🌻 *మహా భారతం* 🌻
🎈 *భాగము 98* 🎈
💧 *బకాసుర సంహారం* 💧
🍃🌺బకాసురునికి తానంటే తాను బలి అవుతానంటూ బ్రాహ్మణ కుటుంబీకులు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే వారిని సమీపించిన కుంతీదేవి-‘‘ఆర్యా! ఈ బకాసురుడు ఎవడు? వాడికి మీరెందుకు బలి కావాలి? వివరంగా నాకు చెప్పండి! చేతనయిన సహాయం చేస్తాను’’ అన్నది.‘‘మీ వల్ల కాదు తల్లీ’’ అన్నాడు బ్రాహ్మణుడు.‘‘అలా ఎందుకనుకుంటారు? నా వల్ల కాకపోతే నా కొడుకుల వల్ల అవుతుంది. ముందు సంగతి చెప్పండి’’ అన్నది కుంతీదేవి.
🍃🌺‘‘చెప్పడానికి ఏముందమ్మా! ఈ నగరానికి శని పట్టింది. నిజం చెప్పాలంటే ఈ దేశాధిపతి అసమర్థుడు. అతని అసమర్థత కారణంగా నగరానికి కొద్ది దూరంలో నివసిస్తోన్న బకాసురుడు ఊరి మీద పడి ఒకొక్క కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంటుంటే...తట్టుకోలేని బ్రాహ్మణులంతా వాడితో గట్టి కట్టడి చేసుకున్నాం. కుటుంబం అంతా కాదు, రోజుకి కుటుంబంలోని ఏ ఒక్కరో ఆహారమవుతామని చెప్పి, మనిషితో బాటు బండెడు అన్నం, రెండు ఎనుబోతులు, మాంస భక్ష్యాలు పంపుతామని విన్నవించుకున్నాం.
🍃🌺అందుకు ఆ నిశాచరుడు ఒప్పుకున్నాడు. ఈ నాటికి ఆ నిత్యబలి నియమం మా వంతయింది.అందుకే ఒక్కుమ్మడిగా రోదిస్తున్నాం’’ అన్నాడు.‘‘దీనికా మీరింతగా చింతిస్తున్నది! చింతించకండి! మీ పనుపున నిత్యబలికి నా కొడుకుల్లో ఎవరో ఒకరు ఆ అసురునికి ఆహారమవుతారు. నాకు అయిదుగురు కొడుకులు’’ అంది కుంతీదేవి. ఆ మాటలు వినలేనట్టుగా చెవులు మూసుకున్నాడు బ్రాహ్మణుడు.
🍃🌺‘‘అతిథిని, శరణన్న వారిని, అభ్యాగతుడై విశ్రమించిన వారిని వధించడానికి గృహస్థు అనుమతించకూడదు. అనుమతిస్తే ఆ గృహస్థునికి ఇహమూ, పరము రెండూ లేకుండా పోతాయి. ఇప్పుడు మనమున్న పరిస్థితి అలాంటిదే! వద్దమ్మా! మీ ఆలోచన మానుకోండి. ఓ మహా పాపానికి నన్ను ఒడి గట్టించకండి’’ అన్నాడు బ్రాహ్మణుడు. చేతులెత్తి కుంతీ దేవికి నమస్కరించాడు.‘‘ఎందుకు చెబుతున్నానో వినండి! మీకు తెలీదు.
🍃🌺మా భీమసేనుడు మహాబలాఢ్యుడు. గొప్ప మంత్ర సిద్ధుడు. ఇక్కడికి రాక ముందు అతను చాలా మంది రాక్షసులను అవలీలగా సంహరించాడు. వీణ్ణి...ఈ బకాసురుణ్ణి కూడా అతనలాగే సంహరించగలడు. ఆ నమ్మకం నాకుంది. అందుకని మీరింకేమీ మాట్లాడకండి! దైత్యునికి దైనందిన భక్ష్యరాశి మా భీముడే తీసుకుని వెళ్తాడు. మీరు నిశ్చింత గా ఉండండి’’ అని భీముణ్ణి కేకేసి-‘‘చెప్పమ్మా! ఈ ద్విజునికి నీ సంగతి చెప్పు’’ అని ఆదేశించింది కుంతీదేవి.
🍃🌺బ్రాహ్మణునికి తన శౌర్య ప్రతాపాలు వివరించి-‘‘బకాసురుని సంగతి నాకొదిలేయండి! నేను చూసుకుంటాను’’ అన్నాడు భీమసేనుడు. మరుక్షణం నుంచి బకాసురుని సంహారానికై అతను నిరీక్షించసాగాడు. అంతలో ధర్మరాజార్జున నకుల సహదేవులు భిక్షాటన నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. భీమసేనుని అత్యుత్సాహం గమనించి ఆశ్చర్యపోయారు.‘‘ఎందుకయ్యా ఇంత ఆనందంగా ఉన్నావు’’ భీముణ్ణి అడిగాడు యుధిష్ఠిరుడు.‘‘బకాసుర సంహారం చేయబోతున్నాను’’ అని చెప్పి, బ్రాహ్మణ కుటుంబ సంరక్షణకై తల్లి ఆనతి మీద తానిందుకు తయారవుతున్నానని తెలియజేసి జబ్బలు చరుచుకున్నాడు భీమసేనుడు.
🍃🌺ఆ మాటలకి నిర్ఘాంతపడి తల్లిని సమీపించాడు యుధిష్ఠిరుడు.‘‘ఏంటమ్మా ఇది! ఎందుకింత సాహసానికి ఒడిగట్టావు. కేవలం ఒక బ్రాహ్మణుని కోసం భీముని బలి పెట్టడం భావ్యమా’’ అడిగాడు.
🍃🌺‘‘భీముని సంగతి నీకు తెలియదు నాయనా! వాడు అతిలోక పరాక్రమశాలి. ప్రపంచంలో ఎవరినైనా ఎదురించగల సమర్థుడు. వాణ్ణి గురించి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. భీముడు ఆ బకాసురుని అవలీలగా సంహరించగలడు. ఇంకొక మాట! ఇతరుల దుఃఖాన్ని మాపేందుకే ఉత్తమ క్షత్రియులు అవతరిస్తారు. శిష్ట భూసురులను సంరక్షించి పుణ్య లోకాలు అందుకోవడమే క్షత్రియ ధర్మం కూడా....
🍃🌺కష్ట కాలంలో ఈ ద్విజుని కాపాడ్డం వల్లనే రేపు నీకూ, నీ సహోదరులకు శ్రేయః పరంపర సిద్ధిస్తుంది. అన్నీ ఆలోచించే నేనీ నిర్ణయం తీసుకున్నాను’’ అన్నది కుంతీదేవి. జనని ద్విజన్మ భక్తికీ, అపార కారుణ్యానికి ఎంతగానో సంతోషించి భీమసేనుని ప్రస్థానానికి అంగీకరించి, ఆతన్ని ఆశీర్వదించాడు యుధిష్ఠిరుడు. దాంతో భీమసేనుడు వివిధ ఆహారాలతోనూ, అన్నరాశితోను, ఎడ్ల బండిపై కూర్చుని దక్షిణాభిముఖంగా ప్రయాణించి కొంత సేపటికి బకాసురుడు ఉండే ప్రదేశానికి చేరుకున్నాడు.
🍃🌺అయితే అక్కడి దుర్గంధాన్ని తట్టుకోలేక యమునా తీరంలో బండినాపి, అక్కణ్ణుంచే బకాసురుని ఎలుగెత్తి పిలిచాడు భీముడు. బకాసురుడు ఎంతకీ రాకపోయేసరికి ఆకలికి తట్టుకోలేక బండిలోని ఆహారాన్ని భక్షిస్తూ రాక్షసుని కోసం ఎదురు చూడసాగాడు.
🍃🌺వాడెవడో నన్నే ఎలుగెత్తి పిలచి రా రమ్మని కవ్విస్తున్నాడు. నేనే పోతాను. వాడి తలపొగరు అణిచి వేస్తాను’ అనుకుని బకాసురుడు ఉవ్వెత్తుగా విజృంభించి ఒక్కంగలో భీముని సమీపించాడు. బకాసురుని పట్టించుకోలేదు భీముడు. తన పనిలో తానున్నాడు. తీరిగ్గా భోంచేస్తున్నాడు. ఆ నిర్లక్ష్య ధోరణికి భగ్గున మండిపడి-‘‘ఎవడ్రా నువ్వు? నాకు పంపించిన భక్ష్య భోజ్యాలన్నీ భుజిస్తూ నన్నే పట్టించుకోకుండా ఉన్నావు’’ అని భీముని మూపుపై పిడికిలితో కసిదీరా బాదాడు బకాసురుడు.
🍃🌺అయినా పట్టించుకోలేదు భీముడు. ఆహార పదార్థాలు తినడంలో ఆవురావున ఉన్నాడు. చూస్తూ తట్టుకోలేకపోయాడు బకాసురుడు. అక్కడ ఉన్న చెట్టునొక దాన్ని పెళ్ళగించి దాంతో భీమునిపై విరుచుకు పడ్డాడు. అప్పటికి భోజనాన్ని ముగించిన భీముడు రాక్షసుని ఉరిమి చూసి-‘‘మనిషి మాంసం బాగా తిని మదించిపోయావు. ఆ మదాన్ని అణిచి వేస్తాను చూడు’’ అంటూ దగ్గరలోని చెట్టునొక దాన్ని పెరికి తనూ యుద్ధానికి సిద్ధమయ్యాడు భీముడు. ఇద్దరూ భీషణ మల్లయుద్ధానికి తలపడ్డారు.
🍃🌺ఆ యుద్ధానికి ధరణీతలమే దద్దరిల్లింది. చూస్తూ బకాసుర బాంధవులు అల్లల్లాడిపోయారు. యుద్ధంలో అసురుడు అలసిపోతున్నాడన్న విషయాన్ని గ్రహించిన భీమసేనుడు, వాణ్ణి గట్టిగా అదిమి పట్టుకుని వాడి శరీరాన్ని రెండుగా చీల్చి మహోత్సాహంతో సింహనాదం చేశాడు. అక్కడ బకాసురుని రుధిర ధారలు ఏరులై ప్రవహించాయి.
🍃🌺అది చూసి ఆ నిశాచరుని బంధుగణం గజగజా వణికిపోయింది. అదే అదనుగా వారితో-‘‘ఇక మీదట మీలో ఎవరయినా నరమాంస భక్షణంటూ ఆశ పడి మనుషులను హింసిస్తే ఇదిగో ఇప్పుడు ఈ బకాసురుడికి పట్టిన గతే మీకూ పడుతుంది. జాగ్రత్త! పొండిక్కణ్ణుంచి’’ అని పెద్దగా అరవడంతో వారంతా భయం భయంగా అక్కణ్ణుంచి పారిపోయారు.రెండుగా చీలి పడి ఉన్న బకాసురుని చూసి వాడి పాదాలు రెండూ దొరకబుచ్చుకుని ఏకచక్ర పురం సింహ ద్వారం దగ్గరకు ఈడ్చుకుని వచ్చాడు భీముడు.
🍃🌺పురవాసులకు, సహోదరులకు, తల్లి కుంతికి చచ్చి పడి ఉన్న బకాసురుని చూపించి అభినందనలు అందుకున్నాడు. ప్రజలు జేజేలర్పిస్తే ఉప్పొంగిపోయాడు భీముడు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[16/04, 7:36 pm] +91 94414 08564: 🌺 *తాళపత్రం* 🌺
🥀 *98 వ రోజు* 🥀
🌻 *రాత్రి సమయంలో పడక గది కిటికీలను ఎందుకు తీసి ఉంచరాదు?* 🌻
🍃🌹రాత్రి సమయంలో భూత ప్రేతాలు తిరుగుతాయని, కిటికీలు తెరచి ఉంటే నిద్రంచే వారిపై ఆవహించి చెడు చేస్తాయని విశ్వసించడం జరిగింది.
🍃🌹దయ్యాల మాట ఎలా ఉన్నా, రాత్రి సమయంలో కిటికీని పడక గదిలో తెరచి నిద్రిస్తే, ముఖ్యంగా చలికాలంలో మనకు జలుబు చేసి జ్వరం వచ్చే అవకాశముంది. అప్పుడు దయ్యం పట్టిన వానివలె గజగజా వణకడం సహజమే కదా ! చలి కారణంగా ఆరోగ్యం క్షీణించి దయ్యం పట్టిన వాని వలె వణుకుతూ ప్రవర్తించడం ఇందులో ఉన్న వాస్తవం.
🍃🌹103° సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే మనుషులు గజగజా వణుకక తప్పదు. ఇలా వణుకడాన్ని దయ్యం పట్టిందని తప్పుగా భావించడం జరిగింది.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[16/04, 7:37 pm] +91 94414 08564: 🙏 *ఓం నమో వేంకటేశాయ* 🙏
🌺 *విష్ణు సహస్రనామాలు* 🌺
🌀 *అజస్సర్వేశ్వరస్సిద్ధస్సిద్ధిస్సర్వాదిరచ్యుతః ।*
*వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥* 🌀
🌹 *98. సిద్ధిః* 🌹
🌺 *ఓం సిద్ధయే నమః* 🌺
*నిరతిశయరూపత్వాద్ అచ్యుతస్సర్వవస్తుషు ।*
*సంవిత్త్వాత్ ఫలరూపత్వాద్ వా సిద్ధిరితి కీర్త్యతే ।*
*స్వర్గాదీనామ్ అనిత్యత్వాత్ అఫలత్వం బుధేరితమ్ ॥*
🍃🌹పరమాత్ముడు 'సంవిద్' (కేవలాఽనుభవ) రూపుడు. సాధకునకు కలుగు అట్టి అనుభవమే అతని సాధనము వలన అతనికి కలుగవలసిన సిద్ధి. కావున పరమాత్మ 'సిద్ధి' అనబడుచున్నాడు.
🍃🌹లేదా పరమాత్ముడు నిరతిశయ రూపుడు - తన రూపమును మించునది మరి ఏదియు లేని ఏ రూపము కలదో అట్టి రూపము తానే యగు వాడు. అట్టి స్థితి కంటే గొప్ప స్థితి ఏదియు లేదు. కావున అట్టి సర్వోత్తమ రూపమే తాను అగు పరమాత్ముడు తానే (సర్వోత్తమమగు) 'సిద్ధి' అనదగియున్నాడు.
🍃🌹లేదా ఏ కర్మలకును ఏ యోగాదిసాధనములకును ఫలము పరమాత్ముడు తానే కావున అట్టి విష్ణుపరమాత్మ 'సిద్ధి' (ఫలము) అనబడుచున్నాడు. స్వర్గము మొదలగు ఫలములును వేరగునవి యున్నవికదా! అనిన వినాశమునందునవి కావున అవి సర్వోత్తమ ఫలములు అనదగినవి కాదు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[16/04, 7:38 pm] +91 94414 08564: 🙏 *ఓం నమో వేంకటేశాయ* 🙏
🌻 *తిరుమల సర్వస్వం* 🌻
🎈 *భాగము 39 (అనంతాళ్వార్)* 🎈
🍃🌹1053 సం. లో జన్మించిన అనంతాళ్వార్ సుమారు 84 సంవత్సరాలు జీవించారు. సుదీర్ఘకాలం పాటు శ్రీవారి పుష్పకైంకర్యంలో పాలుపంచు కున్న ఆ ధన్యజీవి, శ్రీవారి భక్తులందరికీ ప్రాతఃస్మరణీయుడు.
🌻 *తిరుమల ప్రయాణం* 🌻
🍃🌹పూర్వం, భోగమండపమైన శ్రీరంగ క్షేత్రంలో, భగవద్రామానుజులు శ్రీవైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని శిష్యులకు వివరిస్తూ, తిరుమల క్షేత్రంలో స్వామివారికి పుష్పమాలా కైంకర్యం చేయడం భగవతీతికరమని శెలవిచ్చారు. అలాగే, శాశ్వతంగా తిరుమలలో ఉంటూ, వేంకటేశునికి పుష్పసమర్పణ చేయగల వారెవరైనా ఉన్నారా? అని శిష్యులను ప్రశ్నించారు.
🍃🌹ఆ ప్రశ్నకు సమాధానంగా, అనందాళ్వాన్ (అనంతాళ్వార్) అనే శిష్యుడు తన సంసిద్ధతను వ్యక్తం చేసి, తిరుమల వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వ వలసిందిగా ప్రార్థించాడు. సంతృప్తి చెందిన రామానుజాచార్యులు, అనంతాళ్వార్ ను, ఆణ్ పిళ్ళై (నీవే నిజమైన మగవాడివి) అని ప్రశంసిస్తూ, తిరుమల వెళ్ళటానికి అనుమతించారు.
🌻 *పుష్పకైంకర్యం* 🌻
🍃🌹గురువాజ్ఞ ప్రకారం భార్యాసమేతంగా తిరుమల చేరుకున్న అనంతాళ్వార్ - అత్యంత నిష్ఠతో శ్రీవారికి పుష్పకైంకర్యం చేయసాగాడు. అప్పటికే తిరుమల చేరుకుని తీర్థకైంకర్యం చేస్తూవున్న తిరుమలనంబి ద్వారా శ్రీవారి పుష్ప ప్రియత్వాన్ని గురించి, తిరుమలలో లభించే వివిధ పుష్పజాతుల గురించి చాలా వివరాలు తెలుసుకున్నాడు.
🍃🌹తన గురువైన రామానుజాచార్యుల వారి గురువైన యామునాచార్యుల వారి పేరుతో శ్రీవారి ఆలయ ప్రాంగణంలో యామునోత్తరై అనే పుష్పమండపాన్ని అనంతాళ్వార్ నిర్మించారు. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఆ పరమభక్తుడు శ్రీకారం చుట్టిన యమునోత్తర (పుష్ప అర) అనే పుష్పమంటపాన్ని నేటికీ మనం శ్రీవారి ఆలయం నందున్న సంపంగిప్రాకారంలో చూడవచ్చు.
🌻 *చెరువు త్రవ్వకం* 🌻
🍃🌹శ్రీవారి నిత్యకైంకర్యానికి కావలసిన వివిధ రకాలైన, రంగురంగుల, పరిమళాలు వెదజల్లే పుష్పాల నిమిత్తం ఆయన ఒక ప్రత్యేక పుష్పవాటికను పెంచ దలిచాడు.
🍃🌹దానికి నాందిగా, ఆలయానికి దక్షిణ దిక్కున ఉన్న విశాలమైన ప్రదేశంలో ఒక పెద్ద చెరువును నిర్మించ తలపెట్టాడు. ఈ చెరువును ఇప్పటికీ మనం క్యూ కాంప్లెక్స్ ప్రక్కగా చూడవచ్చు. దీని ఒడ్డునే అనంతాళ్వార్ వారి సమాధి కూడా ఉంది. దైవకార్యంలో ఇతరుల సహాయం కోరకుండా, గర్భవతి అయిన తన భార్యతో కలిసి ఈ మహత్కార్యానికి పూనుకున్నాడు అనంతాళ్వార్.
🍃🌹ప్రతి రోజూ ఉదయం, పుష్పమాలా కైంకర్యాలు ముగిసి, తీర్థప్రసాదాలు స్వీకరించాక, చెరువు నిమిత్తం, భార్యతో కలిసి గుంట త్రవ్వడం ప్రారంభించేవాడు.
🍃🌹ఈయన గడ్డపారతో (గునపం) మట్టి త్రవ్వి గంపలో పోస్తే అతని భార్య ఆ మట్టిని దూరంగా తరలిస్తుండేది. ఇలా ఈ కార్యక్రమం దీక్షగా కొన్ని రోజులు కొనసాగింది. గర్భవతి కావడంతో, ఆమె అలిసిపోయి మధ్యమధ్యలో నిలబడి పోయేది. ఆయన పిలవడంతో, చెమట బిందువుల్ని పమిట చెంగుతో తుడుచుకొని తిరిగి పని కొనసాగించేది.
🌻 *బాలుని రూపంలో శ్రీవేంకటేశ్వరుడు* 🌻
🍃🌹ఇలా - పట్టుదలతో, ఇతరుల సాయం కోరకుండా, అంకితభావంతో సేవ చేస్తున్న ఆ దంపతుల శ్రమను చూడలేని శ్రీనివాసుడు పదమూడేండ్ల పసివాని రూపంలో వచ్చి "అయ్యా! మీరు త్రవ్వి పోసిన మట్టిని నేను మోసుకుని వెళ్లాను. నన్ను అనుమంతించండి" అని వేడుకొన్నాడు.
🍃🌹ఆ కుర్రవాడి సాయాన్ని తిరస్కరించిన అనంతాళ్వార్, తమ గురువాజ్ఞ ప్రకారం తామిరువురూ ఆ కైంకర్యం నిర్వహిస్తున్నామనీ, భగవత్సేవలో తామెవరి సాయం తీసుకోబోమని, తమను విసిగించకుండా తక్షణం అక్కడినుంచి వెళ్ళిపొమ్మని, ఆ బాలుణ్ణి కసురుకుంటాడు.
🍃🌹అయితే, కరుణా మయుడైన శ్రీనివాసుడు ఎలాగైనా ఆ దంపతులకు సాయం చేయలని గట్టిగా నిశ్చయించు కుంటాడు. ఇటు, అనంతాళ్వార్ ధ్యాసంతా - త్వరగా చెరువు త్రవ్వి, పూదోటను పెంచి, ఎప్పుడెప్పుడు శ్రీవారికి పుష్పాలను అలంకరిద్దామా! - అని ఉండేది. భర్తె దైవంగా భావించిన భార్య కూడా, తన బాధనంతా ఓర్చుకుని, తనకూ - భర్తకూ కలిగిన శ్రీవారి సేవాభాగ్యానికి మురిసిపోతూ, దైవకార్యంలో నిమగ్నమై ఉండేది.
🍃🌹ఒక రోజు స్వామివారికి మనసాగక,బాలుని రూపంలో అనంతాళ్వార్ వెనుక ఉండి, ఆయన మట్టిని తట్టలో వేయగానే, పరుగుతో వెళ్ళి తట్టను ఖాళీ చేసి, ఖాళీ తట్టను అక్కడ పెట్టసాగాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 *సుందరకాండ* 🙏
🎈 *భాగము 2* 🎈
🍃🌺ఆయన ముందుకు సాగుతూంటే ఆ వాయువేగానికి సముద్రం అల్లకల్లోల మవుతున్నది.ఆ కపిశార్దూలుడు తన బాహువులతో సముద్రాన్ని చిమ్ముతూ ముందుకు సాగుతున్నట్లనిపించింది.
🍃🌺ఆ తీవ్రవేగానికి పైకిలేచిన తరంగాలు మేఘమండలాన్ని చేరి శరత్కాల మేఘంలా ప్రకాశిస్తున్నాయి. అప్పుడు తరంగాలలో బయటపడిన జలచరాలు వస్త్రహీనులయిన మానవులను తలపింపజేశాయి.
🍃🌺సాగరంలోని సర్పాలకు ఆకాశంలోని హనుమంతుడు గరుత్మంతుడేమో అనిపించింది. ఆయన నీడ బహువిశాల ప్రాంతాన్ని ఆక్రమించింది. నీటిలో ఆ నీడ కదిలే మేఘంలా ఉంది. వాయుపథంలో సాగే హనుమంతుడు రెక్కల పర్వతంలా వున్నాడు. సాగుతున్నంతమేరా క్రింది సముద్రంలో గాలి ఒత్తిడి కలిగి అది దోనెలా అవుతున్నది.
🍃🌺మేఘమండలంలో చంద్రునివలె సాగుతున్నాడు; దారికి అడ్డువచ్చి చెల్లాచెదరయిన మేఘాలు రక రకాల కాంతులీనుతున్నాయి. హనుమంతుని తీవ్ర గమనాన్ని తిలకించి దేవ, గంధర్వగణాలు పూలవాన కురిపించాయి.
🍃🌺ప్రయాణంలో వాయువు సహకరించాడు. సూర్యుడు చల్లచల్లగా ఉన్నాడు. గగన సంచారులెందరో ప్రశంసావర్షం కురిపించారు. అనాయాసంగా ఆకాశమార్గాన సాగే ఆ మహాకపిని అభినందించారు, వారు.
🍃🌺ఇక్ష్వాకు వంశీయులయిన సగరులవల్ల వృద్ధి పొందిన సాగరుడు ఆ హనుమంతునికి ఏదోవిధంగా సాయపడడం తన కృతజ్ఞతకు అవకాశంగా భావించాడు. ఈ సాహసయాత్రలో హనుమంతునికి కొంత విశ్రాంతి ఇవ్వగలిగితే మరింత సుఖంగా సముద్రం ఆవలి ఒడ్డును చేరగలడనుకున్నాడు.
🍃🌺తనలో మునిగి ఉన్న హిరణ్యనాభుడయిన మైనాకుని పిలిచి, పాతాళం లోని రాక్షసులు వెలుపలకు రాకుండా దేవేంద్రుడు నిన్నిక్కడ అడ్డుగా ఉంచాడు. ఇప్పుడు నువ్వు కామరూపశక్తితో పైకి పెరిగితే నీకూ, నాకు ఎంతో మేలు కలుగుతుంది. ఇక్ష్వాకు వంశీయుడయిన శ్రీరామచంద్రునికి సేవా ధర్మంతో హనుమంతుడు వెళుతున్నాడు. నువ్వు పైకి పెరిగితే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఆలస్యం చెయ్యకు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చి మన కర్తవ్యం మనం నిర్వర్తించి పెద్దల మన్ననలు పొందుదాం.
🍃🌺ప్రవాసంలో ఉన్న సీతను అన్వేషించడానికి వెళ్ళే ఈ వానర వీరునికి శ్రమలేకుండా సాయపడాలి, అనగా విని మైనాకుడు, మేఘమండలాన్ని చీల్చుకు వచ్చే సూర్యునివలె సముద్రం నుండి పైకి లేచాడు. కాగి కాగి కరగిన బంగారు కాంతుల శిఖరాలతో లేచిన మైనాకం కాంతితో నీలాకాశం పసిడి శోభ లీనింది.
🍃🌺పెరిగి పెరిగి తన మీదికి వచ్చే మైనాకాన్ని చూచి, హనుమంతుడు తన ప్రయాణానికి ఏదో అడ్డం వస్తున్నదని భావించి, తీవ్రవేగంతో శిఖరాన్ని ఢీ కొన్నాడు.
🍃🌺మైనాకుడు హనుమంతుని తీవ్రవేగశక్తికి సంతోషించి వానరోత్తమా! అనన్యసాధ్య మయిన ఈ సాగరతరణంలో కొంతసేపు నా శిఖరంమీద విశ్రాంతి తీసుకో. నువ్వు రామకార్యార్థిపై వెడుతున్నావు. ఆ రామచంద్రుని ప్రపితామహులయిన సగరులవల్ల ఇంతవాడయిన సాగరుడు తన కృతజ్ఞత తెలుపుకోవాలని నన్ను పంపాడు. ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యడం సర్వప్రాణిధర్మం. నా సానువులమీద సువాసనలీనే, అతిమధురమయిన కందమూలఫలాలున్నాయి. వాటిని ఆరగించి, విశ్రాంతి తీసుకుని వెళ్ళు.
🍃🌺ఎంతటి సామాన్యుడయినా అతిథిని పూజించాలి. అటువంటప్పుడు నీవంటివాని విషయంలో వేరే ఆలోచన అవసరంలేదు. దేవతా శ్రేష్ఠుడయిన వాయువుకి కుమారుడవు. నీ తండ్రి అంతవేగంగా పయనించగల శక్తి సంపన్నుడవు.నీకు జరిపే సత్కారం వాయుదేవునికే చెందుతుంది. ముఖ్యంగా నీకీ అతిథిమర్యాద జరపడంలో నా కృతజ్ఞతకూడా వెల్లడించుకుంటున్నాను,
🍃🌺కృతయుగంలో మా పర్వతాలకు రెక్కలుండేవని వినివుంటావు. వాటితో అవి గరుత్మంతునివలె వాయువేగంతో ప్రయాణాలు చేసేవి. అవి ఏ ప్రాంతాన పడతాయో అని అందరూ భయపడుతూంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు ముక్కలు చేశాడు.
🍃🌺ఆ సమయంలో వాయుదేవుడు నన్ను ఈ సముద్రంలో పడవేశాడు. ఆయనవల్ల నా రెక్కలు సురక్షితంగా వున్నాయి. ఇప్పుడు తెలిసిందా. నేనెందుకింత ఆదరం చూపుతున్నానో... నా సత్కారాలు పొంది అనుగ్రహించు, అన్నాడు.
🍃🌺మైనాకా! నీ ఆదరవచనాలే నా కెంతో సంతోషం కలిగించాయి. అయితే ఇప్పుడు నేను ఆగడానికి వీలులేదు. సూర్యాస్తమయం కాకుండా నేను ఆవలితీరం చేరాలి, మరొక విధంగా నువ్వు భావించకు. అతిథి సత్కారం అందినట్లే విశ్వసించు, అని తన చేతితో గిరిశిఖరం స్పృశించి ముందుకు సాగాడు.
🍃🌺సాగరుడు, మైనాకుడు హనుమంతుని ఆశీర్వదించారు. దేవేంద్రుడు మైనాకుని ప్రశంసించాడు.
🍃🌺వాయువీధిని వీడి విమల వినీలాంబర వీధిలో వెడుతున్నాడు. సిద్ధ, సాధ్య, దేవ ఋషి సంఘాలు హనుమంతుని అభినందిస్తున్నాయి. ఆ సమయంలో వారు నాగమాత సురసను పిలిచి ఈ హనుమంతుడు సాహసపరాక్రమోపేతుడు. దానికి తోడు ధీశక్తి ఉన్నదో లేదో పరీక్షించాలి అనగా...
🍃🌺ఆమె భయంకర రాక్షసాకారంతో బయలుదేరి హనుమంతునికి అడ్డుగాపోయి, మా ప్రభువులు నిన్ను నాకు భోజనంగా యిచ్చారు. నువ్వు మర్యాదగా నా వదన గహ్వరంలో ప్రవేశించు. హాయిగా ఆరగిస్తాను, అంది.
🍃🌺అప్పుడాయన: దశరథనందను డయిన రాముడు భార్యసీతతో, తమ్ముడు లక్ష్మణునితో వనవాసానికి వచ్చాడు. అక్కడ సాధుజనరక్షణ కార్యమగ్నుడు కాగా రాక్షసులకు వీరిమీద ద్వేషం కలిగింది.
🍃🌺అంతతో వారి ప్రభువయిన రావణుడు దొంగచాటుగా సీతను అపహరించుకుపోయాడు. ఇప్పుడు నేను సీతాన్వేషణకు వెడుతున్నాను. ఆ పని పూర్తికాగానే వస్తాను. నన్ను నమ్ము అన్నాడు.
🍃🌺మాటలు కట్టి పెట్టు. ఈ భువన భవనంలో నన్ను అతిక్రమించి పోగలవారు లేకుండా వరమిచ్చారు దేవతలు నాకు, అంది.
🍃🌺హనుమంతుడు: సరే, నా శరీరం పట్టేటంత విశాలంగా నీ నోరు తెరుస్తావా, అంటూ దేహాన్ని పెంచుతున్నాడు.
🍃🌺సురస తన వదన గహ్వరం విశాలం చేస్తున్నది. ఆయన ఎంత పెరిగితే అంతకు రెట్టింపు నోరు పెంచుతున్నది.
🍃🌺అలా పెరిగి పెరిగి ఒక్క లిప్తలో అంగుష్ఠమాత్రదేహుడై మరొక లిప్తవ్యవధిలో ఆమె ఉదరంలోకి పోయి పైకివచ్చి ఓ దాక్షాయణీ: మరి నాకు సెలవా, అన్నాడు.
🍃🌺సురస, నాయనా సంతోషం. సుఖంగా కార్యసాధనచేసి రామచంద్రునికి సంతోషం కలిగించు, అంది.
🍃🌺గరుత్మంతునివలె సాగుతున్నాడు, హనుమంతుడు. సింహ, శార్దూల, పక్షి, సర్వవాహనాలమీద విహారయాత్ర చేసే పిద్యాధరాది గణాలన్నీ సంతోషిస్తున్నాయి. చంద్ర, సూర్యసంచార యోగ్యమయిన మంగళ పథంలో వెళుతున్నాడు. సాగుతూ సాగుతూండగా హనుమంతుని గమనం ఆకస్మికంగా ఆగిపోయింది.
🍃🌺ఏమిటా అని క్రిందికి చూశాడు, సముద్రంలో ఛాయాగ్రాహిణి సింహిక కనిపించింది. అది సముద్రంలోపలి నుండి నోరు తెరిచి పైకి లేవడం చూశాడు.
🍃🌺సీతాన్వేషణకు బయలుదేరే సమయంలో సుగ్రీవుడు చెప్పాడు. దక్షిణ సముద్రంమీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులో ఒక రాక్షసి ఉంది. దానిమీద పడిన నీడ ఆధారంగా ఆ ప్రాణిని క్రిందికి లాగుతుంది, అని.
🍃🌺అది గుర్తుకు రాగా తన శరీరాన్ని వర్షాకాలమేఘంలా విశాలంగా పెంచాడు. సింహిక తన నోరు మరింత విశాలంచేసి లాగుతున్నది. తెరిచిన వదనంలోంచి దాని మర్మస్థానాలు చూశాడు హనుమంతుడు.
🍃🌺చూస్తూనే క్రిందికి దిగుతూ తన శరీరాన్ని సంకోచింపజేసి దాని వదనంలోనుండి ఉదరంలోకిపోయి, వాడిగోళ్ళతో మర్మస్థానాలు చీల్చి ఒక్క ఊపులో గగనవీధికి చేరాడు.
🍃🌺సింహిక సముద్రంమీద తేలిపోయింది, చచ్చిపడి... సిద్ధ, సాధ్య, విద్యాధర, గంధర్వగణాలు హనుమంతుని ధీశక్తినీ, ధీరత్వాన్ని అభినందించాయి.
🍃🌺సాగి సాగి సముద్రం అవతలి ఒడ్డు చేరాడు. అక్కడ వనాలూ, సముద్రంలో ప్రవేశించే నదీ ముఖద్వారాలూ చూశాడు పర్వతంమీద దిగుతూ...
🍃🌺నేను యింత విశాల దేహంతో ఉంటే రాక్షసులందరూ నన్ను చూడాలనే కాంక్షతో రావచ్చు. అది కార్యభంగ హేతువవుతుంది, అనుకుంటూ శరీరాన్ని బాగా కుంచించాడు. బలిచక్రవర్తిని వంచించడానికి త్రివిక్రమ రూపం ధరించిన మహావిష్ణువువలె పెరిగిన హనుమంతుడు వామనాకృతి ధరించాడు.
🍃🌺ఆ కొండమీద విహరిస్తూ లంకానగరాన్ని చూశాడు. ఆ నగరం అమరావతిలా వెలుగుతున్నది. ఇది మహర్షి వాల్మీకి విరచితమయిన రామాయణం సుందర కాండలో మొదటి సర్గకు ఉషశ్రీ అనువాదం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*ఏది గమ్యం*
నీటిలో మునిగితే- అది స్నానం. నీలో మునిగితే- అది ధ్యానం. నీలోకి నీవు మునిగిపోవడం నీళ్ళలో మునిగినంత తేలిక కాదు. స్నానానికి సాధనతో పనిలేదు. ధ్యానానికి సాధన తప్ప వేరే దారి లేదు. ధ్యానం కుదరడం లేదని ఫిర్యాదు చేసే చాలామంది చెరువు గట్టున నిలబడి చూసేవారే కాని, నీళ్లలోకి దిగినవారు కారు.
తన వద్ద శిష్యరికం చేసిన పూర్వ విద్యార్థిని పిలిపించి బుద్ధుడు ధ్యానం గురించి అడిగాడు. శిష్యుడికి అది రెండో ఎక్కం లాంటిది. రకరకాల ప్రక్రియలు, ధ్యాన దశల గురించి అప్పటికే విశేషంగా చదివి ఉన్నాడు. పరిశోధనలు చేశాడు. ఆ విద్యలో గట్టి పాండిత్యం సాధించాడు. కనుక బుద్ధుడు అడిగీ అడగ్గానే ఎన్నో సాధనా విధానాలను గడగడా వల్లించాడు. బుద్ధుడు శిష్యుడికేసి ప్రసన్నంగా చూస్తూ ‘మంచిది భిక్షూ! ఇక ధ్యాన సమయంలో నీవు పొందిన అలౌకిక అనుభూతులను కొన్నింటిని వివరించు’ అని అడిగాడు. తెల్లబోయాడు శిష్యుడు. నోట మాట రాలేదు. ఎవరికైనా ధ్యానం గురించి పాఠం చెప్పడానికి తగినంత పరిజ్ఞానాన్ని సాధించావే తప్ప నీవు నిజమైన ధ్యానివి కాలేకపోయావు’ అన్నాడు బుద్ధుడు. లోకంలో సాధకులమనుకునే వారిలో చాలామందిది ఇదే పరిస్థితి.
నిజానికి ధ్యానమంటే గాఢమైన అనుభూతే తప్ప, ఆలోచన కానేకాదు. ధ్యానంలో ఆలోచించడానికి ఏమీ లేదు. వెదురుబొంగు లోపల దట్టంగా అలముకున్న గుజ్జు, పోగులు పూర్తిగా కాలిపోయి, ఖాళీ అయ్యాక- వేణువు కావడానికి సిద్ధమవుతుంది. ముసురుకున్న ఆలోచనలను తుడిచేశాక, ధ్యానం తానుగా మనసులోకి వచ్చి చేరుతుంది. ఆపై నెమ్మదిగా గుండెల్లో ప్రశాంతత ఆవరిస్తుంది. ఆనందం వరిస్తుంది. శరీరం గొప్ప శక్తి కేంద్రమై తరిస్తుంది. ఈలోగానే ఆలోచనలు తిరిగి దాడి చేస్తాయి. పాత జ్ఞాపకాలు తరుముకొస్తాయి. అవి చాలా బలమైనవి. వాటిని ప్రతిఘటిస్తే మనిషి విఫలమవుతాడు. పారిపోతే దొరికిపోతాడు. వాటితో ఘర్షణ వృథా! సాధకుడు వాటిని స్వేచ్ఛగా లోనికి అనుమతించాలి. చిరునవ్వుతో పలకరించాలి. ఆలోచనలకు దారివ్వడమంటే మనసును మచ్చిక చేసుకోవడమని అర్థం. ఆ సాక్షీభూత స్థితిలో మనిషికి, మనసుకు మధ్య స్నేహం కుదురుతుంది. ఆలోచనలనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. వేగంగా కదిలిపోతూ ఉంటాయి. వాటంతటవి తొలగిపోయేవరకు మనిషి ఓపిక పట్టాలి.
ఆ సంధి సమయంలో మనిషికి సహనమే గొప్ప వరం. ధ్యానం కోసం వేచి చూసే స్థితికి చేరుకోవడం విజయంలో తొలిమెట్టు. ఆ స్థితిలో మనసులోకి వచ్చి పోతున్నా పట్టించుకోని విషయాలే స్వయంగా మనిషిని ధ్యానంలోకి తోసేస్తాయి. పరిశీలనలోంచి మనసును అనుభూతిలోకి, ఆస్వాదన లోకి నెట్టేస్తాయి. లీలగా మనిషి ధ్యానంలో లీనమవుతాడు.
సాధన క్రమంలో ఒళ్ళు జలదరించడం, ఆవలింతలు రావడం, అకారణమైన ఆనందమేదో గుండె తలుపు తట్టడం గాని జరిగితే- అవన్నీ ధ్యానంలో పురోగతికి సూచనలని మనం గ్రహించాలి. పరమహంస యోగానందజీ చెప్పినట్లు వాటి ప్రోత్సాహంతో మరింత లోతులకు ప్రయాణం సాగించాలి. ఆ అనుభూతులు వాటంతటవే రావాలి తప్ప మనం ఎదురు చూడకూడదు, వాటికోసం ప్రయత్నించకూడదు. వైకుంఠపాళిలో నిచ్చెనల్లాంటివవి. ధ్యానానికి గమ్యం- ఆ నిచ్చెనలు కావు... పరమపద సోపానం!
✍🏻ఎర్రాప్రగడ రామకృష్ణ, రాజమండ్రి.
భావ కారకాలు మరియు యోగకారకాల విశ్లేషణ.
జాతకచక్రంలో 12 భావాలకు భావకారకులు ఉంటారు. భావకారకుడు భావంలో ఉంటే ఆ భావం ఫలితాలు బాగుంటాయి. కారకోభావనాశాయ ప్రకారం భావకారకుడు భావంలో ఉంటే ఆ భావ లక్షణాలను చెడగొడతాడు. ఉదా:- పంచమం సంతాన స్ధానం, సంతాన కారకుడు గురువు , గురువు పంచమంలో ఉంటే కారకోభావనాశాయ ప్రకారం సంతానం లేటు కావటం, లేదా మనం అనుకున్న దానికి విరుద్ధంగా కలగటం జరుగుతుంది. గురువుకి ఆ క్షేత్రం శత్రుక్షేత్రం గాని, పాప గ్రహ దృష్టి ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది అంతేగాకుండ గురువర్గ జాతకులకు పంచమంలో అనగా మేష,కర్కాటక,సింహ, వృశ్చిక,ధనస్సు,మీన లగ్నాలకు పంచమంలో గురువుశుభప్రదం.
లగ్నభావానికి–రవి కారకుడు
ధనభావానికి-గురువు కారకుడు
భ్రాతృభావానికి-కుజుడు కారకుడు
మాతృభావానికి-చంద్రుడు,బుధుడు కారకులు
మంత్రభావానికి-గురువు కారకుడు
శతృభావానికి-శని, కుజుడు కారకుడు
వివాహభావానికి-శుక్రుడు కారకుడు
ఆయుర్భావానికి-శని కారకుడు
బాగ్యభావానికి-రవి, గురువు కారకులు
రాజ్యభావానికి-రవి,బుధ,గురు,శని కారకులు
లాభభావానికి-గురువు కారకుడు
వ్యయభావానికి-శని కారకుడు
ఈ భావకారకాదిపతులు కారక భావంలో ఉంటే ఆ భావం వర్తించే కారకాన్ని చెడగొడుతుంది. కారకోభావనాశాయ ఫలితం ఎక్కువగా పాప,శత్రు గ్రహాల దృష్టి ఉంటేనే కారకభావం చెడుతుంది.
"భావకారకుడు ఆ భావంలో ఉంటే భావాన్ని నాశనం చేస్తాడు". అనే సూత్రం ప్రసిద్ధమైనదే గాని ఫలితాలలో ఆ సూత్రానికి ప్రాముఖ్యం కనిపించటం లేదు ఎందుకనగా లగ్న విభజనలో గ్రహ వర్గ విభజన పాఠించి ఫలితాన్వేషణ చేయాలి
తను, భాగ్య భావాలలో రవి గురువర్గజాతకులకు అనుకూల ఫలితములు ద్వాదశ భావంలో శని ప్రతికూల ఫలితాన్నిస్తాయి. పంచమ భావంలో గురువు సత్పలితాలను శనివర్గం అనగా వృషభ,మిథున,కన్యా,తులా,మకర,కుంభ లగ్నాలవారికి ప్రతికూలంగా ఉంటాడు.
అలాగే గురువర్గీయులకు సప్తమ శుక్రుడు దోషి అనే మాట ప్రచురంగా కాని శనివర్గీయులకు సప్తమ శుక్రుడు అనుకూలమే అలా ఉంటే భార్య ఆకర్షణీయంగా ఉంటుంది. నేటి కాలంలో భార్య ఆకర్షణీయంగా ఉండటాన్ని నేటి తరం వారు అభిలసిస్తున్న కారణంగా సప్తమ శుక్రుడు శుభఫల ప్రధాతగా గుర్తించవలసిన అవసరం ఉంది.
ఉదా- పురుషులకు సప్తమంలో శుక్రుడు ఉంటే కారకోభావనాశాయ, స్త్రీలకు సప్తమంలో గురువు ఉంటే కారకోభావనాశాయ అంటారు. దీని వలన పాప,శత్రు గ్రహాల దృష్టి ఉంటేనే కళత్ర దోషం ఉంటుంది గ్రహ వర్గవిభజన పరిగణలోకి తీసుకోవడం అత్యంత ఆవశ్యకత
గురువర్గ జాతకులకు 2,11 భావాలలో గురువు ఉంటే డబ్బు ఉంటుంది కానీ శని వర్గజాతకులకు సెక్యూరిటీ ఉండదు. కారకోభావనాశాయ సూత్రం ప్రకారం శత్రురాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న అభద్రతాభావం ఉంటుంది.
అష్టమ భావంలో శని ఉంటే ఆయుష్కారకుడు కావటం వలన ఆయుర్ధాయాన్ని కలిగి ఉంటాడు. కారకోభావనాశాయ ప్రకారం శత్రురాశిలో ఉన్న, పాపగ్రహ దృష్ఠి ఉన్న గురువర్గీయులకు దీర్ఘకాల వ్యాధిని కల్పించి ఇబ్బంది పెడతాడు.
వ్యయ భావంలో శని ఉంటే యోగసాధన (తపశ్శక్తి) కలిగి ఉంటారు శని వర్గజాతకులు కారకోభావనాశాయ ప్రకారం శత్రురాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న అధికంగా ఖర్చులు, తిండి సరిగా తినలేకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం జరుగుతుంది గురువర్గ జాతకులకు.
భావకారకుడు, యోగకారకుడు ఒక్కడే అయితే మంచి యోగం కలుగుతుంది.
ఉదా:- వృశ్చిక లగ్నానికి ద్వితీయ, పంచమాధిపతులు గురువు యోగకారకుడు, భావకారకుడు అవుతాడు.
కుంభ లగ్నానికి ద్వితీయ, లాభాదిపతి గురువు కావటం వలన లగ్నానికి శత్రువైన యోగకారకుడు, భావకారకుడు అవుతాడు.
మేష లగ్నానికి చతుర్ధాధిపతి చంద్రుడు యోగ కారకుడు అవుతాడు.
[13/04, 6:41 pm] Sriram: " *చిదంబర రహస్యం*"
ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన, విశ్లేషణ అనంతరం, పాశ్చాత్య శాస్త్రవేత్తలు, ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్ర, భూమధ్య రేఖ యొక్క కేంద్ర స్థానం చిదంబరం లోని నటరాజ స్వామి పెద్ద బ్రొటన వేలు లో ఉన్నది అని నిరూపించారు.
మన ప్రాచీన తమిళ పండితుడు, కవి ' *తిరుమూలర్* ' ఈ విషయాన్ని ఐదు వేల సంవత్సరాల క్రితమే వక్కాణించారు. వీరు రచించిన ' *తిరుమందిరం* ' అనే గ్రంథం ప్రపంచం అంతటికీ శాస్త్రీయంగా మార్గ నిర్దేశం చేసే అద్భుతమైన గ్రంథరాజం. వీరి అధ్యయనాలను, విశ్లేషణలను అర్థం చేసుకోవడానికి మనకు మరో వందేళ్లు కావాలి, బహుశా.
ప్రత్యేకించి, చిదంబరం ఆలయం ఈ విధమైన లక్షణాలు, విశిష్టతలు కలిగి ఉంది.
*1*. ప్రపంచం యొక్క అయస్కాంత క్షేత్రం -భూమధ్యరేఖ యొక్క కేంద్ర స్థానం లో ఈ ఆలయం నెలకొని ఉంది.
*2*.'పంచభూత' ఆలయాలలో, చిదంబరం-'ఆకాశ' తత్వానికి ప్రతీక, శ్రీ కాళహస్తి-'వాయు' తత్వానికి ప్రతీక, శ్రీ కాంచీ పురం-'భూమి' తత్వానికి ప్రతీక. ఈ మూడు క్షేత్రాలు/ ఆలయాలు ఒకే రేఖ పైన, 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం(79°41') పై నెలకొని ఉన్నాయి. ఆసక్తి కలవారు ఈ విషయాన్ని గూగుల్ లో పరీక్షించుకోవచ్చును. ఇది ఒక అద్భుతమైన వాస్తవమే కాక, ఖగోళ శాస్త్రం లో కూడా అద్భుతమే.
*3*. చిదంబర క్షేత్రం మానవ శరీర నిర్మాణం ఆధారంగా నిర్మించబడినది. మానవ శరీరం తొమ్మిది ద్వారాలను/రంధ్రాలను కలిగి ఉన్నట్లే, ఈ ఆలయం లో తొమ్మిది ద్వారాలు ఉన్నాయి.
*4*. ఆలయం పై కప్పు/ విమాన గోపురం లో 21,600 స్వర్ణ పత్రాలు/బంగారు రేకులు ఉపయోగించబడినవి. ఇవి, మనిషి ఒక రోజు లో తీసుకునే శ్వాస ను సూచిస్తాయి.(15x60x24=21,600).
*5*. ఈ 21,600 బంగారు రేకులను 72,000 బంగారు మేకులు ఉపయోగించి బిగించ బడినవి. మానవ శరీరం లో ఉన్న 72,000 నాడులకు ఇవి ప్రతీకలు. ఇవి శరీరం లోని కొన్ని అదృశ్య భాగాలకు 'శక్తి' నిన్న సరఫరా చేస్తాయి.
*6*. మనిషి 'శివలింగం' ఆకారానికి ప్రాతినిధ్యం వహిస్తాడని తిరుమూలర్ వివరించారు. అదే ' *చిదంబరం*', ' *సదాశివం*', నటరాజ తాండవాన్ని సూచిస్తుంది.
*7*. 'పొన్నాంబలమ్' కొద్దిగా ఎడమవైపుకు వంగి ఉంటుంది. ఇది హృదయ స్థానాన్ని సూచిస్తోంది. దీన్ని చేరుకోవడానికి ఐదు మెట్లను ఎక్కాలి, అవి, " *పంచాక్షరి* *పడి*", " *శి* *వా* *య* *న* *మః*" అనే పంచాక్షరీ మంత్రం.
నాలుగు వేదాలే, నాలుగు స్తంభాలు గా, వీటి ఆధారంగా ' *కనకసభ*' ఉన్నది.
*8*. 'పొన్నాంబలమ్' 28 శైవ ఆగమాలకు (28 పూజా విధానములు) సూచనగా 28 స్తంభాలను కలిగి ఉంది. ఈ 28 స్తంభాలు, ఆలయం పై కప్పు లోని 64 దూలాలకు(బీమ్) ఆధారంగా ఉన్నాయి. ఈ 64, అరువది నాలుగు కళలను సూచిస్తాయి. ఆలయం లోని అడ్డ దూలాలు మనిషి శరీరం లో అంతటా వ్యాపించి ఉన్న రక్త నాళాలను సూచిస్తాయి.
*9*. గర్భాలయం పైన బంగారు విమానం పై ఉన్న తొమ్మిది కలశాలు, తొమ్మిది రకములైన శక్తి ని సూచిస్తాయి.
అర్థ మంటపం లోని ఆరు స్థంభాలు, 'ఆరు శాస్త్రముల'కు సూచికలు. ప్రక్కగా ఉన్న మంటపం లోని 18 స్తంభాలు, పద్దెనిమిది పురాణాలను సూచిస్తాయి.
*10*. నటరాజ స్వామి తాండవాన్ని/నృత్యాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు విశ్వ తాండవం/నృత్యం గా పేర్కొన్నారు.
విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు దేనిని సిద్ధాంతీకరిస్తున్నదో, దాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే హిందూ మతం వక్కాణించి చెప్పింది.
" *హిందూ* *మతం* *అనేది* *ఒక* *మతం* *కాదు* , *అది* *ఒక* *జీవన* *విధానం* ".
😊🙏🙏🙏🙏🙏😊
[13/04, 10:09 pm] +91 94917 74979: *అర చేతిలో ఐదు తీర్థాలు :*
*ైంైంైంైంైంైంైంై*
👉 అగ్నిపురాణంమన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది. ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు.
👉 కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి, ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం అని అంటున్నాము. అలా నీటిని
'ఓమ్ కేశవాయస్వాహా, '
'ఓమ్ నారాయణాయస్వాహా, '
'ఓమ్ మాధవాయస్వాహా',
అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు.
👉 ఈ సందర్భంలోని ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది.
👉 చూపుడు వ్రేలి క్రింది ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని దాన్నే బ్రహ్మతీర్థం అని అంటారు.
👉 చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం అని ప్రజాపతి స్థానమనీ, ప్రజాపతి తీర్థం అని అంటారు.
👉 అరచేతి మధ్య పల్లపు ప్రదేశాన్ని అగ్ని స్థానమని దాన్ని అగ్ని తీర్థం అని అంటారు.
👉 చూపుడు వ్రేలినుంచి, చిటికెన వ్రేలి వరకు ఉన్న వ్రేళ్ళ కొనల భాగం దేవస్థానాలని అవే దేవతీర్థాలు అని అంటారు.
👉 ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు.
👉 ఆచమనం చేసేప్పుడు మణికట్టువైపు బొటనవ్రేలి క్రింద ఉండే ప్రదేశం నుండి నీటిని గ్రహిస్తాము కనుక దీన్ని కూడ బ్రహ్మతీర్థం అంటారు.
👉 సంధ్యవార్చే వ్రేళ్ల చివరలనుంచి తర్పణం జలాన్ని విడుస్తాం కాబట్టి ఇదికూడ దేవతీర్థం అవుతున్నది.
👉 పితృకర్మలలో తర్పణాలకు వదిలే జలం పితృతీర్థం అనబడుతున్నది.
👉 ఇవండీ అగ్నిపురాణంలోని పంచతీర్థాలు మన అరచేతిలో...
[14/04, 6:25 am] +91 94917 74979: *బుధవారం గరుడునిని పూజిస్తే నాగదోషం పరార్..*
👉 బుధవారం గరుడాళ్వార్ పూజతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. గరుడాళ్వార్ నారాయణ స్వామికి వాహనధారుడు. గరుడ దర్శనంతో సర్వమంగళాలు చేకూరుతాయి. అందుకే బుధవారం పూట గరుడాళ్వార్ను ఆలయంలో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆలయంలోనే కాకుండా.. ఇంట్లోనూ రోజూ గరుడాళ్వార్ను తలచి పూజ చేస్తే నాగ దోషాలు తొలగిపోతాయి.
👉 చర్మ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. వివాహం కాని కన్యలకు పెళ్లి అవుతుంది. సత్ సంతానం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పెరుమాళ్ల వారి సన్నిధికి వెళ్లే వారు ముందుగా గరుడుని దర్శించుకోవాలి. తర్వాతే స్వామిని దర్శించుకోవాలి. ఇది వైష్ణవ ఆగమ పద్ధతి. ఆలయంలో కుంభాభిషేకం జరిగేటప్పుడు గరుడాళ్వార్ ఆకాశంలో తిరగడం చేస్తేనే ఆ కుంభాభిషేకం సంపూర్ణం అవుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
*గరుడాళ్వార్ దర్శనం:* ఆదివారం చేస్తే వ్యాధులు నయం అవుతాయి. సోమవారం దర్శించుకుంటే.. కుటుంబ సౌఖ్యం, మంగళవారం గరుడ దర్శనంతో ఆరోగ్యం చేకూరుతుంది. బుధవారం శత్రుభయం వుండదు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శుక్రవారం గరుడ దర్శనంతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. శనివారం గరుడ దర్శనంతో మోక్షం లభిస్తుంది.
[14/04, 8:17 am] Sriram: *_🌹నేటి మంచిమాట🌹_*
*_మనం చూసేదంతానిజం కాకపోవచ్చు,_*
*_అలా అని చూడనిది అబద్దమూ కాకపోవచ్చు,_*
*_చేతులతో తడిమి చూసి,_*
*_నిజం అనుకొన్నా బాగుంటుంది కానీ,_*
*_కళ్ళతో చూసి అదే నిజం అనుకుంటే,_*
*_ఈ మాజిక్ ప్రపంచంలో,_*
*_కేవలం ఒక ప్రేక్షకుడిగా ఉండిపోవాల్సి వస్తుంది.._*
*_అవును మన కళ్ళు,_*
*_మనల్ని మోసం చేస్తాయి,._*
*_చేస్తునే ఉంటాయి.._*
*_పేపర్ బాయ్ లంతా,_*
*_"అబ్దుల్ కలాం" లు అవ్వలేరు!_*
*_పెట్రోలు పట్టినంత మాత్రానా,_*
*_"అంబానీ" లు అయిపోరు!!_*
*_"అనుకరణే" అతి పెద్ద ప్రమాదం?_*
*_"అంతఃప్రతిభే" నీకు అసలు ప్రమాణం.._*
*_మన కోసం "ఆస్తులు" సంపాదించుకోవడం కన్నా,_*
*_మన గురించి ఆలోచించే,_*
*_'ఆప్తులను" సంపాదించుకోవడం మిన్న.._*
*_🌺🌞శుభోదయం🌹_*
*_✡సర్వేజనాః సుఖినోభవంతు_*
*_🕉లోకాః సమస్తాః_* *_సుఖినోభవంతు_*
*_☸శుభమ్ భూయాత్_*
*_శుభమస్తు._*
🌻🌻🌻🌻🌻
*_....✍️ మీchandrasekharrallabhandhi
*తెలుగు సంవత్సరాల పేర్లు... వాటి అర్థాలు*
1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.
2. విభవ - వైభవంగా ఉండేది.
3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.
4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.
5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.
6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.
7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.
8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.
9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.
10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.
11. ఈశ్వర... పరమేశ్వరుడు.
12. బహుధాన్య... సుభిక్షంగా ఉండటం.
13. ప్రమాది... ప్రమాదమున్నవాడు అని అర్థమున్నప్పటికీ సంవత్సరమంతా ప్రమాదాలు జరుగుతాయని భయపడనవసరం లేదు.
14. విక్రమ... విక్రమం కలిగిన వాడు.
15. వృష ... చర్మం.
16. చిత్రభాను... భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం.
17. స్వభాను... స్వయం ప్రకాశానికి గుర్తు. స్వశక్తి మీద పైకెదిగేవాడని అర్థం
18. తారణ... తరింపచేయడం అంటే దాటించడం. కష్టాలు దాటించడం, గట్టెక్కించడం అని అర్థం.
19. పార్థివ... పృధ్వీ సంబంధమైనది, గుర్రం అనే అర్థాలున్నాయి. భూమికున్నంత సహనం, పనిచేసేవాడని అర్థం.
20. వ్యయ... ఖర్చు కావటం. ఈ ఖర్చు శుభాల కోసం ఖర్చై ఉంటుందని ఈ సంవత్సరం అర్థం.
21. సర్వజిత్తు.... సర్వాన్ని జయించినది.
22. సర్వధారి -...సర్వాన్ని ధరించేది.
23.విరోధి.... విరోధం కలిగినట్టువంటిది.
24. వికృతి... వికృతమైనటువంటిది.
25. ఖర.... గాడిద, కాకి, ఒక రాక్షసుడు, వాడి, వేడి, ఎండిన పోక అనే అర్థాలున్నాయి.
26. నందన ... కూతురు, ఉద్యానవనం, ఆనందాన్ని కలుగజేసేది.
27. విజయ... విశేషమైన జయం కలిగినది.
28. జయ.... జయాన్ని కలిగించేది.
29. మన్మథ... మనస్సును మధించేది.
30. దుర్ముఖి... చెడ్డ ముఖం కలది.
31. హేవిలంబి... సమ్మోహన పూర్వకంగా విలంబి చేసేవాడని అర్థం.
32. విలంబి... సాగదీయడం.
33. వికారి.... వికారం కలిగినది.
34. శార్వరి... రాత్రి.
35. ప్లవ... తెప్ప. కప్ప, జువ్వి... దాటించునది అని అర్థం.
36. శుభకృత్... శుభాన్ని చేసి పెట్టేది.
37. శోభకృత్... శోభను కలిగించేది.
38. క్రోధి... క్రోధాన్ని కలిగినది.
39. విశ్వావసు... విశ్వానికి సంబంధించినది.
40. పరాభవ ... అవమానం.
41. ప్లవంగ... కోతి, కప్ప.
42. కీలక.... పశువులను కట్టేందుకు ఉపయోగించే కొయ్య.
43. సౌమ్య... మృదుత్వం.
44. సాధారణ... సామాన్యం.
45. విరోధికృత్... విరోధాలను కలిగించేది.
46. పరీధావి... భయకారకం.
47. ప్రమాదీచ... ప్రమాద కారకం.
48. ఆనంద... ఆనందమయం.
49. రాక్షస... రాక్షసత్వాన్ని కలిగినది.
50. నల.... నల్ల అనే పదానికి రూపాంతరం.
51. పింగళ... ఒక నాడి, కోతి, పాము, ముంగిస.
52. కాలయుక్తి... కాలానికి తగిన యుక్తి.
53. సిద్ధార్థి... కోర్కెలు సిద్ధించినది.
54. రౌద్రి... రౌద్రంగా ఉండేది.
55. దుర్మతి... దుష్ట బుద్ధి.
56. దుందుభి ... వరుణుడు.
57. రుధిరోధ్గారి... రక్తాన్ని స్రవింప చేసేది.
58. రక్తాక్షి... ఎర్రని కన్నులు కలది.
59. క్రోదన... కోప స్వభావం కలది.
60. అక్షయ... నశించనిది
నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*
భరత శాస్త్రం పై పి.హెచ్.డి
ఈ సంఘటనను నాకు ఒక పి.హెచ్.డి చేస్తున్న విద్యార్థి చెప్పాడు. ఆ విద్యార్థి ఒకసారి పరమాచార్య స్వామి దర్శనానికి వెళ్ళాడు
మహాస్వామి: ”ఇప్పుడు నువ్వు ఏమి చేస్తున్నావు?”
విద్యార్థి: “భరత శాస్త్రంపై నేను ఒక పి.హెచ్.డి థీసిస్ రాస్తున్నాను పెరియవ”
మహాస్వామి: “మరి దాన్ని ముగించావా?” విద్యార్థి: “సగం కంటే ఎక్కువే
ముగించాను. కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్ళడం లేదు”
మహాస్వామి: “ఏమిటి నువ్వు ఎదుర్కొంటున్న సమస్య?”
విద్యార్థి: “భరత నాట్యం యొక్క పుట్టుక మరియు దానిలోని పలు అంశాల ఎలా ఆవిర్భవించాయో అని సాహిత్యం, సంగీతం, శిల్పాలు, శాస్త్రాలు మొదలగువాటినుండి సాక్ష్యాలతో సహా నా థీసిస్ తయారుచేస్తున్నాను. ఈ సహస్రాబ్ధిలో మొదటి మూడువందల సంవత్సరాల విషయాలు తప్ప మిగిలిన కాలానికి అన్ని సాక్ష్యాలతో సహా విషయ సేకరణ చేశాను. కనుక మొత్తం పూర్తి అవ్వలేదు.”
తను ఈ విషయాలు స్వామివారికి చెప్తున్నపుడు వారు ఈ విషయం అసలు విననట్టుగా మధ్యమధ్యలో దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతూ వారిని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నారు అని చెప్పాడు. కొద్ది నిముషాల తరువాత మళ్ళా ఇతనివైపు తిరిగి అతణ్ణి అడిగారు.
మహాస్వామి: “నువ్వు ఎప్పుడైనా చిదంబరం వెళ్ళావా?”
విద్యార్థి: “చాలాసార్లు వెళ్ళాను”
మహాస్వామి: “నటరాజ స్వామి దేవాలయానికి వెళ్ళావా?”
విద్యార్థి: “అవును. నేను చిదంబరం వెళ్ళిన ప్రతిసారి దేవాలయానికి వెళ్తాను”
మహాస్వామి: “వెళ్ళిన ప్రతిసారి అమ్మవారి ఆలయంలోకి వెళ్ళావా?”
విద్యార్థి: “లేదు. ప్రతిసారి వెళ్ళలేదు. వెళ్ళిన ప్రతీసారి కొంచం అత్యవసర పరిస్థితిలో ఉండడంవల్ల కేవలం నటరాజ స్వామివారిని మాత్రమే దర్శించేవాణ్ణి. శివకామి అమ్మవారి దేవస్థానానికి తరచుగా వెళ్ళలేదు”
తరువాత మహాస్వామివారు ఏమి మాట్లాడలేదు. భక్తులకు ప్రాసాదం ఇవ్వడంలో నిమగ్నమయ్యారు. ఆ విద్యార్థి స్వామివారి నుండి సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.
కొన్ని నెలల తరువాత అతను చిదంబరం వెళ్ళినప్పుడు నటరాజ స్వామి దేవాలయానికి వెళ్ళాడు. అమ్మవారి సన్నిధికి కూడా వెళ్ళాలి అన్న మాహాస్వామివారి మాటలు మెరుపులాగా స్ఫురించాయి.
అతను దాని విషయమై నాతో ఇంకా ఏమి చెప్పాడంటే “శివకామి అమ్మవారి సన్నిదిలోకి అడుగుపెట్టగానే అకస్మాత్తుగా నాకు ఒక విషయం స్ఫురించింది. నాలుగు ప్రాకారాల్లో ఉన్న శిల్పాలు నా థీసిస్ లో తప్పిన మూడు శతాబ్ధాలకు సాక్ష్యాలుగా కనిపించాయి. నాకు కనిపెట్టడానికి ఎన్నో ఏళ్ళు పట్టగా మహాస్వామివారు కొద్ది క్షణాల్లోనే నాకు సూచించారు. కాని నాకు ఆ సూచనను అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని నెలలు పట్టింది”
వెంటనే అతడు ఆ థీసిస్ ను పూర్తిచేసి విశ్వవిద్యాలయంలో సమర్పించి పి.హెచ్.డి పట్టా అందుకున్నాడు.
--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment