దివ్య సంపద
సంపదలన్నీ సుఖ సౌఖ్య సంతోషాలకేనన్న బలమైన అపోహ ప్రజల్లో ఉంది. ప్రాపంచిక సంపదలన్నీ చేతులు మారుతున్నవే తప్ప స్వయంసృష్టిగా చెప్పదగ్గవి తక్కువ. వంశానుగతంగా సంక్రమించే పూర్వీకుల ఆస్తులన్నీ ఇలా లభిస్తున్నవే.
అర్థశాస్త్ర గ్రంథకర్త చాణక్యుడు సంపదను కూడబెట్టడాన్ని వ్యతిరేకించాడు. ఏ రోజు ఆదాయం ఆ రోజుకు సరిపోతే చాలన్నాడు. అప్పుడు మనిషి స్వార్థమనే బోనులో బందీ కాడు.
రాజ్య నిర్వహణ కోసం పాలకుడు పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండాలని ‘శుక్రనీతి’ చెబుతుంది. కష్టార్జితమే న్యాయార్జితమని విదురనీతి శాస్త్రం బోధిస్తుంది.
ప్రపంచంలో అన్యాయార్జన కోసం ఆరాటపడేవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. మాయాద్యూతంలో పాండవుల సంపదను దోచుకున్న దుర్యోధనుడు, సూది మోపిన స్థలాన్ని కూడా తిరిగి ఇవ్వనన్నాడు. అలా ఉంటుంది సంపద మీద వ్యామోహం. కానీ, వ్యామోహాల పర్యవసానాలన్నీ దుఃఖాంతంగానే ఉంటాయి. దుఃఖం తప్పదని తెలిసినా వ్యామోహాన్ని వదులుకోరు. ధృతరాష్ట్రుడి విపరీత పుత్రవ్యామోహం లోకప్రసిద్ధం.
మహాకవి భారవి తండ్రి తన పుత్రప్రేమను గుప్తంగా ఉంచుకుని, అందుకు కారణం కుమారుడి క్షేమమేనని చెప్పడం గుర్తుంచుకోదగిన చారిత్రకాంశం. సంతానం సాధించిన విజయాలను తండ్రి అభినందించి ప్రోత్సహించాలి. అతిగా పొగడకూడదు.
సంపద అంటే కేవలం ధనధాన్య వస్తువాహనాలు కావు. సరస్వతీ ప్రసాదాలుగా చెప్పుకొనే కళా సాహిత్య స్వరూపాలు కూడా. అక్షర సంపదలన్నీ అక్షయమే. కోటీశ్వరులు, మహారాజులు కూడా కవులకు, కళాకారులకు చేతులు జోడించక తప్పదు. లక్ష్మీ కటాక్షం కన్నా సరస్వతీ కటాక్షమే గొప్పదని రుజువైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని వారికి గండపెండేరం తొడిగినా, తన శ్రోత్రియత్వాన్ని పక్కనపెట్టి విశ్వనాథవారు కవికోకిల జాషువాను గండపెండేరంతో సత్కరించినా- అందుకు వారి అక్షర సంపదే కారణం.
తరతరాల సంపద ఆర్జించి వారసులకివ్వడంతో తమ కర్తవ్యం ముగిసిపోయిందనుకునేవారే ఎక్కువ. వారసులకు సంస్కారం, సంప్రదాయాలను కూడా ఇవ్వకపోతే, కొండంత సంపదైనా కళ్లముందే కరిగిపోతుంది. ఉత్తమ గుణాలు కలిగి ఉన్నవారికి ప్రాపంచిక సంపదల పట్ల ఆసక్తి ఉండదు. వారు అంతర్ముఖులై అంతర్యామిని ఆరాధించడంలో నిమగ్నులై ఉంటారు. దేహాన్ని కేవలం జీవన వాహనంగా భావిస్తారు. ఆత్మభావనతో జీవిస్తారు. చూసేవారికి వారు కాలాన్ని వ్యర్థం చేస్తున్నారనిపిస్తుంది. కానీ వారు జీవితానికి అర్థం చేకూర్చుకుంటున్నారని తెలియదు.
వాల్మీకి పుట్టలో కూచుని కాలం వ్యర్థం చేశాడా? శ్రీరమణులు, అరవిందులు, శ్రీరామకృష్ణులు ఏమీ సాధించలేదా? వారంతా దివ్య సంపదలు ఆర్జించారు. వాటిని ఆశ్రితులకు, జిజ్ఞాసువులకు ఉదారంగా పంచిపెట్టారు.
భారతదేశం దివ్యమైన ఆధ్యాత్మిక సంపదలకు నెలవు. ఎందరో మహానుభావులు తరతరాలకు సరిపడా దివ్య సంపదను వారసత్వంగా ఇచ్చారు. ఆ విషయాన్ని గుర్తించని వారంతా
ప్రాపంచిక సంపదలకు ప్రాధాన్యమిస్తున్నారు. కొన్ని తరాలకు సరిపడా కూడబెట్టి వారసులకు ఇచ్చామని ఘనంగా భావిస్తున్నారు. కానీ, దివ్య సంపదను కోల్పోయామన్న గ్రహింపు లేకపోవడం ఒక జీవితకాలపు నష్టం.
--(())--
1.
మేళ్ల చెరువు.. కోదాడకు 20 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. సిమెంటు
ఫ్యాక్టరీల బెల్టు. సున్నపురాయి నిక్షేపాలు అపారంగా వున్న ప్రాంతం.
2. మేళ్ల చెరువులో శివాలయాన్ని కాకతీయులు 12వ శతాబ్దంలో నిర్మించారు. శాసన ఆధారాలు వున్నాయి. ఆలయ ప్రాంగణంలోనే శిలాశాసనం వుంది.
3. ఆలయంలోని శివలింగం ప్రత్యేకతలు అనేకం వున్నాయి.
4.
వందేళ్ల వ్యవధిలో ఓ బెత్తెడు చొప్పున శివలింగం నిలువుగా పెరుగుతూ
వుంటుంది. గడచిన ఐదు వందల సంవత్సరాలలో పెరిగిన పరిణామాన్ని సంకేతిస్తూ
శివలింగంపై గుంటలు కూడా కనిపిస్తూ వుంటాయి.
5.
లింగంపై అమర్చిన కలశంనుంచి బొట్టుబొట్టుగా కారే నీరు.. ఆ గుంటలను
ఏర్పరుస్తుంటాయి. ఆ గుంట వైశాల్యం పెరుగుతుంటుంది. గడచిన పాతికేళ్లుగా
అక్కడ అర్చకత్వం చేస్తున్న బ్రాహ్మణ పండితుడు ఈ విషయాన్ని నిర్ధారించారు.
వందేళ్ల వ్యవధిలో అది శివలింగం ముఖ భాగంలోకి అంతకు ముందున్న గుంటల్లో
భాగంగా చేరి, లింగం పరిణామం మరింత పెరుగుతుంది. అయితే.. పురావస్తు శాఖవారు
దీనిపై పరిశోధన కానీ, శాస్త్ర నిర్ధారణ కానీ చేసిన దాఖలాలు లేవు.
6. యాగంటి బసవన్న పురావస్తు శాఖవారు పెరుగుదలను నిర్ధారించారు.
7. మేళ్ల చెరువు శివయ్యను నిజరూపంలో దర్శించుకోగలిగటం అదృష్టం.
8.
మేళ్ల చెరువు శివలింగం అగ్రభాగాన.. కొద్దిగా వెనుకవైపుగా ఒక రంధ్రం
వుంటుంది. అందులోంచి నిరంతరం నీటి ఊట వుంటుంది. అదేదో బొక్క పడి వుంటుంది..
పూజారిగారు చేసే అభిషేకాలు, కలశంనుంచి వచ్చే నీటితో ఆ బొక్క నిండుతోంది
తప్ప.. ఊటలేదు, గీటలేదు అని నాలాగే ఎవరైనా అనుకుంటారు.
9.
అసలు దీని లోతు ఎంతో అంతు చూద్దామని, మనం బోరుబోవుల్లో వేస్తామే.. అలాగ..
ఒక రాయికి తాడు కట్టి దింపారు, దింపారు కానీ.. లోతు తెలియలేదు. తాడుని
వెనక్కి లాగినప్పుడు పడిన మరకలు మాత్రం శివలింగంపై మనకు కనిపిస్తాయి.
10.
అయితే దేవాదాయ శాఖవారు కూడా కొన్ని పరీక్షలు చేశారు. అభిషేకాలు అన్నీ
ఆపేసి, ఊట మొత్తాన్ని తోడి, గుడి తలుపులు పావుగంట మూసేసి, మళ్లీ వెళ్లి
చూస్తే.. గుంట నిండే వుంది. అలా మూడుసార్లు పరీక్షలు జరిగాయి.
11.
ఆ ఊట ఎక్కడినుంచి వస్తోందో ఎవరికీ తెలియదు. భక్తుల సౌకర్యార్ధం ఆలయ
ప్రాంగణంలో వేసిన నాలుగు బోర్లు కూడా ఫెయిలయ్యాయి. కానీ.. ఈ నిరంతర ఊట..
అది కూడా శివలింగంపై.. శివుడి శిరస్సున గంగ ప్రవహించినట్టుగా వుంటుంది.
12.
అంతరాలయంలోనుంచి చూసినప్పుడు.. ఆ ఊట గుంట నేరుగా కనిపించదు. అందుకే
పూజారి.. గర్భాలయంలో శివలింగం వెనుక నిలబడి ఒక అద్దం పెట్టి చూపిస్తుంటారు.
ఆ గంగాజలాన్ని భక్తులపై చిలకరించి ఆశీర్వదిస్తారు. శివలింగం వెనుక
అర్ధనారీశ్వరీ రూపాలు కూడా వుంటాయి. వాటిని కూడా అద్దంలోంచి చూడవచ్చు.
13.
శివలింగం రాతి స్వభావం.. ఒక సున్నపు రాయిలాగా తెల్లగా వుంటుంది. కానీ ఆ
ప్రాంతంలో మామూలుగా దొరికే సున్నపురాయి కంటే.. అత్యంత అరుదైన, అమూల్యమైన
సున్నపురాతితో దానిని తయారు చేసి వుంటారని నా వ్యక్తిగత అభిప్రాయం.
సున్నపురాయికి వుండే ఉష్ణస్వభావాన్ని శీతలీకరించే ప్రక్రియలో భాగంగా
కాకతీయులు సహజ శీతలీకరణ యంత్రంగాన్ని ఏర్పాటు చేసి వుంటారని, అందుకు
సరిగ్గా మేళ్ల చెరువులోని నిర్దిష్ట ప్రాంతాన్ని ఇంజనీరింగ్ ప్రతిభతో,
వాస్తు ప్రతిభతో ఎంపిక చేసి వుంటారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎంతో
మెటిక్యులస్ ప్లానింగ్ వుంటే తప్ప ఆ ఆలయ నిర్మాణం, ఆ శివలింగ నిర్మాణం అలా
సాగి వుండదు.
14.
మనకు దైవభక్తి వుండవచ్చు, లేకపోవచ్చు. కానీ ఇటువంటి నిర్మాణాలను
కాపాడుకోవడానికి భక్తి అనేది, దేవుడు అనేవాడు మనకు మాధ్యమం అయితే కొంపలు
మునిగేదేమీ లేదు. సెక్యులరిజానికి, లౌకికవాదానికి వాటిల్లే ముప్పు ఏమీ
వుండదు. మన చారిత్రక, వారసత్వ, విజ్ఞాన కేంద్రాలను మనం కాపాడుకోకపోతే ఎవరు
కాపాడుతారు?
15.
ఆలయం మండపంలో సుమారు పదీ పదిహేనుమంది బ్రాహ్మణులు, నాలుగైదు వేర్వేరు
విధుల్లో నిత్యం వుంటారు. గ్రహశాంతి ఇత్యాది క్రతువులను నిర్వహిస్తుంటారు.
నేరుగా శివుడి సమక్షంలోనే వీటిని నిర్వహించుకోవచ్చు... 💐🙏తాన ప్రదాయిని కోట సత్తెమ్మ
పశ్చిమగోదావరి
జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉంది కోట సత్తెమ్మ
అమ్మవారి దేవస్థానం. అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా
విరాజిల్లుతున్నారు. కోరిన కొర్కెలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి
చెందింది సత్తెమ్మ. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానానికి పురాతన
చరిత్ర ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలానికి
చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో నిడదవోలును నిరవధ్యపురంగా
పిలిచేవారు. నిరవధ్యపురాన్ని పాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు
శక్తిస్వరూపిణిగా పూజలందుకున్నారు. కాలక్రమేణా కోట శిథిలమైంది. అమ్మవారి
విగ్రహం కనుమరుగైంది. అలా అదృశ్యమైన అమ్మవారు 1934లో తిమ్మరాజుపాలెం
గ్రామానికి చెందిన దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి పొలంలో, పొలం
దున్నుతున్నప్పుడు బయటపడింది. భూమి యజమాని కలను అనుసరించి కోటసత్తెమ్మ
విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి నేటి వరకు అమ్మ... భక్తుల కోరికలు
తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచుతోంది. ఈ
ఆలయానికి ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, గుంటూరు, కృష్ణ,
జిల్లాల భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. ఆలయంలో ఏటా దసరా ఉత్సవాలతోపాటు
అమ్మవారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహిస్తున్నారు.
శంఖచక్రగద
అభయ హస్త యజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి
స్వరూపిణిగా వెలసిన అమ్మవారిని సందర్శించటానికి రెండుకళ్లూ
చాలవేమోననిపిస్తుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి.
అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తుంటారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఇక్కడ 65 గదులు ఉన్నాయి.
ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాలలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ
మెక్కుబడులు తీర్చుకుంటారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ
కోటసత్యనారాయణ, కోటసత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఏటా
శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముతైదువలతో ఉచిత
సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ వ్రతాలకు నిడదవోలు
పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంటుంది.
దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు,
లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు రోజుకి
సుమారు 100 మందికి శాశ్వత అన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని
చేపడుతున్నారు.
సంతాన వృక్షానికి పెరుగుతున్న భక్తుల తాకిడి
శ్రీ
కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన
వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. సంతానం లేని దంపతులు ఈ
వృక్షానికి ఊయల కట్టడం సంప్రదాయం. సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు
చేరుకుని ఎర్రటి వస్త్రం, పూర్తిగా పండిన రెండు అరటిపండ్లను అమ్మవారికి
సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును, ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దంపతులు
సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, ‘అమ్మా... పండు
కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ’ అని వేడుకుంటారు. బిడ్డ
పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధి తీసుకువచ్చి పేరు పెట్టుకోవడంతోపాటు బిడ్డ
ఎత్తు తులాభారంతో మొక్కుబడి తీర్చుకుంటారు. తులాభారానికి నగదు (నాణేల
రూపంలో) లేదా పటిక బెల్లం తూకం సమర్పించుకుంటారు.
ఆలయానికి వచ్చే మార్గం...
అమ్మవారి
ఆలయం నిడదవోలు రైల్వేస్టేషన్కి (బస్ స్టాండ్, గణపతి సెంటర్ల మీదుగా) 3
కిలోమీటర్ల దూరాన ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి 26
కిలోమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి 25 కిలోమీటర్ల
దూరం ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.
ప్రతిష్ఠాత్మకంగా రాజగోపుర నిర్మాణం
అమ్మవారి
దేవస్థానం ముందు భాగంలో దాతల సహకారంతో తొమ్మిది అంతస్తుల రాజగోపురం
నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆలయ ఈవో చొరవతో ఇప్పటివరకు నాలుగు అంతస్థులు
పూర్తయ్యాయి.
No comments:
Post a Comment