🕉️ *వైశాఖ పురాణం 22వ అధ్యాయము* 🕉️
*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*
*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్*
🌻 *దంతిల కోహల శాపవిముక్తి* 🌻
💫🌹నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాస మహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తిమహారాజు యిట్లు అడిగెను. మహామునీ యిహపరసౌఖ్యముల నిచ్చు వైశాఖమహిమల నెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణుకథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము యెంతవిన్నను తృప్తి కలుగదు.
💫🌹ఇంకను వినవలయుననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిధివై నా యింటికి వచ్చితివి. నీవు చెప్పిన యీ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని ముక్తిని నా మనసుకోరుట లేదు. కావున నా యందు దయయుంచి యింకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను.
💫🌹శ్రుతకీర్తి మాటలను విని శ్రుతదేవమహాముని మిక్కిలి సంతసించి యిట్లనెను. వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరియొక కథను చెప్పుదును వినుము.
💫🌹పంపాతీరమున శంఖుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియందుండగా గోదావరీ ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరధీనదిని దాటి ముళ్లురాళ్లు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు యెండకు బాధితుడై మధ్యాహ్న సమయమున నలసి యొక వృక్షము నీడలో కూర్చుండెను.
💫🌹అప్పుడొక బోయవాడు వింటిని పట్టుకొని అచటకు వచ్చెను. అతడు దయా హీనుడు. సర్వప్రాణులను హింసించువాడు. సూర్యునివలె ప్రకాశించుచు రత్నకుండలములను ధరించిన శంఖుని పీడించి వాని వద్దనున్న కుండలములను గొడుగును, పాదుకలను కమండలమును లాగుకొనెను. తరువాత నా బ్రాహ్మణుని పొమ్మని విడిచెను.
💫🌹శంఖుడును అచటినుండి కదలెను. ఎండకు కాళ్లు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమున నిలుచుచు, చెట్లనీడలయందు వెదకి నిలుచుచు త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్లుచుండగా బోయవానికి వానియందు దయకలిగెను.
💫🌹వాని పాదుకలను తిరిగి వానికీయవలెనను ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవేయని వాని యభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి యిచ్చెను. ఇట్లుచ్చుటవలన నాకు కొంతయైన పుణ్యము కలుగునుకదాయని భావించెను.
💫🌹శంఖుడును కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవయని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున నితడు దుర్బుద్దియగు కిరాతుడైనను పాదుకలనిట్లిచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున యిట్టి బుద్ధికలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నా కిట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖముగ నుండుమని వానిని యాశీర్వదించెను.
💫🌹కిరాతుడును శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీనుండి దోచుకున్నదానిని నీకు తిరిగి యిచ్చితిని. ఇందువలన నాకెట్లు పుణ్యము వచ్చును. వైశాఖము శ్రీహరి సంతోషించుననియనుచున్నావు. నీవీ విషయమును వివరింపుమని శంఖుని ప్రార్థించెను.
💫🌹శంఖుడును కిరాతుని పలుకులకాశ్చర్యపడెను. లోభముగల యీ కిరాతుడు నీవిట్లు నానుండి దొంగలించిన పాదుకలను తిరిగి యిచ్చి యిట్లు వైశాఖమహిమ నడుగుట శ్రీహరి మహిమయేయని వైశాఖమును మరలమెచ్చెను.
💫🌹దుర్బుద్దివై నా వస్తువులను లాగుకొన్నను యెండలో బాధపడునాయందు దయ కలిగి నా పాదుకలను యిట్లు యిచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును.
💫🌹కాని వైశాఖమాసదాన ధర్మములు వెంటనే ఫలించును సుమా! పాపాత్ముడవైనను, కిరాతుడవైనను దైవవశమున నీకిట్టిబుద్ది కలిగినది. నీకింత మంచిబుద్ది కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయకారణములు సుమా.
💫🌹శ్రీహరికిష్టమైనవి, నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలి యిష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరియే ధర్మకార్యములకు సంతుష్టినందడు.
💫🌹తపస్సులు, యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత యిష్టములు కావు. ఏ ధర్మము వైశాఖధర్మమునకు సాటిలేదు. వైశాఖధర్మముల నాచరించినచో గయకు, గంగానదికి ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు కురుక్షేత్రమునకు ప్రభాసమునకు శమంతమునకు గోదావరికి కృష్ణానదికి సేతువునకు యెచటికిని యేపుణ్యక్షేత్రమునకు పవిత్రనదికి యెచటికిని పోనక్కరలేదు.
💫🌹వైశాఖవ్రత వివరణ ప్రసంగము గంగానది కంటె పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసినవారికి యీ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను యెన్ని దానములు చేసినను యెన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములగు వైశాఖధర్మముల వలన వచ్చు పుణ్యమునకు సాటిగావు.
💫🌹కావుననే యీ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకల నీయవలెనని నీకు అనిపించినది. ఈ మాసమంత గొప్పది కావుననే దీనికి మాధవమాసమని పేరు వచ్చినది. పాదుకలనిచ్చుటచే నీకు పుణ్యము కలుగును. నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను.
💫🌹ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగ బోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై బడెను. సింహమునకు, గజమునకు భయంకరమగు యుద్దము జరిగెను. రెండును యుద్దము చేసి చేసి అలసి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పుమాటలను వినుట జరిగెను. వారు వెంటనే వైశాఖమహిమను వినుట చేతను గజసింహరూపములను విడిచి దివ్యరూపముల నందిరి.
💫🌹వారిని దీసికొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్యరూపమును ధరించిన వారిద్దరును కిరాతునికి వైశాఖవ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించిరి.
💫🌹కిరాతుడు శంఖుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేల నమస్కరించుచున్నారని ప్రశ్నించిరి. గజసింహములుగా నున్న మీకీ దివ్యరూపములు కలుగుటయేమనియు ప్రశ్నించిరి.అప్పుడు వారిద్దరును మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు, కోహలుడునని మా పేర్లు.
💫🌹అన్ని విద్యలను నేర్చి యౌవనములోనున్న మా యిద్దరిని జూచి మా తండ్రియగు మతంగ మహర్షి 'నాయనలారా! విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల నేర్పరచుడు. జనులకు విసనకఱ్ఱలతో అలసటవోపునట్లుగా విసరుడు. మార్గమున నీడనిచ్చు మండపములను యేర్పాటు చేయుడు. చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి యలసటను పోగొట్టుడు.
💫🌹ప్రాతఃకాలమున స్నానము చేసి శ్రీహరి పూజింపుడు. శ్రీహరికథలను వినుడు, చెప్పుడు అని మాకు బహువిధములుగ జెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మముల నాచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్లు నిర్లక్ష్యముగ సమాధానముల నిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్షమునకు కోపించెను.
💫🌹ధర్మవిముఖుడైన పుత్రుని, వ్యతిరేకమున బలుకు భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలయును. దాక్షిణ్యము వలన, ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంత కాలము నరకముననుందురు.
💫🌹కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహముగను, కోహలుడు గజముగను చిరకాలము అడవిలో నుండుడని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరును ఒకరినొకరు చంపుకొనబోదురు.
💫🌹అప్పుడే మీరిద్దరును కలిసికొందురు. ఆ సమయమున కిరాతుడు శంఖుడను బ్రాహ్మణునితో వైశాఖధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాపవిముక్తి, ముక్తి కలుగునని శాపవిముక్తిని అనుగ్రహించెను.
💫🌹శాపవిముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్లుదురనియు మా తండ్రిగారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగనే జరిగినది. కృతజ్ఞులమై నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానముల నెక్కి వెళ్ళిపోయిరి.
💫🌹వాని మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడును కిరాతునితో ఓయీ! వైశాఖ మహిమను ప్రత్యక్షముగ జూచితివి గదా! వైశాఖమహిమను వినుటవలననే దంతిలకోహలులకు శాపవిముక్తి ముక్తి కలిగినవి కదాయని పలికెను. కిరాతునిలోనున్న హింసాబుద్ది నశించెను. వాని మనస్సు పరిశుద్దమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి యిట్లనెను.
💫🌹అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించుచు నారదుడు చెప్పెను.
*వైశాఖ పురాణం ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం*
🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏
[03/06, 6:45 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01
🕉 వినాయకుడిని నాగభూషణుడు అని ఎందుకు పిలుస్తారో తెలుసా ?... 🙏
@ హిందూ పురాణాల ప్రకారం వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావిస్తారు. వినాయకుడికి గణపతి, విగ్నేశ్వరుడు, ఏకదంతుడు, గణనాథుడు, లంబోదరుడు వంటి పేర్లు ఉన్నాయి. ఇవే కాకుండా వినాయకుడిని నాగభూషణడు అని కూడా పిలుస్తారు. అయితే వినాయకుడిని నాగభూషణడు అని ఎందుకు పిలుస్తారో చాలామందికి తెలియకపోవచ్చు. పురాణాల ప్రకారం వినాయకుడికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం...
@ వినాయకుడి తమ్ముడు కార్తికేయ వివాహం ఇంద్రుని కుమార్తె దేవసేనతో నిశ్చయమైంది. ఈ క్రమంలోనే పార్వతీదేవి వినాయకుడిని ఉద్దేశించి తమ్ముడికి పెళ్లి నిశ్చయమైంది, తమ్ముడు పెళ్లి జరగాలంటే ముందుగా నీ పెళ్లి జరగాలని, పెళ్లి చేసుకోమని వినాయకుడికి చెబుతుంది. పెళ్లి చేసుకోవడానికి వినాయకుడు ససేమిరా ఒప్పుకోకుండా అనేక సాకులు చెబుతాడు.పార్వతి దేవి మాత్రం పెళ్లి విషయంలో పట్టుబడటంతో చేసేదేమీ లేక వినాయకుడు తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోతాడు.
@ అలా వెళ్లిన వినాయకుడు తపస్సు కోసం చుట్టూ పుట్టలు ఉండి ఆ పుట్టలో పాము ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. ఆ ప్రదేశంలో తపస్సు చేస్తుండగా పుట్టలో నుంచి పాములు నిటారుగా నిలబడి బుసులు కొడుతూ వినాయకుడి తపస్సుకు భంగం కలగకుండా రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఇంద్రుడు ఎలాగైనా విఘ్నేశ్వరుడి తపస్సు భంగం కలిగించాలని రాక్షసులకు, ‘‘మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్నందర్నీ నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు. పగతీర్చుకోండి!” అని చెప్పి ఉసిగొల్పాడు.
ఆ విధంగా రాక్షసులు వినాయకుడి పై దాడి చేయగా మహాసర్పాలు పాతాళం నుంచి కట్టలుగా వచ్చి వాళ్ళ పొగరు అణిచాయి. అక్కడితో రాక్షసులు అక్కడినుంచి పారిపోతారు.ఇంద్రుడు మంచి ఉల్లాసవంతులైన దేవతాపురుషుల్ని, వారితో అప్సరసలను కలిపి పంపుతూ, ‘‘విఘ్నేశ్వరుడికి ఆటంకం కలిగేలాగ మీ ప్రతాపం చూపండి అని వారిని వినాయకుడి పై ఉసి గొలపాడు. వారిపై నాగులు బుసలు కొడుతూ వారిని కాటు వేస్తూ దేవతలను స్వర్గానికి తరిమాయి.ఈ విధంగా వినాయకుడు తపస్సుకు భంగం కలగకుండా పాములు రక్షించినందుకు వినాయకుడు సంతోషించి పాములను ఎత్తుకొని వాటిని ఆభరణాలుగా ధరించి కైలాసానికి వెళ్తాడు. ఈ విధంగానే పాములు వినాయకుడికి ఆభరణాలుగా మారడంతో వినాయకుడు నాగభూషణడు అయ్యాడు. అప్పటినుంచి వినాయకుడిని నాగభూషణడు అనే పేరుతో కూడా పిలుస్తారు.
[03/06, 6:45 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01
మంచి విషయాలను దారి మళ్లించాలన్నిది కాదు కానీ, కేవలం దేవుడు, కుల మత ఆచారాలకు ముడి పెట్టడం వల్ల మంచి విషయాలన్నీ మటుమాయమైపోతున్నాయని చిన్న బాధ. దేవుడి గుడికి వచ్చిన తరువాత కాస్సేపు కూర్చుని వెళ్లాలని అంటారు. దాదాపు అందరూ పాటిస్తారు. కొందరు సమయం లేకుంటే, ఇలా కూర్చున్నట్లే కూర్చుని లేచి చక్కాపోతారు. దీని గురించి స్పష్టంగా చెబితేనన్నా కూర్చుంటారేమో?
గుళ్లన్నీ చాలా వరకు కొండపై వుంటాయి. కాకుంటే కాసిన్ని అయినా మెట్లుంటాయి. పైగా లోపలకు వచ్చాక గుడిచుట్టూ మూడో, అంతకు పైగానో ప్రదిక్షణలు. ఇవన్నీ అవగానే మళ్లీ వెంటనే మెట్లు దిగడం అంటే అంత మంచిది కాదు. పైగా కొండపైన అంటే ఆక్సిజన్ అంతగా అందదు. అందుకే గుడిపైకి వచ్చి, ప్రదక్షిణలు, దర్శనం చేసాక కాస్సేపు కూర్చోమన్నది. ఎందుకు? కాస్త సేద తీరడానికి. అలుపు తగ్గి గుండె స్పందించే వేగం మళ్లీ మామూలు స్థితికి రావడానికి. ఆపైన మళ్లీ మన ప్రయాణం మనదే. కానీ ఎందుకు కూర్చోవాలో చెప్పకుండా, కూర్చోవాలంతే, అంటూ లాజిక్ లేని కబుర్లు చెబితే కొంత కాలం కాకుంటే, మరికొంత కాలం తరువాత అయినా మటుమాయం అయిపోతాయి.
ఇటీవల గర్భగుడిలో కూడా కొన్ని చోట్ల ప్రదక్షిణలు చేయించేస్తున్నారు. పాపం అంతంత మాత్రం తెలిసిన పురోహితులు. నిజానికి గుడిచుట్టూ ప్రదక్షిణ చేసినా, మన వెనుక భాగం దేవుడి వైపు తిరగదు. కానీ గర్భగుడిలో అలా చేయడం సబబు కాదు. అందుకే గర్భగుడిలో ప్రదక్షిణ నిషేధం. అదే విధంగా గుడిలో భగవంతుడికి అభిముఖంగా సాష్టాంగం పడడం కూడా తప్పే. రాముడైనా, శివుడైనా, మరే దేవుడైనా వారి బంటు లేదా వాహనం దేముడికి ఎదురుగా కొలువుతీరి వుంటుంది. ఆంజనేయుడో, గరుడాళ్వారో,నందీశ్వరుడో. దేవుడి ఎదురుగా సాష్టాంగం పడితే మన కాళ్లు వారి వైపు వుంచాల్సి వస్తుంది. అందుకే ఓ పక్కగా సాష్టాంగం చేయాలి.
మహా నైవేద్యం పెట్టేటపుడు పెద్దగా గంట వాయిస్తారు. ఇప్పటికీ అదే వ్యవహారం. కానీ నిజానికి ఇప్పుడు అంత పెద్దగా అవసరం లేదు. పూర్వం గుళ్లో మహాభోగం అయిన తరువాత కానీ, ఊళ్లో జనాలు కావచ్చు. రాజ్యాన్నేలే మహరాజు కావచ్చు, జమిందారు కావచ్చు, భోజనానికి ఉపక్రమించేవారు కాదు. అందుకోసం, మహాభోగం సమయంలో పెద్దగా గంట వాయించేవారు. దాన్ని విని, దేవుడికి నివేదన జరిగింది అని తెలుసుకుని భోజనానికి ఉపక్రమించేవారు.
తీర్థం అంటూ స్వీకరిస్తాం గుడిలో. ఇప్పడు అభిషేక జలమో, పంచామృతాలో తీర్థంగా ఇస్తుంటారు.కొన్ని గుళ్లలో తులసి వేసిన ఉదకం ఇస్తారు. తులసి మంచి చెడ్డలు తెలిసినవేగా. నిజానికి తీర్థం వెనుక వ్యవహారం ఒకటి వుంది. పూజా సమయంలో భగవంతుడికి సమర్పించే అర్ఘ్య పాద్యాలన్నీ ఆయనకు చూపించాక, వేరే పాత్రలో వేయడం పద్దతి. అలా చేరిన జలాన్ని తీర్థంగా స్వీకరించడం విధాయకం. అంటే భగవంతుడికి అర్పించిన జలం అన్నమాట అది. ఇక్కడ ఓ సంగతి చెప్పాలి. ఇళ్లలో పూజ చేసేటపుడు పంచపాత్ర కింద చిన్న పళ్లెం వుంచుతారు. కానీ పక్కన మరో పళ్లెం లేదా చిన్న గ్లాసు వుంచాలి. గుడిలో భగవంతుడికి అర్పించినవి ఓ పాత్రలోవేసినట్లు, ఇక్కడ కూడా ఆ పళ్లెం లేదా, పాత్రలో వేయాలి. ఇలా చేరిన నీటిని, పూజ అనంతంరం ఓ చిటెకడుసేవించడం, మిగిలినది తులసి మొక్కలో పోయడం శ్రేష్టం. ఎందుకంటే మనం భగవంతుడికి అర్పించేవి ఏవైనా నదీ మార్గంలో లేదా ఇలా భూ మార్గంలో. ఇంటిలో నిత్యం చేసే వ్యవహారం కాబట్టి తులసి మొక్కలో పోయడం అన్నది మంచి పద్దతి. అలా పోసే ముందు చేయి అడ్డుపెట్టి పోయాలి. ఇది రెండు విదాల అవసరం. ఒకటి చేయి అడ్డుపెట్టి పోయడం వల్ల మొక్కవేళ్ల కు మంచిది. రెండవది ఆ చేతికి వున్న నైర్మల్య జలం తలపై జల్లుకునే అవకాశం.
నైర్మల్య జలమే కాదు, దేవుని విగ్రహాలు, ఫొటోలమీద నుంచి తీసిన నిన్నటి పూలు, పత్రి వగైరా కూడా తులసి లేదా ఇతర మొక్కల్లో వేయడం ఉభయతారకం. వాటిని ఎవరూ తొక్కకుండా వుంటుంది. అదే సమయంలో అవి కుళ్లి, మొక్కలకు ఎరువుగా మారుతుంది. కుంకుమార్చన సదా చేసేవారి ఇంట బోలెడు పేరుకుంటుంది. ఏం చేయాలి. ఎంతకని ఎందరికని ఇస్తారు. దాన్ని విసర్జించాలన్నా తులసిలోనే వేయడం సులువైన పని. అయితే ఇలా వేసినపుడు కాసిన్ని నీళ్లు పోయాలి. అలా చేస్తే గాలికి ఎగరదు. అన్నట్లు కుంకుమ అంటే గుర్తుకు వచ్చింది. బజారులో అమ్మే పసుపు పూజకే కాదు,నిజానికి తినడానికి అంత మంచివి లభించడం లేదు. గమనించాలి. ముఖ్యంగా ఈ పసుపు పొడిబారి, ఫేస్ పౌడర్ మాదిరిగా ఎగురుతూవుంటుంది. దానికి కారణం యంత్రాల సహాయంతో పసుపులోని తైలాన్ని వేరు చేయడమే. అలా వేరు చేసిన పసుపు మనకు ఏం ఆరోగ్యాన్ని ఇస్తుంది. అందువల్ల పసుపు కొమ్ములు చిన్న ముక్కలు చేసి, ఇంట్లో ఆడుకుని వాడుకోవడం అంత ఉత్తమం మరొకటి లేదు. అదే మాదిరిగా ఇప్పుడు దొరికే చందనపు పొడులు కూడా అంతే. వాటిని వాడినా వాడకున్నా ఒకటే.
సరే ఇక మళ్లీ ఆలయానికి వస్తే, ఇప్పటి కాలరీతులకు అనుగుణంగా చాలా గుళ్లలో కొబ్బరకాయ కొట్టడం, అగరత్తులు, కర్పూరం, పూలు ఇవ్వడం మానేయడమే మంచింది. అదేమిటి దేవుడికి ఇవ్వవద్దని అంటున్నారు అనుకోవద్దు. మనం ఇచ్చేవి సద్వినియోగం, సక్రమ వినియోగం అవుతాయా..కావా అన్నది గమనించి ఇవ్వండి. మూలవిరాట్ వేరు, ఉత్సవ విగ్రహం వేరు. ఆఖరికి కొబ్బరికాయ కొట్టేదగ్గర విగ్రహం, లేదా ఫోటో వేరు. ఎవరో దేవస్థానం ఉద్యోగి కూర్చుని, యాంత్రికంగా కొబ్బరికాయ తీసకుని, కొట్టడం మన చేతిలొ ఓ చిప్ప వుంచడం, పక్కన రెండు గంపలు పెట్టుకుని, ఆ ఊదు వత్తులు, కర్పూరం, పసుపు, కుంకుమ అలా పడేయడం. అవి గంపక కోద్దీ పోగు కావడం. మనకు ఏం తృప్తి వుంటుంది. అంతగా ఇవ్వాలనుకుంటే మన ఇంట్లోనే లేదా స్వయంగా దేవుడికి నైవేద్యం పెట్టే అవకాశం వున్న గుళ్లలోఇవ్వడం ఉత్తమం.
ముఖ్యంగా దేవాదాయ శాఖ వచ్చాక గుళ్లలో పద్దతులు మారిపోయాయి. దాని వల్ల తెలిసి తెలియకుండానే రకరకాల పద్దతులు అమలులోకి వచ్చేస్తున్నాయి. సింహాచలం దేవస్థానంలో కప్ప స్తంభం అని వుంది. దేవుడికి కప్పం కట్టని వారిని, ఆ స్తంభానికి కట్టి మరీ వసూలు చేసేవారని ప్రతీతి. నలభై ఏళ్ల క్రితం సంతానం లేని దంపతులు దాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని ప్రతీతిగా వుండేది. ఇప్పుడు దేవస్థానం కాస్త రుసుం చెల్లించితే, కప్పస్తంభానికి కట్టి, విప్పే పద్దతి తెచ్చింది. ఇలా చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రచారంలోకి తెచ్చారు. ఇలాంటివన్నీ నమ్మేకన్నా, దేవుడి కోవెలకు నమ్మకంతో వెళ్లాలి. భక్తితో నమస్కరించాలి. ఆర్తితో ప్రార్థించాలి. అప్పుడే మనకు ఆత్మ సంతృప్తే కాదు, ఆత్మశక్తీ కలుగుతుంది. ఆత్మశక్తి వుంటే అన్నీ సమకూరుతాయి. ఆ శక్తినిచ్చేది సూదంటు రాయి లాంటి ఆకర్షణ కలిగిన శిలా రూపంలోని భగవద్ రూపమే. ఆ మూర్తిని దర్శించుకోవడానికే గుడికి వెళ్లాలి.
No comments:
Post a Comment