Tuesday, 21 June 2022


[*కూసింత నవ్వుకోండి!!* 😆


ఐ.టి. కంపెనీ ఉద్యోగైన 🕵 రాజేష్ ఆరోగ్యం బాలేదని🗣 పేరుగాంచిన అన్ని ప్రముఖ ఆసుపత్రుల 🏥 చుట్టూ తిరిగాడు! అయినా ఆరోగ్యం కుదుట పడక 😷చాల బాధ పడుతున్నాడు! అతని భార్య ఓ సలహా యిస్తూ


"ఎందుకైనా మంచిది మీరొకసారి పశువుల డాక్టర్ని సంప్రదించండి" అన్నది!  

రాజేష్ 😳షాకై "నీకేమైనా పిచ్చా నేను పశువుల డాక్టర్ని కలవడమేంటి?" అని అరిచాడు! 


భార్య సున్నితంగా "నాకేం పిచ్చికాదు మీకే ప్రాబ్లమ్!  తెల్లవారకముందే 🐓 కోడిలాగా లేచిపోవటం,

 కాకిలాగా 🐧సగం స్నానం చేసి, కోతిలాగా🐒 చేతికి దొరికిందేదో నోట్లో పెట్టుకుతిని,

పందెం 🐎గుర్రంలా ఆఫీస్ కి పరగులుతీసి, 

అక్కడ గాడిద 🐮 చాకిరీ అంతా చేస్తూ, జూనియర్ల పై ఎలుగుబంటిలా🐻 రంకెలేసి పని చేయించి, 

రాత్రికి ఇంటికి వచ్చి చికాకుతో కుక్కలా 🐕 మా అందరి పై అరుస్తూనే, ముసలిలా🐊 ఆబగా తినేసి, మంచమెక్కి గేదెలా 🐃 నిద్రపోతున్నారుగా! 

అందుకే పశువుల డాక్టర్ని కన్సల్ట్ చేయమంది!"

రాజేష్ ష్టన్నై ఆమెనే😖🙃 చూస్తూ కూర్చుండిపోయాడు!  

"ఏమిటీ  గుంటనక్కలా 🐺 నన్నే చూస్తున్నావ్?" అడిగింది భార్య!

.........

మనకు వేదము సర్వస్వము అట్టి వేదమునకు ఆరు అంగములుగా ఆరు శాస్త్రములు తెలుపబజినవి వాటి ప్రాముఖ్యత సరళ భాషలో శ్రీ అనంత కృష్ణ గారు వివరించిన దానిని వారి వాల్ నుండి యదాతదంగా అందరికి తెలియపరుచవలెననే కోరికతో పోస్ట్ చేస్తున్నాను 

యదాతదంగా ఐనను కాపీ పేస్ట్ చేస్తునందుకు అన్యదాభావించవద్దు


శాస్త్రాధ్యయనము

🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️

శాస్త్రాధ్యయనము - షట్ప్రమాణములు. [1]

🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️


జ్ఞానము రెండు రకములు.  

ఒకటి యదార్థ జ్ఞానము లేక ప్రమ, రెండవది అయదార్థజ్ఞానము లేక భ్రమ.   ఇట్టి యదార్థ జ్ఞానము లేక ప్రమ కలిగించునది ప్రమాణము.  తెలియగోరువాడు ప్రమాత, తెలియవలసినది ప్రమేయము, తెలుసుకొను విధానము ప్రమాణము తద్వారా తెలిసినది ప్రమ.


ఈ ప్రమా జ్ఞానము  కలుగుటకు ఆరు రకముల ప్రమాణములు శాస్త్రములో చెప్పబడినవి.  అవే ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శాబ్దము, అర్థాపత్తి, అనుపలబ్ధి అని. వీనినే షట్ప్రమాణములంటారని పెద్దలు చెప్తారు. 

మనకి ఆరు నాస్తిక దర్శనములు, ఆరు ఆస్తిక దర్శనములు కలవు.  వీరందరిలోనూ ఈ ప్రమాణములపైన ఏకాభిప్రాయము లేదు.  చార్వాకులు అనీశ్వరవాదులు, భౌతికవాదులు కూడా. వీరికి కేవలము ప్రత్యక్షప్రమాణమే ప్రమాణము. బౌద్ధులు, వైశేషికులు ప్రత్యక్షమును అలాగే అనుమానప్రమాణమును కూడా అంగీకరిస్తారు.  అనుమానము అంటే సందేహము అని అర్థము కాదు.  అనుమితి అను యదార్థజ్ఞానమును కలిగించునది.  సాంఖ్యులు, యోగులు ప్రత్యక్ష, అనుమాన, శాబ్దములను ప్రమాణముగా స్వీకరిస్తారు. అయితే నైయాయికులు ఈ మూడూ కాక ఉపమాన ప్రమాణమును కూడా అంగీకరిస్తారు. ఇక మీమాంసకులు సంగతి.  మీమాంసకులలో రెండు మతములు కలవు. ప్రాభాకరమని, భాట్టమతమని. ప్రాభాకరలు అనుపలబ్ధి తప్ప మిగిలిన అయిదు ప్రమాణాలను అంగీకరీంచారు.  వేదాంతులకు అట్లే భాట్టమతానుయాయులైన మీమాంసకులకు  ఈ ఆరు కూడా ప్రమాణములే. ఇక ఈ ప్రమాణముల విషయములను వివరముగా తెలిసికొనవలసి ఉంటుంది.  ఇలా ప్రమాణముల ద్వారా నిరూపించబడిన సత్యత్వము వ్యావహారికమని, పారమార్థికమని రెండువిధములు.  పరమ ప్రయోజనమును పొందుటకు ఇవన్నీ అవసరమే.  ఇవి అంచెలంచలుగా అవగాహన చేసికొనుట ఒక ఎత్తైతే, ,అనుభవమునకు తెచ్చుకొనుట మరొక పెద్ద ఎత్తు.  గురుకృపావిశేషముతో అది సులభసాధ్యమౌతుంది. ప్రస్తుతానికి స్వస్తి.

పై విషయములు పరిశీలించి, పెద్దలు గుణదోషవిచారము చేయగలరు

22/06, 3:45 am] Kant's Rso: *నవ్వుకోండి     😂😂😂*  

---------------------------------


*Godavari Express కి ఇంకా చాలా time ఉంది. ఎక్కబోతూ ఒకసారి Chart లో నాపేరు, Berth Number చెక్ చేసుకున్నా! అసంకల్పితంగా క్రిందనున్న పేరు మీద నా దృష్టి పడింది. చెత్తకుప్పల చిట్టిబాబు.... వయస్సు 45. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఔను! అతనే ఇతను అయి ఉంటాడు. ఇంత విచిత్రమయిన పేరు ఇంక ఎవరికి ఉంటుంది.  అతనికి ముందు పుట్టిన పిల్లలు బ్రతక్కపోతే ఇతను పుట్టగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి, మొక్కుకున్నారని విన్నాం అప్పట్లో. పేరు అలా ఉంది గానీ చూట్టానికి smart గా, active గానే ఉండేవాడు. నా మనసు గతం లోకి జారిపోయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను తెగ ప్రేమించిన వీర ప్రేమికుడు అతను. *(అప్పట్లో నేను కాలేజ్ బ్యూటీ లెండి 😎)* కాలేజీకి వెళ్లినా, ట్యూషన్ కి వెళ్లినా, గుడికి వెళ్లినా body gaurd లా వచ్చేవాడు. భలే కోపం వచ్చేది. ఇంట్లోవాళ్ళకి తెలుస్తే చదువు మానిపిస్తారని భయం. చిట్టిబాబు కాదు జిడ్డుబాబు అని తిట్టుకునేదాన్ని, నిజానికి మూడు సంవత్సరాల డీగ్రీ లో propose చేసి చావలేదు, అతను ఏ రోజు అయినా కనిపించకపోతే నాకు కూడా ఏదో వెలితి గానే ఉండేది.  నేనో రెండ్రోజులు ఏ ఊరన్నా వెళ్లి, కనబడకపోతే నిద్రాహారాలు మానేసి బాధ పడేవాడని ఫ్రెండ్స్ చెప్పేవారు. అతన్ని నేను  ప్రేమించక పోయినా మనసులో ఏ మూలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్.... బహుశా ప్రేమని వ్యక్త పరచడానికి అప్పట్లో మా ఇద్దరికీ ధైర్యం కూడా లేదేమో.  ఆ తర్వాత మా నాన్నగారికి transfer అవటం....

మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ఇపుడు దాదాపు 25 ఏళ్ళ తర్వాత నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో. నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. నాకు పెళ్లి అయిన ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారికి కూడా పిల్లలు ఉన్నారు. అయినా ఒకప్పుడు నన్ను అంతగా ఆరాధించి, అభిమానించిన చిన్ననాటి స్నేహితుడిని చూడాలంటే... *exitement తో నా హృదయం బరువెక్కింది, అసంకల్పితంగా నా పెదాలమీద చిరునవ్వు వచ్చేసింది. మెల్లిగా ట్రైన్ ఎక్కాను నా బెర్త్ వెదుక్కుంటూ వెళ్తే.... Yes అతనే, సీరియస్ గా Suit Case సర్దుకుంటున్నాడు. అప్పుడు ఎలా ఉండే వాడో ఇప్పుడూ అలాగే కత్తి లాగ ఉన్నాడు.* నీట్ గా ట్రిమ్ చేసిన salt & pepper గెడ్డం, full sleeves సగం fold చేసి, పైన రెండు షర్ట్ బటన్స్ వదిలేసి in-shirt చేసాడు, అసలు పెళ్లి అయిందో లేక నన్ను మర్చిపోలేక అలా ఉండిపోయాడో పాపం అనుకుంటూ సంతోషంతో తన్నుకొస్తున్న చిరునవ్వుని బిగబట్టుకుంటు చూస్తున్నా. 

ఇంతలో చెత్తకుప్పల చిట్టిబాబు వెనక్కి తిరిగి నా వైపు చూసాడు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది, BP పెరిగింది.


ఒకటి....రెండు.... అంకెలు లెక్క పెడుతున్నా హఠాత్తుగా అన్నాడు అతను....


 *Aunty, మీరు పెద్దవారు. పై బెర్త్ ఎక్కలేకపోతే నా lower బెర్త్ తీసుకోండి*


దొంగ సచ్చినోడు

చెత్త వెధవ

పండు గెడ్డం గాడు

వాడి గుడ్లు పీకా

వాడికి Carona రానూ                             


----😆😆😆😆

[22/06, 8:25 am] +91 99667 76531: *నోక్టూరియా*


 నోక్టురియా అంటే రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం గుండె వైఫల్యం యొక్క లక్షణం, మూత్రాశయం కాదు.

 శివపురిలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ బన్సాల్, నోక్టురియా నిజానికి గుండె మరియు మెదడుకు రక్త ప్రసరణలో అడ్డుపడే లక్షణం అని వివరిస్తున్నారు.  పెద్దలు, వృద్ధులు ఎక్కువగా రాత్రిపూట నిద్రలేచి మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది.  నిద్రకు భంగం వాటిల్లుతుందనే భయంతో పెద్దలు రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగడానికి దూరంగా ఉంటారు.  నీళ్లు తాగితే మూత్ర విసర్జనకు మళ్లీ మళ్లీ లేవాల్సి వస్తుందని అనుకుంటారు.  పెద్దలు మరియు వృద్ధులలో తరచుగా తెల్లవారుజామున గుండెపోటు లేదా పక్షవాతం రావడానికి పడుకునే ముందు లేదా రాత్రి మూత్ర విసర్జన తర్వాత నీరు త్రాగకపోవడం ఒక ముఖ్యమైన కారణం అని వారికి తెలియదు.  నిజానికి, నోక్టురియా అంటే తరచుగా మూత్రవిసర్జన చేయడం అనేది మూత్రాశయం పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య కాదు.  వయస్సుతో పాటు వృద్ధులలో గుండె పనితీరు తగ్గిపోవడమే దీనికి కారణం, ఎందుకంటే గుండె శరీరం యొక్క దిగువ భాగం నుండి రక్తాన్ని పీల్చుకోలేకపోతుంది.

 అటువంటి పరిస్థితిలో, పగటిపూట మనం నిలబడి ఉన్న స్థితిలో, రక్త ప్రవాహం మరింత క్రిందికి ఉంటుంది.  గుండె బలహీనంగా ఉంటే, గుండెలో రక్తం తగినంతగా ఉండదు మరియు శరీరం యొక్క దిగువ భాగంలో ఒత్తిడి పెరుగుతుంది.  అందుకే పెద్దలు మరియు వృద్ధులు పగటిపూట శరీరం యొక్క దిగువ భాగంలో వాపు పొందుతారు.  వారు రాత్రిపూట పడుకున్నప్పుడు, శరీరం యొక్క దిగువ భాగం ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతుంది మరియు తద్వారా కణజాలాలలో చాలా నీరు నిల్వ చేయబడుతుంది.  ఈ నీరు తిరిగి రక్తంలోకి వస్తుంది.  ఎక్కువ నీరు ఉంటే, నీటిని వేరు చేయడానికి మరియు మూత్రాశయం నుండి బయటకు నెట్టడానికి మూత్రపిండాలు చాలా కష్టపడాలి.  నోక్టురియా యొక్క ప్రధాన కారణాలలో ఇది ఒకటి.

 కాబట్టి మీరు పడుకున్నప్పుడు మరియు మీరు మొదటిసారి టాయిలెట్‌కి వెళ్లడానికి సాధారణంగా మూడు లేదా నాలుగు గంటలు పడుతుంది.  ఆ తర్వాత, రక్తంలో నీటి పరిమాణం మళ్లీ పెరగడం ప్రారంభించినప్పుడు, మూడు గంటల తర్వాత మళ్లీ టాయిలెట్కు వెళ్లాలి.

 మెదడు స్ట్రోక్ లేదా గుండెపోటుకు ఇది ఎందుకు ముఖ్యమైన కారణం అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది?

 రెండు మూడు సార్లు మూత్ర విసర్జన చేసిన తర్వాత రక్తంలో నీరు చాలా తక్కువగా ఉంటుందని సమాధానం.  శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలోని నీరు కూడా తగ్గిపోతుంది.  దీనివల్ల రక్తం మందంగా మరియు జిగటగా మారుతుంది మరియు నిద్రలో హృదయ స్పందన మందగిస్తుంది.  మందపాటి రక్తం మరియు నెమ్మదిగా రక్త ప్రసరణ కారణంగా, ఇరుకైన రక్తనాళాలు సులభంగా నిరోధించబడతాయి...

 పెద్దలు మరియు వృద్ధులు ఎల్లప్పుడూ ఉదయం 5-6 గంటల సమయంలో గుండెపోటు లేదా పక్షవాతంతో బాధపడుతున్నారని గుర్తించడానికి ఇదే కారణం.  ఈ స్థితిలో నిద్రలోనే చనిపోతారు.

 నోక్టురియా అనేది మూత్రాశయం పనిచేయకపోవడం కాదు, వృద్ధాప్య సమస్య అని అందరికీ చెప్పాల్సిన మొదటి విషయం.

 అందరికీ చెప్పాల్సిన మరో విషయం ఏమిటంటే, పడుకునే ముందు గోరువెచ్చని నీరు తాగాలి, రాత్రి మూత్ర విసర్జనకు లేచిన తర్వాత మళ్లీ తాగాలి.

 నోక్టురియాకు భయపడవద్దు.  పుష్కలంగా నీరు త్రాగండి, ఎందుకంటే నీరు త్రాగకపోవడం మిమ్మల్ని చంపుతుంది.

 మూడవ విషయం ఏమిటంటే, గుండె యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి, మీరు సాధారణ సమయంలో ఎక్కువ వ్యాయామం చేయాలి.  మానవ శరీరం అతిగా వాడితే పాడైపోయే యంత్రం కాదు, దానికి విరుద్ధంగా, ఎంత ఎక్కువ వాడితే అంత బలంగా ఉంటుంది.  అనారోగ్యకరమైన ఆహారాన్ని, ముఖ్యంగా అధిక పిండి పదార్ధాలు మరియు వేయించిన ఆహారాన్ని తినవద్దు.

 ఈ కథనాన్ని మీ పెద్దలు మరియు వృద్ధ స్నేహితులతో పంచుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.

 సీనియర్ సిటిజన్లకు చాలా ముఖ్యం.

 ఆరోగ్య సమస్య గురించిన డా.బన్సల్ యొక్క ఆసక్తికరమైన మరియు సమాచార కథనం ఇక్కడ ఉంది.. *నోక్టూరియా*.

జూన్ 21

ప్రపంచ సంగీత దినోత్సవం


 *"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః"* అని ఆర్యోక్తి.అంటే సంగీతాన్ని శిశువులు, జంతువులు, మరియు పాములు సమానంగా అనుభవించి దానికి వశులౌతారు.


తొలుత సంగీత దినోత్సవం ఫ్రాన్స్‌లో ప్రారంభమైంది. దీన్ని 1982 జూన్‌ 21 నుంచి కొనసాగిస్తున్నారు.


 *ఆది ప్రణవనాదమైన "ఓం" కారం నుండి ఉద్భవించినది  సప్తస్వర సమ్మిళిత సంగీతం..* 

శాస్త్రీయ సంగీతమైనా, జానపద సంగీతమైనా, 

పాప్‌ సంగీతమైనా .... ప్రజలను ఓలలాడించే శక్తి సంగీతానిది.  


ఏ సంగీత వాయిద్యాలూ లేనప్పుడు కూడా ధ్వని ఉంది.. శబ్దం ఉంది.. అది శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటి చెప్పింది.  అచేత నంగా మారిన శరీరాన్ని నిత్య చైతన్యశీలంగా మార్చే శక్తి ఉన్న సంగీతం  ఎప్పుడూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది.. *సంగీతం మదిని పులకరింప చేసి నరాల్లో రక్తాన్ని ఉరక లేయిస్తుంది..* 

 

 _భారతదేశంలో శాస్ర్తీయ సంగీతం పైనే మక్కువ ఎక్కువ.. పాశ్చాత్య సంగీతాలైన పాప్‌, రాక్‌, వెస్ట్రన్‌ మ్యూజి క్‌లను సైతం నేటితరం యువత ఆస్వాదిస్తున్నారు. మనిషిని కదిలించి.. కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం... ఆవేశం...వినోదం... విషాదం.. సమయం.. సందర్భం ఏదైనా దానికి గళమిచ్చేది.. బలమిచ్చేది సంగీతమే._


భారతీయ సంగీతాన్ని మూడు విభాగాలుగా చెప్పొచ్చు.. అవి శాస్ర్తీయ సంగీతం,

జానపద సంగీతం , 

ఆధునిక సంగీతం 


 *శాస్ర్తీయ సంగీతంలో ఉత్తరాదికి చెందిన హిందుస్తానీ, దక్షణాదికి చెందిన కర్ణాటక సంగీతంలోనూ భిన్నమైన రాగాలు విదేశీయులను సైతం ఆకట్టుకున్నాయి.* 


 *జానపద సంగీతంలో ప్రధానంగా రాజస్తానీ, భంగ్రా, హర్యానాబీ, కవ్వాలి, గజల్స్‌, దాండియా, భోజ్‌పురి ఇలా వైవిధ్యమైన సంగీత రీతులున్నాయి. ఇవి ఆయా ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటు న్నాయి.* 


 *తెలుగు ప్రాంతంలో వీణ, డప్పు, డోలు, యక్షగానం, సన్నాయి, మృదంగం, డోలు, వైలన్‌, హర్మోనియం, వేణువు, తంబురా ఇలా అనేకం ఉన్నాయి.* 


 *నే డు ఎలక్ర్టికల్‌ గిటార్‌, పియోనో, జాజ్‌ వంటివి వచ్చాయి. ఇతర ప్రాంతాల్లో షహ్నాయి, సంతూర్‌, వేణువు, వయోలిన్‌, సితార్‌తో పాటు ఆధునికంగా సింఫానీ, సొనాటా, కన్సర్ట్‌, క్యారైట్‌, ర్యాంప్‌, బీటల్స్‌ కూడా సంగీతానికి ఉపకరణాలే* ..


 _సంగీతం ఈ మూడక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో వర్ణించలేనిది. రాగం.. తానం.. పల్లవి ఈ మూడు సంగీత సరస్వతికి ప్రాణాధారాలు, సరిగమపదనిసలే సప్తస్వరాలై సంగీత ప్రపంచానికి మూలాధారాలగా నిలుస్తున్నాయి. కాలాన్ని సైతం మరపించి.. మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి సంగీతానికి మాత్రమే సొంతం అనడంలో అతిశయోక్తి లేదు. ఏ సంగీతానికైనా శాస్త్రీయ సంగీతమే ప్రాణం, మూలం. మనిషిని కదిలించి.. కరిగించే మహత్తర శక్తి సంగీతానిది.  ఆనందం.. ఆవేశం… వినోదం.. విషాదం.. సమయం సందర్భం ఏదైనా దానికి గళమిచ్చేది సంగీతం. బలమిచ్చేది సంగీతం. అందుకే పాట లేని ప్రపంచాన్ని ఊహించలేం. అందుకే ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ సంగీత దినోత్సవాలన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించు కుంటున్నారు._ 


మనదేశంలో సంగీతం రాజుల కాలం నుండి ఉన్నది. అప్పట్లో స్వయంగా కొంతమంది సంగీత విద్వాంసులు కావడంతో సంగీతకళకు ఎనలేని ఆదరణ లభించేది. రాజుల తరువాత సంగీత విద్వాంసులు పెద్ద పెద్ద ఆలయాల్లో కచేరీలు ఇచ్చేవారు. ఇండియాలో శాస్త్రీయ సంగీతానికి మక్కువ ఎక్కువ. దీంతో పాటు పాశ్చాత్య సంగీతాలైన పాప్, రాక్ మరియు వెస్ట్రన్ మ్యూజిక్ లను నేటి యువతరం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సంగీతం ఏదైనా ఇవన్నీ సంగీత ప్రియులను మైమరిపిస్తాయి అనటంలో సందేశం లేదు.


 *సంగీతంలో సరిగమపదనిస.. అనే ఏడు స్వరాలే కీలకం, అక్కడ నుండే అనేక జనక రకాలు, వాటినుండి పుట్టిన అనేక జన్యరాగాలు ఉండనే ఉన్నాయి, ఇలా ఆ ఏడు స్వరాల నుండే సంగీతం అనే కళ గొప్పగా అవతరించి మన ముందుకు వచ్చింది.* 


 _త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలకు, అన్నమయ్య జాజిరి పాటలకు, భక్తరామదాసు భజన సాంప్రదాయానికి, కబీర్‌దాసు రామచరిత్ మానస్‌కు, ముత్తుస్వామి దీక్షితులు నవవర్ణకీర్తనలకు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఆధునిక సంగీత కీర్తనలకు, ఎంఎస్ సుబ్బలక్ష్మీకర్ణాటక సంగీత రాగాలకు ఇంకా అనేకమంది లబ్దప్రతిష్టులైన సంగీత ప్రముఖులకు అంతర్జాతీయ కీర్తిని సంపాదించి పెట్టిన సంగీతంతో వారు కూడా బహుముఖంగా కీర్తింపబడ్డారు._ 


త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షిత్తులు, శ్యామశాస్త్రిలను 

సంగీత త్రిమూర్తులు అంటారు, వీరి రచనలు ఒకరొది ద్రాక్షపాకం, ఇంకొకరిది కదిలీపాకం, మరోకరి నారీకేళపాకంలా ఉంటాయని ప్రతీతి. 


 *భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రపంచ సంగీతానికే తలమానికం.*

సేకరణ - 

ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల్ని, నలుగురిలో ఉన్నప్పుడు నాలుకను అదుపులో ఉంచుకోగలిగితే మన జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంటపడతాయి. నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచుకుంటూ ఉంటే ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది.

చెట్టు సారం పండులో వ్యక్తమైనట్లుగా, మనిషి సారం అతడి మాటలో తొంగి చూస్తూ ఉంటుంది. మంగళకరమైన మాట తీరు మనిషి సంస్కారానికి గీటురాయి.

మనిషికి నిజమైన అలంకారం అతడి మాట తీరే. ‘వాగ్భూషణమొక్కటే మనిషికి సుభూషణం’ అన్నాడు భర్తృహరి. సంభాషణం మిత భాషణం, హిత భాషణం, స్మిత భాషణం, ప్రియ భాషణం, పూర్వ భాషణం, సత్య భాషణం అయినప్పుడు- అంతకన్నా భూషణం మరొకటి లేదు.

‘మితంగా, హితంగా మాట్లాడాలి. మనిషికి గౌరవం తెచ్చేవి ఇవే’ అనేవారు గాంధీజీ. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతూ ఉండాలి. మధుర భాషణం వల్ల మర్యాద లభిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది కదా. ప్రియంగా మాట్లాడాలి. ఎదుటివారిని ముందుగా మనమే పలకరించడం పూర్వ భాషణం. రాముడు స్మిత పూర్వ భాషి- మాట కన్నాముందు ఆయన చిరునవ్వు ఎదుటివారిని పలకరించేది.

సత్యమే సర్వోన్నతమైంది కనుక నిర్భయంగా సత్యాన్ని పలుకు. ఆ సత్యాన్ని ప్రేమగా, నేర్పుగా చెప్పాలి. మర్యాదగా, హుందాగా మాట్లాడాలి.

ఆలోచించకుండా మాట్లాడటం, గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన తరవాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి. ‘తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు’ అన్నారు స్వామి వివేకానంద. ఎవరైతే తమ మాటలవల్ల, చేతల వల్ల ఇతరులకు బాధ కలిగించకుండా ఉంటారో వారే ఉత్తములు.

ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఆదరణపూర్వకంగా చెప్పే మాటలకు ఆచరణ ఎక్కువ. ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. అయితే ఆ మాటలను ఎప్పుడు మొదలుపెట్టాలో, ఎప్పుడు ఆపాలో తెలియడం మరీ గొప్ప కళ. మాటలే మంత్రాలు, చెట్లే ఔషధాలు. మాటలు చాలా పదునైనవి కనుక జాగ్రత్తగా వాడాలి, బలమైనవి కనుక సున్నితంగా వాడాలి, ఖరీదైనవి కనుక పొదుపుగా వాడాలి.

మాట్లాడటం అందరూ చేస్తారు. అయితే అందరిలాగా కేవలం నోటితో మాట్లాడితే సరిపోదు. మరింత ప్రభావాన్వితంగా ఉండాలంటే మనసుతో, శరీరంతో మాట్లాడాలి.

మాటే సంపదలకు, మానవ సంబంధాలకు మూలం. మాటే స్నేహితుల్ని సంపాదించి పెడుతుంది, శత్రువుల్నీ తయారు చేస్తుంది. నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. అలాంటివారికి శత్రువులే ఉండరు. మాటలు గాయపరచగలవు, అదే గాయాన్ని నయం చేయనూగలవు. సరైన మాటతీరు- చంపడానికి వచ్చిన శత్రువు మనసునైనా మార్చగలదు.

మాటల మధ్యలో సందర్భానుసారంగా సామెతలు, లోకోక్తులు వాడితే పాయసంలో జీడిపప్పులా మరింత మధురంగా, వినసొంపుగా అనిపిస్తుంది. సంభాషణ సరస చతురత కలిగి ఉండాలి. తిడుతూనే నవ్వించే హాస్య కుశలత కలిగి ఉండాలి.

ఎవరితో, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. ఈ విషయంలో రామాయణంలో నాయకుడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు, సుందరకాండకు నాయకుడైన సుందరమూర్తి హనుమంతుడు మనకు ఆదర్శం కావాలి.

మనిషికి భావ వ్యక్తీకరణ గొప్ప ఆస్తి. ఏం చెప్పారనేదానికన్నా ఎలా చెప్పారనే దాన్నిబట్టి భావప్రసరణ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. భావవ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత మహత్తరంగా ఉంటుంద


   *నాన్న అనుభవం*    (కథ )  

✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు


 విజయ్  పదవ తరగతి చదువుతున్నాడు. చదువంటే ఆసక్తి ఉండకపోవడంతో … తరగతి గదిలో ఎప్పుడూ ఎవరో  ఒకరితో మాట్లాడతూనే ఉండేవాడు. కానీ పరీక్షలంటే మాత్రం భయం. బడి నుండి వచ్చాక కూడా  హోంవర్క్ లాంటివి చెయ్యకుండా ఆటలకు   వెళ్తుంటాడు.  లేదంటే  ఫోనుతో కాలక్షేపం చేసేవాడు.  


వాళ్ల నాన్న సుందరం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పొద్దున్నే  వెళ్లి రోజంతా ఆటో నడిపి , రాత్రికే ఇంటికి  వస్తాడు. కొడుకు  చదువు గురించి పట్టించుకునే తీరిక ఉండేది కాదు. వాళ్ళమ్మ  చెప్పినా విజయ్ పట్టించుకునేవాడు కాదు. 


తండ్రి వచ్చేసరికి విజయ్ నిద్రపోతూ  కనబడతాడు. ఎప్పుడైనా మధ్యాహ్నం భోజనానికి వస్తే ….   అప్పుడు  విజయ్ బడిలో ఉంటాడు. తెల్లవారు జామునే ఆటో నడిపేందుకు వెళ్తూ …. కొడుకుని చదువుకోమని చెప్పి వేకువనే నిద్ర లేపుతాడు సుందరం.   

“అలాగే” అనేసి అతడు వెళ్ళిపోగానే  ముసుగు తన్నేస్తాడు విజయ్. 


విద్యార్థి జీవితానికి పదో తరగతి విలువైనదని, సమయం వృధా చేయవద్దని చెప్పినా పట్టించుకోని కొడుకు గురించి తల్లిదండ్రులు దిగులు పడుతుండేవారు. విజయ్ కి  చదువు మీద శ్రద్ధ పెరగాలని బడిలో ఉపాధ్యాయుల చేత, వీధిలో మిత్రులతో చెప్పించాడు కానీ విజయ్ లో మార్పు రాలేదు.  


“వేకువనే లేచి చదివితే బాగా గుర్తుంటుంది . పరీక్షలలో  చక్కగా జవాబులు వ్రాయగలవు.  బాగా చదువుకుంటే … మంచి ఉద్యోగం దొరుకుతుంది. నెలయ్యేసరికి జీతం వస్తుంది. జీవితంలో సుఖపడతావు. కాలాన్ని వృధా చెయ్యకు” అని బామ్మ కూడ విజయ్ కి చెబుతుండేది. 

“ నువ్వూరుకో బామ్మా. ఎప్పుడూ విసిగిస్తావు. గతేడాది కరోనా వల్ల  స్నేహితులంతా  పదోతరగతి పాసయ్యారు.   మళ్ళీ కరోనా లాంటి వైరస్ వస్తే నన్నూ  పాసు చేస్తారు” అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు.  


ఒకసారి సుందరం ఆటోలో రచయిత గంగారాం  ప్రయాణించాడు . ఆయనని గుర్తుపట్టిన సుందరం మాటలు కలిపాడు. తన నేపథ్యం చెప్పిన తరువాత విజయ్ గురించి కూడా  చెప్పాడు . వాడిలో మార్పు రావడం లేదని, వాడి భవిష్యత్తు నాశనమవుతుందని భయంగా ఉందని బాధ పడ్డాడు. 


  “రేపు ఉదయం ఒక  బడిలో సమావేశానికి వెళ్తున్నాను. మీ అబ్బాయిని తీసుకుని అక్కడకి రండి” అని అడ్రస్ తదితర వివరాలున్న కాగితాన్ని ఇచ్చాడు గంగారాం. 


 మరుసటి రోజు బడికి సెలవు పెట్టించి మరీ గంగారాం చెప్పిన సమావేశానికి కొడుకుని తీసుకుని వెళ్లాడు  సుందరం.  అప్పటికి సమావేశం ప్రారంభమైంది. పిల్లల నుద్దేశించి గంగారాం మాట్లాడుతున్నాడు. వారితో చదువు ఆవశ్యకతా, భవిష్యత్ అవకాశాలు,  ఉపాధి మార్గాలు వివరించాడు. 


అందుకు ఉదాహరణగా తమ కుటుంబ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. 

తమ  అన్నదమ్ముల్లో పెద్దవాడు తప్ప మిగతా ముగ్గురూ బాగా చదవడం వల్ల మంచి ఉద్యోగాల్లో స్థిరపడినట్టు , కుటుంబ పరిస్థితులు కారణంగా చదువు మీద శ్రధ్ధ పెట్టలేకపోయిన అన్నయ్య మాత్రం  పల్లెటూరులో ఎదుగూ బొదుగూ లేని జీవితం గడుపుతున్నట్టు వివరించాడు. 

తరువాత సుందరాన్ని చూసిన గంగారాం వేదిక మీదకు వాళ్ళను ఆహ్వానించాడు. 


విజయ్ ని తీసుకుని వేదిక మీదకు వెళ్ళాడు సుందరం. వాళ్ళని సభకు పరిచయం చేసాడు గంగారాం.   

సుందరానికి మైకు ఇచ్చి “నిన్న ఆటోలో వెళుతున్నప్పుడు నాతో చెప్పిన మాటల్నే  పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పండి” అన్నాడు.  


సుందరం ‘ నేను పదోతరగతిలో ఉన్నప్పుడు రోజూ మా నాన్న వేకువనే నిద్రలేపి చదవమనేవాడు. కానీ  బద్ధకించేవాణ్ణి.   నాన్నని మోసగించి నిద్రపోయేవాణ్ణి . ఫలితంగా  బొటాబొటి మార్కులతో టెన్తు పాసయ్యాను.   ఇంటర్ ఫెయిలయ్యాను. బ్రతుకు తెరువు కోసం ఆటో నడుపుతున్నాను. మామూలుగా వచ్చే డబ్బు కంటే యాభైశాతం ఎక్కువ వస్తుందని రోజూ వేకువనే   మూడింటికి  లేచి ప్రయాణీకుల కోసం వెళుతున్నాను.  అదనంగా వచ్చే డబ్బుతో  కుటుంబ అవసరాలు తీరుస్తున్నాను.  నాన్న చెప్పినట్టు అప్పుడొక   మూడు నాలుగేళ్ళు వేకువనే లేచి బాగా  చదివుంటే ఉద్యోగం తప్పక దొరికేది. చదివే  రోజుల్లో  బద్ధకించాను కాబట్టి బ్రతికినన్నాళ్ళు వేకువనే ఆటో నడపడం కోసం లేవాల్సి వస్తోంది. చదువుకునే వయసులో అశ్రద్ధ చేసారంటే నాలాగే మీరూ కష్టపడాలి. అందుకే చదువు పట్ల నిర్లక్ష్యం పనికిరాదు” అన్నాడు. 

ఆ మాటలకు అందరూ చప్పట్లు కొట్టి సుందరాన్ని అభినందించారు. సుందరాన్ని హత్తుకుని “ఇంతకంటే మంచి ఉదాహరణ నేను కూడా చెప్పలేను” అన్నాడు గంగారం. 

ప్రక్కనే ఉన్న విజయ్ ఏడ్చుకుంటూ వెళ్లి తండ్రి పాదాల మీద పడి “క్షమించు నాన్నా. బుద్ధొచ్చింది. మీరు చెప్పినట్టే క్షణం వృధా చేయకుండా రేపటి నుండి చదువుతాను” అన్నాడు. 


 సుందరం వినమ్రంగా గంగారాం కు నమస్కరించాడు.  “మీరే మీ కొడుకులో మార్పుకి కారణమయ్యారు” అని విజయ్ భుజం తట్టాడు ఆయన. 

______******_______

No comments:

Post a Comment