Saturday, 1 May 2021

No photo description available.
ప్రాంజలి ప్రభు.... 01-05-2021
ఆనందం... ఆరోగ్యం.. ఆధ్యాత్మికం
విధేయుడు.....మల్లాప్రగడ
కార్మిక దినోత్సవ సందర్భముగా అందరికి శుభాకాంక్షలు
 

నేటి సోయగములు
 

ఏమని చెప్పను కార్మిక
విమల చరిత మేది
సమయ మాసన్న మైనదియును
సమము లేని దిక్కు
అమ్మమాటలు అన్ని జరిగేను
వమ్ము కాని బతుకు
కార్మిక చరిత సోయగములు
 

కలలు కన్నాను దేశ భక్తితో
కూలి లేని బతుకు  
కళలను నేర్చాను శక్తితో
కళల పోష నేది
ఆలికి నచ్చిన పనులను
రాలి నట్లు చేసి
గాలిని బేరము పెట్టియు
వాలి లాగ బతుకు
పలక లేనట్టి సోయగములు
 

సత్యమునే నమ్మి బతికాను
నిత్య వెలుగు కొరకు
నిత్యమూ సేవలు చేసాను
ముత్య మైన పలుకు
తత్వపు బోధలు చేసాను   
తత్వ మాయ బతుకు
వ్యత్యాసము గను సోయగములు
--(())--
 

(21-౩౦)  


చదువు లేకయే   
పనులు లేకయే
అన్న౦ లేకయే
కార్మిక కష్టము రామకృష్ణ  ! 


పలికే నీతియు
మారే బుద్ధియు
తెచ్చు ఖ్యాతియు  
వెలుగు జీవమే రామకృష్ణ  !


ఆరోగ్య కరమే  
సౌభాగ్యకరమే
సంతాన పరమే
ఆహ్లాదపరమే రామకృష్ణ  !


ఆలి ప్రేమము  
బంధాల భయము   
బాధలే వరము
బతుకే నరకము రామకృష్ణ  !


కాలమిది ఏన  
నరకమే అఐన
మార్గము లేకన
మాలో చింతన రామకృష్ణ  


ఆటల మలుపులు
వ్యాధితో కథలు
చూసే పెద్దలు
నిత్యము నరకము రామకృష్ణ  !


పెరిగే భారము
తరిగని రోగము
వదలని శాపము
తీరని మొహము  రామకృష్ణ !


తండ్రి మాట విని
తల్లి మాట కని   
మనసే ఎరగని
మమతే పండని రామకృష్ణ !


సత్యము పల్కియు
ధర్మము తెల్పియు   
న్యాయము బతికియు
తిండియే కరువు రామకృష్ణ 


హాస్యమాడితిమి
తస్కరించితిమి
జోలపాడితిమి
నిజము పల్కితిమి రామకృష్ణ !
--(())_- విధేయుడు మల్లాప్రగడ
 

సమస్యకు నా పద్యములు .........
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....

బ్రహ్మ రాతలు అర్ధము అగుట లేదు
బ్రహ్మ బృంగికి  దారియు తెలుప లేదు
బ్రహ్మ బంధము మార్చియు బతక లేదు
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
 

అమ్మ మాటలు పలుకులు అర్దమవగ
భృగు మహర్షుల మాటను పెట్టుకోక
మౌన  ముద్రగా శాంతిని మనకు ఇచ్చె   
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
 

శివుని శాపము బ్రహ్మకు శ్వాస అయ్యె
సత్యమును తెల్ప కుండుట సేవ అయ్యె  
నిత్యము వ్రాత బతుకుట నియమ మయ్యె
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
--(())--
 

జీవితం దృష్టి ప్రధానమైనది. ప్రతి ప్రాణికి చూపు చాలా అవసరమైనదేగాక విలువైనది కూడా! చూపునిచ్చే అవయవం కన్ను. దృష్టి ప్రాముఖ్యాన్ని గుర్తించిన మన పూర్వులు ‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అన్నారు. భౌతికమైన ఈ జగత్తును, అందులోని మార్పులను గమనిస్తూ జీవన గమనం సాగించడం ఒకెత్తు. ఆంతరంగికమైన చూపును కలిగి ఉండటం మరొకెత్తు. అదే ‘లోచూపు’.


ఎవరికి వారు తమంతట తామే ఉన్నత మార్గంలో ప్రయాణించేటట్లు చేసేది ఈ లోచూపు. బాహ్య నేత్రాలు సాధారణ దృష్టినిస్తే, జ్ఞాననేత్రాలు ఆంతరంగిక దృష్టిని అందిస్తాయి. మామూలు చూపు కొన్నిసార్లు ఇంద్రియ లౌల్యానికి దారితీస్తుంది. అధోగతికీ లాక్కెళుతుంది. ‘కన్నుల చూచినందెల్లా కడు ఆసల దగిలి’ అని ఓ సంకీర్తనలో అన్నమయ్య చెప్పినట్లుగా, చూసిన ప్రతి విషయంపై ఆసక్తిని పెంచుకుంటే అది దుఃఖాలపాలు చేస్తుంది. ఆముప్పు దాపురించకూడదంటే జ్ఞాననేత్రాలు విప్పారాలి. ఆ కాంతిలో వ్యక్తిత్వం వికసించాలి. మొక్క సూర్యకాంతిని అందుకొని ఎదిగి మహావృక్షమై ప్రాణవాయువును, పుష్పఫలాలను, కలపను అందించి సమాజానికి ఉపయోగపడుతున్న స్పూర్తిని అందుకొని మనమూ వికసించిన వ్యక్తిత్వంతో సమాజసంక్షేమానికి కృషి చేయాలి.

అన్నమయ్య తన సంకీర్తన భాగవతంలో ‘ఎన్ని మార్లు సేవించిననూ కన్నులూ తనియవు’ అంటూ- భగవత్‌ సౌందర్యాన్ని వీక్షించడం నేత్రాలు చేసుకున్న గొప్ప యోగంగా అభివర్ణిస్తారు! ‘తెర తీయగరాదా నాలోని మచ్చరమను తెరతీయగారాదా తిరుపతి వేంకట రమణా’ అంటూ- నిన్ను దర్శించాలంటే పదివేల కన్నులు కావలెనయ్యా అంటారు త్యాగరాజస్వామి!


బాహ్యంగా చూసినదాన్ని విమర్శించడం మానవ సహజ లక్షణం. దీన్ని అధిగమించి లోచూపుతో నిన్ను నీవు విమర్శించుకో! నిన్ను నీవు సరిదిద్దుకో’ అంటారు విజ్ఞులు. ‘చదివితి తొల్లి, చదివేనింకా కొంత... ఎదిరి నన్నెరగను’ అంటారు అన్నమాచార్యులవారు ఓ సంకీర్తనంలో. ఎంతో కొంత చదివాను, ఇక ముందూ చదువుతాను. కాని నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. ‘ఒరుల దూషింతు కాని, ఒక మారైన నా దురితకర్మములను దూషించను’ అంటూ బాహ్యదృష్టితో చూసి అందర్నీ తప్పుపడుతున్నాను కాని, అంతరదృష్టి కలిగి నన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను అంటూ లోతైన జ్ఞానాన్ని బోధించారు. ఆత్మజ్ఞానం అందుకోవడానికి అవసరమైన విజ్ఞానాన్ని అందించారు.
లోచూపు సాధనకు ధ్యానం ఎంతో ఉపయుక్తమైనది. ఏకాగ్రమైన భావనతో మనసును కేంద్రీకరించినపుడు జ్ఞాననేత్రాలు విప్పారుతాయి. ధ్యానప్రక్రియ ఉత్తమ ఉపాసనామార్గం. అభ్యాసపూర్వకమైన ధ్యానం తమను తాము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానాజ్ఞాన విచక్షణ ఏర్పడి వివేకదర్శనం కలుగుతుంది. తెలుసుకున్న జ్ఞానాన్ని నిత్యజీవనంలో ఆచరించేటట్లు చేస్తుంది. బుద్ధి ప్రచోదనం జరిగి మనసు నియంత్రితమై జీవితం సార్థకమయ్యేలా ఆశలు, ఆశయాలతో జీవనం సాగిపోతుంది. మంచి పనులు చేసే జ్ఞానాన్ని లోచూపు అందిస్తుంది. మనలోపల చుక్కానిలా ఉండి మనల్ని చక్కని మార్గంలో నడిపించే గురువే  లోచూపు!

చిన్న కధ
ఒకసారి చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు. అతను అడిగాడు:
'నేను ఎ౦దుకు పేదవాడను?
బుద్ధుడు సమాధానం చెప్పాడు: మీరు ఎ౦దుకు పేదవారు  అంటే మీరు  ఎటువంటి ఔదార్యము  కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు.
నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది? అని ఆ పేదవాడు అడిగాడు.
అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు
మీరు ఇతరులతో ప0చుకోగల ఐదు నిధులను కలిగివున్నారు.
 మొదట మీ ముఖం ఉంది. మీరు ఇతరులతో మీ  ఆనందాలను (నవ్వులను) పంచుకోవచ్చు .. ఇది ఉచితం ... ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ..
రెండవది మీ కళ్ళు మీకు ఉన్నాయి. మీరు ప్రేమ మరియు శ్రద్ధతో  ఇతరులను చూడవచ్చు .. నిజం.. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు .. వాటిని మంచి అనుభూతిగా చేయండి ..
 

 మూడవది  మీ నోరు మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించండి .. వాటిని విలువైనదిగా భావించండి .. ఆనందం మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ..
 నాలుగవది మీకు గుండె ఉంది. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు .. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.. వారి జీవితాలను తాకవచ్చు..
 మీరు కలిగి ఉన్న చివరి సంపద మీ శరీరం .. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు ..అవసరమైనవారికి సహాయం చేయగలరు .. సహాయం  చెయ్యడానికి  డబ్బు అవసరం లేదు ..
ఒక చిన్న శ్రద్ధ ,సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు.
భగవంతుడు మనకిచ్చిన జీవితం..
కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !
ప్రతిక్షణం ఆనందంగాఉంటూ, పదిమందికి సహాయపడుతూ, జన్మను చరితార్థం చేసుకుందాం.
శుభం...
 

శీర్షిక : విషం చిమ్మే కాలం.
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
కాల యముడు విషమును పంచె  
గోల చేయు టేల
కలల పంటను తుంచు టెందుకో
వలలొ చిక్కు టేల   
జాలిలేదును జోలె పట్టినా
గాలి కూడ కరువు
కాలిపోయిన సోయగములేలు  
నిలవాలి ధర్మము ఏలనూ
కళ్ళు చెమ్మ గిల్లె
తెలపాలి బతుకులో న్యాయము  
అలక లెన్ని ఉన్న
కలలన్ని కాటికి చేరాయి
చిలక బతుకు లాగ
నిలబడి లేక సోయగములు
కాలి పొయే కట్టెనైనాను
జాలి చూపు చున్న  
గాలిలో గాలినై వెతికాను
ఆలి మాట పట్టి
తోలుతిత్తులోన నీటిలా
కాలె కడుపు నింపు
ఆకలి తీర్చు సోయగములు
--(())--
 

నేటి హాస్య కధ ..    "  మా అమ్మాయి   కనపడుట లేదు "   
మాయమై పోతున్న తెలుగు అమ్మాయి.
ఏమండి ఈ మద్యన ఎవరైనా మా తెలుగు అమ్మాయిని చూసారా? చూస్తే చెప్పండి. అయ్యా! మీకు పుణ్యం ఉంటుంది.
ఓహో! మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలియదుకదూ! ఆనవాలు చెపుతా, వినండీ.
 మా అమ్మాయి అమాయకంగా ఉంటుంది.
 చేతినిండా గాజులు వేసుకుని లక్ష్మీదేవి లాగ ఉంటుంది.
 రెండు చేతులకూ గోరింటతో (మెహెంది కాదు), పాదములకు పారాణితో అందంగా ఉంటుంది.
 మా అమ్మాయి నిండుగా పరికిణి కట్టుకుని ఓణి వేసుకుని ఉంటుంది.
 తలకు చమురు రాసుకుని చక్కగా దువ్వి రొండు జడలు వేసుకుంటుంది.
 తలనిండా పూలు పెట్టుకుని, వాలు జడకు జడ కుప్పులు వేసుకుంటుంది.
 చారడేసి కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుటిన పావళా కాసంత చంద్రబింబం లాంటి ఎఱ్ఱటి కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది (బొట్టు బిళ్ళ కాదు).
 కాళ్లకు మువ్వల అందెలతో (కాలి పట్టీలు అనకూడదు) ఘల్లుఘల్లు మంటూ ఇల్లంతా సందడిగా తిరుగుతుంది.
 ముద్దబంతి పువ్వులా, చిదిమి దీపము పెట్టుకునే లాగున, ఇంటికి కళగా ఉంటుంది.
 ఇలాంటి అమ్మాయి మీకేక్కడైనా కనిపించిందా? అగుపించినదా? మాకైతే గత పాతిక సంవత్సారాలుగా కనిపించడం లేదు. పండక్కో, పబ్బానికో, అక్కడ్డక్కడ తళుక్కున మెరిసి మాయమైపోద్ది అంతే !!!
..........
 

దానికి నేను రాసిన సమాధానం ఇది 👇
ఆమె ఉంది కానీ కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగబ్బాయిని వెతుకుతూ వెళ్ళి, ఇంతవరకూ రాలేదు.
తెలుగబ్బాయి ఎవరా అనా?
ఆనవాళ్ళు చెపుతాను.
ధైర్యంగా ముందుకు పోయే తత్వం.
ఠీవిగా, పంచె, లాల్చీ, కండువాలతో ఉంటాడు.
నడిచొచ్చే విష్ణుమూర్తిలా ఉంటాడు.
కోరమీసంతో, కోటేరు ముక్కుతో ఉంటాడు.
అందరినీ వరసలు కలిపి, నవ్వుతూ పలకరిస్తుంటాడు.
తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుతుంటాడు.
చక్కని కుంకుమబొట్టుతో మెరిసిపోతుంటాడు.
తల్లిదండ్రులను అమ్మా నాన్నా అని నోరారా పిలుస్తాడు. అత్తా, మామా,  బాబాయ్ లాంటి భారతీయమైన పిలుపులే వాడుతాడు. అనవసరంగా మ్లేచ్ఛభాష వాడడు.
అడగకుండానే తోటివారికి తోచిన విధంగా సాయం చేస్తుంటాడు.
చూడటానికి రెండు కళ్ళూ, చెప్పటానికి మాటలూ చాలవు అన్నట్టుగా ఉంటాడు.
చూసి చాలా కాలమైంది. తననే వెతుకుతూ వెళ్ళి ఉంటుంది తెలుగమ్మాయి. ఒక్కటి మాత్రం నిజం. వస్తే ఎప్పటికైనా వీళ్ళు కలిసే వస్తారు. రావాలనే ఆశిద్దాం.
--(())--
 

మ్యము సుఖాల గమనం రమణి రాజ్యం
గమ్యము విశాల హృదయం కమల హాసన్
సౌమ్యము వినోద వదనం సకల హృద్యం
కామ్యము వివాహ కమతం కలల బంధం
 

సోయగములు
ఎంత మధురమోను ప్రేమలే    
వింత అనుభవమ్ము
సంత సమ్ముగను ఉండేనులే
కొంతకళల మాయ
మందమారుతము వీచేనులే  
సందడంత చేసి
మందహాసపుముగను సోయగములే
 

మల్లెల తీవియ తొందర
మెల్లగాను సాగు
ఉల్లము జల్లున తొందర
చల్ల గాను సాగు
అల్లము ఘాటున తొందర
జల్లు వాన లాగు
మల్లెలమాలసోయగములు
 

మధుపము సుధకైను చిందులు
విధియె మొహమవ్వు
విధివాద సౌఖ్యపు పొందులు
మదిని గాయ పరుచు   
ఎదలోన భావపు పలుకులు  
ఏది ఎంత వరకు
ఎదలోన మార్పుసోయగములు

--(())--
 

: మనిషి హృదయం
 

చెట్టును చెట్టుగానే చూస్తాడు. చెట్టులో ఏమీ అందం కనిపించదు. పుట్టను మట్టిగా చూస్తాడు. పుట్టలో చీమలు ఉన్నాయా, పాముందా అనేవి అతడికి అనవసరం. మంద్ర స్థాయిలో వీచినా, తీవ్రంగా వీచినా... గాలి గాలే. అందులో ప్రాణవాయువు ఉంటుంది. మనం బతుకుతున్నాం. అది కలుషితం కావడం వల్ల రోగాల పాలవుతున్నాం.
మనిషి గలగల పారే నదిని చూస్తాడు. అందులో నాచు, క్రిమి, కీటకాలు ఉంటాయి. ఆ నీళ్లు నేరుగా వాడకూడదు అంటాడు. సూర్యుడు వస్తాడు. వెళతాడు. అది ఆయన పని.  చంద్రుడు సూర్యుడి మీద ఆధారపడి బతుకుతాడు. స్వయం ప్రకాశం లేదు. గ్రహాలంటారా? అవి సౌర వ్యవస్థలో ఒక భాగం. అలా తిరుగుతూనే ఉంటాయి. పని లేనివాళ్లు తిరుగుతున్నట్లు... ఇదీ వరస. ఇలా ఉంటాయి ఆ వ్యక్తి ఆలోచనలు... ప్రకృతిలో కలిసి బతుకుతాడు. ప్రకృతితో ఏం సంబంధం లేనట్లే ఉంటాడు. ప్రకృతిని ఒక యాంత్రిక వ్యవస్థగా చూస్తాడు.
సంఘంలో అందరితో కలిసి ఉన్నట్లు కనిపిస్తాడు. కాని అన్నీ వ్యావహారిక వ్యాపార సంబంధాలే నెరపుతుంటాడు. డబ్బు లేకపోతే గౌరవం ఎక్కడ ఉంది? అసలు గౌరవం ఎక్కడ ఉంది? అన్నీ ఇచ్చి పుచ్చుకోవడాలే కదా. కనుక వ్యాపారం లేకపోతే బతుకే లేదంటాడు.
భావాలు, స్పందనలు, సౌందర్య ఆరాధన, లాలిత్యం, సౌకుమార్యం, జీవనం మీద నమ్మకం... అతడిలో మచ్చుకైనా కానరావు.
 

పుట్టాం. బతుకుతున్నాం. చావాలి. దానికోసం ఎదురు చూడాలి. అంతా భౌతికమే. కనిపిస్తున్నవాడే మనల్ని రక్షించడం లేదు. కనపడనివాడు ఏం రక్షిస్తాడు? అదంతా పెద్ద భ్రమ. మాయ. కొంత మంది మనుషులు కూడగట్టుకొని చేస్తున్న గారడి అని తలపోస్తాడు.
ఇలాంటి భావాలతో కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్లనెవరూ కాదనలేరు. వాళ్లు ప్రపంచాన్ని చూసే విధానం భిన్నంగా ఉంటుంది.
 

మనిషి మనిషిలా ఉండాలి. సహజ మానవ స్పందనలను నిగ్రహించుకుని హృదయాన్ని కోల్పోకూడదు. హృదయం లేకపోతే ప్రేమ ఉండదు. ప్రేమ లేకపోతే విశ్వ సౌందర్యం తెలియదు. ఈ జగత్తును ఇంత అద్భుతంగా సృష్టించడం వెనక విధాత ఉద్దేశాన్ని ఎప్పటికీ గ్రహించలేం.
 

ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం సృష్టి సూత్రం. అంతా ఒక గొప్ప సంగీత వాయిద్యం మీద పలికించే దివ్య రాగాల ఝరి.
నిమిత్తమాత్రంగా ఉండటం మంచిదే. అది జ్ఞానోదయమై సత్య రహస్యం తెలుసుకున్నప్పుడు ఏర్పడిన దివ్య వైరాగ్య స్థితి. అజ్ఞానంతో తప్పుడు అభిప్రాయాలు ఏర్పరచుకుని హృదయానికి, మనసుకు ఉన్న లంకెను తెంచుకుని తామరాకు మీద నీటిబొట్టులా బతుకుతున్నానని చెప్పుకోవడం సరి కాదు.
 

సత్యం శివం సుందరం ఏమిటో బోధపడాలంటే మనసులోని యాంత్రికతను తొలగించుకుని, తర్క వితర్కాలతో కూడిన మనసును జీవన తత్వంలో ఉన్న ప్రేమతో అనుసంధానం చేసుకోవాలి. నమ్మకం, అపనమ్మకం మధ్యలో సత్యం నివసిస్తుంది. గొప్ప ఆలోచనలు దాన్ని చూపిస్తాయి.
 

మనిషి మట్టి మనిషే. అతడి హృదయం మాత్రం మట్టి కాదు. ప్రపంచం ఎలా ఉందో అలా చూడాలంటే లోపలికి చూడటం ఒక్కటే మార్గం. అక్కడ మట్టి మీద మొలిచిన మహా సౌందర్యలోకాలు ఎన్నో ఉన్నాయని అంతస్సౌందర్య వీక్షకులైన జ్ఞానులు చెబుతారు!
 

--(())--

 మహిత గుణ సంపద

శరీరానికి గుణాలకు ఎంతో అంతరం ఉంది. శరీరం క్షణ భంగురం. గుణాలు ఆకల్పాంతం నిలిచే ఉంటాయి- హితోపదేశంలోని ఒక శ్లోక భావం ఇది గుణాల వల్ల కలిగే కీర్తి చరిత్రలు నాశనం లేనివని అర్ధం సద్గుణ సంపత్తి గలవారి జీవితాలు ఎల్లప్పుడూ సమాజానికి అనుసరణీయమే. మహానుభావుల మంచి గుణాలను, మహిత చైతన్యాన్ని శక్తి మేరకు అనుసరించి ఆ స్ఫూర్తితో జీవించడం ఆవశ్యకమైన లక్షణం. అటువంటి ఆదర్శ జీవన విధానం వల్ల జాతి, దేశం, సంప్రదాయం, సంస్కృతి, జీవనవికాసం సురక్షితమవుతూ ఉంటాయి.

మహాకవులు మహాపురుషుల జీవితాలను ఉజ్వలంగా చిత్రించి భావితరాలకు వెలుగుబాటలు పరిచారు. సంస్కృత సారస్వత ప్రపంచంలో కవికుల గురువు కాళిదాసు. ఆయన కావ్యాల్లో రఘువంశం ప్రసిద్ధమైంది. ధర్మరక్షకులైన రఘువంశ ప్రభువుల చరిత్రల్ని ఉదాత్తంగా చిత్రించి ఆ ఆదర్శ జీవన క్రమాన్ని కాళిదాసు పాఠకులకు బోధించాడు. రఘువంశ రాజుల్లో దిలీపుడి సేవాపరాయణతను, రఘు మహారాజు దాననిరతిని, అజుడి కోమల స్వభావాన్ని, శ్రీరాముడి ఆదర్శ జీవితాన్ని సర్వోత్తమంగా చిత్రించాడు. కావ్యారంభంలో కాళిదాసు రఘువంశీకుల ఉదాత్త గుణాలను పేర్కొని, అవి తనను వారి చరిత్ర రాయడానికి ప్రేరేపించాయని తెలిపాడు. దానం చేయడం కోసం ధనం సంపాదించడం, సత్యం కోసం మితంగా మాట్లాడటం, కీర్తి కోసం శత్రువులను జయించడం పితృరుణ విముక్తికి సాధనమైన సంతానం కోసం వివాహం చేసుకోవడం ఆనే గుణాలు కలిగినవారిగా సూర్యవంశ ప్రభువుల్ని వర్ణిస్తాడు. కాళిదాసు. ఈ లక్షణాలు ఏ కాలంలోనైనా మానవ సమాజానికి

వర్తిస్తాయి మనిషి ధనం సంపాదించాలి కాని అత్యాశతో కాదు కూడబెట్టాలన్న తపనతో కాదు. మన ఆర్డన, వ్యయం రెండూ దర్మబద్ధంగా ఉండాలి. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన ధనం సంపాదించేవారిలో కలగాలి. తమ రాజ్యంలోని పేదలకు కూడు, గుడ్డ, గూడు కల్పించవలసిన బాధ్యత పాలకులపై ఉంది. నేటి అంతర్యామి పాలకులే కాదు, సంపన్నులందరూ ధనం ప్రయోజనం త్యాగమని గుర్తుంచుకోవాలి. ఎంత మితంగా మాట్లాడితే అంత మేలు. సాధారణంగా తక్కువగా మాట్లాడినప్పుడు సత్యమే పలకగలం. మితవాక్యం హితవాక్యం కావాలి. వాచాలత్వం అసత్యాలకు, అనౌచిత్యాలకు నెలవు కావచ్చు.

పూర్వం రాజులు కీర్తికాంక్షతో శత్రువుల్ని జయించేవారు. ఆధునిక ప్రపంచంలోనూ స్పర్థలంటాయి. ఆరోగ్యకరమైన పోటీవల విద్యలు వర్ధిల్లుతాయి. జిజ్ఞాసతో పాండిత్యాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకొని తనను మించినవారిని గెలవాలనే పట్టుదల వాంఛనీయమే. ఇది కుటిల ప్రయత్నాల వల్ల కాక సక్రమ పద్ధతిలో జరగాలి. కామం ఒక పురుషార్ధం. అది అతి శక్తిమంతమైంది. కామ తృప్తికి వివాహమే ఉత్తమ మార్గం. శారీరక సుఖం కాక సంతానోత్పత్తిని వివాహ పరమార్ధంగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. భారతీయ జీవన వ్యవస్థలో గృహస్థాశ్రమం చాలా శ్రేష్టమైనది. తన పూర్వీకుల పరంపరను తన ద్వారా మరో తరానికి అందించడం ప్రకృతి ధర్మం. తన వారసత్వంగా ఇంకొక తరాన్ని సృష్టించడం వల్ల పితృ రుణం నుంచి విముక్తులవుతారని రుషుల సందేశం

త్యాగం, సత్యభాషణం, కీర్తి, కాంక్ష, సంతాన సృష్టి అనే ఈ నాలుగు భావనలూ చాలా ఉత్కృష్టమైనవి. మహా కవులు ఎవరికి ఆపాదించి చెప్పినా ఆ గుణాలు లక్షణాలు మొత్తం మానవ జాతికి అనుసరణీయమని వారి దృష్టి క్రాంతదర్చులైన కవుల వాక్కులు సర్వ కాలాలకు, సకల జనులకు శిరోధార్యం. ప్రాచీన వాంగ్మయం అందించే అమృత సందేశం విస్మరించరానిది

--(())--

మన జీవితంలో ఎదురయ్యే వారంతా  మనకు గురువులే . మంచి వారు పాఠం నేర్పుతారు  చెడ్డవారు గుణ పాఠం నేర్పుతారు . మంచితనం అందరిలో వుండదు , అందరికీ నచ్చదు . అందుకే మంచితనానికి నిందలు ఎక్కువ , నమ్మకం తక్కువ . అనుమానం ఎక్కువ , అభిమానం తక్కువ . అయితే కాలానికి , కర్మకూ జ్ఞాపక శక్తి ఎక్కువ . ఎంతకాలం తరువాతైనా సరే మనం చేసిన మంచి , చెడు లకు ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు . పుట్టుక మనది కాదు , చావు మనది కాదు , భూమి మనది కాదు , ప్రకృతి మనది కాదు , మనదీ అని మిగిలేది విశ్వాసం , నమ్మకం , ప్రేమ , మంచితనం , స్నేహం మాత్రమే . ప్రపంచంలో మనకోసం ఎవరూ లేకపోవచ్చు  కానీ ఎవరికో ఒకరికి మనమే ప్రపంచం లా కనిపించవచ్చు . వయస్సు పెరిగే కొద్ది మనుషులు ఒంటరివారు అవుతుంటారు . కానీ వయస్సు పెరిగే క్రమంలో స్నేహాలు వారి వయసును మరిపించే ఔషధాలు అని మానసిక నిపుణులు చెబుతుంటారు . అది అక్షరాలా నిజం . అందుకే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా , హాయి గా వుండాలంటే అందరితో స్నేహంగా వుండాలి , మంచి స్నేహితులని తరచుగా కలుస్తూ వుండాలి . కాలం , పరిస్థితులు మారుతూ ఉంటాయి కానీ చక్కని బంధం స్వఛ్చమైన స్నేహం ఎప్పటికీ మారదు .
ఇదే జీవిత సత్యం . సర్వే జనా సుఖినోభవంతు.
--(())--


ఆసరా
                                  *
అదో గేటెడ్ కమ్యూనిటీ..లోపల అన్నీ
రిటైర్మెంట్ హోమ్స్...
ఉదయమే ఐదున్నర కల్లా తమ ఇంటినుండి ఉదయపు వ్యాహ్యాళికి బయలుదేరి రెండిళ్ల అవతల ఇంట్లో ఉంటున్న వాసుదేవరావు గారిని కలిసి,  ఒక గంట నడిచి రావడం రామారావు గారి దినచర్య...

ఇప్పుడు ఇటువంటి హోమ్స్ ఎక్కువ వచ్చాయి..
వివిధ కారణాలతో పిల్లలు దూరంగా ఉండి, పని
మనుషులు అందుబాటులో లేక, ఉన్నా భద్రత లేక, ఒంటరిగా అవస్థ పడలేక,  చాలామంది పెద్దలు ఇప్పుడు రిటైర్మెంట్ హోంలలోకి మారుతున్నారు.

రిటైర్మెంట్ హోమ్ లు అన్నీ పక్కపక్కనే   కాటేజెస్ లా ఉంటాయి...ఇక్కడ స్వేచ్ఛగా, గౌరవంగా తమింట్లో తాము వుంటూనే అన్ని  సౌకర్యాలు పొందొచ్చు..
ఇక్కడ అందరివీ సొంత ఇళ్లే..
సొంత ఇల్లు అయినప్పుడు ఎక్కడున్నా ఒక్కటే...పైగా భద్రత సకల సౌకర్యాలు అందించే బాధ్యత కొన్ని సంస్థలు తీసుకుంటాయి...

సకల సౌకర్యాలతో.. వృద్ధ శ్రీమంతుల.ఇళ్ళు అవి...
ఎన్నారై పిల్లలు తమ తల్లితండ్రులకు కొనిపెట్టిన ఇళ్ళు కూడా...

రామారావు గారు వెళ్ళేసరికి ఇంటిముందు వాసుదేవరావు గారు లేరు...
నిద్ర లేవలేదేమో అనుకుని..సర్లే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఆయన ముందుకు వెళ్లిపోయారు...అక్కడ ఇంకో స్నేహితుడు కలవడంతో మాట్లాడుకుంటూ ముందుకు వెళ్లిపోయారు...

గంట తరువాత తిరిగి వస్తూ చూసేటప్పటికి అప్పటికీ వాసుదేవరావు గారి ఇంటి తలుపులు తెరిచి లేవు...
మళ్లీ బెల్ కొట్టినా  ఎవరూ తలుపు తీయలేదు..
తాళం వేసుకుని బయటికి వెళ్లినా తెలీదు ఈ కొత్త పద్ధతులతో అనుకుని తన ఇంటికి వెళ్లిపోయారు...

ఆ సాయంత్రం వరకూ కూడా కనపడకపోవడం తో ఆఫీస్ కి వెళ్లి అడిగారు..వాసుదేవరావు గారి ఇంటి నెంబర్ చెప్పి..
వాళ్ళు వెంటనే.   వాళ్ళు వెళ్లిపోయారు కదా సర్..నిన్ననే... అని..
మీరు రామారావు గారా..మీకిమ్మని ఈ కవర్ ఇచ్చారు అన్నారు..

ఆయన అదేంటి..?  అనుకుంటూ.. కొంచెం ఆతృతగా
అక్కడే కూర్చుని.. కవర్ ఓపెన్ చేసి చదవడం మొదలెట్టారు...
రామా...!
నువ్వు మా గురించి  ఆందోళన పడతావని తెలుసు...అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను...
మేమిద్దరం బాగున్నాము కంగారు పడకు..
సావధానంగా చదువు...

నేను ఒక నెల క్రితం ఒక న్యూస్ పేపర్ లో ఒక మూల చిన్న ప్రకటన చూసాను...
విచిత్రం అనిపించింది...
వాళ్ళకి ఇద్దరు వయసైన భార్యాభర్తలు తమకి తల్లిదండ్రులు గా ఉండాలని...ఏ బాదరబందీ లేని వాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆరోగ్యం గా ఉన్న భార్యాభర్తలు  కావాలని...కింద నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని...
వెంటనే ఆసక్తిగా ఫోన్ చేసాను...
అతను ఆఫీస్ లో ఉన్నాను....తనే ఫోన్ చేస్తాను అన్నాడు..
నేను మరచి పోయాను...శనివారం అతనికి సెలవు రోజు
అతనే కాల్ చేసాడు నాకు..
అతని పేరు గోకుల కృష్ణ ట...
సాఫ్ట్వేర్ ఇంజినీర్..భార్యా భర్తలు ఉద్యోగస్తులు...ఒక పాప...
తన వివరాలు చెప్పి నా వివరాలు అడిగాడు...
నేను నా గురించి చెప్పాను...
అంతా విన్నాడు...
ఒకసారి వచ్చి కలిసాడు...
నన్ను, రాజేశ్వరి ని..
అతని ద్వారా తెలిసిందేంటంటే ఆ గోకుల కృష్ణ, అతని భార్య మాధురి కూడా అనాధాశ్రమంలో
పెరిగారట...
వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం ట...
వాళ్ళు చదువుకుని ఉద్యాగాలు వచ్చాకా
ఇద్దరూ పెళ్లి చేసుకున్నారట...
ఒక సంవత్సరం పాప ఉందట...
పాపని చూసుకోడానికి ఒక మనిషిని పెట్టుకున్నారట...

అయితే ఎవరైనా పెద్ద వాళ్ళు ఇంట్లో వుండి కనిపెట్టుకుని ఉంటే బాగుంటుందని అనిపించిందిట...
అతని భార్య ఆలోచనట ఇది...మనిద్దరికీ ఎవరూ లేరు...
ఎవరైనా పిల్లలు లేని పెద్దవాళ్ళని మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకి అండదండగా ఉంటుంది...
వాళ్ళకీ మన సపోర్ట్ ఉంటుంది...
మన పాపకి తాతా బామ్మల్లా ఉంటారు...
అని ఈ ఐడియా ఇచ్చిందట...

అతనికి నచ్చి ఈ ప్రకటన ఇచ్చాడట...
కానీ మాకు పిల్లలున్నారు కదా...అని సందేహం వ్యక్త పరిచాడు...
మేము మా పరిస్థితి చెప్పాము...
మా పిల్లలు ఒప్పుకోరేమో గొడవలవుతాయేమో అని భయపడ్డాడు...
కానీ మేమిద్దరం నచ్చామని అన్నాడు...అది అతని కళ్ళలో కనపడింది..
మేమిద్దరం ఎడ్యుకేటెడ్, జాబ్స్ చేశాం.. మా ప్రాపకంలో వాళ్ళ పాప చక్కగా పెరుగుతుంది అన్న నమ్మకం కలిగింది అన్నాడు...
నాకూ అతని పద్ధతి, అతని ఆలోచనా తీరు నచ్చింది..
ఇక్కడ  మేము ప్రశాంతంగా జీవిస్తున్నాము..ఒంటరి తనం లేదు
దేనికి లోటు లేదు...
కానీ మాబ్రతుక్కి ఒక అర్ధం ఉండాలనిపించింది...
నెను రాజేశ్వరితో మాట్లాడాను...
తానూ చదువుకుంది కాబట్టి  తనూ ఆలోచించింది...
మేమిద్దరం ఏమనుకున్నాం అంటే..మా పిల్లలా ఇక్కడికి రారు...
మాకు వాళ్ళ దగ్గరికి అన్నేసి గంటలు కూర్చుని ప్రయాణం చేసే ఓపిక లేదు...
ఇలా ఉంటే బాగుంటుందని అనిపించింది...
ఒకరోజు అతను తన భార్యను తీసుకుని వచ్చాడు...
మీ అందరితో నా స్నేహితుడు కొడుకు కోడలు అని చెప్పాను నీకు గుర్తుందో లేదో...
ఆ అమ్మాయి కూడా మంచి పిల్ల...
మాతో మనసు విప్పి మాట్లాడింది...తనకు ఒక కుటుంబం కావాలని...ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే బాగుంటుందని వాళ్ళకి అనిపించిందట..
వాళ్ళ పాప అన్నీ అంటే మన సభ్యత, సంస్కృతి  నేర్చుకునే అవకాశం ఉంటుందని...

ఒక నెల రోజులుగా మేము ఒకరికొకరు బాగా తెలుసుకున్నాకా మా నలుగురికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడ్డాకా...ఒక బాండింగ్ ఏర్పడ్డాకా...
నేను మా పిల్లలతో మాట్లాడాను...

వాళ్ళు షాక్ అయ్యారు... మాట్లాడారు
పోట్లాడారు ...ఇదేంటి అన్నారు...వద్దు అన్నారు..
మీ డబ్బు చూసి వచ్చారేమో అన్నారు...
మేము చెప్పాము వివరంగా...మా పైసా కూడా వాళ్ళు వద్దన్నారని, గోకుల్ వాళ్ళ మొత్తం వివరాలు ఇచ్చాను...

వాళ్ళకి మేము..మాకు వాళ్ళు ఆసరాగా ఉందామని నిర్ణయం తీసుకున్నామని...
మాకు ఇప్పుడు కావలసినవి హంగులతో ఉన్న ఇల్లు, ఫర్నిచర్, సౌకర్యాలు కాదు...
కొంచెం ప్రేమా ఆప్యాయతలు ఇచ్చే మనుషులు కావాలని...

గోకుల్, మాధురి ఇద్దరూ కూడా మీ
బట్టలు తెచ్చుకోవాలంటే తెచ్చుకోండి...అవి కూడా తీసుకురాకపోయినా పర్వాలేదు అన్నారు...

వాళ్ళది మూడు బెడ్ రూముల ఫ్లాట్...గేటెడ్ కమ్యూనిటీ లో ఉంది...
పొందికైన ఇల్లు...రోజూ పొద్దున ఒక నానీ వచ్చి సాయంత్రం వాళ్ళొచ్చేవరకూ పాపని చూసుకుంటుంది...
మేము  ఆ పాపకి తాతా అమ్మమ్మ లానో తాతా బామ్మలాగో ప్రేమని ఇవ్వాలి...
మాకూ శ్రమ లేదు...

మేము పిల్లలని ఒప్పించాము...
చూద్దాం...మేము అడ్జస్ట్ అవుతామనే నమ్మకం ఉంది..అందుకని ఇక్కడ ఖాళీ చేస్తున్నామని లెటర్ ఇచ్చాము...
ఈ మా ఇల్లు రెంట్ కి ఇచ్చేట్టు మాట్లాడాము...
మా బట్టలు రెండు సూట్ కేస్ ల్లో సర్దుకుని అతనితో కార్ లో పంపించాము...

మిగిలిన ఇంట్లోని ఫర్నిచర్ అంతా అలానే ఉంచాము...
అందరికీ చెప్పకుండా వెళ్ళాము కావాలనే...
ఇవన్నీ అందరికీ తెలియడం ఎందుకని...
వాళ్ళు కూడా వాళ్ళ సర్కిల్ లో వాళ్ళ పేరెంట్స్ గానే చెప్తామన్నారు...
మమ్మల్ని  "మా అమ్మా నాన్నగారు అంటే"... "మా అమ్మా నాన్నగారు"  అని గోకుల్ మాధురి పొట్లాడుకుంటుంటే నిజంగా ముచ్చటేసింది మాకు..రామా...!!

నిన్ను, రామలక్ష్మి గారిని తరువాత వచ్చి కలుస్తాము...
మీరూ మా ఇంటికి వస్తూ ఉండొచ్చు...
మనకి ఫోన్ లు ఎలానూ ఉన్నాయి...
రామా...ఇద్దరం ఉండలేకపోతున్నాం రా...ఇది అందరి సమస్య..అనుకో...
చూద్దాం ఈ దారి కొత్తగా ఉన్నా దేవుడే చూపించాడేమో...
ఈ వయసులో మేము వాళ్ళకి ఉపయోగపడతామో..మాకు వాళ్ళు ఉపయోగపడతారో కాలమే నిర్ణయిస్తుంది...
నువ్వే నాకు దగ్గర అయ్యావు కాబట్టి నీకు చెప్పడం నా బాధ్యత అనిపించింది...
ఉంటాను..
వాసుదేవరావు

ధర్మ నిధులు

ధర్మ స్వరూప నిరూపణం, కర్తవ్య నిర్వహణం, భవబంధ విమోచనం అనే మూడు అంశాలూ మానవ ధర్మానికి మూడు స్కంధాలు. వీటిలో మొదటిదానికి మహాభారతం, రెండోదానికి రామాయణం, మూడోదానికి భాగవతం దర్పణాలుగా పండితులు భావిస్తారు. భారతీయ సంస్కృతికి పట్టుగొమ్మలు, జీవధారలూ అయిన గ్రంథరాజాలు ఇవి. మానవ జాతికి సంస్కారాన్ని అందించే ఈ గ్రంథాల్లో సనాతన ధర్మం ప్రతిష్ఠితమై ఉంది. ఈ మూడు గ్రంథాల గమ్యం వేదప్రతిపాదనం. వేదమనే అంతర్యామితత్త్వానికి దేహేంద్రియ మానసాల్ని కల్పించి మూర్తిమత్వాన్ని పరికల్పించడమే ఈ మూడు గ్రంథాల పరమార్థం. వేదవేద్యుడైన పరమ పురుషుడు నరుడిగా ఎలా ప్రవర్తించాడో తెలిపేది రామాయణం. వేదాన్ని సమగ్రంగా మథనం చేసి ధర్మామృతాన్ని ఇచ్చింది మహాభారతం. భౌతిక జీవితం పొందిన జీవుడు నారాయణుడిగా వెలిగి, వెలిగించడానికి భావైక గమ్యమైన సులభ భక్తి మార్గాన్ని ఉపదేశిస్తుంది భాగవతం. వీటిని ప్రసాదించిన వాల్మీకి, వ్యాస మహర్షులు వేదావతారమూర్తులు.

సమస్త విశ్వంలో వ్యక్తి తాదాత్మ్యం చెందే స్థితిలో రామాయణ మహాకావ్యం ఆదికవి హృదయం నుంచి ఆవిర్భవించింది. తపస్వి వాల్మీకి సర్వమానవ జగత్కల్యాణానికి ఉపకరించే సద్గుణ సముపేతుడైన వ్యక్తి ఉన్నాడని నారదుడి ద్వారా తెలుసుకొని ఆ వ్యక్తి దృక్పథాన్ని ఉదాత్త రీతిలో హృదయాకర్షక కథనంగా చెప్పడానికి సంకల్పించాడు. ఈ భూమ్మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం లోకంలో రామాయణం స్థిరంగా నిలిచి ఉంటుందని బ్రహ్మ వాల్మీకిని ఆశీర్వదించినట్లుగా పండితుల వాక్కు. మంచిచెడుల సంఘర్షణ శ్రీరాముడి ప్రయాణం వెనక అంతర్లీనంగా గోచరిస్తుంది. దైవాంశను తనలోనే దాచుకొని విశ్వప్రేమ సుగంధాన్ని, ప్రేమను, కరుణను చుట్టూ ఉన్న ప్రపంచానికి పంచిపెట్టిన ధీరోదాత్తుడు శ్రీరాముడు. జీవితంలో అన్ని కోణాలకూ వర్తించిన శాశ్వత విలువలు కలిగిన విశ్వకావ్యం రామాయణం.

కృష్ణ ద్వైపాయనుడనే వ్యాసుడు భారతీయ సంస్కృతీ ప్రాసాదానికి మూలస్తంభం. వేదాలు బోధించే ధర్మాధర్మాల్ని సామాన్య మానవులకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసమే కౌరవ పాండవ కథా కథన వ్యాజంతో మహాభారతం రచించాడు. అందుకే భారతం పంచమ వేదంగా ప్రశంసలందుకొంది. మహాభారతం విజ్ఞాన సర్వస్వం. వ్యాసమునీంద్రులు దర్శించిన భారతం భారతీయ తత్వ సమగ్ర దృష్టి. విశ్వవాఙ్మయంలో ఇంతగా మానవ హృదయాన్ని మధించి వివిధ రీతుల్లో విస్తృతంగా చిత్రించిన కావ్యం మరొకటి లేదు. అన్ని కాలాలకు, అన్ని దేశాలకు ఉపయోగించే ధర్మాలు భారతంలో ఉన్నాయి. బహువిధ సంకీర్ణమైన మానవత్వ భావగతుల్ని అద్భుతంగా చిత్రించింది భారతేతిహాసం.

భగవంతుణ్నీ భక్తుణ్నీ సంధానించేది భాగవతం. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక తత్త్వాల స్వరూప స్వభావాల కూడలి, నిరాకారమైన భక్తికి సాకారమైన కథనం భాగవతం. భక్తికి, ముక్తికి ప్రాణాధారమైనది భాగవతం. భాగవత పఠనం మనిషిని శాంతచిత్తుణ్ని  చేస్తుంది. రామాయణం కావ్యమని, భారతం ఇతిహాసమని, భాగవతం పురాణమని స్థూలమైన అవగాహన. ఈ మూడు గ్రంథాలూ మానవ జాతిని అనుగ్రహించడం మొదలుపెట్టి ఎన్ని వేల సంవత్సరాలయిందో! ఈ జాతి వారసత్వ సంపదగా ఈ అక్షర సౌధాలు నిత్య నూతనంగా ప్రకాశిస్తూనే ఉంటాయి.

అని ఉంది...

రామారావు గారు లేచి,  వాళ్ళు ఈ వయసులో ఏది కావాలని వెళ్లారో... అది వాళ్ళకి పుష్కలంగా దొరకాలి దేవుడా.. అని,  మనసులో అనుకుని .. ఆ ఉత్తరం జేబులో పెట్టుకుని,  ముందుకు కదిలారు...
        కధలు సేకరించుట జరిగింది వివిధ మార్గాలు ఆదరిస్తున్న అందరికీ శుభాకాంక్షలు

No comments:

Post a Comment