాలు ఒకదాన్నొకటి నశింపచెయ్యకుండా వాటిని జాగ్రత్తగా అనుభవించాలి. అదీ గొప్పతనం! ధర్మాన్ని విడిచి, అర్థకామాల్ని కోరే పురుషుడు నిందలకు గురి అవుతాడు. మునిశాపం, ప్రతిజ్ఞ వుంటే వుండుగాక, అవన్నీ ధర్మం తప్పకుండా తీర్చుకోవాలి గాని ఇంత అన్యాయమా?" అన్నాడు.
"ఇందులో అధర్మమేముంది? ఎదిరించినప్పుడూ నడిచేటప్పుడూ కాదు, ఎగిరినప్పుడు కొట్టాడు భీముడు. అదేం రణనీతికి విరుద్ధం కాదే! అదీకాక ప్రాణం రక్షించుకోవడానికి ఏం చేసినా తప్పులేదని పెద్దలంటారు. తన తల పగలకొట్టడానికి దుర్యోధనుడు ఎగిరితే, నాభి కింది భాగం కొట్టకూడదని ధర్మసూత్రాలు వల్లె వేసుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటాడా భీముడు? కలియుగం దగ్గర పడింది. ధర్మాధర్మాల స్వరూపమే మారబోతోంది. అందుకే దుర్యోధనుడు అన్ని పాపపు పనులు చేసాడు" అన్నాడు కృష్ణుడు.
ఆ మాటలు అంటున్నప్పుడు 'ధర్మక్షేత్రాధిపతిని నేనే ' అన్నట్లు ఆయన వెనక క్షణకాలం ఒక మెరుపు మెరిసి మాయమైంది.
బలరాముడు ఆ వెలుగు చూడలేక కళ్ళు నులుముకుని వెంటనే మళ్ళీ బుసకొట్టాడు కోపంతో.
"ఇటువంటి తుచ్చపు గెలుపు పొందిన భీముడు తగిన సత్కారాలే పొందుతాడు" అని రథమెక్కి వెళ్లిపోయాడు.
ధర్మరాజు స్థాణువై నిలబడ్డాడు. ఇంతలో వెనుకనుంచి చేతులమీద పాక్కుంటూ దుర్యోధనుడు వచ్చాడు. అతన్ని చూడగానే ధర్మరాజు కళ్ళవెంట గిర్రున నీళ్ళు తిరిగాయి.
"..నాకు ఎవరి సానుభూతీ అక్కర్లేదు. కంసుడికి దాసుడైన వసుదేవుడి కొడుకు నన్ను దొంగదెబ్బ కొట్టించాడు కనుక మీరంతా బతికిపోయారు. సరిగ్గా యుద్ధం చేస్తే మీతోపాటూ ఈ కృష్ణుడికి కూడా యమదర్శనం చేయించి వుండేవాణ్ణి. శిఖండిని చాటుచేసుకుని భీష్ముణ్ణి అర్జునుడు చంపేటట్లు చేశాడు. ధర్మరాజు చేత ఆబద్దమాడించి ద్రోణుణ్ణి చంపించాడు. రథం భూమిలోకి దిగబడినప్పుడు కర్ణుణ్ణి చంపించాడు. భూరిశ్రవుణ్ణీ, సైంధవుణ్ణీ కూడా అన్యాయంగానే హతమార్చాడు. ఇప్పుడు యుద్ధనీతికి వ్యతిరేకంగా భీముడి చేత నా తొడలు విరగగొట్టించాడు. ఇంకా సిగ్గులేకుండా ఈ కృష్ణుడేదో కర్మ ధర్మ చక్రవర్తని మీరంతా చాటింపేస్తున్నారు" అన్నాడు దుర్యోధనుడు ఉక్రోషంతో.
కృష్ణుడు నవ్వాడు. "గదాయుద్ధంలో నీ తొడలు విరగ్గొడతానని ప్రతిజ్ఞ చేసిన భీముడు పోన్లే పాపం అని పిడికిటితో పొడుస్తాడనుకున్నావా? నువ్వు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటే గుర్తుకు తెచ్చుకుంటూ ఇక్కడే ఏడుస్తూ పడివుండు" అని పాంచజన్యం పూరించేసరికి పాండవులంతా రథాల మీద బయలుదేరి కౌరవ నగరం చేరుకున్నారు.
"గాండీవం, అమ్ములపొదిలూ అవతల పెట్టించి ముందు నువ్వు రథం దిగు. తరువాత నేను దిగుతాను” అన్నాడు కృష్ణుడు అర్జునుడితో.
విజయుడు ధనువూ, అమ్ములపొదిలూ తీసుకుని దిగిన తరువాత కృష్ణుడు పగ్గాలు మడిచిపెట్టి రథం దిగాడు. జెండాలో వున్న కపి తన భూతగణాలతో సహా తొలగిపోయింది. వెంటనే ఆ రథం గుర్రాలతో సహా చురచుర కాలిపోయింది.
"దేవా! ఇది చాలా ఆశ్చర్యంగా వుంది. ఈ రథం ఎందుకిలా కాలిపోయింది?" అని అర్జునుడు అడిగాడు.
"ద్రోణ కర్ణ అస్త్రాగ్నులతో ఇదివరకే కాలవలసింది. యుద్ధం అయిపోయేదాకా కావాలని నేనే రక్షించాను" అన్నాడు కృష్ణుడు.
అర్జునుడు కృష్ణ ప్రభువుకు వందనం చేశాడు. నడుస్తున్న స్వామిపై పుష్ప వృష్టి కురిసింది.
..
దాతకు సన్మానం(కథ) -- ✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
విదర్భ రాజ్యపు మహారాజు విక్రమకేతు చేతికి ఎముక లేదన్నట్టు దానధర్మాలు చేసేవాడు. ఆయన దానధర్మాల గురించి ప్రజలు గొప్పగా చెప్పుకునేవారు.
మహారాజు విక్రమకేతు సభలో ఉన్న సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చి ‘నాకు కొడుకు పుట్టాడు. చంటి బిడ్డకి తల్లి పాలు చాలడం లేదు. దయతో ఒక గోవును దానం చేయండి’ అని అడిగాడు.
అక్కడున్న ఒక భటుడిని పంపించి గోశాల నుండి ఉత్తమ జాతికి చెందిన గోవును తెప్పించాడు మహారాజు. గోవుకు బంగారు గిత్తలు, కొమ్ములు తగిలించి బ్రాహ్మణుడికి దానం చేసాడు.
దానం పొందిన బ్రాహ్మణుడు సంతోషంతో ‘మీ వంటి గొప్ప దానశీలుడు ఉండడేమో” అని పొగడ్తలతో ముంచెత్తాడు.
రాజు సంతోషంతో సభికుల వైపు చూసి “నా దానాల గురించి అంతా మాట్లాడగా విన్నాను. నేను గొప్పదానాలను చేసినట్టు రాజ్యమంతా చెబుతారు. లోకంలో ఉత్తమ దానమేదో, ఉత్తమ దాత ఎవరో తెలిసినవారు చెప్పండి” అన్నాడు.
రామయ్య అనే సభికుడు లేచి “మీ దానాలు అవసరంలో ఉన్నవాళ్ళను ఆదుకున్నాయి. మీ దానాలు గొప్పవే!” అన్నాడు.
సుందరయ్య అనే రైతు “కర్ణుడి దానగుణాన్ని లోకమంతా చెప్పుకుంటుంది. అడిగినవారికి లేదనకుండా దానం చేసాడు. తనకి ప్రాణహాని ఉందని తెలిసీ కవచ కుండలాలని దానమిచ్చాడు” అన్నాడు.
మాధవయ్య అనే వ్యాపారి “ధర్మరాజు చేసిన దానం గురించి ప్రజలు చెప్పుకోగా ఒక ముంగిస ‘సక్తుప్రస్తుడనే పేద బ్రాహ్మణుడు చేసిన అన్నదాన మహిమతో పోలిస్తే ధర్మరాజు చేసిన దానం తక్కువేనని అంది. సక్తుప్రస్తుడు చేసిన అన్నదాన మహిమతో నీరు తగిలి తన శరీరంలో సగం బంగారు మయం అయిందని, మిగతా సగం కోసం ధర్మరాజు ఇంటికి వస్తే ఫలితం లేదని చెప్పింది” అన్నాడు .
వేదయ్య అనే వ్యక్తి ‘తాను పస్తులుండి అతిధులకు భోజనం పెట్టిన రంతిదేవుడనే మహా దాత ఉండేవాడు” అన్నాడు.
విశ్వనాధం అనే బ్రాహ్మణుడు “శరీరభాగాలను తృణప్రాయంగా దానం చేసిన దాతలున్నారు. వెన్నెముకను దానం చేసిన దధీచి, డేగ కోసం తొడ నుండి మాంసం కోసిన శిబిచక్రవర్తి అలాంటివారే. వామనుడికి బలి చక్రవర్తి చేసిన దానంతో పోలిస్తే మీ దానాలు అంత గొప్పవి కావు” అన్నాడు.
వారి జవాబులకు రాజు సంతోషించాడు. ” మంచి విషయాలు, గొప్ప దాతల గురించి తెలిపారు. వారిలాగా కీర్తి పొందడానికి మరిన్ని గొప్ప దానాలు చెయ్యాలి. మనరాజ్యంలో నన్ను మించిన దాతలున్నారా? అలాంటివారిని పరిచయం చేస్తే సత్కారిద్దాము” అన్నాడు.
సభికులు కొన్ని పేర్లు చెప్పారు. అవేవీ సరైనవి కావని తేల్చారు మరికొందరు.
అంతలో విదూషకుడు “మన రాజ్యంలో సుబ్బయ్య గొప్పదాత” అన్నాడు.
సభికులంతా ఆ పేరు విని ఆశ్చర్యపోయారు. “సుబ్బయ్య ధనవంతుడే కానీ దాత కాదు” అన్నాడు కోశాధికారి.
“దాతగా సన్మానానికి అతడెలా అర్హత పొందాడు?” అని అడిగాడు మంత్రి మాధవయ్య.
“ అతడు పిసినారి. పిల్లికి బిచ్చం పెట్టడు. సుబ్బయ్య సన్మానానికి అనర్హుడు” అన్నాడు ఆస్థానకవి.
వారందరి ప్రశ్నలకు జవాబు ఇవ్వమన్నట్టు విదూషకుడి వైపు చూసాడు రాజు.
“సుబ్బయ్య పిసినారి కాబట్టే గొప్పదాత” అన్నాడు విదూషకుడు నవ్వుతూ.
‘అదెలా’ అని ఆశ్చర్యపోయాడు మంత్రి మాధవయ్య.
“దాతలంతా ఉన్నది అనుభవిస్తూ మిగిలిందే దానమిస్తారు. సుబ్బయ్య పిసినారి కాబట్టి సంపాదించడమే తప్ప ఖర్చు పెట్టడు. సంతానం లేదు కాబట్టి ఆ ఆస్తి మొత్తం ఎప్పటికైనా రాజుగారికి చెందుతుంది. దాచిందంతా లోకానికిచ్చేవాడు మహాదాత కాక మరెవరు?” అని విదూషకుడు అడగగానే సభంతా నవ్వులతో గొల్లుమంది.
విదూషకుడి వాదనతో ఏకీభవించి సుబ్బయ్య సన్మానానికి ఆమోదం తెలిపాడు మహారాజు.
ఒక రోజు సుబ్బయ్యను సభకు రప్పించారు. తనలాంటి పిసినారికి సన్మానమేమిటని ఆశ్చర్యపోయాడు సుబ్బయ్య.
సభికుల మాటలు విన్న తరువాత ‘తానేమీ సుఖాలను, భోగాలను అనుభవించడం లేదని, పోయేటప్పుడు ఏదీ మోసుకుపోలేడని’ గ్రహించాడు . మరుక్షణం కనువిప్పు కలిగింది సుబ్బయ్యకి .
బ్రతకడానికి సరిపోయే ధనాన్ని ఉంచుకుని మిగిలినదంతా పేదసాదలకి దానధర్మాలు చేసాడు సుబ్బయ్య.
రాజ్యంలోని పిసినారులంతా సుబ్బయ్యని చూసి మారిపోయారు. ఎవరికైనా అవసరం ఉన్నట్టు తెలిస్తే సహాయం చేసేవారు. అలా సుబ్బయ్య సన్మానం పిసినారుల్లో దానగుణ
*ధృతరాష్ట్ర పరిష్వంగం*
కుఱు పాండవ యుద్ధంలో కౌరవ సైన్యం మొత్తం మంటగలిసిపోయింది. పద్ధెనిమిది అక్షౌహిణుల సైన్యం నేలకూలింది. సుయోధనచక్రవర్తి భీమసేనుడి గదాఘాతం వల్ల తొడలు విరిగి దుమ్ములో ధూళిలో దొర్లి మరణించాడు. హా! నాయనా! ఎంత అనుచితంగా అస్తమించావురా!" అంటూ ధృతరాష్ట్రుడు ఏడ్చాడు. గాంధారీ, కోడళ్ళూ సృహతప్పి పడిపోయారు.
హస్తినాపురంలో ఆడవాళ్ళూ, పిల్లలూ యుద్ధంలో చనిపోయిన వారికోసం ఆక్రందనలు చేస్తూ, కేకలు వేస్తూ వుంటే ఆ ధ్వనులు ఎక్కడచూసినా ప్రతిధ్వనిస్తున్నాయి.
తమ్ముడా! విదురా! అనాథను అయిపోయాను! అందరూ పోయారు! ఇంక నువ్వే నాకు దిక్కు!" అంటూ దుఃఖించాడు ధృతరాష్ట్రుడు.
"మహారాజా! అజాత శత్రుడి మంచితనాన్ని బలహీనతగాను, చేతగానితనంగాను భావించి నిష్కారణవైరం కొనితెచ్చుకున్నారు. తాటాకు మంటలాంటి కోపం వల్ల హాని లేదు. దీర్ఘక్రోధం వల్ల కీడు కలుగుతుంది. తమకు బలం ఎక్కువగా వుంటే యుద్ధం చెయ్యాలి. శత్రువులకు బలం ఎక్కువగా వుంటే సంధి చేసుకోవాలి. అది రాజనీతి. పైగా పాండవులను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు హరి. అది తెలిసి కూడా మూర్ఖంగా పౌరుషానికి పోయరు. కృష్ణార్జునుల బలం తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు చింతించి ఫలమేమిటి?" అన్నాడు విదురుడు.
ఇంతలో వ్యాసుడు కూడా వచ్చాడు. "నాయనా! నీకు తెలియనిదీ, నీకు కొత్తగా చెప్పవలసినదీ ఏదీ లేదు. భూభారం కొంత తగ్గడానికే ఈ యుద్ధం జరిగింది. ఇకమీదట ధర్మరాజునే నీ కుమారుడిగా భావించుకో. పాండవులందరినీ ప్రేమాభిమానాలతో చూడు" అని ధృతరాష్ట్రుడికి హితవు చెప్పాడు.
ఇలా అంటూ వుండగానే కృష్ణుడు, ధర్మరాజు వచ్చారు. ధర్మరాజు పిన తండ్రికి వంగి నమస్కరించాడు. శోకంలో వున్న ధృతరాష్ట్రుడు ధర్మరాజు శరీరమంతా తడిమి చూసి కౌగలించుకున్నాడు. మరి కాసేపటికి భీమసేనుడు వచ్చాడు. "రారా తండ్రీ! రా" అని భీముణ్ణి రెండు చేతులతోనూ దగ్గరకు తీసుకోబోయాడు ధృతరాష్ట్రుడు.
భీముణ్ణి వద్దని సైగ చేసి ఇనుముతో చేసిన ఒక బొమ్మను ఆ ధృతరాష్ట్రుడు ముందు నిలబెట్టాడు కృష్ణుడు.
ఇనుపమయంగా వున్న ఆ బొమ్మను భీమసేనుడే అనుకుని ధృతరాష్టుడు రెండు చేతులతోనూ గట్టిగా నొక్కి, తన ఉక్కు కౌగిలిలో బిగించి అమితమైన కోపంతో అలాగే హతమార్చబోయాడు.
తీరా నొక్కాకా "అయ్యో! నా ప్రేమాతిశయం వల్ల ఏమీ తెలీలేదు. నా కౌగలిలో భీముడు మరణించలేదు కదా" అని కల్లబొల్లి విచారాన్ని నటించాడు.
"ప్రభూ! మీ వల్లమాలిన ప్రేమ ఇంతపని చేస్తుందని నేను ముందే గ్రహించాను. భీముణ్ణి మీ పరిష్వంగంలోకి వెళ్ళవద్దని కళ్ళతోనే హెచ్చరించాను. మీ కౌగిలిలో విరిగిముక్కలైంది భీమసేనుడు కాదు, ఒక ఇనుప విగ్రహం! దైవానుగ్రహం వల్ల భీముడు క్షేమంగానే వున్నాడు" అన్నాడు కృష్ణుడు.
గత్యంతరం లేక కోపాన్ని దిగమించుకున్న ధృతరాష్ట్రుడు పాండుపుత్రులందరినీ దగ్గరకు తీసుకుని ఆశీర్వదించాడు.
No comments:
Post a Comment