🕉️ వైశాఖ పురాణం 6 వ అధ్యాయము 🕉️
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
🌻 జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ 🌻
💫🌹నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను.
💫🌹మహారాజా! వినుము మాసవ్రతములన్నిటిలో నుత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.
💫🌹పూర్వము యిక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటిబొట్టులను గణించుట, ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము.
💫🌹అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు.
💫🌹బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే యెవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను.
💫🌹ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరును ప్రసిద్దులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.
💫🌹ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగ నేడుమార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారజు గృహమున గోడపైనుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను.
💫🌹మిధిలాదేశ రాజగృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్నకాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి యెదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి దీసికొవచ్చెను. వానిని మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి యా నీటిని తన తలపై జల్లుకొనెను.
💫🌹అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని యెగిరి గోడమీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము నన్ను రక్షింపుమని మానవునివలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ! నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు. నీవు యేపని చేసి యిట్టి దశనందితివి? ఇట్లేల అరచుచున్నావు? నీవు దేవజాతివాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకీదశయేల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను.
💫🌹శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగదమహారాజు మహాత్మా! నేను యిక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. భూమియందలి రేణువులెన్ని యుందునో, నీటియందు జలబిందువు లెన్నియుండునో, ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని.
💫🌹నేనెన్ని సత్కర్మల నాచరించినను, ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, యేడుమార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుచుండగా కొన్ని నీటితుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గి…
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
🎈 భాగము 69 (దర్భ సమర్పణ) 🎈
🍃🌹బ్రహ్మోత్సవాల సందర్భంగా - తితిదే అటవీ శాఖాధికారులు, ఆలయ అధికారులకు దర్భను సమర్పిస్తారు. ధ్వజారోహణపర్వంలో; ఆలయం నందు నిర్వహించే సేవలు, కైంకర్యాలు, హోమాల్లో ఈ దర్భను వినియోగిస్తారు. ఈ దర్భతో తయారు చేయబడిన చాప, తాడు ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయాధికారులకు అందజేస్తారు.
🍃🌹ఈ దర్భను తిరుమలలోని కళ్యాణ వేదిక కెదురుగా ఉండే తితిదే అటవీ విభాగం నర్సరీల్లోనూ, తిరుపతి సమీపం నందున్న వడమాలపేట గ్రామంలోని పొలంగట్ల నుండి సేకరిస్తారు. ఇలా సేకరించిన దర్భలను పదిహేను రోజులు నీడలో ఆరబెడతారు. ఆ దర్భతో తయారు చేసిన కొడితాడు, చాప, విడిగా సుమారు 10 కిలోల దర్భను అధికారులకు అందజేస్తారు.
🌻 రవాణా సదుపాయాలు 🌻
🍃🌹తిరుపతి - తిరుమల మధ్య రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడిపే తొలి బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వ…
✍️....... తీరిక వేళల్లో
💧మనం విశ్రాంతి తీసుకోవాల్సింది. ఎప్పుడంటే.. అందుకు మనకు బొత్తిగా సమయం లేనప్పుడే।
🎈ప్రతిరోజూ మనం.... ఆలోచించేందుకు సమయాన్ని కేటాయించాలి! అది శక్తికి మూలం. చదవడానికి సమయాన్ని వివేకానికి కేటాయించాలి. అది పునాది. ప్రార్ధించేందుకు సమయాన్ని కేటాయించాలి! అది మనశ్శాంతికి రహస్యం. శ్రమించేందుకు సమయాన్ని కేటాయించాలి! అది విజయానికి చెల్లించాల్సిన మూల్యం.
🎈మన వెనక గతం ఉంది, దాని నుండి నేర్చుకోవాలి; మన ముందు భవిష్యత్తు ఉంది. దాని కోసం సిద్ధం కావాలి; కానీ వర్తమానం ఇప్పుడే, ఇక్కడే ఉంది, దానిలో జీవించాలి!
🎈ప్రతివారిలోనూ ప్రత్యేకత ఉంది. కానీ దాన్ని కనిపెట్టే తీరిక, ఓపికలే ప్రతి ఒక్కరికీ లేవనుకుంటా!
పథ్యపు మాటలు!
“ పెద్దనాన్నగారూ! నాన్నను నిన్ననే అపోలోలో జాయిన్ చేసా! నాలుగురోజులుగా జ్వరం తగ్గలేదు! ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఛాన్స్ తీసుకోలేక, వెంటనే అపోలోకి తెచ్చా. రాపిడ్ టెస్ట్ పాజిటివ్! నిన్ననే Remdesivir మొదలుపెట్టారు! ఫ్రెండొకడు పెద్ద రికమెండేషన్ మీద రూమ్ ఇప్పించాడు!”.... పాఠం అప్పచెప్పినట్టు చెప్పేసాడు ఋుషి... కొంత ఆయనంటే భయం, కొంత తండ్రిగురించిన ఆందోళనా పాపం పిల్లాడిలో!
“ అవునా! ఎలా ఉన్నాడ్రా వాడు?”.... అని అడిగారు సత్యమూర్తిగారు. “ ఇదిగోండి ఇస్తా ! ఒకసారి మాట్లాడండి!”.... అంటూ తండ్రిచేతికి ఇచ్చాడు ఋుషి! “ అన్నయ్యా!”... అంటూ నీరసంగా పలకరించాడు సూర్యం!
“ జాగ్రత్తరోయ్! రోజులేం బాలే! మన కుటుంబంలోనే... ఇప్పటికి డజన్ కేసులు. నలుగురు పోనే పోయారు. మా చుట్టుపక్కల అపార్ట్ మెంట్లలో రోజుకో రెండుమూడు కేసులురా! ఈ సెకండ్ వేవ్ ఊడ్చిపెట్టేస్తోంది జనాలను! ఇంట్లో ఏ కషాయాలో తాగి ఉండకుండా... వెధవ ఆసుపత్రికి ఎందుకు పోయావ్. ఆస్పత్రికి వెళ్ళిన వాళ్ళు సగం మంది తిరిగే రావడం లేదట! పైగా మూడువేల మందు ముప్ఫైవేలకు అమ్ముతున్నారట. అయినా కుర్రవెధవ నీతో ఉండడమేంటి? మొన్న మా రాజారావ్ కొడుకు... తల్లీతండ్రికీ కోవిడ్ వచ్చిందని పరిగెట్టుకొస్తే, వాడికీ మహమ్మారి అంటుకుని... మొత్తం కుటుంబం బలయిపోయారు!”...... అన్నగారి భయభ్రాంతిజనిత వాక్కులకు అప్పటికే వణికిపోతున్నాడు సూర్యం! ... స్వాభావికంగా కుటుంబంలోనే పిరికివాడు, అర్భకుడు అతను. దానికి తోడు కోవిడ్!
భర్తచేతిలోంచి ఫోన్ లాక్కున్నట్టు తీసుకుంది సత్యవతమ్మ! “ నాయనా సూర్యం!! నేను పెద్దవదిన్ని!”... అందో లేదో భోరుమన్నాడు మరిది!
“ వదినా! అంతా అయిపోయింది. పిల్లల్ని , సీతనీ దిక్కులేని వాళ్లను చేసి పోతున్నాను. వాళ్ళ పెళ్ళిళ్లు, పుణ్యకార్యాలూ నీదే బాధ్యత ఇకపై”... అంటూ ఏవేవో అనేస్తున్నాడు సూర్యం!
“ నీ మొహం! ఏవీ అవ్వవు.రెండు రోజుల్లో లక్షణంగా ఇంటికొచ్చేస్తావు. పోనీ నన్ను రమ్మంటావా, అంత భయంగా ఉంటే! సూరీ నీకొకటి చెప్పనా, ఏడిద సుబ్బారాయుడి గారు రాసిన నీ జాతకప్రకారం నీకు తొంభై ఎనిమిదేళ్ళ ఆయుర్దాయం ఉంది. ఇప్పటి వరకూ ఆయన చెప్పింది సహస్రాంశమేనా తప్పలేదు. చిన్నప్పుడు మశూచికమే ఏమీ చెయ్యలేదు నిన్ను, ఈ కోవిడ్ ఎంతయ్యా! నువ్వు చేసుకునే...నిరంతర మహాసౌరజపం , ప్రాణాయామం ఉత్తినే పోవు. ఇట్టే తరిమేస్తాయి మహమ్మారిని. ధైర్యంగా ఉండు. నాకూ, సీతకూ మానససరోవరం చూపిస్తానన్నావు. మాట నిలబెట్టుకోవాలిగా! కనుక వెర్రి ఆలోచనలు మాని, హాయిగా వైద్యం చేయించుకుంటూ, బలంగా తింటూ,భగవధ్యానం చేసుకో. శుభ్రంగా నయమయిపోతావు. అన్నయ్య చేత ఓ లక్షరూపాయిలు నీ అకౌంట్లో వేయిస్తా. అందాకా వుంచు! అవసరమయితే అందరం నీతో ఉన్నాం! సరేనా నాన్నా!”..... వదినగారి సాంత్వన వచనాలతో సగం రోగం తగ్గనట్టయింది సూర్యానికి!
“ అన్నయ్య తెగ భయపెట్టేసాడనుకో వదినా!”... అన్నాడు నీరసంగా!
“ విన్నానయ్యా! ఏం మనిషో ఏం లోకమో! అలాగేనా మాట్లాడేది? అంత తెలివే ఉంటే... కలెక్టర్ గా రిటయిర్ అయ్యేవారు కాదూ! డిప్టీగా మిగిలిపోయారు! ... అందామె కినుకగా!
పకపకా నవ్వాడు సూర్యం,ఆమె మాట్లాడిన తీరుకి ! తనేం తప్పు గా మాట్లాడేడో తెలియక ,అయోమయంగా చూస్తూ, మళ్ళీ టీవీలో కరోనా వార్తలకు అతుక్కుపోయారు సత్యమూర్తి!
@ కాశీ కి వెళితే...కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు.... అందులో మర్మమేమిటి ??
అసలు శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పలేదు..
శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు.
కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి " కాయాపేక్ష మరియు ఫలాపేక్ష" ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.
ఇక్కడ కాయాపేక్షా, ఫలాపేక్ష అన్నారు...అంటే...ఈ కాయము పై ( శరీరము పై అపేక్ష ని ) , ఫలాపేక్షా ( కర్మ ఫలము పై అపేక్ష ని) పూర్తిగా వదులుకొని...కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.
కాలక్రమేణా...అది కాస్తా కాయ, పండు గా మారిపోయింది.
అంతే కానీ... కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే...మనకు వచ్చు భక్తి కానీ, అందులో నిజమైన పుణ్యం ఎం ఉంటుంది.
కనుక.... శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని... ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే..నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది... అంతే కాని మామిడి పండుని, వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.
కనుక...ఈసారి మీరు కాశీ వెళితే....మనకి శత్రువులు అయిన ఈ శరీరం పై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని....ఆ విశ్వనాథ దర్శనం చేసి, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్దిదాం.
No comments:
Post a Comment