Saturday, 25 June 2022

 [


హిందూ ధర్మంలో... ఆరాధించే వివిధ ప్రధాన దేవతల ఆధారంగా వివిధ శాఖలు లేదా మతాలు ఏర్పడ్డాయి. విష్ణు పారమ్యాన్ని ప్రవచించే వైష్ణవ మతానుయాయులు హిందూధర్మంలో అధికంగా ఉన్నట్టు కనిపిస్తారు. భగవద్రామానుజులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు తదితరులు వైష్ణవ ధర్మానికి చెందినవారు. షణ్మత స్థాపనాచార్యుడైన శంకర భగవత్పాదులు కూడా కృష్ణ భక్తులని ప్రతీతీ. ఇంతకూ ఏమిటీ వైష్ణవ మతం? ఇతర మతాలకు, దీనికి భేధం ఏమిటి?

‘విష్ణువు’ అంటే సర్వంలోనూ అంతర్యామిగా ప్రవేశించి, అంతటా వ్యాపించిన తత్త్వం. అది పరబ్రహ్మ స్వరూపం. దాన్ని ఒక వ్యక్తిగానో, వస్తువుగానో నిర్వచించడం కానీ, పరిమితం చేయడం కానీ సాధ్యపడదు. ఎందుకంటే, ఆ హద్దు దగ్గర, హద్దుకు లోపలా, వెలుపలా కూడా వ్యాపిస్తున్నది అదే కనుక. విష్ణువు అంటే ఖరీదైన వస్త్రాభరణాలు ధరించే ఒకానొక దేవతామూర్తి పేరు అనుకోవడం అపరిపక్వమైన ఆలోచన. మరి విష్ణువుకు ప్రత్యేకమైన రూపం, వేషం, చిహ్నాలు, వాహనం, పత్ని, పరివారం, నివాసం ఉన్నాయి కదా! వాటి పేర్లు కూడా చెప్పారు కదా! అలాంటప్పుడు ‘విష్ణువును ఒక దేవత అనుకోకుండా ఉండడం ఎలా?’ అనే సందేహం కలగవచ్చు. నిజానికి అవన్నీ శబ్ద, అర్థ, దృశ్య ప్రతీకలు. కొన్ని ప్రతీకలు సృష్టిలో సహజంగా ఉన్నవి కాగా, మరికొన్ని ఉపాసనా సౌలభ్యం కోసం ఋషులు కల్పించినవి. ఈ ప్రతీకలలోని అసలు అర్థాన్ని తెలుసుకోకపోతే... మూలతత్త్వంపై సరైన అవగాహన కలగదు. 

ఋషుల వాఙ్మయంలో వినియోగించే పేర్లు... మనం మానవులకూ, ప్రదేశాలకూ, వస్తువులకూ పెట్టుకొనే సంజ్ఞానామంలా... కేవలం ధ్వని సంకేతాలుగా ఉండవు. ఉదాహరణకు‘హిమాలయం’ అంటే ‘మంచుకు నివాస స్థలం’ అని అర్థం. దాన్ని మనం ఒక పర్వత శ్రేణికి స్థిరమైన పేరుగా... రూఢి చేసి పెట్టినా... మంచుకు నిలయమైన ఏ ప్రదేశానికైనా, వస్తువుకైనా దాన్ని ఉపయోగించవచ్చు. అలా ఉపయోగించినప్పుడు దాన్ని ‘గౌణార్థం’ అంటారు. ఆర్ష వాఙ్మయంలోని ప్రయోగాలన్నిటినీ నిజానికి గౌణార్థంతోనే చూడాలి.

విష్ణువు నల్లని మేఘం లాంటి రంగు కలవాడు అంటే... ‘వర్షించబోయే మేఘంలా సకల ప్రాణులకూ ప్రీతిని, పోషణను ఇచ్చే తత్త్వం’ అని ఒక సూచన. జగత్తు మొత్తం సత్త్వ, రజో, తమో అనే మూడు గుణాల కలయిక. జగత్తులోని సర్వం జ్ఞానం, క్రియ, పదార్థాల (ద్రవ్యం) సమాహారం. విష్ణువు దేహ వర్ణమైన నలుపు నిజానికి ఏ వర్ణమూ కాదు. అది త్రిగుణాతీతమైన తత్త్వమని తెలిపేందుకే అవర్ణమైన ఆ నల్ల రంగును ప్రతీకగా చెప్పారు. ఇక బంగారు రంగులో ఉండే పీతాంబరం నామరూపాత్మకమైన జగత్తు కల్పించే సమ్మోహనత్వానికి ప్రతీక. గుణాతీతతత్త్వం గుణాలతో కప్పి ఉంటుంది. అలాంటి గుణాతీతతత్త్వాన్ని సగుణమైన వాక్కులను ఉపయోగించి, మనస్సు ద్వారా తెలుసుకోవాలని అనుకుంటే... ఊహలు, అపోహలూ కూడా కలిగి ‘ప్రమ’ (జ్ఞానం)తో పాటు ‘భ్రమ’ కూడా కలుగుతుంది. కానీ విష్ణుతత్త్వం నాలుగు చేతులతో... నాలుగు విధాలుగా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ... ఆ విభ్రమ నుంచి రక్షణ కూడా కల్పిస్తుంది.

పద్మ హస్తంతో పతనం కానీయకుండా, గదా హస్తంతో ప్రాపంచిక సుఖాలపై ఆసక్తిని చూర్ణం చేస్తూ, శంఖ హస్తంతో సమస్త ఇంద్రియాలకు ఉపశాంతిని ఇస్తూ, సుదర్శనంతో సత్యాన్ని దర్శింపజేస్తూ రక్షిస్తుంది. ఈ నాలుగూ ‘వైఖరి (పలుకు), మధ్యమ (ఆలోచన), పశ్యంతి (భావం), పరా (అవ్యక్తం)’ అనే నాలుగు వాక్‌ స్వరూపాలకు ప్రతీకలు. అంతేకాకుండా, ఈ హస్తాలు సంసారులకు చతుర్విధ పురుషార్ధాలను... అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలను అనుగ్రహించేవి కూడా. జ్ఞానం, కర్మ అనే రెండు పక్షాలను చక్కగా సమన్వయపరిచే వేదమే పక్షిరూపుడైన గరుత్మంతుడు. అది విష్ణువు వాహనం. అంటే వేదమే ఆ సర్వవ్యాపకతత్త్వానికి వాహకం. ఇలా ప్రతి అంశాన్నీ, నామాన్నీ గౌణార్థంతో, ప్రతీకతో సమన్వయం చేసుకుంటే కానీ సరైన అవగాహన కలగదు, ఉపాసన సాగదు. ఏనాడు ఉపాసన ఫలించి... వాక్కుకూ, మనసుకూ కూడా అందని ఆ సర్వ వ్యాపకమైన తత్త్వం చక్కగా అనుభవైకవేద్యం అవుతుందో... ఆనాడు ఆ అనుభవాన్ని పొందిన మానవుడు మొక్కవోని... అంటే ‘కుంఠితం’ కాని జ్ఞాన స్థితికి చేరుకుంటాడు.

కుంఠితం కాని స్థితి కనుక అది వికుంఠము. దాని సంబంధమైనది వైకుంఠం. ఆ స్థితిలో జ్ఞానపూర్ణమైన అవలోకనం మాత్రమే ఉంటుంది కనుక దాన్ని ‘లోకం’ అనడంలో తప్పు లేదు. అంతేకానీ, అది మరో ప్రపంచం అని అనుకోకూడదు. ఈ విధానం మొత్తం ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరబ్రహ్మోపాసనే. మాటలకు అందని, మనసుకు గోచరించని పరబ్రహ్మ తత్త్వాన్ని చేరుకోవడానికి సవిస్తరమైన విష్ణుస్వరూపమంతా ఒక ఉపాస్య వస్తువు. 

ఈ ఉపాసనాక్రమంలో భాగంగానే ఇతర దేవతా తత్త్వాలను కూడా తెలుసుకోవాలి. తాను ఉపాసించే తత్త్వాన్ని తప్ప... మరే ఇతర విషయాల మీదా మనసు పోనివ్వకుండా, ఏకాగ్రతతో ఉండడమే అనన్య భక్తి. ఆ అనన్య భక్తిని కలిగించడం కోసమే... ఇష్ట దేవతను స్వీకరించి, పరబ్రహ్మ భావనతో ఉపాసన చేయాలని శాస్త్రం బోధిస్తుంది. ఇదే విధంగా శైవాది ఇతర మతాల్లో కూడా ఉపనిషత్తులు ప్రతిపాదించిన పరబ్రహ్మోపాసనే నిరూపితం అయింది. శివ, శక్తి లాంటి పరబ్రహ్మ స్వరూపాలను, చిహ్నాలను, ఆయా ఉపాసనా మార్గాల్లో అంగాలుగా ప్రతిపాదితమైన దేవతలను కూడా జ్ఞానార్థంతో చక్కగా సమన్వయం చేసుకొని ఉపాసించాలి.  ఆ దేవతల నామాలను, లక్షణాలను, చిహ్నాలను, ఇతర సమస్త అంశాలను గౌణార్థంతో గ్రహించి, ఉపనిషద్వాక్యాలతో సమన్వయం చేసుకోవాలి. నిజమైన అనన్య భక్తుడు అన్యదేవతలను తక్కువ చెయ్యలేడు... ఆ అన్యదేవత తన దేవత తాలూకు మరొక విభూతే కనుక. అలాగే ఇతరులు తన దైవాన్ని తక్కువ చేసినా చలించడు... తన దైవంకన్నా భిన్నమైనదేదీ అతనికి లేదు కనుక. ఈ అనన్యభక్తి కొరవడినప్పుడు, సక్రమమైన ఉపాసన, అవగాహన, సమన్వయం లేనినాడు మాత్రమే... అపరిపక్వ భక్తుల మధ్య దేవుళ్ళ విషయంలో వైషమ్యాలు ఏర్పడతాయి.

[

*బాంధవ్యం -  భగవంతుడు...!!*


ఆన్ని రకాల అనారోగ్యాలకు మూలకారణం మనస్సు. మనస్సులో దుఖం ఎక్కువైతే హృదయ రోగం వస్తుంది...

 దుఃఖం ఎందుకు వస్తుందో ముందుగా తెలుసుకోవాలి, మానవుడు తనకు ఎందుకు అనారోగ్యం వస్తుందో తెలుసుకోవాలి. 

అప్పుడు అతనికి ఎందుకు/ఎలా బ్రతకాలో తెలుస్తుంది..మానవులందరూ కూడా అంటుంటారు.. నేను నా భార్య కోసం బ్రతుకుతున్నాను.. భర్త కోసం బ్రతుకుతున్నాను.. పిల్లల కోసం బ్రతుకుతున్నాను అంటారు. 

కాని నీవు.. నీకోసం బ్రతకాలి, నిన్ను ఈ భూమిపైకి మానవుడులా పంపి.. బ్రతకడానికి ప్రాణం పోసిన ఆ భగవంతునిపై అమితమైన ప్రేమను పెంచుకుని ఆ పరమేశ్వరునిలో మమేకమవ్వడానికి బ్రతకాలి...


అనిత్యమైన బంధాలలో చిక్కుకుని భార్యను.. భర్తను.. పిల్లలను అమితంగా ప్రేమిస్తూ.. మరలా వారు.. నన్ను పట్టించుకోవడం లేదు.. నేను ఏవిధంగానైతే వారిని నేను ప్రేమించానో.. ఆ విధంగా నన్ను వారు ప్రేమించడంలేదు అని బాధ పడిపోతే ఏమి వస్తుంది.. పిల్లలు నా మాట వినడం లేదు.. నేను ఎంతో అల్లారు ముద్దగా పెంచాను ఈ రోజు నన్ను పట్టించుకొనడం లేదు అని వాపోతూ ఉంటే నీకు ఏమి వస్తుంది.. 

నీ హృదయంలో వేదన పెరుగుతుంది, నీ గుండెలో వత్తిడి పెరుగుతుంది, నీకు గుండె పోటు వస్తుంది...


అందరూ కూడా.. నేను నా భార్యను అమితంగా ప్రేమించాను. 

కాని నన్ను అర్ధం చేసుకువడంలేదు. అందుకే నేను రోదిస్తున్నాను.. నా భర్తను అమితంగా ప్రేమిస్తున్నాను.. కాని నన్ను బాగా చూసుకువడం లేదు. 

నా పిల్లలను అమితంగా ప్రేమించాను కాని నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా మాట వినడం లేదు, నన్ను గౌరవంగా చూడడం లేదు, ఒక తండ్రికి/తల్లికి ఇవ్వవలసి ప్రేమను ఇవ్వడంలేదు.


పెళ్ళి చేసుకున్నాకా నా బిడ్డ నామాట వినడం లేదు, భార్యతో వెళ్ళిపోయాడు, నన్ను ఒంటరివాడిని (లేదా) ఒంటరి దానిని చేసేసాడు అని రకరకాలుగా భాధలు చెపుతుంటారు. 

ఈ బాధల వల్లనే హృదయ రోగం వస్తుంది. 

అంతేకాదు వృత్తిలో ఇంకా ఎదగడం లేదు అని.. వ్యాపారంలో ఇంకా ఎక్కువుగా లాభాలు రావడం లేదు అని.. ఉద్యోగంలో ఇంకా ప్రమోషన్ రావడం లేదు అని.. ఇలా కారణాలు రకరకాలుగా ఉంటాయి. 


కారణాలు ఎమైనా కూడా.. ఒక విషయం గుర్తు పెట్టుకోండి.. ఎప్పుడూ కూడా.. నిత్యమైన భగవంతుని ప్రేమించండి.. నిత్యమైన భగవంతుని సేవించండి.. 

నిత్యమైన భగవంతుని నామం స్మరించండి.. భగవంతుడుని చేరడానికి నిరంతర ధ్యానము.. ఆధ్యాత్మిక చింతనే పరిష్కారం...

[

*దైవం మానుష రూపేణా*

                  ➖➖➖


*’మానుష రూపేణ’ అంటే దైవం ఎక్కడో లేదు మనిషి రూపంలోనే మన దగ్గర ఉంటుంది అని అర్థం..!  మరి ఆ యొక్క దైవస్వరూపం ఎవరు అంటే .. మొదటగా మనను నవమాసాలు మోసి, జన్మనిచ్చిన తల్లి,(రెండవది మనం ఈ భౌతిక శరీరధారణకు కారణమైన 'తండ్రి'), మూడవది మన చుట్టూ ఆవరించి ఉన్న చీకట్లు, అజ్ఞానం తొలగించిన గురువు. చివరిగా నాలుగవది.. మనకు సేవకు అవకాశం కల్పించిన భగవత్ స్వరూపం అతిథి..!* 


*అందుకే మన సనాతనధర్మం నినదిస్తుంది .. ‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ !’ అని.*



*మాతృదేవోభవ:*


 *ఇలలో తల్లిని మించిన దైవం లేదు అన్న ప్రాథమిక సత్యాన్ని ప్రతిఒక్కరూ గుర్తెరగాలి.. డిల్లీకి రాజు అయినా తల్లికి బిడ్డే కదా..!    అసలు భూలోకంలో అద్భుతం ఏదైనా ఉంది అంటే అది 'నువ్వే'.* 


*మరి అటువంటి అద్భుతాన్ని సృష్టించిన తల్లికి మించిన వేరే దైవం ఏమి ఉంటుంది. తన రక్త మాంసంతో మనిషిని సృష్టించి, ప్రత్యక్షంగా కంటికిరెప్పలా కాపాడుతూ పెంచి, పోషించి, ప్రయోజకుడిగా సరిదిద్దడంతో తల్లిపాత్ర    ప్రతి మనిషి జీవితంలోనూ సుస్పష్టం..!  మరి అటువంటి తల్లి ఒకరోజు వృద్ధురాలు అయినప్పుడు                         ఆ యొక్క తల్లితో మనం ఎలా వ్యవహరిస్తున్నాం?  మనకు మనం ఏం ఇచ్చి ఋణం తీర్చుకోగలం?   తనకు స్వాంతన కలిగించడమే మనం తల్లి ఋణం తీర్చుకోవడం..          తల్లితో అమర్యాదగా వ్యవహరించకపోవడమే ఋణం తీర్చుకోవడం !                        తల్లిని గౌరవించడమే.. తల్లికి అగ్రతాంబూలం..!!*



*పితృదేవోభవ:*


*తల్లి .. తండ్రి.. రెండుకళ్ళు ప్రతి మనిషికి. నిరాకార భగవంతునికి సాకార ప్రత్యక్షమే తండ్రి.. మన ఎదుగుదలకు అనుక్షణం ఆరాటపడుతూ.. జీవితంలో ప్రత్యక్షం పోరాడుతూ.. మన ఉన్నతికి బాటలు వేసిన అలుపెరుగని యోద్ధుడు ‘తండ్రి..!’  సమసమాజంలో మనకోసం గౌరవం, బాధ్యత, కర్తవ్యం, భద్రత, కీర్తి, వంశం, ప్రతిష్ట మొదలగు పదాలకు స్వరూపం నాన్న.*


*అందుకే ఒక మహాత్ముడు ఇలా అన్నాడు.. "ఎవరైనా ఒకరికి చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాం అంటే ఆ యొక్క వ్యక్తి ఆ స్థాయికి ఎదగడానికి కారణం అయిన అతని తల్లి, తండ్రులకు మొదట నమస్కారం పెట్టాలి."      కాని వారిని  కన్న తల్లి తండ్రులు.. మరింత గౌరవనీయులు..! తల్లి తండ్రులను గౌరవించడమే  .. అసలైన ఆధ్యాత్మికత. వారు శరీరాలను వదిలిన తరువాత విగ్రహాలు నిర్మించడం, ఫోటోలకు దండలు వేయడం, కర్మకాండలు ఆడంబరంగా నిర్వహించడం ముఖ్యం కానేకాదు. వారు జీవించియుండగా వారికి తోడుగా, నీడగా ఉండడమే అసలైన మన ధర్మం..!*



*ఆచార్య దేవోభవ:*


*మనతో ఏ మాత్రం రక్త సంబంధం లేకున్నా మన ఉన్నతి కోసం పై లోకాల నుండి దిగివచ్చిన..  మనలను గొప్ప జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి కంకణబద్ధుడై, అపర భగవంతుడే ఆచార్యుడు .. ఇహ, పర జ్ఞానాన్ని మనకు ప్రసాదించి జన్మను సార్థకం చేసుకుని మహా భాగ్యాన్ని మనకు అందించిన గురువుకు సదా కృతజ్ఞుడై ఉండడమే 'ఆచార్య దేవోభవ'.*



*అతిథి దేవోభవ:*


 *మనకు తల్లి తండ్రుల ద్వారా సంక్రమించిన సంస్కారాన్ని, గురువు ద్వారా అభ్యసించిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. మనకి విశేష సేవకి అవకాశం కల్పించిన మహాత్ముడే 'అతిథి'.     'పంచుకుంటే పెంచబడుతుంది' అన్నది పరమసత్యం. అతిథి సేవ ద్వారానే మన జీవితంలో ప్రస్ఫుటం అవుతుంది. మనం ఎవరికైనా సేవ చేసే అవకాశం వస్తే.. సాక్షాత్  భగవంతుడికి సేవ చేస్తునట్లే .. అందుకే భగవాన్ శ్రీ సత్యసాయి అందరికీ బోధిస్తూండేవారు .. 'మానవ సేవయే మాధవ సేవ' అని .. ఇలా మనకు సేవకు అవకాశం కల్పించిన మన తోటి మిత్రులే అతిథి దేవుళ్ళు.*


*మానవ జన్మ తీసుకుని ఎవరైతే ధ్యానసాధన, అహింసపాలనలో ఉంటారో వారు మాత, పితృ ఋణం తీర్చుకున్నవారు అవుతారు. మరి ఎవరైతే ధ్యానప్రచారం, జ్ఞానప్రచారంలో సారధులౌతారో వారు గురు ఋణం తీర్చుకున్నవారు అవుతారు .. ప్రతివ్యక్తికి సేవచేస్తూ.. అందరిలో భగవత్ స్వరూపాన్ని దర్శించుతారో అతిథి ఋణం తీర్చుకున్నవారు అవుతారు. తన జన్మకు ఒక అర్థం, పరమార్థం సాధించుకున్న వారుగా.. ఆచంద్రార్కంగా .. ఆనందంలో  జీవిస్తాడు

[


అందరికీ ఈ పేరు ఇప్పుడు సుపరిచితమే ! 


అనేక రాజకీయ పార్టీలు  ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకొన్నాయి .. నియమించుకొంటున్నాయి .. నియమించుకొంటాయి . 


ఇప్పుడు ఇలాగే మరో వ్యూహకర్త సునీల్ . 


వీరి వ్యూహాలు , 

వాటి వల్ల సమాజానికి జరిగే లాభం ఎంత ?నష్టం ఎంత ? ప్రజాస్వామ్యానికి ఇది మంచి చేస్తుందా? 

లేక చెడా? 

ఈ చర్చ వేరు . 

ఈ పోస్ట్ దాని పై కాదు . 


ప్రశాంత కిషోర్ ఆదాయం ఎంత ఉంటుంది ? బహుశా వందల కోట్లు . 


ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ఇంత సంపాదన . సంపాదనకు మించి పేరు ప్రతిష్టలు . పలుకుబడి ? ఎంత పెద్ద ఉద్యోగం చేస్తే ముఖ్య మంత్రులను నేరుగా కలిసే అవకాశం ఉంటుంది ? 


ఇక్కడేమో ముఖ్య మంత్రులే ప్రశాంత్ కిషోర్ లాంటి వారి కోసం ఎదురు చూసే స్థితి . 


పదేళ్ల క్రితం ఇలాంటి ఒక వృత్తి ఉంటుందని ఎవరైనా ఊహించారా ? 


ప్రపంచం లో ఏదైనా యూనివర్సిటీ ఇలాంటి కోర్స్ ను డిజైన్ చేసిందా ? 

లేదు కదా . 


*మరి ప్రశాంత్ కిషోర్ కు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది ?*


*దీన్నే  లాటరల్  థింకింగ్ అంటారు . భిన్న కోణం లో ఆలోచించడం*


మీరు టాక్సీ ఓనర్ కావాలంటే ? 

లోన్ తీసుకోవాలి . 

కారు కొనాలి . 

డ్రైవర్ ను పెట్టుకోవాలి . దానికొక ఆఫీస్ . 

ఇలా చేస్తే ఎన్ని కారులకు ఓనర్ అవుతారు ? 


ఒక్క కారు కూడా కొనకుండా , 

ఒక్క డ్రైవర్ కు కూడా జీతం ఇవ్వకుండా ప్రపంచం లో అతి పెద్ద కారు రెంటల్ కంపనీస్ వచ్చాయి . 


ఉబెర్ .. ఓలా.. 


*జస్ట్ ఒక ఐడియా తో.. భిన్నంగా ఆలోచించడం వల్ల*


ఇదే విధంగా రెస్టారెంట్ లు .. 


ఒక్క బిల్డింగ్  కూడా లేకుండా ఒక్క కుక్ ను కూడా నియమించుకోకుండా ప్రపంచ రెస్టారెంట్ సామ్రాజ్యం .. 


ఒక్క ఐడియా తో .. *జొమాటో .. స్విగ్గీ*


*చికెన్ ఫ్రై* ఎంత పెద్ద బిజినెస్ ? 


రోడ్డుపైన ఎక్కడో వైన్ షాప్ ముందు పెట్టుకొంటే  .. 


రోజంతా కస్టపడి పని చేస్తే అయిదు వందల లాభం . 


కానీ వాడు భిన్నంగా ఆలోచించాడు . 

ప్రపంచ చికెన్ సామ్రాజ్యం .. అదే *kfc*


ఇది ప్రారంభం మాత్రమే . రానున్నది రోబో యుగం .


ఇప్పుడున్న ఉద్యోగాల్లో సగానికి పైగా ఉద్యోగాలను రోబో లు ఎత్తుకొని పోతాయి .


 ఇప్పటికి మనం ఊహించని ఉద్యోగాలు .. అంటే ఇంకా పేరు పెట్టని ఉద్యోగాలు .. అవకాశాలు వస్తాయి . 


వాటికి ఫలానా కోర్స్ అంటూ లేదు .


*బాబాయ్ హోటల్* ఓనర్ ఏ యూనివర్సిటీ లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసాడు ? 


*పుల్లా రెడ్డి* గారు ? *kfc* ఓనర్ ? *ప్రశాంత్ కిషోర్* కు ఎన్నికల టక్కు టమారాలు నేర్పిన కాలేజీ ఏది ?

 *ఉబెర్* ఓనర్ చదివిన యూనివర్సిటీ ఏది ?


*రానున్నది కొత్త ప్రపంచం*


నువ్వు ఎక్కడ చదివావు అనేది కాదు . 

ఎన్ని మార్కులు వచ్చాయి ? 

రాంక్ ఎంత అనేది అసలే కాదు . 


*సరి కొత్త గా ఆలోచించగలవా ?*


నీలో భ్యవిష్యత్తు నైపుణ్యాలు...  

అంటే...  

కాగినీటివ్ ఫ్లెక్సిబిలిటీ , లాటరల్ థింకింగ్ , క్రిటికల్ థింకింగ్ , 

సోషల్ ఇంటలిజెన్స్ , ఎమోషనల్ ఇంటలిజెన్స్, 

క్రియేటివిటీ  లాంటి స్కిల్స్  ఉన్నాయా ? లేవా ? అనేదే ప్రశ్న . 


చదువంటే బట్టి కొట్టి మార్కులు సాధించడం కాదు . 


అది వ్యక్తి జ్ఞాపక శక్తికి పరీక్ష . 


నీకంటే మిలియన్ రెట్లు ఎక్కువ సమాచారాన్ని నిక్షిప్తం చేసి ప్రాసెస్ చేయగల రోబో లు,  కృత్రిమ మేథ ఒక పక్క ఉంటే,  


జ్ఞాపక శక్తి తో ప్రపంచం లో రాణించాలంటే, మూడవ ప్రపంచ యుద్ధాన్ని విల్లంబులతో జయించాలని ప్రయత్నం చేయడం లాంటిది .


ఫ్యూచరిస్టిక్ స్కిల్స్  ఏంటి ? 


వాటిని బాల్యం నుంచే నేటి తరానికి ఎలా నేర్పాలి ? 


సృజనాత్మతక అనేది భవిష్యత్తు లోఅతి కీలక నైపుణ్యం అవుతుంది .


 సృజనాత్మకత పుట్టుకతో రావాలి కదా ? 


దాన్ని నేర్పడం సాధ్యమా ?


సృజనాత్మకత అనేది ఇది పుట్టుకతో 80% వస్తే ఉన్నదాన్ని ఖచ్చితంగా 20 శాతం అభివృద్ధి చెందిచవచ్చు అంటే ఒక వ్యక్తి 60 శాతం సృజనాత్మకత కలిగి జన్మిస్తే అతని 20 మెరుగుపరచవచ్చు అలాగే 80 ఉన్నవాని 100 చేయవచ్చు కానీ మనం అలాంట బోధన అభ్యసన ప్రక్రియలను చేపట్టవలసి ఉంటుంది

మన విద్యా విధానం వ్యక్తిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి అభివృద్ధి  చేసేదిగా ఉండాలి.


మనం చదువుకున్న చదువులు వేరు. ఇపుడు నడుస్తున్న, రాబోయే తరాల విద్యార్ధులు మల్టీ టాలెంటడ్ స్కిల్స్ కలిగి ఉంటే తప్ప కెరీర్ లో రాణించలేరు. Bookish knowledge తో పాటుగా Soft skills like  presentation skills, communication skills, decision making, planning and execution skills, time management, positive thinking లతో పాటుగా creativity తో routine కి భిన్నంగా వినూత్న ఆలోచనా విధానం భవిష్యత్తులో కీలకం కానుంది. పిల్లలందరినీ ఆ విధంగా తీర్చిదిద్దాలి.

[


No comments:

Post a Comment