*హనుమంతుడు భూత ప్రేత పిశాచాల నుంచి మనల్ని రక్షించడానికి కారణమేమిటో తెలుసా ?*
ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు.అదేవిధంగా ఆంజనేయస్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేని ఇల్లు ఉండదు.ప్రతి ఒక్కరి ఇంటిలో ఆంజనేయస్వామి ప్రతిమ తప్పకుండా మనకు దర్శనమిస్తుంది.
మన హిందూ దేవుళ్ళలో ఆంజనేయ స్వామికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. రామాయణంలో శ్రీ రామచంద్ర ప్రభుకి ఆంజనేయుడు నమ్మినబంటుగా ఉంటాడు. ఈ క్రమంలోనే భక్తులు శ్రీరామచంద్రుని పూజించిన లేదా ఆంజనేయుడుని పూజించిన ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఆంజనేయుడు శ్రీరాముడికి ఏ విధమైనటువంటి భక్తుడో మనకు తెలిసిందే.
ఇక రామభక్తులు ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చేస్తుంటారు. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు, గ్రహస్థితులు, భూత ప్రేత పిశాచాల భయం ఉండదని భావిస్తారు.ఈ విధంగా భూతాలకు భయపడేవారిని ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్లి అక్కడ స్వామివారి తాయెత్తులు కట్టించడం ద్వారా వారికి ఆ భయం తొలగిపోతుందని భక్తుల విశ్వసిస్తుంటారు.
అదే విధంగా ఇలాంటి భయాందోళనలో ఉన్నవారు ఎక్కువగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే మంత్రాన్ని జపిస్తూ ఉండటం వల్ల వారికి ధైర్యం కలుగుతుందని భావిస్తారు. నిజంగానే ఆంజనేయస్వామి పిశాచాల నుంచి మనల్ని రక్షిస్తాడా... మనల్ని ఆంజనేయ స్వామి ఈ విధంగా రక్షించడానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...
రామనామం ఎంత మధురమైనదో ఆంజనేయస్వామి ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలోనే విష్ణుమూర్తి తన రాముడి అవతారాన్ని చాలిస్తూ ఆంజనేయుడికి ఒక విషయం చెప్పి తప్పకుండా పాటించాలని చెబుతాడు. ఈ క్రమంలోనే శ్రీరాముడు తన తనువు చాలిస్తూ.. హనుమా కలియుగం అంతమయ్యేవరకు భూలోకంలో ఉండి సజ్జనులను కాపాడాలని వారికి కలిగే భయం, ఆందోళన, భూత ప్రేత పిశాచాల నుంచి వారిని కాపాడి వారిలో ధైర్యం నింపాలని ఈ భూలోక వాసులకు నువ్వు రక్షణ కల్పించాలని చెబుతూ తన అవతారాన్ని చాలిస్తాడు. ఈ విధంగా శ్రీ రాముడు ఆంజనేయుడి కోరిక కోరడంతో శ్రీ రాముడి ఆజ్ఞను హనుమంతుడు నెరవేరుస్తానని మాట ఇవ్వడం వల్ల ఆంజనేయస్వామి కలియుగంలో భక్తులకు రక్షణగా ఉండి వారికి కలిగే భయాందోళనలను నుంచి రక్షిస్తున్నాడు..
[
*పారిభాషిక పారిజాతాలు*
ప్రతి భాషలో కొన్ని పదాలకు చాలా అర్థాలుంటాయి. సందర్భాన్నిబట్టి వాటిని ఉపయోగిస్తుంటారు.
ఉదాహరణకు, ‘దయచేయండి' అన్న పద ప్రయోగాన్ని మర్యాదగా 'లోపలికి రండి' అన్న అర్థంలో వాడుతూ ఉంటారు. అదే పదజాలాన్ని కాస్త విసురుగా అంటే ‘బయటికి నడు' అన్న అర్థం వస్తుంది. ధ్వనిప్రధానమైన కొన్ని పదాలు రెండర్థాలతో తికమకపరుస్తూ ఉంటాయి. భౌతికంగా పదానికి ఉన్న అర్థంతోపాటు ఆధ్యాత్మికంగా మరో అర్థాన్ని ఆ పదమే ధ్వనిస్తూ ఉంటుంది. ఈ పదాలను పారిభాషిక పదాలు అంటారు. ఉపాధి అనే పదానికి బాహ్యార్థం బతుకుతెరువు. అదే పదానికి ఆధ్యాత్మికపరంగా వేరే అర్థం చెబుతారు. ఆత్మకు ఆ శరీరం ఒకలాంటి తొడుగు అన్న భావం స్ఫురిస్తుంది. పారిభాషిక పదాలు ఆధ్యాత్మిక గ్రంథాల్లో చాలా కనిపిస్తాయి.ముఖ్యంగా భాగవతంలో పామరులు తెలుసుకోదగ్గ
పారిభాషిక పదాలను కొన్నింటిని ప్రస్తావించాలి. ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిత్తు మహారాజుకు శుకయోగీంద్రుడు ఏడు రోజుల్లో భాగవత కథామృతం అందించడానికి ఉపక్రమించాడు. శాపోహహతుడైన రాజుకు పాపోపశమనంతోపాటు మోక్షం పొందడానికి అంతకుమించిన ఉపాయం మరేదీ కనిపించలేదు. ఆ సందర్భంగా శుకుడు మొట్టమొదట వినిపించిన శ్లోకంలోనే రెండు ముఖ్యమైన పారిభాషిక పదాలు ఎదురవుతాయి.
ఓ రాజా! ఆలకించు. నువ్వు ఆత్మవిత్తులకు (ఆత్మజ్ఞానులు) అనుకూలంగా ప్రశ్నవేశావు. లోకహితమైనదేదో తెలుపమన్నావు. చెబుతా విను. వేలాది జీవులు ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండానే వెళ్లిపోతూ ఉంటారు. సంసారంలో ఉన్న జీవులు రెం రకాలు. గృహస్థు, గృహమేధి. గృహస్థు ఇహపరసాధకుడు. ఈ ప్రపంచంలో ఉంటూ జీవితాన్ని తెలివిగా జీవిస్తాడు. అకామకామిగా, అనాసక్తయోగిగా సంసార సాగరాన్ని దాటి, తామరాకుపైన నీటిబిందువులా ప్రవర్తించి తరిస్తాడు. గృహమేధి తానుగా సృష్టించుకున్న కుటుంబ సభ్యుల సైన్యానికి చిక్కి నానాయాతనలు అనుభవిస్తాడు. పగలంతా కష్టపడి వారికోసం సంపాదిస్తూ రాత్రి అంతా నిద్రపోతాడు. భార్యాబిడ్డలు కడగట్టే సంసార సైనికులని, బంధువులు స్నేహితులు, ఆస్తులు, అంతస్తులు, సుఖాలు, భోగాలు- ఇవన్నీ అశాశ్వతమని తెలుసుకునే అవకాశం కోల్పోతాడు. జీవితం నిరర్థకం కాకుండా, వైరాగ్య శస్త్రాలను ప్రయోగించి అకామకామి కాగలిగితే మోక్షగామి కాగలడు. ఆత్మ సైనికులు అంతం కాగలరు. పరమాత్మ గురించి సదాస్మరణ, మనన, ధ్యానం కలిగినవాడు ఉత్తమ సాధకుడు అవుతాడు. మానవుడు మానవుడి పట్ల ఎన్నో అపరాధాలు చేస్తూ ఉంటాడు. ఆ తరవాత పశ్చాత్తాపంతో, చేసిన తప్పులు సరిదిద్దుకుంటాడు. తిరిగి అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా ఉంటాడు. దైవంపట్ల అపరాధం జరిగితే అంత సులభంగా బయటపడటం కుదరదు. అంచేత దైవాపరాధం జరగకుండా ముందుగా జాగరూకత వహించడం ప్రతి మనిషికీ చాలా అవసరం. పద్మ పురాణం అలాంటి పది అపరాధాల గురించి హెచ్చరిక చేస్తున్నది.
1) దైవ భక్తుల నింద 2) నామరూప భేదాలను పాటించడం 3) గురు ఆజ్ఞను మీరడం 4) వేదాలను తూలనాడటం 5) అర్చనామూర్తిని ఆరాధించకపోవడం 6) దివ్యత్వం గురించి ఊహాపోహలు కలిగి ఉండటం 7)దైవనామస్మరణతో పాపం తొలగిపోతుందని తెలిసి, మళ్ళీ మళ్ళీ పాపాలకు ఒడిగట్టడం 8) లోక కల్యాణం కోసం దైవభక్తిని పాటించకపోవడం 9) నాస్తికుల్లో దైవనామస్మరణ కల్పించకపోవడం 10) దైవంతోపాటు అహంకార, మమకారాలకు దాసోహం కావడం. భగవన్నామ స్మరణ, ఆయన దివ్యకథలు పాటించి ఆలకించి, మననం చేసుకుంటూ మనిషి ఏ కర్మ చేపట్టినా అది దివ్యకర్మగా మారుతుంది. భవతారకమై మోక్ష కారకం అవుతుంది. భాగవతసార సంగ్రహం నిరంతర భగవన్నామ సంకీర్తనం.
ఉప్పు రాఘవేంద్రరావు
[జీవితమంటే ఏమిటి ?
ఎంత ఆలోచించినప్పటికీ జీవితమంటే ఎమిటో తెలియక సతమతమవుతున్న ఒక జీవితపు ప్రయాణ బాటసారి గురువు వద్దకి వెళ్ళి
"స్వామీ ఎంత ఆలోచించినా జీవితం అంటే ఎమిటో తెలియట్లేదు ఇక మీరే నాకు జ్ఞాన ప్రదాత అని శరణు వేడాడు .
అది చూసిన గురువు గారు ఆ శిష్యుడిని పోస్టు మాస్టర్ వద్దకి తీసుకెళ్ళి, ఈరోజు "ఉత్తరాల సంచిని" శిష్యుడికి ఇప్పించి ఆ సంచిలో ఉన్న ఉత్తరాలను అడ్రసుల వారీగా పంచిరమ్మని ఆజ్ఞాపిస్తాడు.
అది చూసిన ఆ బాటసారి కొంత ప్రశ్నార్థకంగా చుస్తూ ,
సరే గురువు గారు చెప్పారు కదా....అని ముందుకి సాగుతాడు .
అలా ఇల్లిల్లూ తిరిగి ఉత్తరాలు పంచుతూ ఉండగా ఒక ఇంటికి వచ్చిన ఉత్తరంలో, ఆ ఇంటి బిడ్డకు ఉద్యోగం వచ్చిందని లేఖ ఉంటుంది , అది చూసి సంతోష పడతాడు.
మరో ఇంటికి వచ్చిన లేఖలో వారి బంధువొకరు మరణించారన్న వార్త చూసి బాధపడతాడు.
ఇంకో పేద వృద్ధురాలికి పించను డబ్బులు మనీ ఆర్డర్ ద్వరా ఇచ్చి సంబరపతాడు.
ఇంకొకరి బంధువుల ఇల్లు మంటలలో కాలిపోయిందన్న ఉత్తరమిచ్చి విలపిస్తాడు.
అలా తిరుగుతూ సాయంకాలానికి గురువుగారి ఆశ్రమానికి చేరుకొని విచారంగా కూర్చుంటాడు.
గురుదేవుల రాకను గమనించి గబుక్కున లేచి కొంత అలసటతో కొంత విచారంతో కొంత తెలుసుకోగలిగానన్న సంతోషంతో గురువుగారి పాదాలకు మనస్కరించి వెళ్ళిపోతాడు.
ఏంటీ .... కథ ను మధ్యలో ఆపాననుకుంటున్నారా .......
నిజమేనండి కథ అయిపోయింది,
ఆలోచించండి ఆ శిష్యుడికి ఏమి అర్థమయ్యుంటుంది .
...జీవితమంటే పోస్టు మ్యాన్ భుజానికున్న ఉత్తరాల సంచి లాంటిది అందులో సంతోషం, బాధల కలబోతల ఉత్తరాలున్నట్టు, జీవితం కుడా సుఖ దుఃఖాల కలబోత అన్నిటినీ భరిస్తూ ముందుకి సాగడమే జీవితం .... " మానవుడు భగవంతుని నుండి వేరుపడిన తరువాత సుఖ దుఃఖాలు లో పడి అనుభవిస్తాడు. ఈ జీవితం నుండి బయట పడాలంటే ఆ శ్రీకృష్ణుని శరణు వేడడం తప్ప వేరు మార్గం లేదు. భక్తుడు సుఖ దుఃఖాలు రెండిటిని సమానంగా తీసుకుంటాడు. మానవుడు భక్తిలో ఉంటే సుఖ దుఃఖాలు ఏమి చేయలేవు , నిత్యం సంతోషంగా ఉంటు ఆ శ్రీకృష్ణుని లోకం చేరుకుంటారు. గొలోకంలో నిత్యం సంతోషంగా ఉంటారు. జీవితం అంటే.
[
‘ఏదీ మన చేతిలో లేదు. మనం సంకల్పించవలసిన పని కూడా లేదు. జరగవలసింది జరుగుతుంది. మనం నిమిత్తమాత్రులం, అంతా విధి లిఖితం, అన్ని పనులూ ఆ భగవంతుడి చేతిలోనే ఉంటాయి. ఆయన అనుకోకపోతే ఏవీ కావు’ ఇలా భావించేవారు లోకంలో చాలామంది ఉంటారు. సంకల్పం లేకపోతే అనుకున్నది జరుగుతుందా? దానంతట అదే జరుగుతుందా?
జడ చేతన జ్ఞానం లేకపోవడం వల్లే మనిషికి ఇలాంటి సందేహాలు కలుగుతుంటాయి. నిజానికి ఈ సృష్టి విచిత్రమైంది. మనం చేసే కర్మ వైచిత్రి వల్ల, దానికి అనుగుణంగా సృష్టి రచన జరిగినట్లు కనిపిస్తుంది. సృష్టి తర్వాత ప్రళయం. ప్రళయం తర్వాత సృష్టి. ఇలా ఏర్పడటానికి కారణం ఎవరు? సృష్టికి, ప్రళయానికి మధ్య లోకస్థితి ఒకటుంది. దానికి కారణం ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవలసి ఉన్నది.
‘పూర్ణమదః పూర్ణమిదమ్, పూర్ణాత్ పూర్ణముదచ్యతే’ అని ఉపనిషత్ వాక్యం. ‘పూర్ణ పురుషుడైన పరమాత్మ ఈ పూర్ణసృష్టి ఏర్పాటుచేశాడు’ అని దాని అర్థం. అలాంటప్పుడు, ఈ సృష్టి దానంతట అదే ఏర్పడింది అనే అభిప్రాయం ఎలా కలుగుతుంది? ఎవరి ప్రమేయం లేకుండా ఒక రాయి శిల్పం అవుతుందా? ఒక మట్టిముద్ద కుండగా మారుతుందా? ఎవరైనా రాతిని శిల్పంగా మార్చాలి. మట్టిని కుండగా చేయాలి. చేయకపోతే ఏ మార్పూ ఉండదు. మరి చేయడానికి ముందు సంకల్పం చేసుకోవాలి. ఆ సంకల్పమే మనతో ఆయా పనులను చేయిస్తుంది. పరమాత్మ సంకల్పించడం వల్లే ప్రపంచం ఏర్పడిందని యజుర్వేదం చెబుతున్నది.
‘పరమాత్మ పూర్వ సృష్టుల మాదిరిగానే జీవుల ప్రయోజనం కోసం, ఆయా పదార్థాలను సృష్టి చేశాడు. అందుకుగాను, అతను మొదటగా సంకల్పించాడు’- అని ఈశావాస్య ఉపనిషత్తు స్పష్టం చేసింది. లోకాలను సృజించాలని పరమాత్మ అనుకున్నాడు కాబట్టే, వాటిని చక్కగా సృష్టించాడని తెలుస్తుంది.
ఈ సృష్టి స్థితి లయలకు వెనుక పరమాత్మ ఉన్నాడనే విశ్వాసం లేనివారు- ప్రపంచం దానంతట అదే ఏర్పడిందనే అభిప్రాయంతో ఉంటారు. కానీ, జడం ఎప్పుడూ చేతన పదార్థంగా పనిచేయదు. ఏ వస్తువును తయారు చేయాలన్నా, మన అవసరం ఎలా ఉంటుందో, అలాగే ఈ సృష్టి రచనకు పరమాత్మ అవసరం ఉంది. పరమాత్మ కూడా ఇది చేయాలని సంకల్పిస్తే అది నామరూపాలను ధరిస్తుంది.
పరమాత్మ ‘సత్’ స్వరూపుడే కాదు, ‘చిత్’ స్వరూపుడు కూడా. తన జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని నిర్మించాడు. పరమాత్మ అనుకున్నట్లే జరుగుతుంది. అందుకు కారణం ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కావడమే. ఆయన అంతా తెలిసినవాడు. ఎప్పుడు ఎవరి మనసులో ఎలాంటి భావాలు ఉద్భవిస్తాయో వాటిని కూడా గ్రహించగల ప్రజ్ఞాశాలి. అందుకే ఆయనను ‘మనీషి’ అని అభివర్ణించింది వేదం.
మరి మనుషులమైన మనం ఏదైనా చేయాలని అనుకున్నదే నెరవేరనప్పుడు, అనుకోనిది ఎలా సఫలమవుతుంది? పరమాత్మ అనుకుంటే అన్నీ జరిగాయి! మనం అనుకోనప్పుడు ఏదైనా జరుగుతుందని భావించడానికి వీలు లేదు. పరమాత్మ అనుకున్నట్లే మనం కూడా అనుకోవాలి. సంకల్పించుకోవాలి. అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. ‘తన్మేమనః శివసంకల్పమస్తు’ అంటుంది వేదం. పరమాత్మవన్నీ శుభ సంకల్పాలే. అలాంటి సంకల్పాలే మనమూ కలిగి ఉన్నప్పుడు, అనుకున్నవన్నీ సఫలమవుతాయి. అంతే కానీ, మనమేదీ అనుకోకుండా ఉంటే ఏదీ నెరవేరదు.
మనం చేసేపని విజయవంతం కావాలంటే మొదట శుద్ధమైన మనసుతో సంకల్పించాలి. తర్వాత ఇంద్రియాలను సంకల్పానికి అనుగుణంగా సమాయత్తం చేయాలి. ఏకాగ్రత, లక్ష్యశుద్ధి కలిగి ఉండాలి. శతకకారుడు వేమన చెప్పినట్లు సాధకులం కావాలి. ‘అభ్యాసం కూసువిద్య’ అనే మాటలోని అభ్యాసానికి కార్యనిర్వహణ అని అర్థం. ఫలం.. పనిమీద ఆధారపడి ఉంది. పని, కర్తవ్యాన్ని బట్టి ఉంటుంది. కర్తవ్యం కర్తను బట్టి ఉంటుంది. కర్త సంకల్పించినప్పుడే ఏదైనా జరుగుతుంది. సంకల్పించకుండా (అనుకోకుండా) ఉంటే జీవితం అంధకారమవుతుంది.
[
No comments:
Post a Comment