Monday, 20 June 2022

341--345



341 : బాలవినష్టకుని కథ-
పూర్వం ఒక రాజ్యంలో రాచకొలువును చేసే రుద్రశర్మ అనే బ్రాహ్మణునకు ఇద్దరు భార్యలున్నారు. అందులో ఒకామె ఒక కుమారుని గనిన వెంటనే చనిపోయింది. రుద్రశర్మ పుట్టిన శిశువును రెండవ భార్యకిస్తూ 'నీకొడుకుతో పాటు ఈ బాలునికూడా పెంచ'మని అప్పగించాడు. సవతి కొడుకునకామె తీక్ష్ణమైన ఆహారమివ్వటం చేత ఆతని పొట్టపెరిగి ధూసర వర్ణం(బూడిదరంగు) కలవాడయ్యాడు. రుద్రశర్మ భార్యతో 'బాలునీవిధంగా ఎందుకు పెంచుతున్నా'వని అడుగగా ఆమె 'ఇతని పుట్టుకయే ఇట్లాంటి'దని నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చింది. అప్పటినుండి ఆ బాలకునకు బాలవినష్టుకుడనే (బాల్యం కోల్పోయినవాడు) అనే పేరు వచ్చింది.
ఆ బాలకునకు వయసుతో పాటు బుద్ధికూడా పెరగసాగింది. ఆతనికి ఐదేండ్లు వచ్చాయి. ''నా సవతి తల్లి నన్నెప్పుడు ఇబ్బంది పెడుతున్నది. దీనికేమన్నా ప్రతిక్రియ చేయా''లనుకున్నాడు. రాజకొలువునుండి అప్పుడే ఇంటికి వచ్చిన తండ్రితో ఆ బాలుడు తనకిద్దరు తండ్రులున్నారన్నాడు. ఈ విధంగా ప్రతిదినం పలకటంచే తండ్రికి భార్యపై అనుమానం వచ్చి ఆమెతో మాట్లాడటమే కాకుండా తాకటం కూడా మానివేసాడు. దీనితో తల్లికి ఈ బాలవినష్టకుడే ఏదో చేసి ఉంటాడనే సందేహమేర్పడి ఆతనికి మంచి చేసుకొని పెరుగన్నం తినిపించి 'నీతండ్రి అనుమానానానికి కారణమేమి'టని అడిగింది. దానికాతడు ఆమెతో '' నీవు నీపుత్రుని పోషించుకొంటూ నన్నేల ఇబ్బంది పెడతావు. ఇప్పటికైనా నన్ను సరిగా చూసుకోకపోతే ఇంతకంటె ఎక్కువ చేస్తా''నని అనగానే ఆమె ఇం కెప్పుడు ఈ విధంగా చేయనని ఆ బాలకునకు మాట ఇచ్చింది. అప్పుడా బాలకుడు సవతి తల్లితో ''అయితే మా నాయిన ఇంటికి రాగానే అద్దాన్ని  ఆతని ముందుంచే ఏర్పాటు చేయ''మన్నాడు. మరునాడు రుద్రశర్మ ఇంటికి వచ్చే సమయానకు తన చేటిని అద్దాన్ని ఆతని ముందుంచే ఏర్పాటు చేసింది. ఇంటికి వచ్చిన రుద్రశర్మ ప్రతిబింబమద్దంలో ప్రతిఫలించగనే బాలవినష్టకుడు 'తన రెండవ తండ్రి ఇతడే' అని అరవసాగాడు. రుద్రశర్మకు బార్యపై అనుమానం మాసిపోయింది.  అతడు భార్యాపిల్లలతో సుఖంగా ఉన్నాడు. కాబట్టి బాలుడైనా కోపాన్ని పూనినట్లైతే ఎట్టి దోషాన్నైనా ఆరోపిస్తాడు.( ''ఏవముప్తాదయేద్దోషం బాలకోఽపి వికృతిం గత: ''2-6-47శ్లో) కథాసరిత్సాగరం- రెండవలంబకం- ఆరవతరంగం)
******

****

. 342.భక్తుడు: ఏ రూపాన్ని దృష్టిలో ఉంచుకొని ధ్యానం చెయ్యాలి?

శ్రీ రామకృష్ణులు: ఏ రూపం చేత ఎక్కువగా ఆకర్షితుడవవుతావో, ఆ రూపాన్ని మనస్సులో పూర్తిగా నిలుపుకో. అన్ని రూపాలూ పరబ్రహ్మమే అని గ్రహించినవాడు కృతార్థుడవుతాడు. మానవ రూపంలో ఉన్న అవతారాలన్నీ ఆయన నీడలు మాత్రమే అని గ్రహించాలి.

రూప మేలైన మనసును రంగ రించు
పాప లాగదైవము నిన్ను మలుపు తిప్పు
ద్వీప దైవాన్ని మనసులో తీర్చిదిద్ది
దేవుడని మనుషులలోను తృప్తి పరచు

భక్తుడు: భగవంతుణ్ణి మనం కళ్ళతో చూడగలమా?

శ్రీ రామకృష్ణులు: దైవకృప కలిగినప్పుడు దేవుడు దివ్యనేత్రాలు ప్రసాదిస్తాడు. ఈ భౌతికమైన కళ్ళతో చూడలేం. అర్జునునికి కూడా దివ్య చక్షువులు ప్రసాదించి, పిమ్మట తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు కృష్ణుడు. రాగభక్తి కలవాడికి దైవకృప తప్పకుండా సిద్ధిస్తుంది. ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడం వీరి స్వభావం.

దైవ కృప కలిగి నపుడు దివ్య నేత్ర
మిచ్చి దివ్య చక్షువులను  పెంచు దేవ
సిద్ది కొరకయే ప్రేమను వ్యక్త పరుచు
ప్రతి ఫలాన్ని కోరక రాగ భక్తి

భక్తుడు: మేమంతా సామాన్యులం. ఎన్నో పాపాలు చేస్తుంటాం మా గతి ఏమవుతుంది?

శ్రీ రామకృష్ణులు: చెట్లను ఆశ్రయించిన పక్షులు రెండు చేతులతో చప్పట్లు కొట్టగానే ఎలా ఎగిరిపోతాయో భగవన్నామం ఉచ్చరించడం వల్ల మానవులు చేసే పాపకర్మలు అలాగే వదలి పోతాయి. భగవన్నామమే చప్పట్లు. పాపాలే పక్షులు. శరీరం చెట్టు లాంటిది. సూర్యరశ్మి వల్ల చెరువులోని నీరు ఆవిరి అయి నట్లు, భగవన్నామ సంకీర్తనం వల్ల పాపాలు ఆవిరి అయిపోతాయి.

చేయి చేయికలిపి శబ్ద చేరువవ్వు    
పాప పుణ్యకర్మలు ఫలం పొందు నువ్వు   
వేడికి జలము ఆవిరి వేగమవ్వు
దైవ పూజలే మనకు దగ్గరవ్వు   

భక్తుడు: దేవుడు మమ్మల్ని ఈ సంసారంలో ఎందుకు దింపాడు?

శ్రీ రామకృష్ణులు: సంసారం కర్మక్షేత్రం. కర్మల ద్వారా జ్ఞానాన్ని సముపార్జించవచ్చు. చేయదగిన కర్మల, చేయరాని కర్మల గురించి గురువు ఉపదేశిస్తాడు. అంతేగాక నిష్కామకర్మ చేయాల్సిందిగా గురువు శిష్యులకు బోధిస్తాడు. కర్మ చేసేకొద్దీ మనోమాలిన్యం నశిస్తుంది. సమర్ధుడైన వైద్యుడి సలహా మేరకు ఔషధం పుచ్చుకొని రోగాన్ని నయం చేసుకోవడం లాంటిది ఇది.

కర్మచేమనోమాలిన్యం కాటికేవ్వు  
కర్మ లన్ని సంసార మ్ము కడిగి వేయు  
కర్మలజ్ఞానాన్నిసము పార్ది౦చవచ్చు  
కర్మ లు గురువు ఉపదేశ కరువు మార్చు
 
భక్తుడు: భగవంతుడు మమ్మల్ని సంసారం నుండి ఎందుకు విముక్తుల్ని చేయకున్నాడు?

శ్రీ రామకృష్ణులు: ఈ కామినీ కాంచనాల్ని అనుభవించాలన్న కోరిక వదలిపోయినప్పుడు మనల్ని ఆయన సంసారం నుండి విముక్తుణ్ణి చేస్తాడు. ఒకసారి ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకొ న్నాక సదరు వ్యక్తి అక్కడ నుండి ఎక్కడికీ వెళ్ళలేడు. రోగం నయం కానిదే అతడు వెళ్ళడానికి వైద్యుడు అనుమతి ఇవ్వడు.

రోగము నయము కానిదే రాక వుండు
భోగము వలన రోగము బోధ చేయు
యోగ కామిని కాంచన ఎదురు తిరుగు
మూగ అవయవ దోషము మాయ మవును     

--(())--

 
343..*గర్వం ఉన్న వ్యక్తి ఎలా పతనం అవుతాడు?

****


1) *విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు*

గర్వం ఉన్నందు వల్ల మనం పూర్తి గా భౌతిక మనస్సు చెప్పినట్టు వింటాము, భౌతిక మనస్సు కు ఆధ్యాత్మిక నియమాలు తెలియవు, ఇతరులు మన గురించి ఏమనుకోవాలను కుంటామో దాని గురించి ఆలోచించి వారి మెప్పు కోసం పనులు చేస్తూ, అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటాం.

2) *ఆధ్యాత్మికం గా పతనం చెందుతాడు*

గర్వం పెరగడం వల్ల వారు దేవుడున్నడని నమ్మరు, ఉన్నత శక్తి వుండే అవకాశం లేదంటారు, వారి చేష్టల వల్ల వారి ఉప చేతనాత్మక మనస్సు ని నిద్రాణo  చేసుకుంటారు.

3) *తక్కువ స్థాయి స్పందనలు వస్తాయి*

మనం ఏదైనా వ్యతిరేక మయిన పని చేస్తే మన తల చుట్టూ నల్లని మేఘం లా వ్యతిరేక శక్తి కమ్ముకుని వెలుతురిని రానివ్వ కుండా ఒక చక్రం సృష్టింప బడుతుంది, దాని వల్ల మనం బలహీనమై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము.

4) *అసూయ వస్తుంది*

అసూయ వల్ల మనం ఇతరులతో పోల్చు కుంటాం, మనకు జరిగిన మంచి విషయాలను గమనించ కుండా మన కేమి జరగలేదో అవే గుర్తు తెచ్చుకుని బాధ పడుతూ, ఇతరులకు జరిగిన మంచి విషయాలు చూసి సహించ లేరు.

6) *ఎప్పుడు అసంతృప్తి తో ఉంటాడు*

భూ లోకం లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం తృప్తి తో జీవించడం, భౌతిక మనస్సు మాట వినడం వల్ల అహం ఏర్పడుతుంది, అది మనల్ని ఇంకా ఇంకా కోరుకునేలా చేస్తుంది, మనం ఆ కోరికలకు లోబడి పోయి సంపద, అధికారం, కీర్తి, సంపాదిస్తాం, కానీ అవేమి మనకు తృప్తి ని ఇవ్వవు.

7) *శత్రువులు అధికం అవుతారు*

గర్వాన్ని అదుపు లో ఉంచు కోకుండా అనాలోచితం గా మూర్ఖం గా మాట్లాడడం వల్ల శత్రువులు ఏర్పడతారు.

8) *బంధుత్వాలు నష్టపోవడం జరుగుతుంది*

గర్వం వల్ల ఆధిక్యతా భావం వస్తుంది, దీని వల్ల బంధుత్వాలు నిలబడవు.

9) *ఆశలు  ఎక్కువ అవుతాయి*

అహం ఉన్నందు వల్ల ఇది నేనే చెయ్యాలి, ఇది నాకే దక్కాలి, అనుకుంటాం, దీని వల్ల ఆశ , ఆశ వల్ల వత్తిడి, ఆశ వల్ల ఇతరుల నుండి ఏవేవో కావాలనుకుంటారు.

ఏ వ్యక్తి అయితే వీటిని గమనించి అతడు అతని దృష్టి ని మరలుస్తాడో అతను ఆధ్యాత్మికం గా ఎదుగుతాడు.

 ****

 344..అస్తిత్వమన్నది భూమి

 మనిషి అస్తిత్వంతో కలిసి వున్నపుడే సజీవంగా వుంటాడు. మన పునాదులు అస్తిత్వంలో వుంటే మనం సంపూర్ణంగా, ఆరోగ్యంగా వుంటాం.
మనం అస్తిత్వ సంబంధం లేకుండా ఒంటరిగా వుంటే, పునాదులు లేకుంటే ఎట్లాంటి ఎదుగూ బొదుగూ లేకుండా ప్రాణం లేకుండా వుంటాం.
అస్తిత్వమన్నది భూమి, మన బలవర్థకమయిన ఆహారం, మన ఆరోగ్యం, సమజీవితం అంటే విస్ఫోటన మినహా మరేం కాదు. అది మన సజీవత్వానికి సంబంధించిన విస్ఫోటన.
దానినే ప్రేమబంధం అంటారు 

మనకున్నది ఒక్కటే మనసు.  ధ్యాన ప్రయత్నానికి, ఆలోచనలకు కారణం ఆశ అనే గుణం. ఆలోచనలు తెప్పిస్తుంది.  ఉన్నది ఒక్క మనసే కనుక అది అన్ని కోరికలతో పాటు ఏదో సాధించాలన్న కోరికను కూడా ఒక రోజు మర్చిపోతుంది. అలా కోరిక పోయిన క్షణంలో కలిగే దివ్యానుభూతే నిజమైన "ధ్యానం".  అందుకే ఆత్మజ్ఞానులైన పెద్దలంతా 'ధ్యానం చేసేది కాదు, కొనసాగుతున్నదే' అని చెప్తున్నారు. టివి చూసేప్పుడు, పేపర్ చదివేప్పుడు ఇతర ఆలోచనలతోపాటు తాను ఆ పని చేయాలన్న ఆశ కూడా పోతుంది. అందుకే అందులో లీనం కాగలుగుతున్నారు. జపంలో ఎలాగైతే తాను 'రామరామ' అంటున్న విషయం కూడా తెలియకుండానే అనేస్తున్నాడో, ఇక్కడ తాను చేస్తున్న పని తెలియకుండానే దాన్ని అనుభవిస్తున్నాడు. జపంలో అయితే దాన్ని "సమాధిస్థితి" అంటారు. సాధారణ పనుల్లో అయితే దాన్నే తాదాత్మ్యత అంటారు !
మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే! అనగా మనం నిర్వహనాసక్తితో ఏదైనా చదించవచ్చు అని అందరూ తెలుసుకోవాలి.
--(())--

 345.🦌🦌 *కొత్త  యుద్ధం*

 *సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బ్రతకగలదు*

*అది ఒక జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా నిర్భయంగా జీవిస్తున్నాయి .*

*ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారితప్పి వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నో కొత్త కొత్త జంతువులు, తోడేళ్ళను, పులులను, సింహాలను, నక్కలను తొలిసారి అక్కడే చూసింది.*

*అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై " ఓ జింక సోదరా ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే " అంది.*

*"అవును మాది జింకలవనం " అంది.*

*" ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూర మృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపో " అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళి పోయింది.*

*" పిరికి జింక నేనూ జింకనే అదెలా తప్పించుకుందో నేనూ అలాగే తప్పిచుకోగలను " అనుకుంటూ జింకల వనం జింక ముందుకు వెళ్ళింది.*

*అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక చిన్నగా దాని దగ్గరికి వెళ్ళి తన ముందరి గిట్టతో సింహం తోక తొక్కింది .*

 *సింహానికి మెలకువ వచ్చింది. బద్దకంగా లేస్తూ జింకను చూసి గర్జించింది. ఆ గర్జన విని జింకకు గుండె ఆగినంత పనయింది .*

*వెనుదిరిగి వచ్చిన దారినే పరుగు పెట్టింది. అడవిని దాటి జింకల వనం వైపు పరుగు తీస్తూనే  వుంది. జింకల వనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి చీల్చి ఆరగించింది .*

 *తరువాత సింహం లేచి మెల్లగా జింకల వనంలోకి వెళ్ళింది. దానికి అది క్రొత్త ప్రదేశం . అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తుంది .*

*కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడి పోయాయి.* *చెల్లాచెదురు అయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నాయి .*

*పొ‌రపాటున ఏ జింకయినా బయటికొస్తే చాలు సింహం దాన్ని పడగొట్టేస్తుంది .*

*అయితే ఆ జింకల్లో తెలివయిన కుర్ర జింక ఒకటుంది. దాని పేరు జ్ఞాన నేత్ర. జింకల పెద్దలు జ్ఞాన నేత్ర దగ్గరికి వచ్చి "దీనికి పరిష్కార మార్గం ఏమిటి " అని అడిగాయి.*

*" జింక పెద్దలారా నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూర జంతువును ' సింహం ' అని అంటారు. దీని పంజా నుంచి తప్పించుకొనే చాకచక్యం మనకు లేదు.*

*ఎటు ఆలోచించినా. . ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తుంది.*

*ఈ సింహం ఆహారం లేకుండా*

*14 రోజులు మాత్రమే బ్రతక గలదు. కానీ మనం 21రోజులు బ్రతకగలం.*

*కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14రోజులు బయటకు రాకుంటేచాలు దాని పీడ మనకు విరగడౌతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా దాని జీవిత కాలం మరో 14 రోజులు పెంచినట్లే.*

*ఈ రోజు అమావాస్య ఇప్పుడే పొదల్లోకి దూరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొదల నుండి బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే" అంది.*

*జింకలన్నీ జ్ఞాన నేత్రం మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.*

*పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటే భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టు కింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి, గెంతాయి. జింకల కేరింతలతో వనం అంతా పులకరించింది.*

ఇది ప్రస్తుత పరిస్థితులకు కరెక్టుగా సరిపోయింది కదా.. 

అందుకే..

*ఇంట్లోనే ఉండండి* 

*కరోనా రక్కసి పనిపట్టండి*

మనం జింకలకన్నా తెలివైనవాళ్ళమేగా

[---

 

No comments:

Post a Comment