Monday, 3 May 2021

May be an image of 2 people


ప్రాంజలి ప్రభ ... 03-05-2021
ఆనందం - ఆరోగ్యం - ఆద్యాత్మికం
సకల లోకంబు లేలును సాధు జనులు
సకల సంపదలొసగును  సమయమందు
సకల రోగములు కలిగి శోకమవ్వు
సకల దైవలీలలు చూపె శెలవులందు
నేటి ప్రపంచం
గుళ్ళకు గుళ్ళనే నిశ్శబ్దంగా మూసేస్తుంది - సమ్మోహం
నీళ్ళకు నీళ్ళనే నిశ్శబ్దంగా కల్షమ్మైంది - ఉన్మాదం
ఇళ్ళకు ఇళ్ళనే నిశ్శబ్దంగా మింగేస్తుంది - ఆరోగ్యం
ఊళ్లకు ఊళ్లనే నిశ్శబ్దంగా మ్రింగేస్తోంది - స్మశానం.
అంత జరిగినా ఏమి ఎరగనట్లే ఉంటుంది -  ప్రపంచం.
ఏమి జరిగినా తెల్సి తెలియనట్లే ఉంటారు - ప్రభావం
అంత తెలిపినా న్యాయ మలుపులన్నీ ఎవ్వారు - ప్రధానం
ఎంత తెలిపినా రోగ కలుపులన్నీ పెర్గేను - ప్రమాదం
--(())--
సందర్భోచిత పద్యాలు
కుమ్మరి ప్రమిదను చేసిన ఏమి
కమ్మని గానుగ నూనెను నింపి
నెమ్మది వెలుగిచ్చు వత్తిని ఉంచి
నమ్ముము వెలుగుకు నటనలు రావు
తేనె తెరలజాడ తేనెటీగ యెఱు౦గు
సుమరసంబు జాడ భ్రమరమెఱుగు
పరమయోగి జాడ భక్తుండెఱుగును
చదరంగమున  చూడ రాజ్య మెఱుగు
పలకయందు దొలుత నక్షర మొవ్వు
నులకమంచ గదుల నక్షర మొవ్వు   
గిలకతాడు గదులు నక్షర మొవ్వు
తొలుత అమ్మ సుడులు నక్షర మొవ్వు
మంచిమాటల యందు మౌనము వలదు
మంచివారి గుణము మచ్చిక చేయి
తీయని మామిడి చిగుళ్లను గుర్తు  
గోయిల కును దక్కు పక్షుల క్కాదు
--(())--
నేటి సమస్యకు పురాణం పద్యాలు  ..
ఛందస్సు వృత్తములు
చెరువులు మాయ మగుగాని నీరును గాదే
బరువులు పెర్గు టకుగాని భారము గాదే
చిరుగుల గుడ్డ తలపాగ ఎండకు గాదే
శిరమును బోడి యగుగాని చిత్తము గాదే.......
మెరుపులు వేడి యగుగాని వైనము గాదే
వరుసకు బేడి పడుగాని దొంగయు గాదే
తరువుకు గాడి యగుగాని గాయము గాదే
శిరమును బోడి యగుగాని చిత్తము గాదే.......
మగువకు మౌన ముసుగేను మోహము గాదే
పగటికి రేయి చెలిమేను పందెము గాదే
నరములు వేడి యగుగాని రక్తము గాదే
శిరమును బోడి యగుగాని చిత్తము గాదే.......
--(())--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ  - నేటి ద్విపద కవిత్వం  
కొత్తగా పెళ్లయిన వారిలో ఉండే భావాలు
కల హంస ఆటలో కను విందు చేసె  
కళ  మంచి మాటలో కామ్యమ్ము చూపె  
కళ మాయ సౌందర్య కప్పును తీసె    
జత గాను సంద్రమ్ము జాగుగా చేరె    
మది పొంది ముద్దాట మేలిమై యగును   
సిరి పొంద గిలిచూపి సిత్రపు చూపు    
చను వంత విందాట చలి కల్గి చనువు   
చిరు హాస వింతాటలో కలి చిత్తు అయ్యె  
అల హాస ఉయ్యాల కలలాగ ఊగె  
చల చల్ల  చిందాట  చిరు నవ్వు చూపె    
తొలి  మల్లె  సయ్యాట తలపులు విప్పె  
మలి మాట ముచ్చట్లు మునిగియు తేలు
లలలాల లల్లేల లోలక కాక  
కల కాత ఒళ్లేల కలకల కేక  
వలచిక్కి జల్లేల వలపుల వాన   
కల కాల మిల్లాలు కేకథ లన్ని  
--(())--
సీస పద్యము ..
జనులతో అప్పుల జూదము ఆడేను  
చులకన చేసియు జుట్టు పట్టె
అరచేతి బెల్లము  అరువవుగా ఇచ్చి
దోచేటి సలహాలు దగ్గరవ్వు
పలుకల నేర్పుతో  పల్లకి ఎక్కించి  
మనసును దోచేటి  మందు చెప్పు  
చేతికందినదియు చక్కగా  పొందియు   
లేదని అరిచేటి  వారు ఉండు
తేటగీతి
సిగ్గు ఎగ్గయు లేదునూ చింత లేదు
దోచి సిగ్గవిడిచియు శీ ధనము దోచె  
ఆశచూపియు రోగము అంట గట్టి
నంగ నాచిలా జూదపు నటన పుట్టె
*(())*
నీడలు
పుణ్యము పండిన
నాణ్యత పెరిగిన
ధన్యత కలిగిన
అనైక మనసున  రామకృష్ణ
మనుష్య జన్మము  
అనూహ్య దేహము
తనువుల దాహము
అణుకువ మోహము రామకృష్ణ
ఇంకను పండెను
మక్కువ గుండెను
ఎక్కువ కేగెను
తక్కువ  మాగెను రామకృష్ణ
దర్మము నిత్యము
మర్మము మోహము
కర్మయు  దాహము
నిర్మల మార్గము రామకృష్ణ
అనురక్తి కలుగు
అణుయుక్తి జరుగు
వినయమ్ము పెరుగు  
కనలేని మెఱుగు రామకృష్ణ
--(())--
సాహితీ మేరు పర్వతాన్ని మరొక్కసారి స్మరించుకుంటూ🙏🙏🙏
"కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ...
 ప్రపంచపు బాధ  అంతా శ్రీ శ్రీ బాధ " అని...
చలం యోగ్యతా పత్రం లో పేర్కొనడం అతిశయోక్తి కాదు .యోగ్యతా పత్రం మహాప్రస్థానం పుస్తకానికి 1940 లో చలం గారు రాసిన పీఠిక .తెలుగు సాహిత్యంలో వచ్చిన గొప్ప పీఠికల్లో ఇది ఒకటి.
 ఆ పుస్తకం ఎవరు చదవాలి..? ఎందుకు చదవాలి? ఎలా చదవాలో వివరించే పీఠిక  ఇది.
                     "రాబందుల రెక్కల చప్పుడు పయోధర ప్రపంచ ఘోషం ఝంఝానిల.. షడ్జధ్వానం" విని తట్టుకోగల చావ ఉంటే ఈ పుస్తకం తెరవండి." అంటూ పుస్తకం చదవడానికి పాఠకుడిని సమాయత్త పరచే పీఠిక .
                        ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - జూన్ 15, 1983). శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదంపొందారు.
                       మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది. తెలుగు సాహిత్యపు ప్రస్థానానికి ఒక దిక్చూచిలా వెలుగొందిన శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం అప్పటికి ..ఇప్పటికీ ..ఎప్పటికి అగ్నికిరణాలే...  ఆధునిక సాహిత్యాన్నీ మహా ప్రస్థానానికి ముందు మహాప్రస్థానం తరువాత అని విభజించడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మహాప్రస్థానం 40 కవితలతో అలరారుతున్న అభ్యుదయ అద్భుత సంపుటి. 1930 దశకం లో  ఆర్థికమాంద్యం వల్ల  నిరుద్యోగ యువకుల జీవితాలు ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలమైన సమయం ఆ కాలాన్ని ఆకలి కాలం  (హంగ్రీ థర్టిస్) అని అన్నారు అంటే ఎంతటి క్షామం ...అది ఎంతటి క్షోభం .తన చుట్టూ జరిగే సంఘటనలనే కవితా వస్తువులు ...
అన్నార్తుల ఆకలి కేకలు కార్మిక కర్షక శ్రామిక గొంతులను.. కష్టాల కన్నీళ్లను తన సిరాలో  నింపుకొని రుధిరాక్షరాలుగా  వ్యక్తీకరించిన మహాప్రస్థానం నిజానికి ఒక మహా ప్రస్థానమే.. దీనిలో మనల్ని మనం వెతుక్కోవచ్చు.
                         కవిత ఓ కవితా కళాఖండం ద్వారా కవితా తాత్వికతను దాని వెనుకనున్న సంఘర్షణను వెల్లడించిన సమూల నైపథ్యంగా తెలుస్తుంది. మొదటి గేయం మహాప్రస్థానం అదొక కవాతు పాట... పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి అంటూ ప్రబోధించే ఈ గేయం హరోం..! హరోం హర !హరోం హర..!హరోం హర !హర! హర! హర! హర !అంటూ యుద్ధ నినాదంతో కదలమనే పిలుపు ఇస్తుంది.
 " ఐ "గేయంలో తాను స్మరిస్తే పద్యం...
 అరిస్తే వాద్యం అని చెప్పుకున్నారు.
 నా మహోద్రేకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు అంటూ తన గురించి తాను వ్రాసుకున్నారు ."జయభేరి "కవిత ద్వారా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను  అంటూ సాగే ఈ గేయం ద్వారా తానే భువన భవనపు బావుటానై పైకి లేస్తాను అని పేర్కొన్న వ్యక్తిత్వ గీర్వాణం ఒక తార్కాణం. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైపైకి  అని ఉవ్వెత్తునత లేచిన అగ్ని తరంగం సాహిత్య లోకంలో సింహం వలె గర్జించేను .ఈ పుస్తకాన్ని 1938లో అకాల మరణం పొందిన శ్రీశ్రీ స్నేహితుడు, సాహిత్యకారుడు కొంపెల్ల జనార్ధనరావుకు
అంకితమిచ్చారు.
                        శ్రీ శ్రీ  వ్యక్తిత్వం ఎన్నో విరుద్ధ భావాల విచిత్రమైన సంఘర్షణల సమాహారం ఆయన బహిర్ముఖ తీవ్ర విమర్శకుడు గా ఓవైపు పసితనపు మాటలకు సమంగా ప్రసిద్ధుడు శ్రీ శ్రీని ఎరిగిన వారెవరైనా అతడు వయసొచ్చిన పసివాడని. . అమాయకుడైనా చురుకైన వాడని.. అహంకారి అయినా తలవంచుకు ఉంటాడని విచారణశీలి అయినా తప్పించుకు తిరుగుతున్నాడని ఆకర్షకుడైనా ఏడిపించనూగలడని అంగీకరిస్తారు.
                  చమత్కార సంభాషణలకు..చణకులకు శ్లేషాప్రయోగాలల్లోనూ  శ్రీ శ్రీ ప్రసిద్ధిగాంచారు.
శబ్దాలంకార చమత్కారాలు తన నాలుక అనే కరవాలంపై నాట్యమాడుతుండేవి.
                        వ్యంగాస్రాల బాణాలే ...కాదు
వివాదాలకు..అలవాలమై.. నిలిచిన తన వ్యక్తిత్వం..విమర్శకులకు..అస్త్రమై నిలిచాయి..
మదరాసులో ఉన్న రోజుల్లో నన్ను బ్రతికించినవారు ఇద్దరే. ఒకరు మున్సిపాలిటీ కుళాయి వాళ్లు, రెండోది విశ్వనాథ సత్యనారాయణ పద్యాలు అని చెప్పుకున్నారు
                       విశ్వనాథ గారు శ్రీశ్రీపై ఇంతగా ఆప్యాయత చూపినా, శ్రీశ్రీకి విశ్వనాథ కవితాశక్తిపై చిన్ననాటి నుంచి ఎంతో అభిమానం (కొన్నేళ్ళు హీరోవర్షిప్) ఉన్నా వారిద్దరి వ్యతిరేక భావాలు విభేదాలు తీసుకుచ్చాయి. భావాలకు మించి విశ్వనాథకున్న కుండబద్దలు గొట్టే మాట, శ్రీశ్రీలోని మాట తూలే లక్షణం మరింత ఆజ్యం పోశాయి. ఎన్ని విభేదాలు సృష్టించినా...ఎన్ని స్పర్థలు..ఎదురైనా..
విమర్శలకు నెరవక..తన సాహిత్యం నిత్య నూతనమై తన అభిమానుల గుండెల్లో చిరస్మరణీయుడై..నిలిచిన శ్రీశ్రీని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డులు వరించి అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగాను..( విరసం )విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడు గా కొనసాగారు.ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన పాటలను  సినీ గేయ రచయుతగా...స్ఫూర్తి దాయకమైన
సాహిత్యాన్ని...మరెన్నో యుగళగీతాల మాధుర్యాన్ని సినీ రంగానికి అందించి ఎందరో సాహితీ శ్రోతలను సంపాదించుకొని..అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు.
        .      కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించారు.విశాఖపట్నం
 లోని బీచ్ రోడ్డులో ఆయన గుర్తుగా నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
 అప్పటికి..ఇప్పటికి..ఎప్పటికి...నిలిచిపోయే
విశిష్ట...విష్పష్ట ద్రష్ట..సాహితీ నవ్యతను... రంగరించి...విప్లవ ఉత్తేజాన్ని అణువణువు నింపగలిగే కండ కలిగి ...చేవ కలిగిన..రచనలతో
రచయితలకు సాహితీతృష్ణను రగిలించే..
అగ్నిరవ్వల ఖడ్గ సృష్టి...రచనల విరచిత విధాత..
సాహితీ భావితరంగానికి ఉత్తేజ సంద్రం..
అతడే శ్రీ శ్రీ...ఆతడే శ్రీ శ్రీ..
ఆకలి ప్రేగులే జీవన స్వరాన్ని
అపశృతుల్లో..అలపించే ఈవేళలో..
మానవత్వం మంటకలిపి...
మారణహోమం చేస్తున్న ఈ వేళలో
దేశం  అనేక అరాచకాలల్లో..
కబంధ హస్తమైన ఈవేళలో..
మానవ సంబంధాలన్ని కుళ్ళిపోయి..
కుప్పకూలుతున్న..ఈవేళలో..
యువతరాన్ని..ఉత్తేజితులను
చేయుటకై...రావయ్యా..
రావయ్యా..మరో సారి..శ్రీ శ్రీ...
 నీ రుధిర  బింధువే.... మా కలానికి
సిరా గా మారడానికి రావయ్యా..
కొన్ని వేల మంది శ్రీ శ్రీ ల..కవితా ఘోషవై
విరచించు..వినిపించు..వికసించు..!
శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా...సాహితీ సుమాంజలి సమర్పిస్తూ...🙏🙏🙏💐
సోయగములు
పగలులేవు పనులు ఎందుకో
సెగలు కక్కు చుండె
వెలుగులేని బతుకు ఎందుకో   
నలిగి పోయె జీవి  
చలిలోను వానలో టెండలో
అలసి పనులు చేసె  
నేడు కరోనాగ సోయగం
నడిచే మరలుఆగి అలసినా
బడుగు జీవి ఆగు
నడి సంద్రమున చిక్కిన పడవ
అడుగు పడక మునుగు
ఆడ బిడ్డల మాన ప్రాణాలు
మడుగునందు మునిగె
రోజులెన్నోతేలి సోయగం
పరుల కష్టం దోచె బతుకులు
పరువు దేవు డెఱుఁగు
మరిగిన హృదయపు వేదన
అరచి మొత్తు కున్న
పరులకేమియు తెలియని విధి
నరము ఉబ్బు చుండె
ఇకకరోనా ఇది సోయగం
--(())--
👌👌👌👌 నేను ద్రాక్ష పండ్లను కొంటానికి మార్కెట్కు వెళ్ళాను.
నేను   :    బాబు కిలో ఎంత...?
అతను :  *"కిలో 80 సర్।"*
పక్కనే విడి విడిగా ఉన్న ద్రాక్ష పండ్లను చూసాను.... ।
నేను అడిగాను :  *" మరి వీటి ఖరీదెంత?"*
పండ్లతను : *"30 రూపాయలకు కిలో సర్"*
నేను అడిగా : "ఇంత తక్కువగాన..?
పండ్లతను   :    "సర్, అవి కూడా మంచివే..!!
కాని... *కాని అవి గుత్తి నుండి విడి పోయాయి ...అందుకే అంత తక్కువ రేటు।"*
అప్పుడు నాకు అర్థమైంది... *సమాజము,సంఘము*  మరియు *కుటుంబము* నుండి వీడి పోతే .....మన జీవితము కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది।
దయ చేసి మీ *కుటుంబము లో ఉండండి.....
  ఈ జన్మకే....
ఈ జన్మకే వాళ్ళు మన అమ్మా నాన్నలు...
ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన జీవిత భాగస్వాములు...
ఈ జన్మకే వాళ్ళు మన అక్కా చెల్లెల్లు, అన్నా తమ్ముళ్ళు...
ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు, సన్నిహితులు...
ఈ జన్మకే, కేవలం ఈ జన్మకే!
మహా అయితే ఇంకో పదీ..పదిహేను, ఇరవై ..........సంవత్సరాలు !
కుటుంబము లో ఎవరు     తప్పు చేసినా  క్షమిద్దాం ,అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!
పోయాక ఫోటోను ప్రేమించే కన్నా,
ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న
బంధుత్వాలు  తెంచుకోవడం  నిముషం.
అదే  నిలుపుకోవాలంటే  ?
తము గడిపిన  భయంకర  అవస్థలు తమ
పిల్లలకు  రాకూడదని ,  తమ పిల్లలు  కూడా  నలుగురిలో ఉన్నతంగా  బ్రతకాలనే  తాపత్రయంతో
కన్నవాళ్ళు  తను  సామాన్య జీవితాన్ని  గడుపుతూ  ,
ఆస్థులు  కూడ బెట్టి  తమ పిల్లలకు  ఇస్తే ,
తమ  తల్లిదండ్రులు  బతికి  ఉండగానే  కొందరు
తమ  తల్లిదండ్రులు  కాలం  చేసాక  కొందరు
 వివిధ  రకాల  కారణాలతో   రక్త సంబంధీకులందరూ  శాశ్వతంగా   దూరమవుతూ ,
బ్రతికి   ఉండగా  మాట్లాడు కోకుండా ,  మొహాలు  కూడా
చూసుకోకుండా  తమ  జీవితాంతం  వరకు  ఒకరి నొకరు
ద్వేషించుకుంటూ , ఆ ద్వేషాలు  తమ  వారసత్వంగా
తమ  పిల్లలకు  కూడా  బదిలి చేస్తూ  ,  తన అశాంతితో
జీవిస్తూ  తన  వారిని  కూడా  అశాంతి పాలు  చేస్తున్నారు .
ఎవరి  కోసం  ? ఎందు  కోసం ?
దాని  వల్ల  ఒరిగే  ప్రయోజనము  ఏమిటి ?
జీవితాంతం   ఒక  రక్తం  పంచుకున్న  అన్న దమ్ములు ,
అక్క చెల్లెళ్ళు  .  అన్నా  చెల్లెళ్ళు  పరస్పరం
 అశాంతితో  ద్వేషించుకుంటూ ఒకరి నొకరు  చూడకుండా
జీవిస్తూ  శాశ్వతంగా  దూరమయి , ఇంటి లోని ఆనందాన్ని పంచుకోకుండా, వివాహాలకు
కూడా  పిల్చుకోకుండా ,  హాజరుకాకుండా ,
చివరకు  ఎవరో   ఒకరు  కాలం  చేసాక   తట్టుకోలేని
శోకతప్తులై  గుండెలు  బాదుకుని  కుమిలి  కుమిలి
విలపిస్తే  ఆ   చనిపోయిన  వారిని  తిరిగి  పొందగలమా?
ఆ   ఖాళీ  అయిన   స్థానాన్ని  ఎవరూ  భర్తీ  చేయలేరు.
కొంతమంది  తమ  తల్లిదండ్రులను  కూడా           ఈ  ఆస్థిపంపకాల అసంతృప్తితో  దూరం  చేసుకుంటున్నారు.
ఆ  వయసులో  కన్నవారు  పడే  వేదన వర్ణనాతీతం.
మరి  ఈ  సమస్య కు  పరిష్కారము  ?
  పంతాలు  పౌరుషాలు  ప్రక్కన  పెట్టి  అందరూ
కూర్చుని  సామరస్యంగా    ఆవేశాలకు  పోకుండా
మాట్లాడుకుని   పరిష్కరించుకుంటే  అభిమానాలు
కలకాలం  పరిమళిస్తూ   అనుబంధాలు  పెంపొందే
అవకాశం  ఉంటుందేమో  నని  నా  నమ్మకం .
దీనికి  కావల్సింది  సహనంగా  ఆలోచించడం
విచక్షణ  పట్టుదలలు  సడలించు కోవడం .
ఈ విషయములో పెద్దవారు చొరవ తీసుకోవాలి ...
ఓడిన వాడు  కోర్టులోనే  ఏడుస్తాడు
గెలిచిన వాడు  ఇంటికి  వెళ్ళి  ఏడుస్తాడు
రెండిటికీ  తేడా  ఏమీ  ఉండదు.
ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే🙏
--(())--
నేటి సమస్య పూరణ పద్యాలు  .........
బంగారము సాటివచ్చు మోహము గలదే   
శృంగారము సాటివచ్చు బేరము గలదే  
గోంగూరకు సాటి వచ్చు కూరయు గలదే
దొంగాటకు పోటి వచ్చు ఆటయు గలదే
 బొగ్గు లలొ కాల్చు మొక్కజొన్న బొగైనా రుచులు వేరు
మగ్గమున నేసిన ట్టి రుమాలైన నేతయు వేరు     
సిగ్గులతొ రంభ ఊగిన స్త్రీమతి మెఱుపు వేరు
మిర్చి, గోగోర గుంటూరు మించిన ఊరు ఏది
 చెంగున దూకేటి జింకయు
భగ్గున దూకేటి సింగము కలవరపరచెన్
దుంగలు మోసేటి ఏనుగు
గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే
రంగస్థలి కైలాసపు
జంగమ దేవరను కనగ చవులూరింపన్
లింగోద్భవ కాలములో
గోంగూరకు సాటివచ్చు కూరయు గలదే
కంగారేలా..మనిషీ ?
బంగారము వంటి కూర వండిన..' భేష్ - భేష్ ' !
రంగారురుచియె సొంతము..
గోంగూరకుసాటివచ్చు కూరయు గలదే !? "
----
లోక్ నీతి
విధేయుడు మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సాక్షి గా ఉంటూ,
వర్తమానంలో జీవించడమే సత్యం
భర్త గా ఉంటూ,
బాధ్యతా మానం భావించడమే నిత్యం
భార్య గా ఉంటూ, దాహమేతీర్చీ సేవించడమే భాగ్యం
ప్రేమ గా ఉంటూ,
పిల్లలే ‌తీర్పై ప్రేమించడమే గమ్యం
ధ్యానాన్ని మనం పట్టుకుంటే,
కాసేపు పట్టుకుని వదిలేస్తాము.
వేషాన్ని మనం వేసి ఉంటే,
కాసేపు నాట్యము నటన చేస్తాము
మోసాన్ని మనం చేసి ఉంటే,
కాసేపు భయ్యము దయయు చూప్తాము
సాస్త్రాన్ని నమ్మి శోభ నమ్మే,
కాసేపు ధైర్యము సుఖము చూస్తాము
ధ్యానం మనలను పట్టుకుంటే,  
అది మన అహాన్ని అంతం చేసే వరకూ వదలదు.
స్త్రీ యే మనలను పట్టుకుంటే,
అతి సుఖ అహాన్ని చూపే దోచే వరకు వదలదు
ప్రేమే మునులను పట్టుకుంటే,
సుఖ మణి అహాన్ని దాహం తీర్చే వరకు వదలదు
పుణ్యం మనలను పెట్టుకుంటే,
సహనము యెంచి ధర్మం న్యాయం కడకు వదలదు
--(())--
నేటి పద్యాలు
" ఇందువదనా..( భ జ స న గగ--14/9
శ్రీ చరిత మానసపు పుత్రి సమయత్రి
శ్రీ విషయ వాంచితము ధార్మిక సుభజ్ఞే  
శ్రీ వినయ వాంఛ పలుకే రతి  మురాళే  
శ్రీకృప సహాయ వదనం రుణము పొందే  
శ్రీ సుమసుధా సుగుణ గాత్ర సుమమంత్రి
శ్రీ సరసిజే ! విభవదాయిని ! మనోజ్ఞే !
శ్రీ చరణ పూజ లతలే  హర సుధా ళే
శ్రీ పద పిపాస మనసే జనని వందే
శ్రీ మధుమతీ ! మనసు ధాత్రి ! మనమైత్రి
శ్రీ మనసుయే చరిత రాగిణి రస జ్ఞే  
శ్రీ కరుణ కావ్య తలపే శివ విహాళే
శ్రీరమ సరోజ మెరుపే జనని వందే
----
శ్రీగిరిసుతే ! సుగతిదాత్రి ! భవహంత్రి ,
శ్రీ సరసిజే ! విభవదాయిని ! మనోజ్ఞే !
శ్రీపదకవిత్వవిభవే ! సితమరాళే  ,
శ్రీరుచి శశాంక వదనే ! జనని ! వందే !!!
--(())--
శుక్రవారములక్ష్మి  పూజలు శుభము చేర్చు
శనివార మహిమతో వెంకన్న శోభ చేర్చు
ఆదివారమున ఆదిత్యని అనుకరించు
సోమవారము శివ నామము సౌఖ్యమిచ్చు    
శనినిన్ను వెంటాడక నిజము సెప్పియు  బతుకు
శుక్ర వారము న స్త్రీ దేవత సౌఖ్యము పెంచును     
ఆది అంతము లేనట్టి ఆర్భాట మొద్దు
సొమ్మసిల్లక సోమవారము సరదాగ ఉండు
--(())--



నేటి 

No comments:

Post a Comment