Wednesday, 9 June 2021

 🕉️  : వైశాఖ పురాణం 29వ అధ్యాయము


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత ||


🌻 శునీ మోక్షప్రాప్తి 🌻

💫🌹నారదుడు అంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నిట్లు పలికెను.

💫🌹మహారాజా! అన్ని తిధులలో వైశాఖమాసమున శ్లుక్లపక్షమున వచ్చు ద్వాదశీ తిధి సర్వపాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశినాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగువానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతఃకాల స్నానము చేసినచో గ్రహణకాలమున గంగాతీరమున వేయిగోవుల నిచ్చిన పుణ్యము వచ్చును.

💫🌹ఈనాడు చేసిన అన్నదానము విశిష్టఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జలకలశమును దధ్యన్నమును యిచ్చిన వచ్చు ఫలము మాటలకందనిది. అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము.

💫🌹ఈనాడు సాలగ్రామదానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో నభిషేకించుట, పానకము నిచ్చుట, దోసపండ్ల రసమును, చెరకుగడను, మామిడిపండును, ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము. సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు కథను వినుము.

💫🌹పూర్వము కాశ్మీరదేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలినియను అందమైన కుమార్తె కలదు. అతడామెను సత్యశీలుడను వానికిచ్చి వివాహము చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలినిని తన దేశమునకు గొనిపోయెను. అతడు మంచివాడే అయినను ఆమెయనిన పడదు. ఆమెకును అతడన్న పడదు. ఈ విధముగ వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను.

💫🌹మాలిని భర్తను వశీకరణ చేసికొను ఉపాయములను చెప్పుడని భర్తృపరిత్యక్తలగు స్త్రీలను అడిగెను. వారును మేము మా భర్తలకు చేసినదానిని చెప్పినట్లు చేయుము. మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు-మాకులను వశీకరణకై యిచ్చుయోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనము నిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయుమని అడిగెను. యోగినికి ధనమును తన చేతి యుంగరమునిచ్చెను.

💫🌹యోగినియు నామొకొక మంత్రము నుపదేశించెను. అన్ని ప్రాణులును స్వాధీనమయ్యెడి చూర్ణము నిచ్చుచున్నాను. దీనిని నీ భర్తచే తినిపింపుము. ఈ యంత్రమును నీవు ధరింపుము. ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమునిచ్చెను. మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తచే తినిపించెను.

💫🌹యంత్రమును తానుకట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధికలిగెను. మరికొన్ని దినములకు యేమియును అనలేనివాడు చేయలేనివాడును అయ్యెను. దురాచారురాలూగు ఆమె భర్తమరణించినచో తాను అలంకారములను విడువవలసి వచ్చునని బాధపడెను. మరల యోగి వద్దకు పోయెను. ఆమె యిచ్చినదానిని భర్తచే తినిపించెను. వాని యారోగ్యము బాగుపడెను.

💫🌹కాని ఆమె స్వేచ్చగా చరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే నామెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమును చేరి పెక్కు చిత్రవిచిత్రములగు హింసలననుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపముననున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీరదేశమున పద్మబంధువను బ్రాహ్మణుని యింట పనిచేయు దాసి గృహమందు కుక్కగానుండెను. ఇట్లు ముప్పది సంవత్సరములు గడచినవి.

💫🌹ఒకప్పుడు వైశాఖమాసమున ద్వాదశినాడు పద్మబంధువు కుమారుడు నదీస్నానము చేసి తిరిగి వచ్చి తులసి యరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో బాటు వచ్చిన కుక్క తులసి యరుగు క్రింద పండుకొనియున్నది. బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు అరుగుపైనుండి జారి క్రిండపడుకొన్న కుక్కపై పడెను.

💫🌹ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతికల్గెను. తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తపము కలిగెను. తాను చేసిన దోషములను అన్నిటిని చెప్పి విప్రోత్తమా! దీనురాలైన నాపై దయయుంచి వైశాఖ శుద్ద ద్వాదశినాడు చేసిన పుణ్యకార్యములను, పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపుమని బహువిధములుగ వేడుకొనెను.

💫🌹కుక్క మాటలాడుటయేమని యాశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని, తాను ద్వాదశినాడు చేసిన ప్రాతఃకాల నదీస్నానము పూజ, కథశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకార్యముల పుణ్యఫలము నిచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున నున్న మాలిని మరల పెక్కు విధములుగ దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడంగీకరింపలేదు.

💫🌹అప్పుడాకుక్క మిక్కిలి దీనముగా దయాశాలీ! పద్మబంధూ! నన్ను దయజూడుము గృహస్థు తను పోషింపదగినవారిని రక్షించుట ధర్మము. నీచులు, కాకులు, కుక్కలు ఆ యింటిలోని బలులను ఉచ్చిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింప…
[7:59 pm, 08/06/2021] +91 94414 08564: 🙏 శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్మ్యం –5 🙏

🌻 నీలుడి కధ 🌻


🍃🥀రావణ వధ తర్వాత ,లంకా రాజ్యానికి విభీషనుడికి పట్టాభిషేకం చేయించాడు. తమ్ముడు లక్ష్మణునితో శ్రీ రాముడు. అతడు ధర్మ బద్ధంగా రాజ్య పాలన చేస్త్రున్నాడు. విభీషణుడి కొడుకు పేరు నీలుడు.ఇతడు గుణము,బలము విద్యలలో మేటి. ఒక సారి నీలుడు ,తండ్రి విభీషణుడి దగ్గరకు చేరి ,నమస్కరించి ఇలా అన్నాడు”తండ్రీ !మీ పరిపాలనలో ప్రజలంతా సుఖ ,సంతోషాలతో వర్ధిల్లుతున్నారు.

🍃🥀వారికేమీ లోటు లేదు మనకు ధనం సంపదలకు కొదవ కూడా లేదు. అయినా మన రాజ్యమైన లంకలో ”చింతామణి ,కామధేనువు ,కల్పవృక్షం ”లేని లోటు బాగా కన్పిస్తోంది నాకు. మీరు, శ్రీ రాముని పద సన్నిధిని చేరి ,లంక సామ్రాజ్యాన్ని దక్కించుకొన్నా ,వీటిపై మీకు ద్రుష్టి లేదు. వాటిని మీరు ఎందుకు పొందలేక పోయారు?నాకు అనుజ్న ఇస్తే వాటిని సాధించి ,తీసుకొని వచ్చి ,మన లంకలో ఉంచు  తాను”అన్నాడు వినయంగా....

🍃🥀నీలుని మాటలను విన్న తండ్రి విభీషణుడు ”కుమారా,నీలా !నేను శ్రీ రామచంద్ర పాదాబ్జ మకరందాన్ని గ్రోలే తుమ్మెదను .ఆ రామ ప్రభు దివ్యాను గ్రహం వల్ల అన్ని సుఖాలు ,ఆనందాలు ,భోగ ,భాగ్యాలు అనుభవిస్తున్నాను. బ్రహ్మానంద రసాను భూతిని అనుభవిస్తున్నాను. దేవతలకు కూడా సాధ్యం కాని దీర్ఘాయుస్సు ,సామ్రాజ్యము నాకు శ్రీ రామకృప వల్ల లభించాయి.

🍃🥀శ్రీ రాముడే నా చింతామణి ,కామ ధేనువు ,కల్ప వృక్షం .అంత కంటే వేరే ఏమీ నాకు అక్కర లేదు. రాముని కరుణ వల్ల ,ఇంద్రాది అష్ట దిక్పాలకులు ,నా వశంలోనే వున్నారు. కనుక నాకు నువ్వు చెప్పిన ఆ మూడిటి అవసరం లేక పోయింది .అవి లంకలో లేవనే చింత వదిలెయ్యి .శ్రీ రామ పద భక్తితో ధన్యుడవు అయే ప్రయత్నం చెయ్యి ”అని అనునయంగా చెప్పాడు.

🍃🥀తండ్రి మాటలు ,నీలుడికి రుచించ లేదు .కీర్తి కాంక్షతో తహ తహ లాడి పోతున్నాడు. మళ్ళీ తండ్రి తో వాటి అవసరాన్ని తెలియ జేశాడు. చివరికి విభీషణుడు మెత్త బడి ”నీ కోరికను కాదన లేక పోతున్నాను. వాటిని సాధించి ఇక్కడికి తీసుకొని రావటానికి గురువు అనుజ్న చాలా ముఖ్యం.ముందుగా మన కుల గురువు శుక్రాచార్యుల వారి శుశ్రూష చేసి ,అనుగ్రహం సంపాదించి ,అప్పుడు ,ఆయన అనుమతితో ప్రయత్నం చెయ్యి ”అని సలహా ఇచ్చి ,ఆశీర్వదించి నీలుడిని పంపాడు.

🍃🥀తండ్రి అనుమతితో సగం కార్యం తీరింది అని సంతోషించిన నీలుడు గురువు శుక్రాచార్యుల వారిని ,చేరి పూజించి ,నమస్కరించి ,చేతులు జోడించి ”గురుదేవా !మా తండ్రి విభీషణ మహారాజు ఆనతితో మిమ్మల్ని ఆశ్రయించటానికి వచ్చాను.నాకు చింతామణి ,కల్ప వృక్షం,కామధేనువులను సాధించి ,లంకలో వాటిని ఉంచాలి అన్న కోరిక కలిగింది.దీనికి మీ అనుగ్రహం కావాలి.ప్రసాదించండి ‘అని వేడు కొన్నాడు.

🍃🥀నీలుని భక్తీ తత్పరత,వినయం ఆచార్యులకునచ్చి ” కుమారా !ఈ రోజూ మృగశిరా నక్షత్రం.ఈ నక్షత్ర కాలంలో కొత్త మంత్రోపదేశానికి మంచిది. దాన్ని జపిస్తే నీ కోరిక శీఘ్రంగా ఫలిస్తుంది.శ్రీ హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను.శ్రద్ధతో జపించి నీ కోర్కెను సాధించుకో ”అని చెప్పి ,వెంటనే ”పంచ ముఖ ఆంజనేయ మంత్రం ”ఉపదేశించాడు. జగన్నాధ క్షేత్రం చేరి ,దీక్షతో ,ఆ మంత్రాన్ని ,త్రికరణ  శుద్ధి గా, జపించమని చెప్పాడు శుక్రా చార్య గురు వరేన్యుడు .

🍃🥀పంచముఖ ఆంజ నేయుడు ఎలా ఉంటాడో కూడా వర్ణించి చెప్పాడు. ”పంచ వక్త్రం ,మహాభీమం ,కపి యూద సమన్వితం బహుభిర్దశ భిర్యుక్తం ,సర్వ కామార్ధ సిద్ధిదం
పూర్వంతు ,వానర వక్త్రం ,కోటి సూర్య సమ ప్రభం-దంస్త్రా కరాల వదనం భ్రుకుటీ కుటి లేక్షణం . ”
”అస్త్వైవ దక్షిణ వక్త్రం ,నారసింహం ,మహాద్భుతం –అత్యుగ్ర తేజో వపుషం ,భీషణం ,భయ నాశనం ”
”పశ్చిమే ,గారుడ వక్త్రం ,వక్ర తుండం ,మహాబలం –సర్వ నాగ ప్రశమనం ,సర్వ భూతాది కృంతనం”
”ఉత్తరే సూకర వక్త్రం ,కృష్ణ దీప్త నభో మయం -పాతాలే సిద్ధ భేతాళ ,జ్వర రోగాది కృంతనం ”
ఊర్ధ్వం హయాననం ,ఘోరం ,దాన వాన్తకరం ,పరం -యేన వక్త్రేనా విప్రేంద్ర తాట కాయా ,మహా హవె ”
దీని భావం తెలుసుకొందాం .

🍃🥀పంచముఖ ఆంజ నేయుడు సర్వ సిద్ధి ప్రదాత .తూర్పు ముఖం’ వానర ముఖం” .కోటి సూర్యుల కాంతితో ,భీకరమైన కోరలతో ,భ్రుకుటి ముడిచి కని పిస్తుంది .దక్షిణ ముఖం ‘నార సింహ ముఖం ”మహాద్భుతంగా ,మృత్యువును తెచ్చే ఉగ్ర రూపం గా ,తేజో వంతంగావుంటుంది. భయ నాశనం చేస్తుంది. పశ్చిమ ముఖం ”గరుడిని ముఖం ”దీనికి వక్ర తుండం వుంటుంది. సర్పాల విషాన్ని నాశనం చేస్తుంది. సర్వ భూతాలను అదుపు లో ఉంచుతుంది.

🍃🥀ఉత్తర ముఖం ”సూకర ముఖం ”.ఈ వరాహ ముఖం నల్లని కాంతి తోవుంటుంది. భేతాళ ప్రయోగాల్ని ,జ్వరం మొదలైన రోగాల్ని నాశనం చేస్తుంది. పై ముఖం ”హయ ముఖం. ఇది మోక్షాన్ని ఇస్తుంది .ఇలాంటి మహా మహిమాన్విత మైన అయిదు ముఖాలకు చెందిన ”బీజాక్షరాలు ”తో భక్తీ గా మంత్రాలను జపిస్తే ,కోరిన కోరిక తీరుతుంది .

🍃🥀గురువు అనుమతి తో నీలుడు ,బయల్దేరి ‘నీలా చల  క్షేత్రమైన పూరి ,జగన్నాధ క్షేత్రాన్ని” చేరాడు .అక్కడ ఒక మహా పర్వతం ,దానికింద పెద్ద అడవి వున్నాయి .ఆ పర్వతం మీదకు చేరి ,అక్కడి జలాశయం దగ్గరున్న కొండ బిలంలో ప్రవేశించి దీర్ఘ తపస్సు చేయటం ప్రారంభించాడు. ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితంగా కోటి సూర్య ప్రభలతో ,ముప్పది మూడు కోట్ల అర్బుదగణంతో” సంజీవ రాయుడు” అయిన ఆంజనేయ స్వామి ,నీలుడికి ప్రత్యక్షమైనాడు.

🍃🥀శంఖ ధ్వని వంటి ధ్వనితో నీలున్ని పిలిచాడు ,వెంటనే మేల్కొన్న నీలుడు ,ఆయన పాదాల పై సభక్తికంగా వాలి పోయాడు కళ్ళ వెంట ఆనంద  బాష్పాలు ధారా పాఠంగా కారి పోతున్నాయి .నీలున్ని బుజం పట్టి పైకి లేపాడు హనుమ. నీలుడు అత్యంత భక్తీ తో స్తోత్రం చేశాడు . దీన్నే ”నీల కృత ఆంజనేయ స్తోత్రం ”అని పేరు .చాలా మహి మాన్విత మైన స్తోత్రం .దానికి విపరీతంగా సంతోషించి హనుమ ”నీలా !నీ తపస్సు ,ధ్యానాలకు మెచ్చాను.

🍃🥀నీ మనోభీష్టం నాకు తెలుసు .త్వర లో ఇంద్రుని జయిస్తావు. చింతామణి వగైరాలను పొందుతావు.దేవతా స్త్రీలలో అందమైనది ”వన సుందరి ”అనే స్త్రీ నీకు భార్య గా లభిస్తుంది .నువ్వు కోరక పోయినా ,బ్రహ్మ దేవుడే నీకు వరాలు అనుగ్రహిస్తాడు .లోకంలో ఎవరైనా సరే ,నీ లాగానా మంత్రాన్ని జపించి ,నా వ్రతాన్ని చేస్తే వారందరి కోరికలు నేను తక్షణమే తీరుస్తాను .నీ తండ్రి విభీషణుడు నాకు మంచి మిత్రుడు.

🍃🥀ఆయనా ,నేను శ్రీరాముని బంటులం.నా దక్షిణ భాగం లో నీకు సుస్తిరమైన స్తానం కల్పిస్తున్నాను .నువ్వు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం ఇక నుంచి ”పురుషోత్తమ క్షేత్రం ”అని పిలువ బడుతుంది.నీ కోరికలు న్యాయ బద్ధమైనవే.త్వరలోనే అవి తీర గలవు ”అని వరదానం చేసి ,పరివారంతో సహా అదృశ్యమైనాడు ఆంజనేయుడు .

🍃🥀శ్రీ హనుమ దర్శనంతో తృప్తి చెంది ,ఆయన వరాలను అందుకొన్ననీలుడు ,అక్కడి నుంచి బయల్దేరి మళ్ళీ గురువు శుక్రాచార్యుల సన్నిధి కి చేరాడు .భార్గవుడు చాలా సంతోషించి,ఆశీర్వ దించి ,తండ్రి విభీషణునికి వివరాలన్నీ తెలియ జేయ వలసినది గా చెప్పి పంపించే శాడు .లంకలో తండ్రి విభీషనుడిని చేరి ,జరిగిన విధానం అంతా పూస గుచ్చి నట్లు తండ్రికివిన్న   వించాడు .కుమారుని అద్భుత తపో వృత్తాంతం ,వర గ్రహణం విన్న విభీషణుడు ,పరమానందం పొందాడు.

🍃🥀నలుణ్ణి ఆశీర్వదించి అంతఃపురం చేరమని పంపాడు .నీలుడు చింతామణి మొదలైన వాటిని ఎలా పొందాడో తరువాతి కధలో తెలుసుకొందాం .


🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒🌼🍒
[8:01 pm, 08/06/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏


🌻 తిరుమల సర్వస్వం 🌻


🎈 భాగము 92 (విమాన ప్రదక్షిణం) 🎈


🍃🌹శ్రీవారి ఆలయ మహాద్వారం మరియు వెండివాకిలి దాటి లోనికి ప్రవేశించగానే, మొట్టమొదటగా కనిపించే మార్గమే "విమానప్రదక్షిణమార్గం" లేదా "పథం".

🍃🌹స్వామివారి ప్రధాన ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ ప్రదక్షిణ మార్గం, సంపంగిప్రాకారానికి మరియు విమాన ప్రాకారానికి మధ్యలో ఉంటుంది. మునుపటి ప్రకరణాలలో శ్రీవారి ఆలయ కుడ్యాలకు చుట్టూ, బాహ్యంగా ఉన్న మహా ప్రదక్షిణాన్ని; ఆలయం లోనికి ప్రవేశించగానే ఉన్న సంపంగి ప్రదక్షిణాన్ని; ముగించుకొని పరమపవిత్రమైన ధ్వజస్తంభ ప్రదక్షిణగా; వెండివాకిలి దాటి, విమాన ప్రదక్షిణ మార్గంలోనికి చేరుకున్నాం.

🍃🌹శ్రీవారి దర్శనానంతరం ఈ మార్గంలో ఉన్న విశేషాలన్నింటిని ఏ విధమైన అవరోధాలు లేకుండా దర్శించుకోవచ్చు. శతాబ్దాల చరిత్ర గల ఈ మార్గంలో నడయాడుతూ ఉన్నప్పుడు - ఎడమప్రక్కగా, ఎత్తయిన అరుగులతో ఉన్న అనేక మండపాలు మనను ఆకట్టుకుంటాయి. మన కుడి ప్రక్కన శోభాయమానంగా వెలుగుతున్న ఆనందనిలయ గోపురాన్ని లేదా విమానాన్ని కూడా కన్నులారా వీక్షించవచ్చు.

🍃🌹ఒక్కో మంటపానికి ఒక్కో చరిత్ర! ఆయా రాజుల దాతృత్వానికి, శ్రీవారి పట్ల వారికున్న అచంచల భక్తికి నిలువెత్తు నిదర్శనం! ఆనందనిలయ విమాన వైశిష్ట్యాన్నైతే ఎంత చెప్పుకున్నా తక్కువే! ఆ చరిత్రపుటలను, ఆధ్యాత్మిక సొబగులను ఒక్కొక్కటిగా ఇప్పుడు అవలోకిద్దాం...


🌻 శ్రీరంగనాథస్వామి 🌻


🍃🌹విమానప్రదక్షిణ మార్గంలో ప్రవేశించగానే - మొట్టమొదటగా, మనకు ఎదురుగా శేషతల్పంపై శయనించివున్న శ్రీరంగనాథుడు దర్శనమిస్తాడు. ఈ కుడ్యశిల్పం గరుడాళ్వార్ సన్నిధికి వెనుకభాగాన ఉంటుంది. బంగారుపూతతో ధగధగ లాడుతున్న శ్రీరంగనాధునికి పైభాగంలో వరదరాజస్వామి, క్రిందిభాగంలో శ్రీవెంకటేశ్వరుని ప్రతిమలు, ఒకే ఫలకంపై చెక్కబడి ఉంటాయి.

🍃🌹అంటే - శ్రీరంగపు రంగనాథస్వామిని, కాంచీపుర వరదరాజస్వామిని, తిరుమల వేంకటేశ్వరుణ్ణి - మూడు వైష్ణవ దివ్యక్షేత్రాలను ఏకకాలంలో దర్శించి తరించు కున్నామన్నమాట. వైష్ణవులందరి చిరకాల స్వప్నం - ఈ మూడు వైష్ణవ దివ్యక్షేత్రాల సందర్శనం!
1991వ సంవత్సరంలో 55 లక్షల రూపాయలు వెచ్చించి ఈ బంగారు తాపడం చేయించ బడింది.

🍃🌹పూర్వం - భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనం, టెంకాయలు ఇక్కడే సమర్పించుకునే వారు. భక్తుల రద్దీ కారణంగా ఇప్పుడు కర్పూరహారతులను - ఆలయ మహాద్వారానికి ఎదురుగా, బేడి ఆంజనేయస్వామి సన్నిధి ముందున్న "అఖిలాండం" అనబడే ప్రదేశానికి తరలించారు.

🍃🌹ప్రతిరోజూ తెల్లవారు ఝామున జరిగే "అంగప్రదక్షిణలు" లేదా "పొర్లుదండాలు" రంగనాథస్వామి విగ్రహం ఎదురుగా మొదలై, విమాన ప్రాకారాన్ని సవ్యదిశగా ఆసాంతం చుట్టి, మళ్లీ ఇక్కడే పూర్తవుతాయి. అంగప్రదక్షిణ చేయాలనుకున్న భక్తులు సంబంధిత తితిదే కార్యాలయంలో గానీ లేదా ఆన్లైన్ లో గాని ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. ప్రతిరోజు 750 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు. శుక్రవారం మరియు ముఖ్యమైన పర్వదినాల్లో అంగప్రదక్షిణకు అనుమతి లేదు. భక్తులు ముందుగా స్వామి పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి, నిర్ణీత సమయానికి క్యూ కాంప్లెక్స్ ను చేరుకొని, ఆలయ నిబంధల ననుసరించి, అంగప్రదక్షిణ గావించుకోవచ్చు.


🌻 వరదరాజ స్వామి ఆలయం 🌻


🍃🌹శ్రీరంగనాథునికి ఎదురుగా నిలుచున్నప్పుడు, మనకు ఎడంప్రక్కగా కొద్ది అడుగుల దూరంలో, కాంచీపుర వరదరాజస్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయం విమానప్రదక్షిణానికి ఆగ్నేయదిక్కున, పశ్చిమాభిముఖంగా కొలువై ఉంటుంది. మూడు అడుగుల ఎత్తైన పీఠంపై, చిరునవ్వు చిందిస్తున్న వరదరాజస్వామి విగ్రహం అభయముద్రలో దర్శనమిస్తుంది.

🍃🌹ఆలయ పైభాగంలో, ఏకకలశ నిర్మితమైన గర్భాలయ గోపురాన్ని కూడా చూడవచ్చు. ఈ స్వామిని ఇక్కడ ఎప్పుడు - ఎవరు ప్రతిష్ఠించారో చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవు. అయితే, 1354 వ సం. ముందు నుండే ఈ ఉపాలయం ఉన్నట్లు తెలుస్తోంది. కాంచీపురంలో కొలువై ఉన్న వరదరాజస్వామి విగ్రహాన్ని మ్లేచ్ఛుల దండయాత్ర నుండి తప్పించే నిమిత్తం ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారని కొందరంటారు. కానీ ఈ విషయాన్ని ధ్రువీకరించే చారిత్రక ఆధారాలు లేవు.

🍃🌹క్యూ ప్రతిబంధకాల కారణంగా ఈ స్వామిని దగ్గరనుంచి దర్శించుకోలేము. పురాణేతిహాసాల ననుసరించి:

- శ్రీరంగనాథుడు,
తిరుమల వేంకటేశుడు,
కంచి వరదరాజస్వామి,

🍃🌹ఈ ముగ్గురి మూర్తులు మూడుకోణాలుగా ఏర్పడే త్రిభుజాకారంలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. మనం వెండివాకిలి దాటినది మొదలు, శ్రీవారి దర్శనం పూర్తయ్యేంత వరకూ ఈ త్రిుజాకారం లోనే గడుపుతాం. ఎంతో దూరాలోచనతో, మన పూర్వీకులు - ఆలయ సందర్శనార్ధం వచ్చే భక్తులకు అపారమైన దైవికశక్తిని ప్రసాదించడం కోసం ఈ మూర్తులను ఆయా ప్రదేశాల్లో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఏర్పాటు చేసిన ఆ ద్రష్టలను మనసులోనే స్మరించుకొని శ్రీవారి దర్శనార్థం ముందుకు సాగుదాం.


🌻 గరుడాళ్వార్ సన్నిధి 🌻


🍃🌹శ్రీరంగనాథస్వామి కుడ్యప్రతిమకు ఎడంప్రక్కన ఉన్న కటాంజన ద్వారంలో ప్రవేశించి, క్యూ మార్గంలో కుడిప్రక్కకు తిరగగానే, కొన్ని అడుగుల దూరంలో మనకు తూర్పుదిశగా, పంచభూతాల సమ్మేళనం గా భావించబడే "గరుడి" ని ఆలయం కనబడుతుంది. అదే "గరుడాళ్వార్ సన్నిధి". 1512 వ సం. లో ఎవరో అజ్ఞాతభక్తుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింప జేశాడు. శ్రీమహావిష్ణువు పరివారదేవత, వారి సేవకులలో ముఖ్యుడైన గరుత్మంతుని గురించి ఇంతకుముందే - "శ్రీవారి బ్రహ్మోత్సవాలు - గరుడవాహనం" ప్రకరణంలో విస్తారంగా తెలుసుకున్నాం.

🍃🌹సరిగ్గా శ్రీవారి బంగారువాకిలికి ఎదురుగా, శ్రీవారిని సతతం దర్శించుకుంటూ, నమస్కారభంగిమలో, రెక్కలు విప్పార్చుకున్నట్టి ఆరు అడుగుల గరుత్మంతుని విగ్రహం నేత్రపర్వంగా దర్శనమిస్తుంది. ఈ సన్నిధి గోపురంపైన ఉన్న మూడు బంగారు కలశాలను మనం విమానప్రదక్షిణ మార్గంలో ప్రవేశించగానే, శ్రీరంగనాథుని మూర్తి ఉపరితలభాగంపై చూడవచ్చు. శ్రీవారి ముల్లోకవిహారానికి ఎల్లవేళలా సన్నద్ధుడై, అజ్ఞాబద్ధునిగా ఉండే గరుత్మంతుణ్ణి మనఃపూర్వకంగా నమస్కరించుకుని, ఆ తరువాతే తన దర్శనం చేసుకోవడం శ్రీనివాసునికి సంతోషదాయక మని చెప్పబడుతుంది.




🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment