*చైత్ర మాసం విశిష్టత*!
“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత" ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.
శ్రీ శుభకృత్ నామసంవత్సరానికి తొలి మాసం కూడా.
చైత్రమాసం అనగానే మనకి "ఉగాది, "శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి.
అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.
అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా.
ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.
#ఉగాది పూజా విధానం పై శ్రీ చాగంటి వారి ధర్మ సూక్ష్మాలు తెలియ చెప్పే ప్రవచనం:
శ్రీ ప్రభవనామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి.
అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది.
అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది.
అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి.
ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’.
ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు.
కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది.
అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి.
మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.
#పురాణ గాథ!...
ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట.
అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు.
దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు.
నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు.
అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు.
వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు.
సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో త. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి,
ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు అని జ్ఞానబోధ నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు.
అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.
----నిజమైతే బాగుంటుందనిపించే కల😇
వేడివేడి ఉప్మా తింటుంటే - అల్లం ముక్క నోటికి తగిలినట్టూ
దోరగా వేగిన పెసరట్టు కొరికితే - జీడిపప్పు పంటి కిందకి వచ్చినట్టూ
మిర్చిబజ్జి ఆబగా తినబోతే - నాలిక సుర్రుమన్నట్టూ
పక్కనే ఉన్న వొగ్గాణీ - గుప్పెడు బొక్కినట్టూ
పచ్చి మిరపకాయలు తగిలించి - రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ
మామిడికాయ బద్ద నవులుతూ - గుండమ్మ కథ సినిమా చూస్తున్నట్టూ
పీకల్దాక పెరుగన్నం తినేసి - ఉసిరికాయ బుగ్గనెట్టుకున్నట్టూ
దిబ్బరొట్టె మొత్తం -
నేనే తినేసినట్టూ
వేపచెట్టు కింద మడతమంచమెక్కి -
చెంబుడు నిమ్మకాయ మజ్జిగ తాగి పడుకున్నట్టూ
చద్దన్నంలో - ఆవకాయ వాయ కలిపినట్టూ
పప్పుచారులో గిన్నెడు - చిన్నుల్లిపాయలు, దోసకాయ, బెండకాయ, ములక్కాయ ముక్కలు తేల్తున్నట్టు
రోడ్ మీద కొబ్బరి బొండాం కొట్టించుకుంటే - లేత కొబ్బరి ఉన్నట్టూ
లేత లేత ముంజెలు వేలితో పొడుచుకుని - లెక్కెట్టకుండా తిని మూతి తుడుసుకున్నట్టూ
కమ్మగా ఉడికిన ముద్దపప్పు అన్నంకి - దోసబద్దల పచ్చడి తోడైనట్టూ
చుక్కకూర పప్పు కుతకుతలాడించి - వేడివేడిగా అమ్మ చపాతీ చేసినట్టూ
నూకలన్నంలో - వెన్న తీయని మజ్జిగ పోసుకుని జుర్రినట్టూ
పులగం అన్నంలోకి - ఘాటుగా పచ్చిపులుసు పోసినట్టూ
చెట్టు నుంచి తెంపుకొచ్చిన లేత వంకాయలు - మగ్గీ మగ్గగానే పళ్ళెంలోకి వడ్డించినట్టూ
సావిట్లో గేదెలతో పోటీపడి - తేగలు తెగ తినేసినట్టూ
దోర పచ్చికొబ్బరి లోకి - బెల్లం గెడ్డ జత కుదిరినట్టూ
తిరుపతి లడ్డూ మొత్తం - అచ్చంగా నాకే ఇచ్చేసినట్టూ
పరపరలాడే పచ్చిమామిడికాయలు - ఉప్పూ కారం దట్టించి కొరికినట్టూ
పండిన వేపకాయ - ఎవరూ చూడకుండా చీకిపారేసినట్టూ
టమాటా పప్పుకి తోడు - ఊరమిరపగాయలూ , వడియాలూ , అప్పడాలతో వచ్చినట్టూ
మసాలా చాయ్ - ముంత మసాలాతో తాగినట్టూ
బంగినపల్లి మామిళ్ళు - పరకల కొద్దీ తినేసినట్టు
వేడి వేడి బెల్లం జిలేబీ ,
రోడ్ మీద కొనీ కొనగానే -
కారు డోర్ వేసుకుని గుటుక్కుమనిపించినట్టు
బొగ్గుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తులు - ఒలుచుకు తిన్నట్టూ
లోటాడు మద్రాస్ ఫిల్టర్ కాఫీ - స్టార్ బక్స్ లో దొరికినట్టూ
బట్టీలోంచి తెచ్చిన బఠాణీలు - పటపటమని నమిలేసినట్టూ
అలా చెట్టు నుంచి దూసిన కరేపాకు - తాలింపులో వేసి కొత్తటుకులు వేయించినట్టూ
సినిమా హాల్ లో పాప్కార్న్ - ఎవరన్నా తెచ్చిపెట్టినట్టూ
చిన్నా పెద్దా తేడాలేకుండా - రసాలు గుటకలేసినట్టూ
కొబ్బరి బూరెల కోసం చేసిన - చలివిడి కొట్టేసి తిన్నట్టూ
బిడ్డనెత్తుకొచ్చిన సారెలో - పంచదార చిలక నాకే ఇచ్చినట్టూ
కొబ్బరి మామిడికాయ ముక్కలు - కేజీలు ఖాళీ చేసినట్టూ
మా పెద్ద రేగు చెట్టు - ఇంకా బిందెలు బిందెలు కాయలు కాస్తున్నట్టూ
కిస్మిస్ లని - కేజీల్లో మాయం చేసేసినట్టూ
దోర జాంకాయాలు చెట్టునుంచి ఎతికెతికి కోసుకుని - పరపరా నమిలేసి తిన్నట్టూ
సన్నసెగన మరగకాగిన ఉలవచారు తాలింపు - ఘుప్పుమన్నట్టూ
వానాకాలంలో పకోడీల వాసన - గాలిలో తేలి వచ్చినట్టూ
తంపడకాయలు, కాల్చిన పచ్చేరుసెనక్కాయలు - కలిసి దొరికినట్టూ
పుల్లైసు బండి - పరిగెత్తకుండానే మన గుమ్మం ముందే ఆగినట్టూ
పొట్ట పగిలిపోడానికి రడీగా ఉన్న సీతాఫలం - చెట్టునే మగ్గి దొరికినట్టూ
దోరగా పండిన చింతకాయ - చిటుక్కున చేతికి అందినట్టూ
పాలసపోటా చెట్టుకింద నిలబడి - అలాగ్గా కోసుకు తిన్నట్టూ
చిన్నుసిరికాయల చెట్టు - స్కూలుకెళ్ళే దారిలో కొమ్మజాపి రమ్మన్నట్టూ
ఎర్రగా వేగిన బంగాళా దుంప కూరకి - రసం తోడైనట్టూ
వాక్కాయల చెట్టొకటి తోవెమ్మటే ఉండి రారమ్మన్నట్టూ
కణుపు చిక్కుళ్ళు - చట్టినిండా ఉడకబెట్టి అమ్మ వాకిట్లోకి వెళ్ళినట్టూ
మామిడితాండ్ర పొరలుపొరలు తీసితింటూ - ముచ్చట్లు చెప్పుకున్నట్టూ
సాంబారు పెట్టిన్నాడే - దొండకాయ వేపుడు కూడా చేసినట్టూ
ఎర్రని సీమతుమ్మకాయలు - కొక్కెం ఊడిపోకుండానే ఒడినిండా దొరికినట్టూ
గుళ్ళో పక్కనోళ్ళు - వాళ్ళ వాటా పులిహోర కూడా నాకే ఇచ్చినట్టూ
వగరే తెలియని కండపట్టిన నేరేళ్ళ కొమ్మ - చేతికందినట్టూ
విరగ కాసిన ఈత చెట్టొకటి - పిలిచి కాయలిచ్చినట్టూ
బెల్లం గవ్వలు - ఒక పిసరు పాకం తక్కువై తీగ సాగినట్టూ
వర్షం పడుతుంటే - పునుగుల పళ్ళెం చేతిలోకి వచ్చినట్టూ
వేయించిన ఎండుమిరపకాయలు వెల్లుల్లి వేసి - రోట్లో తొక్కిన గోంగూర పచ్చడి వెన్నపూసేసుకుని వాయ కలిపినట్టూ
భోజనాల బల్ల దగ్గర ప్రశాంతంగా కూర్చుని - పాలుపోసి వండిన కూరలో ములక్కాయ ముక్కల్ని ఓ పట్టుపట్టినట్టూ
ఆవడల మీద బూందీ మిక్చరు వేసుకుని - మిట్టమధ్యాహ్నం ఎండలో హాయిగా తింటున్నట్టూ
పూరీలు పున్నమి చంద్రుళ్ళా పొంగి - కమ్మని కూరతో తెగతిన్నట్టూ
ఉల్లిపాయలు జీలకర్ర కరేపాకు దిట్టంగా వేసిన రవ్వట్టు - గుండ్రని డైనింగ్ టేబుల్ సైజులో పెట్టినట్టూ
గడ్డపెరుగులో - నిమ్మకాయ బద్ద నంజుకుని నాకేసినట్టు
పానిపూరీలు - లొట్టలేసేంత పుల్లగా వర్రగా కుదిరినట్టూ
దప్పళం గిన్నె - మొట్టమొదలు నాకే ఇచ్చినట్టూ
ఆఖరికి ఏడేడి ఇడ్లీలు దూదిలా మెత్తగా పొగలు కక్కుతుంటే - నేతిగిన్నెలో ముంచి కారప్పొడి అద్దినట్టూ
*కమ్మని కలలు కంటూ మాంచిగా నిద్రలో ఉంటే, కుళ్ళుమోతు అలారం పీడకలొచ్చినట్టు మోగిచచ్చింది!*
----*పరనింద..!*
➖➖➖✍️
*ఇతరుల్ని కించపరిస్తే కలిగే నష్టాన్ని ఒక సంస్కృత కవి ఎంత చక్కగా వివరించాడో స్వయంగా చూడండి…*
*ఒకరోజు లక్ష్మిదేవి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న పార్వతి దేవి ఇంటికి వెళ్లింది. పార్వతి ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. లక్ష్మి ఆ పరిసరాలన్నీ పరికించింది. పార్వతికి లక్ష్మికున్నంత ఐశ్వర్యం లేదు, డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి.*
*లక్ష్మికి అనుకోకుండా పార్వతిని ఓ ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది. "భిక్షార్థీ స క్వ యాతః?” అని చిన్న ప్రశ్న వేసింది. మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది.. కాని లక్ష్మి అలా అనలేదు. ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా? అంది. శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది.*
*పార్వతికి ఈ ప్రశ్న చాలా బాధ కల్గించింది. ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుంది గాని తన భర్తను నిందిస్తే ఏమాత్రం సహించలేదు కదా! కాని ఏంచేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు. అలాగని సరిపెట్టుకుని ఊరుకోనూలేదు. ఏదో సమాధానం చెప్పాలి. ఏంచెప్పాలి? కొంచెం ఆలోచించింది… "సుతను బలిమఖే !" అంది.*
*'బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా! అని సమాధానం.*
*ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తల తిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు తన భర్త శ్రీమహావిష్ణువు.*
*వామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే. 'మా ఆయనకన్నా మీ ఆయనే దారుణం' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది.*
*లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. మళ్లీ ఏదోవిధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయింది. రెండో ప్రశ్న వేసింది.*
*’తాండవం క్వాద్య భద్రే!’ అనడిగింది.* *అమ్మా! మీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడు? అని దానర్థం.*
*మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని లక్ష్మి మాటల్లోని అంతరార్థం.*
*అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది…*
*మన్యే బృందావనాంతే అంది.*
*బృందావనంలో అనుకుంటున్నానమ్మా! అని ఆ మాటలకర్థం.*
*బృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు, శివుడు కాదు.*
*'మా ఆయనే కాదు మీఆయన కూడ నాట్యం చేస్తాడు. ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు. అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడు' అని సమాధానం.*
*పార్వతి సమాధానం ఇంత పదునుగా ఉంటుందని లక్ష్మి ఊహించలేదు. ఆమెకు మతిపోయినంతపనయింది. ఏలాగో కుడగట్టుకుంది…*
*ఈ సారి తనకు ఇబ్బంది లేనివిధంగా మాట్లాడాలనుకుంది…*
*’క్వను చ మృగ శిశుః’ ? అని మరో ప్రశ్న వేసింది.*
*మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా? అని అర్థం.*
*లక్ష్మి కొడుకు మన్మథుడు చాల అందగాడు. పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరం లేదు. 'మా అబ్బాయి చాల అందగాడు మీ అబ్బాయి మాత్రం కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని అభిప్రాయం.*
*పార్వతి చాలా నొచ్చుకుంది. కాకిపిల్ల కాకికి ముద్దన్నట్లు ఎవరిపిల్లలు వాళ్లకు ముద్దు.*
*పార్వతి మెదడులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. వెంటనే అంది…*
*'నైవ జానే వరాహం' అంది.*
*“ఇక్కడేదో పంది తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు!" అంది.*
*’మా అబ్బాయిది ఏనుగు ముఖమేగాని మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!’ అని పార్వతి సమాధానం లోని చమత్కారం.*
*ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించింది. కొంతసేపటికి ఎలాగో తేరుకుంది…*
*ఈసారి జాగ్రత్తగా తనకు ఎదురుదెబ్బ తగలని విధంగ పార్వతికి దెబ్బకొట్టాలనుకుంది. అటు ఇటు కాసేపు చూసింది…*
*’బాలే! కచ్చిన్న దృష్టః జరఠ వృషపతిః ?’ అనడిగింది.*
*'మీ వాహనం అదే ఆ ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మా?’ అని ప్రశ్న.*
*'మాది గరుడ వాహనం! విమానాల్లో వలే ఆకాశంలో తిరుగుతాం. మీరు నేల పై తిరుగుతారు. మీ వాహనం ముసలి ఎద్దు. అది కదల్లేదు మెదల్లేదు' అని ఆక్షేపం. మేం పై స్థాయి వాళ్లం, మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు.*
*ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి. అందుకే వెంటనే అందుకుంది…*
*"గోప ఏవాస్య వేత్తా " అంది.* *'ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా? పో! పోయి, మీ ఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది.*
*మా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడు. మీకంటే మేమే ఎక్కువ అని పార్వతి మాటల్లోని ఆంతర్యం. ఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయింది. తిన్నగా జారుకుంది.*
*నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేళాకోళంగా జరిగిన సంభాషణ.*
*ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే ఒక కవి లక్ష్మీపార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించాడు.*
*ఇందులో నీతి ముఖ్యం గాని, ప్రశ్నలు సమాధానాలు ముఖ్యం కాదు. ‘వారిరువురి మధ్య జరిగిన ఈ సరసమైన సంభాషణ మనందరిని రక్షించుగాక!’ అని చమత్కరించాడో కవి. ఇంత సరసమైన భావాన్ని తనలో దాచుకున్న ఈ శ్లోకం చదవండి…*
*భిక్షార్థీ స క్వ యాతః? సుతను బలిమఖే తాండవం క్వాద్య భద్రే ?*
*మన్యే బృందావనాంతే క్వను చ మృగశిశుః? నైవ జానే వరాహం*
*బాలే కచ్చిన్న దృష్ట: జరఠవృష పతిః? గోప ఏవాస్య వేత్తా*
*లీలాసంలాపఇత్థం జలనిధిహిమవత్కన్యయోః త్రాయతాం నః*
----
*ఉపదేశం*
*శ్రీ రాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైనాడు.*
*ఒకనాడు శ్రీరాముని చూడడానికి వచ్చిన కైకేయి " రామా !ఈభవబంధాలనుండి, సంసార సాగరం నుండి ముక్తి పొందే మార్గం తెలియక అల్లల్లాడే నాకు నీవే ఒక మార్గం చూపించాలి." అని అడిగింది.*
*అది విన్న రాముడు… “అమ్మా... దిగులు పడకండి. రేపు లక్ష్మణుడు మిమ్మల్ని ఒక చోటుకు తీసుకుని వెడతాడు. అక్కడ మీకు తగిన మార్గం లభిస్తుంది." అని అన్నాడు.*
*మరునాడు లక్ష్మణుడు కైకేయిని పల్లకిలో సరయూ నది ఒడ్డుకు తీసుకుని వెళ్ళాడు. అక్కడ నది ఒడ్డున మేత మేస్తున్న ఒక మేకల మంద వద్ద పల్లకీని ఆపించాడు.*
*"అమ్మా .. ఒకసారి బయటకు రండి ..” అని వినయంగా పిలిచాడు.*
*పల్లకి నుండి దిగిన కైకేయి తనకి ఎదురుగా వున్న మేకల మందను చూసింది. తనను పల్లకి నుండి ఎందుకు బయటకు రమ్మని పిలిచాడో కారణం తెలియక లక్ష్మణుని వైపు చూసింది.*
*కైకేయి సందేహం గ్రహించిన లక్ష్మణుడు… “అమ్మా..యీ మేకలు చేసే శబ్దాలు మీరు కొంతసేపు వినాలని చక్రవర్తి శ్రీరాముని ఆదేశం." అని అన్నాడు.*
'మే..మే అని వందల సంఖ్యలో వున్న మేకల అరుపులను కొంచెంసేపు ఏకాగ్రతగా వినగానే కైకేయి మనసులో ఏదో స్పష్టత ఏర్పడింది.
*వెంటనే… "లక్ష్మణా ! ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి రాముడు నాకు చూపిన మార్గం అర్ధమైనది. ఇక మనం రాజ భవనానికి వెళ్ళిపోదాం" అన్నది.*
*రాజభవనానికి తిరిగి వచ్చిన కైకేయిని శ్రీరాముడు ఆహ్వానించాడు. రామునితో కైకేయి "రామా.. నదీతీరాన నేను ఒక మేకల మంద అరుపులను తదేకదీక్షతో విన్నాను. ‘మే..మే..’. అంటే నాది అని అర్ధం కదా ..! *
*’నేను అనే అహంకారంతో, నాది అనే కోరికతో బ్రతికినందువలనే ఇప్పుడు మేము మేకలు గా పుట్టాము’ అని అవి నాకు చెప్తున్నట్టుగా తోచింది.*
*'నేననే అహంకారం.. నాది అనే మమకారం మనిషిని అజ్ఞానాంధకారంలోకి నెట్టుతోందని గ్రహించాను. ఇంక మీద నేను ఈ లౌకిక భవబంధాలను త్రెంచుకొని ప్రశాంతిగా జీవిస్తాను." అని ఆన్నది కైకేయి.*
*అది విని చిరునవ్వు నవ్విన రాముడు… "తల్లీ ! నిజం గ్రహించారు. పుత్రునికి తల్లికి ఉపదేశించే అర్హతలేదు. అందువలన మీకు మీరుగా సత్యాన్ని తెలుసుకునేందుకు మిమ్మల్ని మేకల మంద వద్దకు పంపించాను." అని పలికాడు.*
*శ్రీరాముని వివేకం, వినయసంపత్తి ఆయన ఔన్నత్యానికి దర్పణం పడుతుంది.*
----పంచాంగం ప్రకారం ఈ విషయాల గురించి మీకు తెలుసా !
రవి పుష్య యోగం
ఆదివారం నాడు పుష్యమి నక్షత్రం ఉండటాన్ని రవి-పుష్య యోగంగా పరిగణిస్తారు. దీనిని విశేషమైన రోజుగా చెబుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 10, మే 8 తేదీల్లో రవి-పుష్య యోగం ఉంది. పుష్యమిని కాస్మిక్ నక్షత్రంగా చెబుతారు. 27 తారల్లో దీనిని శక్తిమంతమైనదిగా పరిగణిస్తారు. రవి-పుష్య యోగం ఉన్న రోజున చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని చెబుతారు. వ్యాపార ప్రారంభం, విస్తరణ పనులు ఈ రోజు మొదలుపెడితే విజయవంతంగా పూర్తవుతాయి.
రాహుకాలం..
ప్రతి రోజూ వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండ కాలం, అమృత ఘడియలు ఇలా పలు ప్రత్యేక సమయాలు ఉంటాయి. తెలుగు రాష్ర్టాల్లో ప్రధానంగా వర్జ్యం, దుర్ముహూర్తం పాటిస్తుంటారు. రాహుకాలం ఆచరించే సంప్రదాయం తమిళనాడులో కనిపిస్తుంది. కాలక్రమంలో అన్ని ప్రాంతాల వారూ రాహుకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇంతకీ రాహుకాలం ఎందుకు వదిలిపెట్టాలి? ఈ సమయంలో రాహు కారకత్వాలైన కార్యహాని, అగ్ని, మృత్యు, రోగ, రాజభయాదులు కలుగవచ్చు. అందుకే వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం పరిశీలించి శుభముహూర్తాలు నిర్ణయిస్తుంటారు పంచాంగ కర్తలు.
సంపదలకు ప్రతీక శంఖం
పూజగదిలో శంఖాన్ని ఉంచి, నిత్యం ధూపదీపాలను సమర్పిస్తే అరిష్టాలు తొలగిపోతాయని చెబుతారు. పూజలో ఉంచడానికి దక్షిణావర్త శంఖం శ్రేష్ఠమైనది. క్షీరసాగర మథనంలో పుట్టిన పద్నాలుగు రత్నాల్లో శంఖం కూడా ఒకటని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవితో పాటు క్షీరసాగరం నుంచి ఉద్భవించిన కారణంగా శంఖాన్ని శ్రీలక్ష్మికి సోదరునిగా భావిస్తారు. అందుకే శంఖాన్ని పూజించడం లక్ష్మీప్రదమని భావిస్తారు. పూజల్లో, నీరాజన సేవలో శంఖాన్ని పూరిస్తారు. తాంత్రిక క్రియల్లోనూ దీనిని ఉపయోగిస్తారు.
గుమ్మడి ఎందుకంటే..
ప్రతి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టి ఉండటాన్ని గమనిస్తాం. గుమ్మడికాయను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. గుమ్మడి శుభానికి సంకేతం. దృష్టి దోషాలను తొలగిస్తుందని నమ్మకం. అశుభాలను తొలగించి, శుభాలను ప్రసాదించే తత్తం గుమ్మడిలో ఉందని విశ్వాసం. ఆకారాన్ని బట్టి గుమ్మడికాయ భూగోళానికి ప్రతీకగా చెబుతారు. దానిలో అనంతమైన శక్తి ఉందని, అది దోషాలను పరిహరిస్తుందని పెద్దలు చెబుతారు. అందుకే ఇంటి గుమ్మానికి గుమ్మడిని కట్టే సంప్రదాయం స్థిరపడింది.
గుడి నీడ పడకూడదా!
ఇంటిమీద గుడి నీడ పడకూదని చాలామంది చెబుతుంటారు. గుడి పవిత్రతను కాపాడటానికి వచ్చిన ఆచారం ఇది. గుడి నీడ పడేటంత దగ్గరగా ఇల్లు నిర్మించకుండా ఉండేందుకు ఈ నియమం ప్రచారంలోకి వచ్చింది. గుడి పవిత్ర ప్రదేశం. నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఊరిలోని వారంతా ఆలయానికి వస్తూ ఉంటారు. సాధారణంగా ఇండ్లలో అశుచి సోకక తప్పదు. ఆ ప్రభావం గుడిపై పడితే ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ ఇబ్బందిని పరిహరించే ప్రయత్నంలో భాగంగా గుడి నుంచి ఇల్లు దూరంగా ఉండాలని పెద్దలు సూచించారు. అది ఇంటికి క్షేమమని చెబితే.. తప్పక పాటిస్తారని నియమంగా చేశారు. సమాజ శ్రేయస్సు, ఆలయ పవిత్రత దృష్ట్యా వచ్చిన సంప్రదాయం ఇది.
మంత్రం పరమార్థం
ధ్యానానికి ఏకాగ్రత చాలా అవసరం. మనసును నియంత్రించే శక్తి ఉండాలి. మంత్రోచ్ఛాటనకు ఏకాగ్రతతో పెద్దగా పనిలేదు. మంత్రోచ్ఛారణ చేస్తున్నప్పుడు పరిపరి విధాలుగా మనసు సంచరిస్తూ ఉంటుంది. ఆలోచనలూ కలుగుతుంటాయి. అవి వస్తూపోతూ ఉన్నా.. మంత్రం కొనసాగుతూనే ఉంటుంది. శబ్దానికి ఉన్న శక్తి వల్ల మంత్రం ఫలితాన్ని ఇస్తుంది. అయితే, సాధన తీవ్రమయ్యే కొద్దీ మంత్రోచ్ఛాటన సమయంలోనూ ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. అప్పుడు మరింత త్వరగా మంత్రం సిద్ధిస్తుంది. కోరికలు నెరవేరుతాయి.
ప్రణీతా నది పుష్కరాలు
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం చైత్ర శుద్ధ ద్వాదశి బుధవారం (13/4/2022) మధ్యాహ్నం 3-46 గంటలకు గురువు పూర్వాభాద్ర నాలుగో పాదం మీనరాశిలోకి ప్రవేశంతో సార్ధ త్రికోటి తీర్థ సహిత ప్రణీతా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పన్నెండు రోజులు కొనసాగే ఈ పుష్కరాలు ఏప్రిల్ 24తో ముగుస్తాయి. ప్రణీతా నదే ప్రాణహిత. వార్ధా, వెన్గంగా నదుల కలయికతో ఏర్పడిన ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది. ప్రణీత నది ప్రాశస్త్యం గురించి మత్స్య, వాయు, వామన పురాణాలలో కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంతోపాటు పలు ప్రాంతాల్లో పుష్కరాలను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ 12 రోజుల పుష్కర సమయంలో పితృ దేవతల ప్రీత్యర్థమై స్నాన, దాన, తర్పణ, పిండ ప్రదానాలు చేయడం శ్రేయస్కరం.
కుజ దోషం వివరణ
జన్మ లగ్నం నుంచి కుజుడు 2-4-7-8-12 స్థానాల్లో ఉంటే కుజ దోషంగా పరిగణిస్తారు. చంద్ర లగ్నం నుంచి, శుక్ర లగ్నం నుంచి ఈ స్థానాల్లో ఉన్నా దోషమే అవుతుంది! వధూవరులిద్దరి జాతకంలో కుజ దోషం ఉంటే పరిహారంగా భావిస్తారు. ఒకరి జాతకంలోనే ఉన్నప్పుడు కుజుడు ఉన్న క్షేత్రాన్నిబట్టి పండితులు పలు పరిహారాలు సూచించారు. కుజుడు ఉచ్ఛ, స్వక్షేత్రం, మిత్రక్షేత్రాల్లో ఉంటే దోష పరిహారం. అలాగే కుజ-చంద్ర, కుజ-గురు, కుజ-బుధ యోగం ఉన్నా, కుంభ, సింహ రాశుల్లో పుట్టినా కుజదోషం లేదని శాస్త్రం చెబుతున్నది. వృషభ, తుల రాశుల వారికి 12వ స్థానంలో కుజుడున్నా దోషం ఉండదు. మేష, వృశ్చిక రాశుల వారికి 4వ స్థానంలో కుజుడుంటే దోషం ఉండదు. మకర, కర్కాటక రాశుల వారికి 7వ స్థానంలో, ధనుస్సు, మీన రాశుల వారికి 8వ స్థానంలో కుజుడు ఉన్నా దోషం పరిహారం.
కుజదోషం లేని నక్షత్రాలు: అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజదోషం ఉండదు.
జన్మ నక్షత్రంలో..
చేయదగిన పనులు: యాగం, అన్నప్రాసన, వ్యవసాయం, ఉపనయనం, రిజిస్ట్రేషన్, అక్షరాభ్యాసం
చేయకూడని పనులు: సీమంతం, గర్భాదానం (నక్షత్ర ప్రథమార్థంలో చేయవచ్చు), క్షౌర కర్మ, ఔషధ సేవ, ప్రయాణం, వివాహం
స్త్రీలకు జన్మనక్షత్రంలో వివాహం శ్రేష్ఠమని పండితుల మాట.
వివాహానంతరం చేయకూడని పనులు
వివాహం జరిగిన తర్వాత ఆ ఇంట్లో ఆరు నెలల వరకు చెవులు కుట్టడం, ఉపనయనం, తీర్థయాత్రలు, నూతన వ్రతాలు ఆచరించడం, ఉద్యాపననలు మొదలైన కార్యక్రమాలు చేయకూడదు. సంవత్సర భేదం ఉంటే ఈ కార్యక్రమాలకు నిషిద్ధం లేదని కొందరి అభిప్రాయం.
ఈ రోజుల్లో ప్రయాణాలొద్దు
కాలగణనలో దగ్ధయోగాలుంటాయి. ఆదివారం- ద్వాదశి, సోమవారం- ఏకాదశి, మంగళవారం- పంచమి, బుధవారం- తదియ, గురువారం- షష్ఠి, శుక్రవారం- అష్టమి, శనివారం- నవమి.. ఆయా రోజుల్లో పైన పేర్కొన్న తిథులుంటే వాటిని ‘దగ్ధయోగాలు’ అంటారు. ఈ రోజుల్లో దూర ప్రయాణాలు, యాత్రలు చేయకపోవడం శ్రేయస్కరం. విధి నిర్వహణలో భాగంగా చేసే ప్రయాణాలకు దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదు. శుభకార్యం, క్షేత్ర సందర్శన కోసం వెళ్తున్నట్లయితే పాటించడం మంచిది. ఏదేమైనా దగ్ధయోగం ఉన్న రోజున ప్రయాణం చేయాల్సి వస్తే ఇష్టదైవాన్ని ధ్యానించి వెళ్లండి.
బల్లిపాటు ఫలితాలు
పురుషులకు:తలమీద-కలహం, బ్రహ్మరంధ్రం-మృత్యుభయం, ముఖం – ధనలాభం, ఎడమకన్ను- శుభం, కుడికన్ను-అపజయం, కుడి చెంప- దుఃఖం, ఎడమచెవి- లాభం, పైపెదవి- కలహం, కింది పెదవి- ధనలాభం, రెండు పెదవులపై- మృత్యు భయం, కుడి భుజం- ఆరోగ్యం, చేతిలో- ధన నష్టం, మణికట్టు- అలంకార ప్రాప్తి, మోచేయి- ధన నష్టం, చేతి వేళ్లు- స్నేహితుల సందేశం, తొడలు- వస్త్ర నాశనం, పాదాలు- కష్టం, కాలి వేళ్లు- రోగం.
స్త్రీలకు: తల- ప్రాణభయం, కొప్పు- రోగభయం, పిక్కలు- బంధు దర్శనం, ఎడమ కన్ను- భర్త ప్రేమ, కుడి కన్ను- మనోవ్యథ, ఛాతీ- సుఖం, కుడిచెంప- పుత్రలాభం, కుడిచెవి- ధనలాభం, పైపెదవి- శత్రుత్వం, కిందిపెదవి- నూతన వస్తులాభం, రెండుపెదాలు- కష్టం, వీపు- మరణవార్త, గోళ్లపై- కలహం, ఎడమచేయి- మనో చలనం, చేతివేళ్లు- భూషణ ప్రాప్తి, మోకాళ్లు- బంధనం, చీలమండ- కష్టం, కుడికాలు- శత్రునాశనం, కాలివేళ్లు- పుత్రలాభం
గమనిక: బల్లి శరీరంపై ఎక్కడ పడినా, వెంటనే తలస్నానం చేయాలి. దీపారాధన చేసి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. శరీర భాగాలపై తొండ పాకినా ఇవే ఫలితాలు వర్తిస్తాయి.
నూతన వధూ ప్రవేశం
వివాహమైన రోజు నుంచి 16 దినాల్లో నూతన వధువు సరి సంఖ్య రోజులో గృహ ప్రవేశం చేయాలి. చతుర్థి, షష్ఠి, చతుర్దశి మినహా మిగిలిన తిథులు అనుకూలం. సోమ, బుధ, గురు, శుక్ర, శని వారాల్లో ప్రవేశం మంచిది. అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 17 నక్షత్రాలు నూతన వధూ గృహప్రవేశానికి ప్రశస్తమని శాస్త్రం చెబుతున్నది. ముఖ్యంగా నూతన వధూ ప్రవేశానికి పగటి పూట కన్నా రాత్రి వేళ మంచిదని పెద్దల మాట.
నివాస ప్రాంతం అచ్చుబాటు
గ్రామం (నివసించే ప్రాంతం/కాలనీ/ ఊరు) పేరు మీద వచ్చే నక్షత్రం మొదలు నామ నక్షత్రం వరకు లెక్కించి ఈ కింద తెలిపిన ప్రకారం ఫలితం తెలుసుకోవచ్చు. కొందరు నామ నక్షత్రం మొదలు గ్రామ నక్షత్రం వరకు కూడా లెక్కిస్తుంటారు.
1-5 శిరస్సు లాభం
6-8 ముఖం ధనక్షయం
9-13 కుక్షి ధనధాన్యప్రదం
14-19 పాదాలు దరిద్రం
20 వీపు భయం
21-24 నాభి సంపద
25 మూలస్థానం పీడ
26 కుడిచేయి దుఃఖం
27 ఎడమచేయి వివాదం
No comments:
Post a Comment