337..రుద్రాక్షలు
ఆధ్యాత్మికతతో నిండిపోయుండే భారతీయ హృదయానికీ,
రుద్రాక్షకూ అవినాభావ సంబంధం ఉంది. శివుని అక్షుల నుంచి జాలువారిన నీటి
బిందువులు భూమి మీదకు జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారి వాటికి కాసిన
కాయలను రుద్రాక్షలు అంటారు.
ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు..
అందరూ వీటిని ధరించారని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ గురువులు,
స్వామిజీలు, బ్రాహ్మణులూ, పూజారులు, దైవజ్ఞులు.. వంటి వారు వీటిని ధరిస్తూ
ఉంటారు. అంతేకాదు పూజా గదులలో కూడా వీటిని పెట్టి పూజిస్తూ ఉన్నారు.
రుద్రాక్షలు
అత్యంత శక్తివంతమైనవనీ, వీటిని ధరిస్తే ఎటువంటి చెడు ప్రభావం తమపై పడదు.
చాలా అరుదుగా లభించే రుద్రాక్షలంటే ఎవరైనా ఆరాటపడుతూనే ఉంటారు. వైవాహిక
జీవితంలో ఒడిదుడుకులు పడుతున్నవారు, వ్యాపారపరంగా కలసిరానివాళ్ళు, అనారోగ్య
సమస్యలతో బాధపడే వారే కాక అద్భుత భవిష్యత్తును ఆశించేవారు కూడా ముందు
చూపుగా ఈ రుద్రాక్షలను ధరిస్తుంటారు.
భక్తులను అనుగ్రహించేందుకు
రుద్రాక్షలు స్థావరాలుగా అవతరించాయి. వీటిని ధరించిన భక్తులు ఏ రోజు చేసిన
పాపాలు ఆ రోజే నశిస్తాయని.. రుద్రాక్షలను దర్శించడం వల్ల లక్ష జన్మల
పుణ్యం, ధరించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని 'జాబాలోపనిషత్'
చెబుతోంది. రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయని.. సకల సంపదలూ
ఒనగూడుతాయని స్కాంద పురాణం చెబుతోంది.
రుద్రాక్షకు ఆ నామం ఎలా వచ్చింది?
రుద్రుడు
అంటే శివుడు, రాక్షసులతో పోరాడి, 3 పురములను భస్మం చేసినప్పుడు మరణించిన
వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినపుడు జాలువారిన కన్నీరు భూమిపై
పడి చెట్లుగా మారాయి. వాటి నుంచి జన్మించినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అనగా
రుద్రుడి కళ్ళు, కన్నీళ్ళు అని అర్ధం. శ్రీశైల క్షేత్ర తూర్పు ద్వారమైన
త్రిపురాంతక క్షేత్రంలో పరమశివుడు త్రిపురాసురులను సంహరించడంతో త్రిపురాంతక
క్షేత్రమే రుద్రాక్షల జన్మస్థలమని కూడా చెబుతారు.
ఇక రుద్రాక్షలు
ఎంత చిన్నవైతే అంత శక్తివంతమైనవని తంత్ర శాస్త్రం చెబుతోంది. అంటే ఉసిరిక
కాయంత పరిమాణమున్నవి ఉత్తమమైనవిగా, రేగుపండంత పరిమాణమున్నవి మధ్యమ జాతికి
చెందినవిగా, శనగ గింజ పరిమాణం ఉన్నవి అధమమైనవిగా చెప్పబడుతున్నాయి. కాబట్టి
రుద్రాక్షలను ధరించే సమయంలో వాటి పరిమాణం కూడా ముఖ్యమే.
రుద్రాక్షలు
రకరకాల పరిమాణాల్లో ఉన్నట్లే రకరకలైన రంగుల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా
తెలుపు, తేనె, నలుపు రంగులతోపాటు మిశ్రమ రంగుల్లో ఇవి లభ్యమవుతాయి.
సాధారణంగా తేనె రంగులోని రుద్రాక్షలు ఎక్కువగా లభిస్తాయి.
రుద్రాక్షలలో
వివిధ ముఖాలు కలిగినవి లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే
రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నప్పటికీ, పండితులు మాత్రం 21
ముఖాలు వున్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మొత్తం మీద
పరిశీలిస్తే 14 ముఖాలున్న రుద్రాక్షలు మత్రమే ప్రస్తుతం లభ్యమవుతున్నాయి.
ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది.
వాటి వివరాలు, ఉపయోగాలు ఏంటో చూద్దాం
1. ఏకముఖి రుద్రాక్ష
ఏకముఖి
రుద్రాక్ష శివుని ప్రతిరూపం. శివుని త్రినేత్రముగా, ఓంకార రూపంగా
నమ్ముతారు. ఇది ధరించిన వ్యక్తికి వ్యక్తి వికాసం, జ్ఞాన సమృద్ధి, సంపద
చేకూరతాయి.
2. ద్విముఖి
ద్విముఖి రుద్రాక్ష అర్ధనారీస్వర తత్వానికి సంకేతం. శివపార్వతి రూపంగా నమ్ముతారు. దీనిని ధరించడం వలన కుండలినీ శక్తి పెరుగుతుంది.
3. త్రిముఖి
త్రిముఖి రుద్రాక్షను త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. ఇది అగ్నికి సంకేతం. ఆరోగ్యానికీ, అభ్యుదయానికీ ఉపకరిస్తుంది.
4. చతుర్ముఖి
చతుర్ముఖి
రుద్రాక్ష నాలుగు వేదాల స్వరూపం. ఇది బ్రహ్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
పాలలో వేసి తాగితే మానసిక వ్యాధులు దూరమవుతాయి. విద్యార్ధులకు మరింతా
ఉపయోగం.
5. పంచముఖి
పంచముఖి రుద్రాక్ష పంచభూత స్వరూపం. గుండె
జబ్బులు ఉన్నవారికి ఇది మంచిది. ఇది పాము కాటునుంచి రక్షణ కలుగుతుంది.
అంతేకాదు శతృవులను సులభంగా జయించవచ్చు.
6. షణ్ముఖి
షణ్ముఖి రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక. రక్తపోటు, హిస్టీరియా వంటి వ్యాధులు దూరమవుతాయి.
7. సప్తముఖి
సప్తముఖి రుద్రాక్ష కామధేనువుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని విశ్వాసం.
8. అష్టముఖి
అష్టముఖి రుద్రాక్ష వినాయకుడికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుంది.
9. నవముఖి
నవముఖి రుద్రాక్ష నవగ్రహ స్వరూపము. ఇది భైరవునికి ప్రతీక. దీనిని ఎడమ చేతికి ధరించాలి. దుర్గ ఆరాధకులకు మంచిది.
10. దశముఖి
దశముఖి
రుద్రాక్ష దశావతార స్వరూపము. ఇది జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగము
చేసినంత ఫలితము కలుగుతుంది. దీనిని మహిళలు ఎక్కువగా ధరిస్తారు.
11. ఏకాదశముఖి
ఏకాదశముఖి రుద్రాక్ష 11 ముఖాలు. రుద్రుని 11 రూపాలకు ప్రతీక. దుష్ట శక్తుల న…
👌🏼👌🏼👌🏼
338.. శ్రీకృష్ణుడు అష్ట భార్యల పేర్లు మరియు పెళ్లి చేసుకోవడానికి కారణాలు
01. రుక్మిణి:-
విదర్భరాజు
భీష్మకుని కూతురు రుక్మిణీదేవి సందేశాన్ని అందకొని స్వయంవర సమయంలో
ఎత్తుకొచ్చి వివాహం చేసుకొన్నాడు అన్యాయంగా, బలవంతంగా లాక్కువెళ్ళి పెళ్ళి
చేసుకొన్నాడని శిశుపాలుడు ఆరోపించాడు ప్రేమవివాహం.
02. సత్యభామ:-
సత్రాజిత్తు
కూతురు కృష్ణుణ్ణి అపనిందలకి గురిచేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన
కూతుర్నిచ్చి పెళ్ళిచేస్తాడు ఈమె భూదేవి అవతారం. గోదాదేవి సత్యభామ అవతారం
అని అంటారు.
03. జాంబవతి:-
సాధారణంగా రుక్మిణి తర్వాత సత్యభామని
గౌరవిస్తున్నాం జాంబవంతుడికి అడవిలో ఒక పాప దొరికితే తెచ్చుకొని
పెంచుకున్నాడు ఆమె పేరే జాంబవతి జాంబవంతుడిని 28 రోజుల యుధ్ధంలో ఓడించి,
జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు వీణా విద్వాంసురాలు.
04. మిత్రవింద:-
కృష్ణుడికి
ఐదుగురు మేనత్తలు వాళ్ళపేర్లు పృథ (కుంతి), శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ,
రాజాథిదేవి పృథని శూరసేనుని దగ్గరచుట్టం కుంతిభోజుడు దత్తత చేసుకోవడం వలన
కుంతి అని పిలువబడింది పాండవుల తల్లి శృతదేవ కరూశదేశపురాజు వృద్ధశర్ముని
భార్య దంతవక్త్ర, విదూరథుల తల్లి శృతకీర్తి (శృతసేన) కేకయరాజు భార్య ఈవిడకి
సంతర్థనుడూ మొదలైన కొడుకులూ, భద్ర అనే కూతురూ ఉన్నారు. ఈమె ఇంకో కొడుకే
ఏకలవ్యుడు. ఎందుచేతనో నిషాథరాజు హిరణ్యధన్వుడి దగ్గర పెరుగుతాడు ద్రోణుడికి
కుడిచేతి బొటనవేలు గురుదక్షిణగా ఇస్తాడు తర్వాత జరాసంథుడి తరఫున
కృష్ణుడితో యుద్ధంచేసి ఆయనచేతిలో మరణిస్తాడు శృతశ్రవ చేదిదేశపురాజు
దమఘోషుడి భార్య శిశుపాలుని తల్లి.
ఈ శిశుపాలుడు, దంతవక్త్రులే ఒకప్పుడు
వైకుంఠంలో కాపలాభటులైన జయవిజయులు సనకసనందుల
(సనక,సనంద,సనత్కుమార,సనత్సుజాతులు) శాపంవల్ల మొదటిజన్మలో హిరణ్యాక్ష
హిరణ్యకశిపులుగా,రెండవజన్మలో రావణ కుంభకర్ణులుగా, ఆఖరిజన్మలో శిశుపాల
దంతవక్త్రులుగా పుడతారు రాజాథిదేవి అవంతీదేశపు రాజు జయశేనుడి భార్య ఈవిడ
కొడుకులు విందానువిందులు, కూతురు మిత్రవింద విందానువిందులు మహాభారత
యుద్ధంలో కౌరవుల తరఫున పోరాడతారు వీళ్ళ చెల్లెలు మిత్రవింద అన్నల కోరికకి
వ్యతిరేకంగా స్వయంవరంలో కృష్ణుని వరించి పెళ్ళిచేసుకుంటుంది ఆమె కోరిక
మేరకే బహిరంగంగా స్వయం వరానికొచ్చి అందులోనే ఇతర రాజకుమారులందరినీ ఓడించి
చేపట్టాడు పై విషయాలబట్టి తెలుస్తున్నదేమిటంటే, పాండవులు తప్ప, మిగతా
మేనత్తల కొడుకులంతా కృష్ణుని శత్రువులే.
05. భద్ర:-
మేనత్త కేకయ
దేశపు రాజు భార్య అయిన శృతకీర్తి కుమార్తె ఈమె సలక్షణ సమన్విత జాత్రత్త గల
నడవడిక కలది కృష్ణుడికి మేనమరదలి వరుస శ్రీకృష్ణఉనికి ఇద్దరు భార్యలు
మేరికం పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.
06. నాగ్నజిత్తి:-
అసలుపేరు
సత్య. కోసలరాజు నగ్నజిత్తు కుమార్తె నగ్నజిత్తు కృష్ణుడు ఏడు రూపాలను
ధరించి ఏడు ఎద్దులను ఒక్కొక్క గుద్దు గుద్ది లొంగదీసుకుని వాటిని తాళ్ళతో
బంధించి పెళ్ళి చేసుకున్నాడు నాగ్నజితి కోసల దేశాధిపతియైన నాగ్నజిత్తు
కుమార్తె ఈ రాజు నగరంలోని ఏడు వృషభములు ప్రజలకు అపాయము చేయుచున్నవి
రాజ్యంలో ఎవ్వరును వీటిని పట్టలేకపోతారు రాజు వీటిని పట్టగలవానిని తన
కూతురు నిచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని
కౌసల్యకు వెళ్ళి ఆ వృషభాలను వధించి నాగ్నజితిని పరిణయమాడెను.
07. కాళింది:-
సూర్యుని
కుమార్తె. విష్ణువుని భర్తగా కోరి తపస్సుచేస్తే ఈ అవతారంలో ఆమె కోరిక
తీర్చాడు కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయటానికి వెళితే ఆవిడ
కామవాంచతో కృష్ణున్ని చూచిచినప్పుడు, అర్జునుడు ఆమె వివరగాలు అడిగి ఆమె
మనోగతాభిప్రాయం కృష్ణునికి చెప్పి ఇద్దరికి సంధానం చేశాడు గోపాలు ఆమె
భక్తికి మెచ్చి ద్వారకకు తీసుకెళ్ళి పెద్దలందరి ముందు పెళ్ళాడాడు.
08. లక్షణ:-
మద్రదేశ
రాకుమారి బ్రుహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ ఆమె శ్రీకృష్ణుని గుణగణాలు,
మాయలు, రూపురేఖలు, సామర్థ్యం, నారదుని వల్ల విని అతనినే పెండ్లాడ గోరింది
దాంతో ఆమె తండ్రి ఏర్పాటు చేసిన స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదించి
పెళ్ళాడతాడు స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టి లక్షణను చేపట్టాడ
339..ఇదే లోకం (3)
ప్రపంచంలోకి
మనుషులు వివిధ రకాల జంతువులు వచ్చాక చివరగా మనిషి రంగప్రవేశం చేశాడనేది
కొంతమంది చెబుతుంటారు. ఇది నిజం అనుకొంటే- పశువులకు మనిషికి తేడా
కొట్టవచ్చినట్టు కనబడుతుంది. పశువు తిండి, నిద్ర, మైధునం ఇట్లాంటి
నిత్యకృత్యాలు ప్రకృతిని అనుసరించి చేస్తూ ఉంటాయి.
సూర్యోదయం
కాబోతుండగానే క్రిమి కీటకాదులతో సహా జంతువులన్నీ మేల్కొంటాయి. మనిషి మాత్రం
మేల్కొనాలన్న సిద్ధాంతాన్ని ఏమీ పెట్టుకోలేదు. మిగతా విషయాలు కూడా
జంతువుకు, మనిషికీ తేడా కనిపిస్తుంది. జంతువు ఆకలి వేసినప్పుడు తింటే మనిషి
మాత్రం తినడం కోసమే కష్టపడి సంపాదిస్తాడు. కేవలం తన కడుపు నిండితే చాలు
అనుకోడు. తాను తినడమే కాక తనవారికోసం తరతరాలకు తరగని ఆస్తులను
కూడగట్టుతాడు. కనుక మనిషికి తిండి విషయంలోనే జంతువుకు పోలిక సరిపడదు.
అట్లాంటి
మనిషి కనుకనే మానవత్వం గురించి వేరుగా చెప్పాల్సి వస్తోంది. మొదట్లో అంటే
జ్ఞానం కావాల్సినంత సముపార్జించనపుడు మనిషి కూడా పశువులాగే పనులు
చేస్తుంటాడు. ఇతరుల కష్టనష్టాలను అంచనా వేయగలడు. తనకు కావాల్సిన దానిని
పట్టుపట్టి తీసేసుకుంటాడు.
మృగం లా ప్రవర్తిస్తున్నాడు అంటుంటారు కదా.
దీనివల్లనే. మనిషి ఎప్పుడైతే తాను వేరు శరీరం వేరు అన్న జ్ఞానాన్ని
ఆర్జిస్తాడో అపుడు తనను తాను అదుపులో పెట్టుకుంటాడు. తన కోరికలను కూడా
అదుపులో పెట్టుకుంటాడు.
ఏది చేయవచ్చు. ఏది చేయకూడదు అన్న ఆలోచనలను
కలిగి ఉంటాడు. అపుడు మానవత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం ఉండదు.
ఎప్పుడైతే శరీరం వేరు. ఈ శరీరం నశించేది. కేవలం మరుజన్మకు పుణ్యపాపాలే తోడు
ఉంటాయి అన్న కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాడో అపుడే పాపభీతి మొదలవుతుంది.
అపుడు ఇతరులకు కలిగే కష్టాన్ని నష్టాన్ని గురించి తెలుసుకొంటాడు. అపుడు
అతడిలో మానవత్వపు ఛాయ పొడచూపుతుంది.
మనిషి తాను ఎవరు అన్న
జ్ఞానాన్ని ముందు సంపాదించడం మొదలు పెట్టాలి. ఈ సంపాదన కోసం ఆధ్యాత్మిక
మార్గంలో వెళ్లితే దైవం లేకపోతే చైతన్యం ఏదో ఒకటి మాత్రమే మనిషిని
నడిపిస్తుంది అన్న సత్యాన్ని సులభంగా తెలుసుకొంటాడు.అపుడు అతనిలోని మృగత్వ
లక్షణాలు తొలుగుతాయి. మానవత్వం మొగ్గతొడుగుతుంది.
ప్రతి మనిషి తాను
ఎవరో తెలుసుకొంటే - నేను అనే దానికి సమాధానం దొరకబుచ్చుకుంటే ఎవరూ ఎవరినీ
బాధించరు. ఎవరూ ఎవరినీ కష్టపెట్టరు. అపుడు సులభంగా సర్వులూ సంతోషంగా
ఉండవచ్చు.
--(()))--
340..*దశావతారాల అంతరార్థము*
*1. మత్స్యావతారం - చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో, అదేవిధంగా జీవితంలో 'ప్రతికూల పరిస్థితుల్లో'నూ సంసారాన్ని ఈదాలి.*
*2. కూర్మావతారం - తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో, అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి 'ధ్యానం' చేయాలి.*
*3. వరాహావతారం - వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో, అలాగే 'ఇంటి బాధ్యత'లను మొయ్యాలి.*
*4. నరసింహావతారం - మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెందడాలి.*
*5. వామనావతారం - మొదటి అడుగు భౌతికంగానూ, రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ; మరి మూడవ అడుగును మనలోని 'అహంకారాన్ని' గుర్తించి 'బలి' ఇవ్వాలి.*
*6. పరశురామావతారం - 'లక్ష్యం' కోసం పట్టుదలతో ముందుకెళ్లాలి.*
*7. రామావతారం - 'ధర్మ'యుతంగా జీవించాలి.*
*8. కృష్ణావతారం - ఎన్ని కష్టాలు ఎదురైనా 'ఆనందం'గా ఉండాలి.*
*9. బుద్ధావతారం - 'జ్ఞానాన్ని' పంచాలి.*
*10. కల్కి అవతారం - సకల మానవాళి 'అజ్ఞానాన్ని తీసివేయాలి'.*
--(())--
No comments:
Post a Comment