🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺
#గ్రానైట్ #ముక్కలు -#గజదొంగలు
శ్రీమఠం మకాం #కార్వేటినగరంలో ఉంది. కారులో చెన్నై నుండి వచ్చిన ఒక కుటుంబం ఆరోజు సాయింత్రానికే తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. అంతా సిద్ధం చేసుకున్నారు. #మహాస్వామి వారు వెళ్ళమని చెప్పగానే బయలుదేరివెళ్ళడానికి నిర్ణయించుకున్నారు.
#మహాస్వామివారు ఒక బిల్వవృక్షం కింద కూర్చున్నారు. సబేసన్ కుటుంబం స్వామివారికి నమస్కరించి ప్రసాదం కోసం వేచియున్నారు. ప్రసాదం తీసుకుని కారు వద్దకు వెళ్తుండగా స్వామివారు #చిటికేసిన శబ్ధం వినపడడంతో ఆత్రుతగావెనక్కు వచ్చారు. కొద్దిదూరంలో ఉన్న విరిగిపోయిన గ్రానైట్ రాళ్ళముక్కల గుట్టవైపు చూపిస్తూ “వీటిని కొన్ని ఒక చిన్న గోనెసంచిలో తీసుకుని, గట్టిగా కట్టి ఇంటికి తీసుకుని వెళ్ళు” అని చెప్పారు.
అందరూ అయోమయంగా చూశారు. విరిగిపోయిన #గ్రానైట్రాళ్ళని కార్వేటినగరం నుండి చెన్నై తీసుకుని వెళ్ళడం ఎందుకు?ఆ రాళ్ళకున్న ప్రత్యేకత ఏమిటీ? ఎవరూ స్వామివారిని అడిగే ధైర్యం చెయ్యలేదు. కాబట్టి సబేసన్ కొన్ని రాళ్ళని గోనెసంచిలో తీసుకుని గట్టిగా ముడివేసి, దాన్ని కారువెనుక భాగంలో పెట్టి బయలుదేరాడు.
పుత్తూర్ రోడ్డు ఇరువైపులా రాళ్ళ గుట్టలతో ఉంటుంది. ఆ రాత్రి సమయంలో నలుగురైదుగురు మగవారు రోడ్డు మధ్యలో నిలబడి కారుని ఆపారు. వారు #హైవే #దొంగలని తెలుస్తోంది. కారులోనుండి అందరిని బయటకు తోసి లోపల దేనికో వెతకనారంభించారు. కాని ఏమి దొరకలేదు. కోపంతో కారు వెనుకభాగాన్ని తెరవగా అక్కడ ఉన్న మూట కనపడింది.
“ఒరే! అది ఇక్కడుంది రా” అరిచాడు వాళ్ళల్లో ఒకడు.
మరొకడు దాన్ని తీసుకొవడానికి ప్రయత్నించాడు కాని చాలా బరువుగా ఉండడం వల్ల కుదరలేదు. అందరూ కలిసి దాన్ని కిందకు దింపారు. “వెళ్ళిపోండి వెళ్ళిపోండి” అని సబేసన్ కుటుంబాన్ని తొందరపెట్టారు. సబేసన్ ఎక్కడాఆగకుండా కనీసం వెనుకకు చూడకుండా చాలా వేగంగా కారుని నడుపుతూ ఏదో ఒక చిన్న ఊరు కనపడడంతో కారు ఆపి ఊపిరి పీల్చుకున్నారు.
”నాకు చాలా #భయమేసింది. ఖచ్చితంగా వళ్ళు మన నగలను అడుగుతారు అనుకున్నాను” అంది అతని భార్య. ”అదృష్టం! మనందరిని కలిపి కట్టెయ్యలేదు” అని అన్నాడు కొడుకు. ”దేవుడా కృతజ్ఞతలు. వాళ్ళు మా కారుని ధ్వంసం చెయ్యలేదు” అన్నది కూతురు. సబేసన్ కార్వేటి నగరం వైపుకు తిరిగి చేతులెత్తి #స్వామివారికి నమస్కరించాడు.
ఆ దొంగలు ఆ బరువైన సంచిలో చాలా డబ్బుందని భ్రమపడి ఇతరములపై దృష్టి పెట్టలేదు. రెండురోజుల సబేసన్ ఒక్కడే #పరమాచార్యస్వామివారి దర్శనానికి వచ్చి భక్తితో, ఆశ్చర్యంతో జరిగిన విషయమంతా చెప్పాడు.
”భగవంతుడు నిన్ను రక్షించాడు” అని చెప్పారు #మహాస్వామి వారు.
అవును నిజమే. సబేసన్ కి తెలుసు తనను రక్షించిన భగవంతుడు ఎవరో. అప్పటి నుండి విరిగిపోయిన గ్రానైట్ ముక్కల్ని పనికిరానివాటిగా చూడలేదు.
--- ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ పరమాచార్య అనుభవాల సంగ్రహం 1
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం.
*టైం మెషిన్ లో 50 ఏళ్ల క్రితం*
*అర్ధశతాబ్ద పూర్వం జీవన శైలి.*
ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందుం పుల్లలు అని కూడా అనే వారు.
కొంతమంది కచ్చిక (ఆవు పేడ పిడకలను కాల్చగా వచ్చిన పొడి), పళ్ళ పొడితో పళ్ళు తోముకునే వారు. తాటాకులు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచు కోవడానికి ఉపయోగించేవారు.
మొగ వాళ్ళు చాలా మంది నూతి దగ్గరే నీళ్ళు చేదలతో తోడుకు పోసుకొనే వారు. ఆ చన్నీటి స్నానం చాలా హాయి నిచ్చేది. చలి కాలంలో మాత్రం వేడి నీళ్ళు ఉండేవి.
ఉదయం నీళ్ళు కాచుకొనేoదుకు కర్రల పొయ్యి, లేదా పొట్టు పొయ్యి ఉండేది. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్ర మైన విషయం. Rs.3/- కి ఒక పొట్టు బస్తా వచ్చేది. పొట్టు బస్తాలను ఎడ్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మే వారు.
కాఫీ డికాషన్ కి వేడి వేడి నీళ్లలో కాఫీ పొడి వేసి, కొంచం సేపు ఆగాక, పైన తేరిన నీటినే డికాషన్ గా ఉపయోగించే వారు. పాలు శేరు లెక్కన అమ్మే వారు.
బొగ్గుల కుంపటి మీద కాఫీ. కుంపటి విసరడానికి ఓ వెదురు విసినకర్ర. కొంతమంది UMRAO వత్తుల స్టౌ (కిరసనాయిలుది) / పంపు స్టౌ వాడేవారు.
అదే విధంగా గా బరువులను వీశ (1400 గ్రా), ఏబులం (అర వీశ), పదలం( పావు వీశ)గా తూచే వారు.
ఇంట్లో దేవుడి పూజలు అవీ సామాన్యంగా ఉండేవి. మడి, తడీ మాత్రం పాటించే వారు బాగా. వంట అంతా ఇత్తడి గిన్నెల తోనే. అందరి ఇళ్లలోనూ రాచ్చిప్ లు ఉండేవి. ఈ రాచ్చిప్పల్లో పచ్చి పులుసు, ఉల్లిపాయల పులుసు, పప్పుపులుసు కాచే వారు. ఆ రుచి అమోఘంగా ఉండేది. అన్ని పచ్చడులూ రుబ్బురోట్లోనే.
అప్పుడు బియ్యంలో మట్టి బెడ్డలు, వడ్లు, ఎక్కువుగా ఉండటంతో వాటిని బియ్యం నుండి ఏరేసుకుని వండుకునేవారు. రోజూ మధ్యాహ్నం ఆడవాళ్ళు అందరూ కలసి బియ్యం చేటల్లో పోసుకుని, వడ్లూ బెడ్డలూ ఏరుకునేవారు. అదే వారికి ఇరుగింటి పొరుగింటి వాళ్లతో కాలక్షేపం, పిచ్చాపాటి.
అదేవిధంగా అన్ని సామాన్లు అంటే, ఆవాలు, జీలకర్ర ఇలాoటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకొనేవారు.
బియ్యం లో అక్కుళ్లు, ఆట్రగడ్డలు, వంకసాన్నాలు, SLO, కిచిడి అనే రకాలు ఉండేవి. ఆక్కుళ్లు, ఆట్రగడ్డలు అంటే ముతక బియ్యం. వంక సన్నాలు, SLO మధ్య రకం. కిచిడి బియ్యం అంటే సన్నబియ్యం. మసూరీ బియ్యం ఇంకా ఖరీదు.
సీతారామాభ్యానమః అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అందరి ఇళ్ళకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి (ఇప్పుడు WhatsAppలో రోజూ ఉదయం పంచాంగం పోస్ట్ చేస్తున్నట్టుగా) వెంటనే వెళ్లి పోయేవారు. వెళ్లిపోయే లోపులో గృహస్థులు అందరూ గుప్పెడు బియ్యం వేసే వారు. ఒక వేళ మిస్స్ అయితే ఏదో తప్పు చేసినట్లుగా, అపరాధ భావనతో ఉండి, మర్నాడు ముందే రెడీగా ఉండి, రెండు గుప్పెళ్లు వేసేవారు బియ్యం.
రాత్రిపూట7, 8 గంటలకు మాదాకాలం తల్లీ అంటూ వచ్చేవాళ్లకి ఆరాత్రి తినగా మిగిలిన అన్నం, కూరలు ఇచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు పేచీ పెడుతుంటే మాదాకాళo అబ్బాయికిచేస్తానని భయపెట్టేవారు తల్లులు.
టిఫిన్స్ ఉండేవి కావు. ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి / ఎర్ర నూక ఉప్మా లాంటివి ఉండేది.
పిల్లలు అందరూ 3 పూటలు అన్నం తినే వారు. భోజనం ఎప్పుడూ వంటింట్లో నేల మీద పీట వేసుకునే. తినడం అయ్యేక తిన్న చోట నీళ్ళు జల్లి శుద్ధి చేసేవారు. ప్రతి రోజూ రాత్రి వంటిల్లు కడిగి ముగ్గు పెట్టడం అలవాటు.
ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పడుకొనే వాళ్ళం బొంతలు వేసుకుని. చుట్టాలు లోపలిగదిలో పడుకునే వారు.
డబుల్ బెడ్రూం, సింగిల్ బెడ్రూం అనే పదాలే తెలియవు. చాలా మటుకు 3 గదుల ఇళ్లే. కొంచం స్థితి మంతులు ఐతే 4 గదులులోనూ, ఇంకా పెద్ద పెద్ద ఇండ్లలో ఉండే వారు.
3 వరుస గదుల ఇల్లు అద్దె నెలకి - 27 రూపాయలు. కరెంటు -1 బల్బు కి నెలకు 1 రూపాయి. అలాగ మొత్తం కరెంటుతో కలిపి నెలకి 30 అద్దె ఉండేది.
వైద్యం కి RMP డాక్టర్స్ అయిన Dr. చట్టి రామన్న పంతులు గారు, రామారావు పేట 3 లాంతర్లు జంక్షన్ దగ్గర, Dr. కస్తూరి వెంకటాచలం గారు నూకాలమ్మ గుడి దగ్గర ఉండే వారు. వాళ్లు చెయ్యి పట్టుకు చూసి, బిళ్ళలు, అరకు ఇచ్చే వారు. జ్వరం తగ్గే వరకూ లంఖణమే. తర్వాత bread, జావ, ఆ తర్వాత రోజు చారు అన్నం తినమనే వారు. డాక్టర్ భుజం తట్టి తగ్గిపోతుందిలే అనేమాటకే సగం జ్వరం తగ్గిపోయేది.
ఇంకా, పిల్లల చదువుల మీద ఎక్కువ వత్తిడి ఉండేది కాదు. బాగా చదువుకోమని చెప్పే వారు. అంతే. ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లలని టెన్షన్ కి గురి చేసే వారు కాదు.
పుస్తకాలు ఎప్పుడు 2nd hand వే. పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేట్ కి టెక్స్ట్ బుక్స్ కొనే వారు. నోట్స్ అన్నీ తెల్ల కాగితాల పుస్తకాలే. సింగిల్ రూల్లు, బ్రాడ్ రూళ్లు, పెన్సిల్ తో కొట్టుకోవడమే. Last year నోట్ బుక్స్ లో మిగిలిన తెల్ల కాగితాలు అన్నీ చింపి, ఒక కొత్త బుక్ లా కుట్టించుకుని నెక్స్ట్ ఇయర్ లో రఫ్ బుక్ గా వాడుకునే వారు.
రాత్రి 9 గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినే వారం అర్థం అయినా కాకపోయినా. రాత్రి పెంద్రాలే నిద్ర. వేసవి కాలం అయితే ఆరుబయట, మిగిలిన కాలాల్లో లోపల పక్కలమీద. ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసినికర్రే.
ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కి కూడా లైసెన్స్ ఉండేది. 2 రూపాయలు పెట్టి ఒక లైసెన్స్ రేకు బిళ్ళ కొనుక్కుని సైకిల్ కి బిగించేవారు.
అదీ ఆరోజుల్లో జీవన శైలి.
ఎవరికీ ఏ చీకూ చింతా ఉండేది కాదు. జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించే వారు. సంతోషంగా కాలం గడిపేసే వారు. ఆనందంగా భాద్యతలు నిర్వహించేవారు.😃🤷🏻♂️
🎻🌹🙏ప్రతి రోజూ సుప్రభాత సమయాన
మాతా పితరులను తలుచుకుని గురువులని తలచుకుని
అరచేతిని కనుల కద్దుకుని
కరాగ్ర వసతే లక్ష్మీ... కరమధ్యే....సరస్వతి...
కరమూలేచ దుర్గే...లేదా గోవిందే....అని నమస్కారిస్తూ....
ప్రార్థన చేసుకోవాలి...
మన ఆయురారోగ్యాల కోసం
మన మనోధైర్యం.... కోసం
మన మానసిక ఆందోళనలు భయాలు భాధలు నివారణ కోసం....
మన ఇష్ట దైవాన్ని.....స్మరిస్తూ.....
ప్రాణాయామం..ధ్యానం..యోగా....చేయగలిగితే...
సూర్య భగవానుడి....తొలి..
ఉషోదయ కరణాల నుండి
వెలువడే....ఆరోగ్య ...కాంతి పుంజాలతో...
మనకి ఎంతో...అధ్భుతమైన
అమోఘమైన... వేగవంతమైన....
మహోన్నత.... శక్తి....
మనకు....
ఆ పరమాత్మ.... ప్రసాదిస్తారు....👌👌🙏
ఎంతటి కఠినమైన రుగ్మతలు
ఉన్నా.....అవి....నెమ్మది నెమ్మది గా...
.తగ్గిపోయి...
ఒక కాంతి వంతమైన....
దివ్య.... తేజస్సు....
మనలో ప్రసరిస్తాయి.....
అందరమూ.... భగవంతుని... అనుగ్రహముతో🙏🙏🙏
ఆచరిద్దాము....ఉల్లాసంగా ఆనందంగా.... సంతోషంగా
ఆరోగ్య వంతంగా.....
జీవిద్దాము....
🕉️ఓం శ్రీ ధన్వంతర్యైనమః
🙏సకల గురుభ్యోనమః🙏
🙏మాతా పిత్రృ చరణార విందభ్యోనమః🙏
🙏సకల దేవాతాభ్యోనమః
లోకాసమస్తా... సుఖినోభవంతుః.🌺🌿🌺🌿.🙏🌹🎻
వైశాఖ మాసం సందర్భంగా *వైశాఖ పురాణం* ప్రతిరోజు పంపబడును.
🕉️ *వైశాఖ పురాణం 1వ అధ్యాయము* 🕉️
*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*
*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*
☘️ *వైశాఖమాస ప్రశంస* ☘️
💫🌹సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు.
🔷 వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి?
🔷 ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి?
🔷 మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును?
🔷 వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మొదలైన విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.
💫🌹నారదుడును రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు.
💫🌹ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు.
💠 విద్యలలో వేదవిద్యవలె,
💠 మంత్రములలో ఓంకారమువలె,
💠 వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె,
💠 ధేనువులలో కామధేనువువలె,
💠 సర్వసర్పములలో శేషునివలె,
💠 పక్షులలో గరుత్మంతునివలె,
💠 దేవతలలో శ్రీమహావిష్ణువువలె,
💠 చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె
💠 యిష్టమైన వానిలో ప్రాణమువలె,
💠 సౌహార్దములు కలవారిలో భార్యవలె,
💠 నదులలో గంగానది వలె,
💠 కాంతి కలవారిలో సూర్యుని వలె,
💠 ఆయుధములలో చక్రమువలె,
💠 ధాతువులలో సువర్ణమువలె,
💠 విష్ణుభక్తులలో రుద్రునివలె,
💠 రత్నములలో కౌస్తుభమువలె,
💠 ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది.
💫🌹విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు.
🍃🌹అట్లు వైశాఖ స్నానమాచరించిన వారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును.
🍃🌹స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.
💫🌹అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను,అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును.
🍃🌹జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు.
🍃🌹వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.
*వైశాఖ పురాణం మొదటి అధ్యాయము సంపూర్ణము*
🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏
No comments:
Post a Comment