🕉️ *వైశాఖ పురాణం 21వ అధ్యాయము* 🕉️
*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*
*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్*
🌻 *పాంచాలరాజు సాయుజ్యము* 🌻
💫🌹నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను.
💫🌹పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేనివాడునగు శ్రీమహావిష్ణువును యిట్లు స్తుతించెను.
నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం |
యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1||
ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం |
అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2 ||
సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి |
తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం ఖలనిగ్రహాయ || 3 ||
తమోగుణం రాక్షస బంధనాయ రజోగుణం నిర్గుణ విస్వమూర్తే |
దిష్ట్యాదంఘ్రిః ప్రణతాఘనాశన స్తీర్దాస్పదంహృదిధృతః సువిపక్వయోగైః || 4 ||
ఉత్సిక్త భక్త్యుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతింతవ పదస్మృతిమాత్రతోయే |
భవాఖ్యకాలోరగపాశబంధః పునఃపునర్జన్మజరాది దుఃఖైః || 5 ||
భ్రమామి యోనిష్వహమాఖు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతేః |
నూనం న దత్తం న చతే కధాశ్రుతా నసాధవో జాతు మయాసిసేవితాః || 6 ||
తేనారి భిర్ద్యస్త పరార్ధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టః స్వహరూహ్యగుం స్మరన్ |
స్మతౌ చ తౌమాంసముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్త బంధూ || 7 ||
వైశాఖధర్మ్రైః శ్రుతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది పుమర్ధహేతుభిః |
తద్భోధతో హంకృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ || 8 ||
తస్మాదభూన్మేపరమః ప్రసాదః తేనాఖిలాః సంపద ఊర్జితా ఇమాః |
నాగ్నిర్నసూర్యోన చ చంద్రతారకా నభూర్జలంఖంశ్వసనో ధవాఙ్మనః || 9 ||
ఉపాసితాస్తేపి హరంత్యఘంచిరాద్విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా |
యన్మన్యసేత్వంభవితాపి భూరిశఃత్యక్తేషణాన్ త్వద్పదన్యస్తచిత్తాన్ || 10 ||
నమస్స్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ |
తన్మాయయోమోహితోహం గుణేషు దారార్థరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ || 11 ||
త్వద్పాద పద్మే సతిమూలనాశనే సమస్త పాపాపహరే సునిర్మలే |
సుఖేచ్ఛయానర్ధ నిదాన భూతైః సుతాత్మదారైర్మమతాభియుక్తః || 12 ||
నక్వాపినిద్రాంలభతే న శర్మప్రవృద్దతర్షః పునరేవతస్మిన్ |
లబ్ద్వాదురాపం నరదేవజన్మత్వం యత్నతః సర్వపుమర్ధహేతుః || 13 ||
పదారవిందం న భజామి దేవ సమ్మూఢ చేతావిషయేషు లాలసః |
కరోమి కర్మాణి సునిష్ఠితః సన్ ప్రవృద్ధతర్షః తదపేక్షయాదద్ || 14 ||
పునశ్చభూయామహమద్యభూయామిత్యేన చింతాశత లోలమానసః |
తదైవ జీవస్య భవేత్కృపావిభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే || 15 ||
సమాగమః స్యాన్మహతాంహి పుంసాం భవాంబుధిర్యేనహి గోష్పదాయతే |
సత్సంగమోదేవయదైవ భూయాత్తర్హీశదేవేత్వయిజాయతేమతిః || 16 ||
సమస్త రాజ్యాపగమహిమన్యేహ్యనుగ్రహం తేమయి జాత మంజసా |
యధార్ధ్యతే బ్రహ్మసురాసురాద్యైః నివృత్త తర్షైరపిహంసయూధైః || 17 ||
ఇతః స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాదసరోరుహం విభో |
అకించన ప్రార్ధ్యమమందభాగ్యదం నకామయేన్యత్తవ పాదపద్మాత్ || 18 ||
అతోన రాజ్యం నసుతాదికోశం దేహేన శశ్వత్పతతారజోభువా |
భజామినిత్యం తదుపాసితవ్యం పాదారవిందం ముని భిర్విచింత్యం || 19 ||
ప్రసీదదేవేశ జగన్నివాస స్మృతిర్యధాస్యాత్తవ పాదపద్మే |
సక్తిస్సదాగచ్ఛతు దారకోశ పుత్రాత్మచిహ్నేషు గణేషు మే ప్రభో || 20 ||
భూయాన్మనః కృష్ణ పదారవిందయోః వచాంసితే దివ్యకధానువర్ణనే |
నేత్రేమమేతేతన విగ్రహేక్షణే శ్రోత్రేకధాయాం రసనాత్వదర్పితే || 21 ||
ఘ్రూణంచత్వత్పాద సరోజ సౌరభే త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ |
స్యాతాంచ హస్తౌ తవమందిరేవిభో సమ్మర్జనాదౌ మమనిత్యదైవ || 22 ||
కామశ్చమే స్యాత్తవసత్కధాయాంబుద్ధిశ్చమే స్యాత్తవచింతనేనిశం |
దినానిమేస్యుస్తవ సత్కధోదయైః ఉద్గీయమానైః మునిభిర్గృహా గతైః || 23 ||
హీనః ప్రసంగస్తవమేనభూయాత్ క్షణం నిమేషార్థ మధాపి విష్ణో |
న పారమేష్ఠ్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో || 24 ||
త్వత్పాదసేవాంచ సదైవకామయే ప్రార్ద్యాంశ్రియా బ్రహ్మభవాదిభిః సురైః || 25 ||
అని స్తుతించెను.
💫🌹పాంచాలరాజు చేసిన యీ స్తుతి అర్ధవంతము శక్తిమంతమునగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాలరాజువలె పూర్వ కర్మననుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలెనే కష్టములను దాటి సర్వసుఖములనంది పాంచాలరాజువలె భగవంతుని దర్శనమును పొందగోరువారమే కదా!
💫🌹అందుకని యీ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమోయని తలచి భావమునిచ్చుచున్నాము. సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించకొనగలరు. 24 తత్త్వములు పరమేశ్వరుడు/శ్రీహరి ఒకడు మొత్తము 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న యీ స్తోత్త్రము సాభిప్రాయమైనదే.
💫🌹1.స్వామీ! నీవు దేనియందును ఆసక్తుడవుకావు ఏదియు అంటనివాడవు. సృష్టికర్తలకు అధిపతివి. పరాత్పరుడవు. నీమాయకులోబడిన తత్త్వవేత్తలును సృష్టికర్తలనెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు.
💫🌹2. తత్త్వవిదులును మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువా! దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించినవాడవు, రక్షించువాడవు. నశింపజెయువాడవును నీవొక్కడవే.
💫🌹3.స్వామీ! నీవు కోరికలన్నియు తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు.
💫🌹4.తమోగుణమున దుష్టులను శిక్షింతువు. రజోగుణమున రాక్షసుల నిగ్రహించు చున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది.
💫🌹5.స్వామీ! గర్వము-భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము/పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు.
💫🌹6.నేనును యిట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియు దానము చేయలేదు. నీ కథలను వినలేదు. ఉత్తముల సేవయును చేయలేదు.
💫🌹7.ఇందువలన శత్రువులు నా రాజ్యము నాక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్తబంధువులగువారు నా యొద్దకు వచ్చి తమ ప్రభోధములచే నా దుఃఖమును పోగొట్టిరి.
💫🌹8.ధర్మార్థకామమోక్షములను, స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖధర్మముల నాచరించితిని.
💫🌹9.అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరియనుగ్రహము కలిగినది. అందువలన నుత్తమ సంపదలు అధికములుగ నొనగూడినవి. అగ్ని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగువానిని సేవింపలేదు.
💫🌹10.నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులనుపాసింపలేదు. అవి యన్నియు స్థిరములు కావు. అన్నిటిని ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును.
💫🌹11.స్వామీ! నీవు స్వతంత్రుడవు. ఎవరికిని లోబడినవాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు. అందరికంటె నుత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందాసక్తుడనైతిని.
💫🌹12.మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వపాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగానేను సుఖము కావలయుననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యమున్నగు కోరికలచే పీడింపబడితిని.
💫🌹13.స్వామీ! ఎచటను సుఖనిద్రలేదు, శుభములేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవజన్మనెత్తియు నీవే సర్వపురుషార్థకారణమని యెరుగజాలకపోతిని.
💫🌹14.నీ మహిమనెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును యెవరికిని యిచ్చుటలేదు.
💫🌹15.స్వామీ! ప్రభూ! పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలయుననియున్నను చేయలేకున్నను. కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును.
💫🌹16.సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగరభయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నది అగును. అంతేకాడు దైవమగునీయందు భక్తి భావము కలుగును.
💫🌹17.ప్రభూ! నీ రాజ్యమంతయు పోవుట మంచిదేయని అనుకొనుచున్నను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీయనుగ్రహమును పొందు అవకాశము కలిగినది.
💫🌹18.స్వామీ! అచ్యుతా! నీపాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులును ప్రార్థింపదగినవి. అనంతభాగ్యము నిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొకదానిని స్మరింపను.
💫🌹19.కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటివారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును.
💫🌹20.జగన్నాధా! ప్రసన్నుడవగుము. నీ పాదపద్మస్మృతి నన్ను విడువకుండ చూడుము. నీ పాదములయందు ఆసక్తియు, భార్యాపుత్రాదులయందనాసక్తియు కలుగజేయుము.
💫🌹21.ప్రభూ! నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందములయందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణకధాను వర్ణనమున ప్రవర్తించుగాక. నా యీ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నాయీ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక.
💫🌹22.నా ముక్కు నీ పాదపద్మగంధమునే వాసన జూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక! స్వామీ! నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక.నా పాదములు నీ క్షేత్రములున్నచోటకు, నీ కథలు చెప్పుచోటకు మాత్రమే వెళ్లుగాక. నాశిరమున నీకై నమస్కారము నిమగ్నమగు గాక.
💫🌹23.నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ది నీ చింతనమునందాసక్తమగుగాక.
💫🌹24.నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడచుగాక. నీ యింటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచుగాక. నీ ప్రసంగములేని క్షణమైనను గడువకుండు గాక.
💫🌹25..ప్రభూ! బ్రహ్మపదవి అక్కరలేదు. చక్రవర్తిత్వము కలదు. మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కాని వారికి నీ పాద సేవ సులభముకాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము.
💫🌹ఇట్లు పాంచాలరాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలెనన్న కన్నులతో ప్రసన్నుడై వానిని జూచుచు మేఘగంభీరస్వరముతో నిట్లనెను. నాయనా నీవు నా భక్తుడవని కోరికలు కల్మషములేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. పదివేల సంవత్సరముల దీర్ఘాయువునందుము. సర్వసంపదలను పొందుము. నీకు నాయందు నిశ్చలమైన భక్తియుండును.
💫🌹తుదకు ముక్తినందుదువు. నీవు చేసిన యీ స్తుతితో నన్ను స్తోత్రము చేసినవారికి సంతుష్టుడనై భుక్తినిముక్తిని యిత్తును. సందేహములేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయతృతీయాతిధి సార్ధకనామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తుల నక్షయముగ నిత్తును. భక్తిపూర్వకముగ గాకున్నను బలవంతము వలననో మొగమాటమువలననో ఏదోయొక కారణమున వైశాఖస్నానాదికమును చేసినవారికిని భుక్తిని, ముక్తిని యిత్తును.
💫🌹ఈ అక్షయతృతీయయందు పితృదేవతలకు శ్రాద్దమును నిర్వహించినచో వారికి వంశవృద్ది అనంతపుణ్యము నిత్తును. ఈ అక్షయతృతీయాతిధి మిక్కిలి యుత్తమమైనది. దీనికి సాటియైన తిధిలేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయఫలములనిచ్చును. కుటుంబముకల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వసంపదలను వర్షించి ముక్తి నిత్తును. సమస్త పాపములను పొగొట్టు వృషభదానమును చేసినవానికి అకాలమృత్యువేకాదు, కాలమృత్యువును కూడ పోగొట్టి దీర్గాయుర్దాయము నిత్తును.
💫🌹వైశాఖ వ్రతమును దాన ధర్మములను యధాశక్తిగ చేసినవారికి జన్మ, జరా, మృత్యు, వ్యాధి, భయములను, సర్వపాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ దానము మున్నగువాని వలన సంతోషించినట్లుగ నితరమాసములందు చేసిన పూజాదికమునకు సంతోషపడను. వైశాఖమాసమునకు మాధవమాసమని పేరు.
💫🌹దీనిని బట్టి నాకీ మాసమెంత యిష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖవ్రతము నాచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును.
💫🌹వైశాఖవ్రతమును దానాదులను ఆచరించినవారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యముకాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేలకొలది మహాపాపములు చేసినవారైనను వైశాఖవ్రతము నాచరించిన పాపక్షయమును అనంత పుణ్యము నిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును.
💫🌹పాంచాలమహారాజా! నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్దలతో నాచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగనే అంతర్ధానమందెను. పాంచాలరాజును శ్రీహరి యనుగ్రహమునకు మిక్కిలి యానందమునందెను. శ్రీహరి యందు నిశ్చలభక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను.
💫🌹శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు. గౌరవింపలేదు. భార్యాపుత్రాదులకంటె శ్రీమన్నారాయణుడే తనకు కావలసినవాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు పరివారము అందరితో గలసి వైశాఖవ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వసుఖభోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.
💫🌹ఉత్తమమైన యీ కథను విన్నను వినిపించినను సర్వపాపవిముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగ నారదుడు అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు చెప్పెను.
*వైశాఖ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము*
🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏
: ఇడ్లీలు మొదట ఏదేశం వంటకం? దక్షిణాది వారిదేనా? దానికేమైనా చరిత్ర ఉంది?
ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందని అంటారు. . ఆవిరితో ఉడికించే వంటల్లో ఇండోనేషియాలోని "డిం సం" అనే వంట ప్రసిద్ధమయింది. వెదురు బుట్టల్లో ఈ డిం సం లను ఉంచుతారు.
అలా ఉంటే కొరియాలో కూడా రైస్ కేక్ దొరుకుతుంది. ఇది మన ఇడ్లీయే. ఇవి అక్కడ చతురస్రాకారంలో ఉన్నవి.
మనదేశానికొస్తే -
పదకొండవ శతాబ్దం (1127-1138 A.D) లో మూడవ సోమదేవుడు (చాళుక్య సోమదేవుడు) అనే చాళుక్యప్రభువు "అభిలాషితార్థ చింతామణి" అని ఓ పుస్తకాన్ని రచించాడు. దాన్నే "మానసోల్లాసం" అంటారు. అందులో సామాజిక విషయాలు చాలా చెప్పాడు. అందులో ఇడిలికం గురించి ఒక శ్లోకం ఉంది.
సుశీతా ధవళా శ్లక్ష్ణా ఏతా ఇడరికా వరాః |
తస్యైవ మాషపిష్టస్య గోళకాన్ విస్తృతాన్ ఘనాన్ ||
చల్లనివి, తెల్లనివీ, మృదువైనవి ఐన ఇడ్లీలు గొప్పవి. అవి ఉద్దిపిండితో గుండ్రంగా, పెద్దగా, బరువుగా చేయబడతాయి.
శ్రీనాథుని కాశీఖండంలో ఇడ్లీ గురించి ఉందట.
చాళుక్యుల కాలాన ఇడ్లీ రికార్డు కాబడింది అంటే, అంతకు మునుపు కూడా అది ఉండి ఉండవచ్చును. ఇండోనేషియా లోని బోరోబుదుర్ - భారతీయులు స్థాపించినదే. అక్కడ పరంబనన్ దేవాలయం, ఇతరత్రా కూడా భారతీయులవే. అంతే కాదండోయ్, బహసా ఇండోనేషియా లో సంస్కృత ప్రాకృత శబ్దాలు కనిపిస్తాయి.
కనుక ఆ దేశానికి భారతదేశానికి మధ్య ఆదానప్రదానాలు ఉన్నాయి. కనుక ఇడ్లీ అక్కడి నుంచి వచ్చి ఉండాలి లేదా భారత దేశం నుండైనా వెళ్ళి ఉండాలి.
ఇంతటి ఘనమైన ఇడ్లీకి నా నుతి.
చక్రాకారం ధవళమృదులం చారురూపం సుభక్ష్యం
చట్నీయుక్తం ఘృతవిరచితం క్షారచూర్ణాత్ విభూష్యం |
సూపే సిక్తం రసభరమిదం సర్వదా సంప్రయుక్తం
ఇడ్లీ నామ్న్యాం ఉదరశుభదం పూర్ణతః భోక్తుమీడే ||
[29/05, 6:39 pm] Sriram: 🙏🙏🙏🙏🙏
తమలపాకుతో చేసిన కిళ్లీ నములుతున్నారా? వారికో శుభవార్త!
తమలపాకులకు ఉన్న ప్రత్యేకత మరే ఆకుకు ఉండదు. దేవుడికి సైతం తమలపాకులనే సమర్పిస్తారు. తమలపాకులను ఇతరులకు అందిస్తే శుభం జరుగుతుందని భారతీయుల నమ్మకం. ఇలా పండుగలకే కాకుండా తమలపాకులను కిళ్లీలుగా కూడా వేసుకుంటూ ఉంటారు. దీనికి అలవాటు పడిన వారు రోజుకు రెండు, మూడు నమలందే ఉండలేరు. తాంబూలంతో ఆరోగ్యమే కాని ఎలాంటి చెడు దరిచేరదు. తమలపాకు వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలేంటో తెలుసుకోండి.
ప్రయోజనాలు :
తమలపాకును తాంబూలం అని కూడా అంటారు. ఇందులో క్యాల్షియం, ఫైబర్, పోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉంటాయి.
తమలపాకులు నమలడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
తలనొప్పితో బాధపడేవారు తమలపాకులను నూరి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ముక్కులో వేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
ఈ రోజుల్లో అధిక బరువుతో బాధపడేవారు చాలామందే ఉన్నారు. వారు రెండు నెలలపాటు ప్రతిరోజూ ఒక తమలపాకు, 10 గ్రా. మిరియాలు కలిపి తినాలి. తర్వాత వెంటనే చన్నీళ్లు తాగితే సరిపోతుంది.
తమలపాకులో నూనె ఉంటుంది. ఇది ఫంగస్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
తమలపాకు నమిలేవారిలో వృద్దాప్య చాయలు తక్కువగా కనిపిస్తాయి. ఇది యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది.
రేర్గా కనిపించే బోధకాలు మనిషిని నాశనం చేస్తుంది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందాలంటే. రోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్ద చేసుకోవాలి. దీన్ని నీటితో తీసుకుంటే మేలు చేస్తుంది.
తమలపాకులు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా పనిచేస్తుంది. వీటిని ముద్దగా నూరి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు రమ్మన్నా కూడా రాదు.
🙏🙏🙏సర్వంశివసంకల్పం🙏🙏🙏
[29/05, 6:39 pm] Sriram: 💐ఈ ఒక్క దీపం వలన నవగ్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి దీపం ఎంత మహత్యమో తెలిస్తే💐
ప్రమిదల్లో దీపమెలిగించడంలో ఎంత నిగూఢ అర్థముందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీని ఓ లుక్కేయండి. ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా నవగ్రహాలను కొలిచినట్లవుతుందని.. ప్రమిద దీపం నవగ్రహ దోషాలను తొలగిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆలయాల్లో, గృహాల్లో ప్రమిదలతో దీపాలు వెలిగించడం మనం చూస్తూవుంటాం. ఎంతటి సంపన్నుడైనా దేవాలయానికి వస్తే ప్రమిదలతో దీపమెలిగించాల్సిందే. ఏ దేవునికైనా ప్రమిదలో దీపమెలిగించడం ద్వారా సుభిక్షమైన ఫలితాలను పొందవచ్చు. ప్రమిద, అందులోని నూనె, వత్తులు, కాంతికి నవగ్రహాలకు సంబంధం వుంది. ఇంకా ప్రమిదల్లో నేతిని నింపి దీప ప్రజ్వలన చేయడం ద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రమిదల్లోని జ్వాలలో మహాలక్ష్మి నివసిస్తుందని విశ్వాసం.
ప్రమిద దీపం -సూర్యుడు
నెయ్యి, నూనె- ద్రవపదార్థం - చంద్రుడు
వత్తులు - బుధుడు
ప్రమిదను వెలిగించడం ద్వారా ఏర్పడే జ్వాల- అంగారకుడు
ఈ జ్వాల నీడ భూమిపై పడుతుంది- ఇది భూమికి సంకేతమైన రాహువును సూచిస్తుంది.
జ్వాలలో కాంతినిచ్చే పసుపు రంగు- గురువు
దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే మసిలాంటి నల్లటి రంగు- శనికి సంకేతం
దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే కాంతి- ఇది జ్ఞానం.. కేతువుకు సంకేతం
ప్రమిదలోని వత్తులు తరుగుతూ రావడానికి శుక్రుడు సంకేతం. శుక్రుడు ఆశకు కారకుడని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.
అదెలాగంటే.. మానవుడు ఆశలను తగ్గించుకుంటే.. సుఖసంతోషాలు చేకూరుతాయనేందుకు ప్రమిదలో వెలిగే దీపమే నిదర్శనం. ఆశలతో మానవ జన్మ సార్థకం కాదని, తద్వారా మోక్షం లభించడం కష్టమని, తిరిగి తిరిగి మానవుడు ఆశల ద్వారా కర్మలు చేసుకుంటూ పోతాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ విషయాన్ని మట్టి ప్రమిదలో మనం వెలిగించే దీపం ద్వారా తెలుసుకోవచ్చునని వారు సెలవిస్తున్నారు...
[29/05, 6:39 pm] Sriram: 🙏మలయప్ప స్వామి......!!
🌸🌿🌸🌿🌸🌿🌸
తిరుమలలో మలయప్ప స్వామిని ఉత్సవమూర్తిగా ఊరేగించిన విశేషాలు తరచూ వార్తల్లోకి వస్తుంటాయి. ఇంతకీ ఎవరీ మలయప్ప స్వామి! ఆ పేరు ఎలా వచ్చింది! అసలు ఉత్సవ మూర్తి అంటే ఎవరు! అన్న విశేషాలు...
ధ్రువబేర:
తిరుమల గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టుని ధ్రువ బేర అంటారు. అంటే స్థిరంగా ఉన్న ప్రతిమ అని అర్థం. ఈ మూలవిరాట్టుని ఉన్న చోట నుంచి కదల్చరాదు కాబట్టి ఆ పేరు వచ్చింది. మరి గర్భాలయం వెలుపల శ్రీనివాసునికి సేవలు చేసేందుకు, కళ్యాణోత్సవం తదితర ఉత్సవాలు నిర్వహించేందుకు, ఊరేగించేందుకు ఒక అంశ ఉండాలి కదా! అదే ఉత్సవ బేర! తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు, ఉత్సవమూర్తిగా వెలుగొందుతున్నారు. మూలవిరాట్టుకి జరిగే ప్రతి కార్యక్రమానికీ ఈ ఉత్సవబేర ప్రతినిథిగా ఉంటుంది కాబట్టి, ఈ స్వామివారిని మూలవిరాట్టుతో సమానంగా భావిస్తారు.
చరిత్ర:
ఒకప్పడు ఉత్సవాల కోసం ఉగ్రశ్రీనివాసుని మూర్తిని వినియోగించేవారట. అయితే ఒకానొక బ్రహ్మోత్సవాల సందర్భంలో, స్వామివారి ఊరేగింపు జరిగే సమయంలో చుట్టుపక్కల మంటలు చెలరేగాయి. ఎందుకిలా జరిగిందా అని భక్తులు, అర్చకులు ఆందోళనపడుతుండగా ఒక భక్తుని ద్వారా స్వామివారు తన సందేశాన్ని వినిపించాడని అంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరో సౌమ్యమైన మూర్తిని ఉత్సవాల కోసం వినియోగించమన్నదే ఆ సందేశం. ఒక కొండ వంగి ఉండే ప్రదేశంలో ఆ మూర్తి కనిపిస్తుందని కూడా స్వామివారు తెలియచేశారట. ఆ సందేశాన్ని అనుసరించి భక్తులు నూతన ఉత్సవ మూర్తి కోసం వెతకసాగారు. అలా వారికి ఒకచోట శ్రీదేవిభూదేవి సహిత వేంకటేశ్వరుని విగ్రహాలు లభించాయి. ఈ స్వామివారికి తమిళంలో మలై కునియ నిన్ర పెరుమాళ్ (తలవంచిన పర్వతం మీద కొలువైన స్వామి) అన్న పేరుని స్థిరపరిచారు. కాలక్రమంలో అదే మలయప్పస్వామిగా మారింది.
రూపం:
మలయప్ప స్వామి విగ్రహం పంచలోహాలతో రూపొందింది. తామరపూవు ఆకారంలోని పీఠం మీద మూడు అడుగుల ఎత్తున ఠీవిగా ఉన్న శ్రీనివాసుని రూపం అది. శంఖుచక్రాలతోనూ, వరదహస్తంతోనూ స్వామివారి దివ్యమంగళ రూపం ఉంటుంది. ఈ విగ్రహానికి కుడివైపున శ్రీదేవి, ఎడమవైపు భూదేవి అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి. ఈ రెండు విగ్రహాలూ ఒకేలా ఉంటాయి. కాకపోతే భంగిమలు అటుదిటుగా ఉంటాయంతే! మరి ఇద్దరిలో ఎవరూ ఎక్కువతక్కువ కాదు కదా! శ్రీదేవిభూదేవి విగ్రహాలు కూడా వేంకటేశ్వరుని విగ్రహంతో పాటుగానే స్వయంభువులుగా దొరికాయని అంటారు. ఈ విగ్రహాలు దొరికిన కోనని ఇప్పటికీ మలయప్ప కోనగా పిలుస్తున్నారు. దాదాపు 700 సంవత్సరాలకు పూర్వమే లిఖించిన ఒక శాసనంలో ఈ విగ్రహాల ప్రసక్తి ఉన్నది.
సేవలు:
శ్రీవారికి భక్తులు జరుపుకొనే కళ్యాణోత్సవాలలో మలయప్ప స్వామివారినే వినియోగిస్తారు. సాయంవేళ జరిగే సహస్రదీపాలంకరణ సేవలోనూ స్వామివారే కొలువుంటారు. స్వామివారికి జరిగే కొన్ని అభిషేకాలలో కూడా ఉత్సవమూర్తికి భాగం ఉంటుంది. పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా మలయప్ప స్వామివారికే నిర్వహిస్తారు. ఇక పద్మావతి పరిణయం, బ్రహ్మోత్సవాల వంటి ఉత్సవాల సందర్భంగా మలయప్ప స్వామివారు గజ, అశ్వ, గరుడ, శేష తదితర వాహనాలలో వైభవంగా ఊరేగుతూ భక్తులకు ఆశీస్సులను అందిస్తారు.
🌸🌿🌸🌿🌸🌿🌸
[29/05, 8:23 pm] +91 96520 19186: ఆట విడుపు ....
✨✨✨😇😇😇✨✨✨
భార్య హాస్పిటల్ ఐసియు లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది .
బయట భర్త ఆవేదనని , కన్నీళ్లని ఆపడం ఎవరి వలన సాధ్యం కావడం లేదు .
ఐసియు నుంచి డాక్టర్ గారు భర్తను లోపలకు రమ్మని అతనితో ..!
" మేము మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాము . కానీ ఆవిడ ఏ మందులకి స్పందించడం లేదు . బహుశా ఆమె కోమాలోకి వెళ్లిపోయినట్టుంది ..! "
వెంటనే భర్త డాక్టర్ గారి కాళ్లపై పడి , భోరున విలపిస్తూ ..! " డాక్టర్ గారు తన వయసు 31 కూడా పూర్తి కాలేదు . జీవితంలో ఆమె ఏం చూసిందని దేవుడు ఇంత తొందరగా ఆమెను తన దగ్గరకు తీసుకెళ్ళిపోతున్నాడు . మీరే ఏదైనా చెయ్యండి ..! " అంటూ ప్రాధేయపడ్డాడు .
అప్పుడే ఒక అద్భుతం జరిగింది . ఈసిజి మిషన్ పనిచెయ్యడం ప్రారంభించింది .
హార్ట్ బీట్ మెల్లగా పెరిగింది .
చేతి వేళ్లు కదులుతున్నాయ్ .
మెల్లగా కళ్ళు తెరుచుకుంటున్నాయ్ .
పెదాలనుంచి మాట
మెల్లగా వస్తోంది...
అప్పుడు భర్త ఆనందంతో ఏం చెప్పాలనుకుంటున్నావ్ ..!? చెప్పు ..! అన్నాడు ....
అప్పుడు భార్య ....
భర్తను మెల్లగా రెండు పీకి ..
నావయసు29 మాత్రమే నండి ..! " అని చెప్పి ...
బ్రతికిపోయింది...
గరికపాటి వారి హాస్యం ఆవేదన కలగలిసిన అద్భుత ప్రవచనం
https://youtu.be/IbWYH_PmLSQ
✨✨✨😇😇😇✨✨✨
[30/05, 10:00 am] +91 99850 01339: 🙏🌷🙏🌷🙏🌷🙏🌷
ఒకసారి రామకృష్ణ పరమహంస గారు కాళీమాత పై ఉన్న అమోఘమైన భక్తితో అమ్మవారికి భోజనం సమర్పించి అమ్మవారి రాకకై వేచి ఉన్నాడు.అంతలోనే ఆకలిగా ఉన్న బిచ్చగాడు అమాంతంగా అమ్మవారి దగ్గర ఉన్న భోజనం తీనేస్తాడు. అది చూసిన రామకృష్ణ పరమహంస కోప్పడకుండా మళ్లీ నైవేద్యం తయారుచేసి అమ్మవారిని తినమని ప్రాధేయపడతాడు. అమ్మవారు వచ్చి తినేదాకా ఇక్కడ నుంచి పోయేదిలేదని మొండి పొట్టుతో కూర్చుని వేచిఉన్నాడు. ఆయన నిస్వార్ధభక్తికి మెచ్చిన ఆ కాళిమాత వచ్చి నాకు ఆకలిగా లేదు. ఇప్పుడే కదా నాకు భోజనం సమర్పించావు. కడుపు నిండిన తర్వాత ఎలా తినానగలను చెప్పు పుత్రా! అని అడుగుతుంది.విషయం అర్థంకాక రామకృష్ణ పరమహంస నీకు పెట్టినా నైవేద్యం భిక్షవాడు తీనేసాడు కదా?మరి నువ్వు ఎప్పుడు తిన్నావని ప్రశ్నిస్తాడు.ఆ మాటకు కాళికామాత ఆకలిగా ఉన్న భిక్షవాడిని కూడా నేనే! ఈ ప్రపంచంలో ఎవ్వరు నిస్వార్ధంగా ఆపదలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి సహాయం చేస్తారో ఆ సహాయం నాకు(దేవుడికి) చేసినట్లే! అందరూ నా పిల్లలే కదా! అని సమాధానం చెప్పి వెళ్లి పోయింది.అప్పటినుంచి రామకృష్ణుడు అందరిలోనూ,అన్నింటి లోనూ అమ్మను(కాళీమాతను) చూసుకుని జీవితం గడిపేవారు.
[30/05, 9:42 pm] D Krishnamurthy: *🍂యోగాలు ఎలా పుట్టాయి ?🍂*
👉🏻మానవుడు దేవుని చేరే విధానంలో జరిగే ప్రక్రియా మార్గమే యోగం.
అసలు యోగాలు ఎలా పుట్టాయి అని ఆలోచిస్తే ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తాయి. మనిషి తానున్న చోటినుంచే ఎక్కడకైనా వెళ్లగలడు. అలాగే, తనకున్న దానినుంచే ఇంకొక ఉన్నతమైనదానిని అందుకోగలడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ విలక్షణుడే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ప్రత్యేకత ఉంటుంది. వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శక్తిని బట్టి వారి వ్యక్తిత్వంలోని విలక్షణతను బట్టి ఆయాయోగాలు వారికి సరిపోతాయి. అందరికీ అన్ని యోగాలు సరిపోవు అనడానికి ఇదే కారణం.
👉🏻మనిషి అనేవాడు దేహం, ప్రాణం, హృదయం, కర్మేంద్రియ,జ్జానేంద్రియ, మనో, బుద్ది, ఆత్మల కలయిక.
👉🏻అలాంటి మనిషికి కర్మేంద్రియాలున్నాయి. వీటిద్వారా భగవంతుని అందుకునేది కర్మయోగం. కొందరు పని చెయ్యకుండా క్షణం ఊరుకోలేరు. వారి జీవితం అంతా కర్మ మయంగా ఉంటుంది. అటువంటివారికి కర్మయోగం సరిపోతుంది.
👉🏻మనిషికి జ్ఞానేంద్రియాలున్నాయి. వీటి ద్వారా దేవుని చేరుకునేది జ్ఞానయోగం. కొందరిలో బుద్ది చాలా తీక్షణంగా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఒకరిపైన ఆధారపడకుండా, ఏ బంధాలలోనూ ఇమడకుండా, పూర్తి స్వతంత్రంగా ఉండాలనే గట్టి వ్యక్తిత్వం కలవాళ్ళకు సరిపోయేది జ్ఞానయోగం.
👉🏻మనిషికి స్పందించే హృదయం ఉంది. దానిద్వారా కలిగే ప్రేమతత్వంతో భగవంతునిచేర్చేది భక్తియోగం. సున్నిత మనస్కులకు, దయా స్వభావులకు, ఒకరిపైన ఆధారపడే స్వభావం ఉన్నవారికి సరిపోయేది భక్తి యోగం.
👉🏻మనిషికి శరీరం ఉంది. కొందరికి దేహస్పృహ ఎక్కువగా ఉంటుంది. దేహాన్ని దాటి వాళ్ళ ఆలోచనలు ముందుకు పోలేవు. వీరికి ముందుగా కావలసింది హఠయోగం. శరీరంలో కఫ శ్లేష్మాది కల్మషాలు ఎక్కువగా ఉన్నవారికి వాటి ప్రక్షాళణ కోసం ఇది బాగా పనిచేస్తుంది.
👉🏻మనిషికి మనస్సు ఉంది. దానిద్వారా పరమాత్ముని చేరుకోవటం రాజయోగం. మనో మయ జీవులకు, ఆలోచనాపరులకు రాజయోగం చక్కగా సరిపోతుంది.
👉🏻మనిషికి ప్రాణశక్తి ఉన్నది. దానిద్వారా ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుని చేరుకోవటం కుండలినీ యోగం. ప్రాణ సాధకులకు, ప్రాణ శక్తి ఎక్కువగా ఉన్నవారికి ఈ యోగం బాగా సరిపోతుంది.
👉🏻వీరు ఇతర మతాలవలె అందరినీ ఒకే త్రాటిన కట్టకుండా ఉండడం మన సనాతన మతం యొక్క విశిష్టత. నువ్వున్న చోటినుంచి ముందుకు నడువు, నువ్వున్న చోటినుంచే పైకి ఎదుగు అని మన మతం చెబుతుంది.
ఆ క్రమంలో పుట్టినవే వివిధ యోగ ప్రక్రియలు.
*🌾సర్వేజనాఃశుఖినోభవంతు🙌🏼సమస్త సన్మంగళానిభవంతు🎋*
[01/06, 9:00 am] Mallapragada Sridevi: ప్రాంజలి ప్రభ..100 నుండి 104 వరకు
నీతి
బోధించుటకా ఆచరించుటకా
అనుభవించుటకా
ఆత్మీయులను బతికించుటకా
స్నేహము
మనసు బాధ తెలిపేందుకా
కోరికలు తీర్చు కొనేందుకా
ప్రేమను తెలిపేందుకా
రోగము
మనిషిలో ఉందా బయట వుందా
కర్మ అని సర్దు కోమందా
మందు వాడితే రోగము పోతుందా
ఆశలు
మనుష్యులను బతికిస్తాయా
చచ్చుటకు మార్గ మోతాయా
చంపుటకు మార్గమోతాయా
[01/06, 9:24 am] Mallapragada Sridevi: 105..చిరునవ్వు
నీలో లేదెందుకు, నాలో ఉందెందుకు,
నీకు నమ్మకం లేదెందుకు
నవ్వుకోవడానికి రావెందుకు
106..దైవభక్తి
ఉండితీరాలి ఆస్తికుడుగా
ఉండకూడదు నాస్తికుడుగా
నడిపించేది దేవుడే గా
107..దేశ భక్తి
పుట్టినప్పుడే ఉగ్గుపాలతో నేర్పింది అమ్మ
కండకావరంతో లేదన్నా దేశం బతికి స్తుందని చెప్పేది అమ్మ
దేశద్రోహుడుగా మారితే నరికేది అమ్మ
108..గురుభక్తి
ఉన్నవాడు జీవితాన్ని చూడగలుగుతాడు
లేనివాడు జీవితంలో కష్టాలు చూస్తాడు.
109. వార్ధక్యం
పిరికిది కానేకాదులే మేధాసంపత్తు పంచే శక్తి లే
గౌరవించేవాడికి తెలుస్తుందిలే
110.. సత్యమే
విశ్వాన్ని నడిపించు ఆయుధము
దేనికీ లొంగని బతుకు జీవనము
సత్యవాణి తాకే మంత్రము
No comments:
Post a Comment