☘️🍁ప్రాంజలి ప్రభ.. 004..9-9-24
ప్రశ్నలు - సమాధానాలు 🍁☘️
1) సాలోక్య, సామీప్య, సాయుజ్య ముక్తులు.. అంటే ఎట్టివారు? భేదాలేమిటి?
జవాబు : పై మూడింటితో పాటు 'సారూప్య' అనే ముక్తి కూడా ఉన్నది. సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్య.... అని ముక్తి భేదాలు. తాను ఉపాసించే దేవతను నిరంతరం ధ్యానించడం చేత ఆ దేవతా రూపాన్ని (దివ్యమంగళ దేహాన్ని) ధరించడం
సారూప్యముక్తి. వైకుంఠంలో విష్ణువువంటి రూపాలు, మణిద్వీపంలో అమ్మ వంటి
రూపాలు, కైలాసంలో శివుని వంటి రూపాలు.. ఇవి సారూప్యముక్తులు. నిరంతరం భగవల్లోక భావన (భగవంతుడే లోకంగా ఉండడం చేత ఆ దేవతాలోకంలో నివసించడం 'సాలోక్యం’. ఆ లోకంలో కూడా దేవతకి సమీపంలో ఉండగలిగే భాగ్యం
'సామీప్యం'. చివరకు మరి దేవతకు భిన్నము కాకుండా పూర్తిగా తన జీవభావం
దేవతలో విలీనం కావడం సాయుజ్యం. ఇది అద్వైతంలో చెప్పబడుతుంది. తాదాత్మ్య
ఉపాసన, అభిన్న భావన వలన లభించే ముక్తి ఇది. వారి వారి ఉపాసన స్థాయిని
బట్టి ఈ ముక్తులు అనుగ్రహించబడతాయి. ఇంకా - ఈశ్వరుని శక్తులవంటి శక్తులను
పొందే 'సాక్షి' అనే ముక్తిని కూడా కొన్ని గ్రంథాలు చెప్పాయి.
2) 'ఏకం సత్ విప్రా బహుధాభవన్తి' అనే ప్రసిద్ధిచెందిన వాక్యం ఏ గ్రంథంలోనిది?
సందర్భం ఏమిటి?
జవాబు : ఇది ఋగ్వేదం లోని మహాసౌరపారంలోని 20 వ ఋక్కు పూర్తిపాఠం:ఇంద్రం మిత్రం వరుణ మగ్ని మాహురథో దివ్యస్ససుపర్లో గరుత్మాన్
ఏకం సత్ విప్రాబహుధావదన్యగ్నింయమం మాతరిశ్వాన మాహుః
ఉన్నది ఒక్కటే. అది శాశ్వతమైన ఉనికియైన పరమాత్మ. విశేష ప్రజ్ఞ గలిగినవారు
దానిని బహువిధాలుగా చెప్తారు. (సృష్టి నిర్వహణలో ఆ పరమేశ్వరుడు ప్రకటించే
వివిధశక్తులననుసరించి) - ఆతడే ఇంద్ర, మిత్ర, వరుణ, అగ్ని, సుపర్ణ, గరుత్మాన్,
యమ, వాయు... మొదలైనదేవతలుగా జ్ఞానులచే చెప్పబడుతున్నాడు.
బహుదేవతలు ఏకేశ్వరునియొక్క విభిన్న అభివ్యక్తులేనని దీని భావం.
3) ఈ మధ్య ఒక కృష్ణభక్త బృందంవారు ఆదిశంకరుడు 'మాయావాది', వీరు భక్తికి
వ్యతిరేకి - అంటూ ప్రచారాలు చేశారు. ఇది ఆమోదయోగ్యమేనా?
జవాబు : 'మాయ', 'అద్వైతం' అనేపదాలు ఆదిశంకరులు తయారు చేయలేదు. 'ఇంద్రో
మాయాభిః పురురూప ఈయతే' - లాంటి వేద మంత్రాలున్నాయి. అంతెందుకు ఆ
కృష్ణభక్త బృందంవారు ప్రమాణంగా భావించే భగవద్గీతలోనే “దైవీ హ్యేషా గుణమయీ
మమమాయా దురత్యయా॥ మామేవ యే ప్రపద్యన్తో మాయామేతాం తరన్తితే- అని
సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మయే బోధించాడు.
అంటే శ్రీకృష్ణుడే 'మాయావాది' అని అంగీకరించాలి.శంకరులు సూటిగా స్పష్టంగా చెప్పినప్పటికీ సరిగ్గా గ్రహించలేని వారు వారి
సిద్ధాంతాన్ని తిరస్కరిస్తారు. కానీ సూక్ష్మదృష్టితో గ్రహించిన విజ్ఞులు విశ్వజనీనమైన వారి తాత్త్వికతను ప్రశంసించి శిరసా వహించారు.
శంకరులు భక్తికి ఎన్నడూ వ్యతిరేకికారు. అయితే - వారిది జ్ఞానభక్తి. 'ఈశ్వరునికి
భిన్నంగా ఏదీలేదు' అనే ఉపనిషత్తత్త్వమే వారి సిద్ధాంతం. భిన్నత్వాన్ని చూసే ద్వైత
భ్రాంతిని విడచి-ఏకమైన ఈశ్వరునితో అభిన్నతను పొందడంకంటే భక్తి
ఏముంటుంది? సాధనలుగా అన్నిరకాల భక్తి సంప్రదాయాలను శంకరులు అంగీ
కరించారు కనుకనే 'భజగోవిందం' 'గోవిందం పరమానందం’ ‘హరిమీడే స్తవం’
‘విష్ణుషట్పదీస్తోత్రం', 'లక్ష్మీనృసింహకరావలంబ స్తోత్రం', 'శివానందలహరి',
'సౌందర్యలహరి' లాంటి భక్తి భరిత స్తోత్రవాఙ్మయాన్ని అందించారు.
No comments:
Post a Comment