🕉️ వైశాఖ పురాణం 16వ అధ్యాయము 🕉️
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
🌻 యముని పరాజయము 🌻
💫🌹అప్పుడు నారదమహర్షి యమలోకమునకు వెళ్లెను. యమలోకస్థితిని జూచెను. యమధర్మరాజా! నీ లోకమున నరకబాధలు పడువారి రోదన, ధ్వనులు వినిపించవేమి? చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కను వ్రాయుటమాని మునివలె మౌనముగ నున్నాడేమి? సహజముగ బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండటకు కారణమేమి? అని ప్రశ్నించెను.
💫🌹యముడును దీనుడై యిట్లనెను. నారదమహర్షీ! భూలోకమున యిక్ష్వాకు వంశము వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిలి విష్ణుభక్తుడు. అతడు ధర్మభేరిని మ్రోగించి తన ప్రజలందరిని వైశాఖవ్రతము నవలంభించునట్లు చేయుచున్నాడు. చేయని వారిని తీవ్రముగ శిక్షించుచున్నాడు. ఇందువలన ప్రతివారును భక్తివలననో దండన భయముననో తప్పక వైశాఖమాస వ్రతమును ధర్మములను ఆచరించుచు చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరుచున్నారు.
💫🌹ఇందువలన నరకమునకు వచ్చువారెవరును లేక వైశాఖస్నానాదుల మహిమవలన శ్రీహరిలోకమునకే పోవుచున్నారు. ఇందువలన నేను మ్రోడైనమానువలెనుంటిని. నాకు యిట్టిస్థితి పోయి పూర్వపు స్థితి రావలెను. అందులకై ఆ రాజుపై దండెత్తి వానిని చంపదలచితిని. యజమాని చెప్పినపనిని చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసికొని ఊరకుండువాడు తప్పక నరకము నందును నేనును బ్రహ్మచే యమలోకమున పాపులను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును.
💫🌹ఆ రాజును నేను చంపలేక పోయినచో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమియని యడుగుదును. అని యమధర్మరాజు నారదునకు చెప్పెను. నారదుడును బాగున్నదని తన దారిన పోయెను.
💫🌹యమధర్మరాజు తన వాహనమైన మహిషము నెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులగు యేబదికోట్ల యమభటులతో కీర్తిమంతుడును వచ్చినవాడు యమధర్మరాజని తెలిసికొని యుద్ధసన్నద్ధుడై యమధర్మరాజునెదిరించెను. యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను. యముని సేవకులగు మృత్యువు, రోగము, యమదూతలు కీర్తిమంతుని యెదిరింపలేక పారిపోయిరి.
💫🌹యముడు ప్రయోగించి ఆయుధములన్నియు కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి. తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో మంత్రించి దండమును కీర్తిమంతునిపై ప్రయోగించెను. మిక్కిలి భయంకరమైన ఆ యమదండమును జూచి అందరును బెదిరి హాహాకారములను చేసిరి.
💫🌹అప్పుడు శ్రీహరి తన భక్తుడగు కీర్తిమంతుని రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను. భయంకరమగు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనములగావించి మరలించి యమునిపై మరలెను. విష్ణుభక్తుడను కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రమునిట్లు స్తుతించెను.
సహస్రార నమస్తేస్తు విష్ణుపాణి విభూషణ
త్వం సర్వలోక రక్షాయై ధృతః పురా
త్వాం యాచేద్యయమంత్రాతుం విష్ణుభక్తం మహాబలం ||
నృణాందేవద్రుహాంకాల స్త్వమేవహినచాపరః
తప్పాదేవం యమం రక్ష కృపాంకురు జగత్పతే ||
💫🌹అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శనచక్రము యముని విడిచి దేవతలందరును చూచుచుండగా నా రాజు వద్దకు వచ్చి నిలిచెను. యముడును తన సర్వ ప్రయత్నములను వ్యర్థములగుటను గమనించెను. కీర్తిమంతుడు సుదర్శనమును ప్రార్థించి తనను రక్షించుటను చూచి మిక్కిలి అవమానమును విషాదమును పొందెను.
💫🌹అతడు తలవంచుకొని సవిచారముగ బ్రహ్మదేవుని వద్దకు పోయెను. ఆ సమయమున బ్రహ్మ సభదీర్చియుండెను. మూర్తములు, అమూర్తములునగు వారిచే బ్రహ్మ సేవితుడై యుండెను. బ్రహ్మ దేవతల కాశ్రయమైనవాడు. జగములు అను వృక్షమునకు, బీజము, విత్తనము అయిన వాడు. అన్ని లోకములకును పితామహుడు.
💫🌹ఇట్టి బ్రహ్మను లోకపాలకులు, దిక్పాలకులు, రూపముకల, ఇతిహాసపురాణాదులు, వేదములు, సముద్రములు, నదీ నదములు, సరోవరములు, అశ్వర్థాది మహా వృక్షములు, వాపీకూప తటాకములు, పర్వతములు, అహోరాత్రములు, పక్షములు, మాసములు, సంవత్సరములు, కళలు, కాష్ఠములు, నిమేషములు, ఋతువులు, ఆయనములు, యుగములు, సంకల్ప వికల్పములు, నిమేషోన్మేషములు, నక్షత్రములు, యోగములు, కరణములు, పూర్ణిమలు, అమావాస్యలు, సుఖదుఃఖములు, భయాభయములు, లాభాలాభములు, జయాపజయములు, సత్వరజస్తమోగుణములు, సాంత, మూఢ, అతిమూఢ, అతి ఘోరావస్థలు, వికారములు సహజములు, వాయువులు, శ్లేష్మవాత పిత్తములు వీనితో కొలువు దీరిన బ్రహ్మను చూచెను.
💫🌹ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో క్రొత్తపెండ్లి కూతురు వలె తలవంచుకొని ప్రవేశించెను. ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని జూచి సభలోనివారు క్షణమైన తీరికయుండని యితడిక్కడికెందులకు వచ్చెను. తలవంచుకొని విషాదముగ నుండుటకు కారణమేమియని సభలోనివారు విస్మయపడిరి. ఇతడు వచ్చిన కారణమేమి? పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో నుండుటేమి? అని యిట్లు సభలోనున…
[9:03 pm, 26/05/2021] +91 94414 08564: 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🌻 తిరుమల సర్వస్వం 🌻
🎈 భాగము 79 (అశ్వవాహనోత్సవం) 🎈
గక్కున నయిదవనాడు గరుడునిమీదను యెక్కెను ఆరవనాడు యేనుగుమీద చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోను యిక్కున చేరును గుర్ర మెనిమిదోనాడు
🍃🌹బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవరోజు రాత్రి మలయప్పస్వామివారు ఒంటరిగా, కలిపురుషుని వేషధారణలో, శిరస్త్రాణభూషితుడై, నడుముకు కత్తి - డాలు ధరించి, ఒక చేతియందు చర్నాకోల - మరో చేతితో గుర్రపు పగ్గాలు చేబూని, యుద్ధానికి సిద్ధంగా ఉన్న వీరాధివీరుని వలె, అశ్వవాహనంపై రాచఠీవి ఉట్టిపడేలా ఊరేగుతారు.
🍃🌹అశ్వానికి చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక, సమకాలీన ప్రాశస్త్యం విశేషంగా ఉంది. వేగానికి ప్రతీక అయిన అశ్వం చతురంగబలాలలో ప్రధానమైనది. యుద్ధాలలో సైనికులు గుర్రాలనెక్కి యుద్ధం చేస్తుండగా, దళాధిపతులు - రారాజులు తమతమ హోదాలను బట్టి అశ్వాలు పూన్చిన రథాలపై నుండి సమరం సాగించేవారు. విశ్వాసానికి మారుపేరైన అశ్వరాజాలు తమ యజమానులను కాపాడటం కోసం, తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఉదంతాలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి.
🍃🌹పురాణేతిహాసాల ననుసరించి - శ్రీహరి శ్రీనివాసునిగా భూలోకం లోని వేంకటాచలం చేరి; పద్మావతిదేవిని పరిణయమాడటం కోసం - వేట నెపంతో, ఖడ్గధారియై, అశ్వం మీద నారాయణవనాని కేతెంచారు. క్షీరసాగరమథనంలో పుట్టిన ఉచ్ఛైశ్రవము అనే అశ్వరాజ్యాన్ని ఇంద్రుడు తన వాహనంగా స్వీకరించాడు. శ్రీమహావిష్ణువు యొక్క జ్ఞానావతారాలలో మొదటిది "హయగ్రీవుని" అవతారం. హయగ్రీవుడంటే, "గుర్రం ముఖం కలిగిన దైవం" అని అర్థం.
🍃🌹హయగ్రీవునికి గుర్రం ముఖం ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఒకానొకప్పుడు పదివేల ఏండ్లపాటు నిర్విరామంగా రాక్షసులతో యుద్ధం చేసి అలసిపోయిన శ్రీమహావిష్ణువ - అల్లెత్రాడుతో (వింటినారితో) ఇరుకొనలూ బిగించి కట్టబడిన "శార్ ఇం" అనబడే ధనుస్సు యొక్క ఒక కొనను నేలపై నుంచి, మరొక కొనపై గెడ్డాన్ని ఆన్చి, నుల్చొని ఉండే నిద్రపోతాడు ("...శార్ ఇం ధన్వాః గదాధరః" అన్న విష్ణుసహస్రనామ శ్లోకాన్ని స్మరణకు తెచ్చుకోండి). ఆయనను నిద్రనుండి మేల్కొలపటానికి దేవతలు భయపడుతుంటే - బ్రహ్మదేవుని ఆజ్ఞమేరకు ఓ "వజ్ర" (చెదపురుగు), వింటినారిని కొరికి శ్రీహరికి నిద్రాభంగం కావించే ప్రయత్నం చేస్తుంది.
🍃🌹కానీ, దురదృష్టవశాత్తూ వింటినారి తెగడంతో, ధనుస్సు యొక్క కోపు అతివేగంగా వెళ్ళి విష్ణువు యొక్క తలను ఛేదించగా, ఆ శిరస్సు వెళ్ళి ముల్లోకాలకు ఆవల పడుతుంది. ఈ హఠాత్సంఘటనకు నివ్వెరబోయిన దేవతలు, లక్ష్మీదేవి యానతి ననుసరించి, ఓ అశ్వరాజాన్ని వధించి దాని శిరస్సును తీసుకుని వస్తారు. దేవశిల్పి గుర్రం తలను విగతజీవియైన విష్ణుమూర్తి మొండానికి అతికించగా, బ్రహ్మదేవుడు తిరిగి ప్రాణం పోస్తాడు. ఇదంతా, లోకకళ్యాణార్థం, పూర్వపు యుగాల శాపాలు - వరాల ననుసరించి జరుగుతుంది.
🍃🌹సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి హయగ్రీవుని ఆలయం, ఉత్తరమాడవీధి చివరిభాగంలో, స్వామిపుష్కరిణి యొక్క ఈశాన్యదిక్కుకు ఎదురుగా స్థితమై ఉంది.
🍃🌹బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటిదైన "పెద్దశేషవాహనం" కుండలినీయోగానికి ప్రతీక అయితే, చిట్టచివరిదైన "అశ్వవాహనం" ఓంకారానికి సంకేతం.
🍃🌹అసమాన శక్తికి, శారీరక దృఢత్వానికి కూడా అశ్వం పేర్గాంచింది. ఆధునికయుగంలో యంత్రశక్తిని "హార్స్ పవర్" లేదా "అశ్వికశక్తి" తో గణించటం మనందరికీ విదితమే!
🍃🌹దాదాపు నూరు సంవత్సరాల పూర్వం వరకూ, బ్రహ్మోత్సవాలకై ఆహ్వానం పలకడం లోనూ అశ్వరాజాల పాత్ర ఎంతగానో ఉండేది. ఉత్సవ ప్రారంభానికి దాదాపు రెండు నెలల ముందుగానే - బ్రహ్మోత్సవ చిహ్నమైన ధ్వజాన్ని చేబూని, 24 అశ్వికదళాలు మేళతాళాలు మ్రోగించుకుంటూ, ఉత్సవాలకై అట్టహాసంగా సమస్త జనులకూ ఆహ్వానం పలుకుతూ అన్ని దిక్కులలో బయలుదేరేవి.
🍃🌹వారి తిరుగుప్రయాణంలో - ఉత్సవాలకు విచ్చేసే భక్తుజనులందరూ, వారివారి వాహనాలలో అశ్వికదళాల ననుసరిస్తూ, వారి రక్షణలో తిరుమల క్షేత్రాన్ని చేరుకునేవారు. రాలేని భక్తులు వారి వారి కానుకలను అశ్వదళం ద్వారా శ్రీవారికి పంపేవారు.
🍃🌹విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో చిట్టచివరిది "కల్కి" అవతారం. కలియుగాంతంలో కల్కిభగవానుడు ఖడ్గం చేబూని, అశ్వవాహనం ఎక్కి, దుష్టసంహారం గావించి ధర్మాన్ని పునరుద్ధరించుతాడని పురాణాలు చెబుతున్నాయి.
🍃🌹శ్రీకృష్ణదేవరాయలు తన "ఆముక్తమాల్యద" గ్రంథంలో కల్కి అవతారం గురించి విశదంగా వర్ణించాడు. అశ్వం వేగానికి ప్రతీక అయితే, మనస్సు దాని కంటే వేగవంతమైనది. హరిని తలంచినంతనే జ్ఞానచక్షువులు వైకుంఠాన్ని దర్శిస్తాయి. ఇంద్రియాలను ఆలవాలంగా చేసుకొని మనస్సు అత్యంత వేగంతో పరిభ్రమిస్తుంది. అందుకే "మనోవేగము" అన్న నానుడి వాడుకలోకి వచ్చింది. అశ్వారూఢుడై ఊరేగుతున్న స్వామి - నిరంతర సాధనతో ఇంద్రియాలపై విజయం సాధించి, దాని ద్వారా మనస్సు యొక్క వేగాన్ని నియంత్రించి పరమాత్మపై లగ్నం చేయాలని - ఉపదేశిస్తున్నారు.
🍃🌹యుగాంతంలో తాను జరుపబోయే దుష్టశిక్షణ కార్యక్రమానికి నాందీ ప్రస్తావన కూడా ఇప్పుడే పలుకుతున్నారు. "కలి" అనే శబ్దానికి పుణ్యం అని అర్థం. కృతయుగంలో ఒక సంవత్సరం పాటు చేసేటటువంటి తపస్సు, త్రేతాయుగంలో చేసినటువంటి యజ్ఞాలు, ద్వాపరయుగంలో కావించినటువంటి అర్చనలు - వీటి ద్వారా ఎంత ఫలితం వస్తుందో, అంతే ఫలితం కలియుగంలో ఒక్కరోజు, ఒక్కగంట - నిశ్చలమైన మనస్సుతో భగవధ్యానం చేస్తే వస్తుందట!
🍃🌹అందుకే కలియుగం అంత గొప్పది. ఈ యుగంలో జన్మించిన మనం పరమాత్మను సేవించుకుంటూ, కలిపురుషుని రక్షణలో, జన్మను సార్థకం చేసుకోవాలి. ధర్మానికి ఎప్పుడు హాని కలుగుతుందో, నిజమైన ధార్మికులు ఎప్పుడైతే కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతారో, అప్పుడు దుష్ట శిక్షణకు కల్కిభగవానుడు అవతరిస్తాడని అశ్వ వాహనం ద్వారా తెలుప బడుతోంది.
నీవు తురగముమీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదచల్లి తపుడు పదిలముగ నిరువంక పసిడి పింజల యంప పొదల తరకసములొరవులు నెరపగా గదయు శంఖము చక్రము ధనుఃఖడ్గములు పదివేలు సూర్యబింబము లైనవపుడు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 శ్రీవారి పౌర్ణమి గరుడసేవ 🙏
No comments:
Post a Comment